జగన్ కు జైలా.. బెయిలా ? వైసీపీలో టెన్షన్ టెన్షన్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయం? ఆయన బెయిల్ రద్దు కాబోతోంది? ఇదీ కొంత కాలంగా ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు. ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్‌ దియోధర్‌.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో, అంతకు ముందు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పై జూన్ 1న విచారణ జరుగుతుండటంతో ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కమలనాధులు చెబుతున్నట్లే సీఎం జగన్ బెయిల్ రద్దు కాబోతోందా అన్న చర్చ జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోంది, సీబీఐ కౌంటర్ ఎలా వేయబోతుంది అన్నది కీలకంగా మారింది. వైసీపీ నేతల్లోనే ఇదే టెన్షన్ కనిపిస్తోంది.  జగన్‌ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జగన్‌తోపాటు సీబీఐ కూడా కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉంది. లాక్‌డౌన్‌ పేరుతో జగన్‌ లాయర్, ఉన్నతాధికారుల అభిప్రాయం తెలుసుకోవాలంటూ సీబీఐ లాయర్‌ కౌంటర్‌ వేయకుండా వాయిదా కోరారు. దీనిపై సీబీఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ... జూన్‌ 1లోపు కౌంటర్‌ వేయకుంటే, తామే పిటిషన్‌పై నేరుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో ఈసారి కౌంటర్ ఖచ్చితంగా దాఖలు చేయాల్సిందే. దీంతో జగన్‌ బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? ‘ఔను... రద్దు చేయాలి!’ అంటుందా? లేక... ‘రద్దు చేయవద్దు..  బెయిలు నిబంధనలను ఆయన ఎంతమాత్రమూ ఉల్లంఘించడంలేదు’ అని చెబుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో  తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.  అధికారంలోకి రాకముందు నుంచే బీజేపీతో జగన్‌ కు మంచి సంబంధాలున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా మొదలుకుని, కొవిడ్‌ సమయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు జగన్. ఆక్సిజన్, వ్యాక్సిన్ కేటాయింపుల విషయంలోనూ లేఖలతోనే సరిపుచ్చుతున్నారు. ప్రధాని మోడీని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి విమర్శిస్తే జగన్‌ కౌంటరిచ్చారు. జార్ఖండ్ సీఎంకు జగన్ ట్వీట్ అంశం జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. బీజేపీ సర్కార్ కు జగన్ లొంగిపోయారనే విమర్శలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. జగన్ అలా ఎందుకు చేస్తున్నారో తెలుసంటూ జేఎంఎం నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఇక రాజకీయ ప్రాధాన్యమున్న కేసుల్లో సీబీఐ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో... జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌పై కేంద్రం  డైరెక్షన్ లోనే సీబీఐ కౌంటర్ వేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దర్యాప్తు సంస్థలు ఎక్కువగా నిందితుడికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటాయి.  బెయిలు పిటిషన్లను వ్యతిరేకించడం, గరిష్ఠ శిక్ష విధించాలని కోరుతాయి. ఈ విధంగా చూస్తే... జగన్‌ బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరాలి. అదే జరిగితే... పెద్ద సంచలనమే. సీబీఐ ముందున్న మరో ‘ఆప్షన్‌’.. బెయిలు రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం. ఇది ఒక దర్యాప్తు సంస్థగా సీబీఐ చేయకూడని పని. ఎందుకంటే... రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్‌ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు పేర్కొన్నప్పటికీ... జగన్‌ బెయిలు రద్దు చేయకూడదనే వైఖరికే సీబీఐ కట్టుబడితే అది కేంద్రం ‘సూచనల’ మేరకే జరిగినట్లు భావించాల్సి ఉంటుంది.  జగన్‌ బెయిలు రద్దుకు ఎస్‌ లేదా నో చెప్పడంతోపాటు సీబీఐ ముందు మరొక ఆప్షన్‌ కూడా ఉంది. అదేమిటంటే... ‘ఈ విషయంలో మేం జోక్యం చేసుకోం. మీరే నిర్ణయం తీసుకోండి’ అని బంతిని సీబీఐ కోర్టులోకే నెట్టేయడం. అలాగే... అసలు కౌంటరే వేయకుండా మౌనం పాటించవచ్చు. ‘జూన్‌ 1వ తేదీ నాటికి కౌంటర్‌ వేయకపోతే నేరుగా పిటిషన్‌పై విచారణ చేపడతాం’ అని కోర్టు ఇప్పటికే చెప్పింది. ఆ తర్వాత... విచారణ సమయంలో సీబీఐ  అభిప్రాయాన్ని కోరే అవకాశముంటుంది. ఆ తర్వాత కేసులో ఏదైనా జరగవచ్చు. మొత్తంగా ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్.. ఇప్పుడు వైసీపీలో టెన్షన్ పుట్టిస్తోంది. జగన్ అనుచరులకు నిద్ర లేకుండా చేస్తోంది. జూన్ 1న జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ఏపీ జనాల్లోనూ వ్యక్తమవుతోంది. 

యూపీ బీజేపీకి  శస్త్ర చికిత్స ... 

కేంద్రంలో అధికారం నిలుపుకోవాలన్నా, అధికారంలోకి రావాలన్నా, యూపీనే కీలకం. అందుకే మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్’లో పాగా వేస్తే, ఢిల్లీ పీఠం దగ్గరవుతుందని అంటారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజీపే దేశం మొత్తంలో గెలుచుకున్న (303) స్థానాల్లో ఇంచుమించుగా ఐదింట ఒక వంతు స్థానాలు (62) ఒక్క యూపీ నుంచే గెలుచుకుంది. అలాగే, అంతకు ముందు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 403 సీట్లకు గానూ, 312 స్థానాలను సొంతంగా కైవసం చేసుకుంది. మిత్ర పక్షాలను  కలుపుకుంటే లెక్క 325 చేరింది. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు వచ్చియన్ సీట్లు మొత్తం కలిపినా మూడంకెలకు చేరలేదు. అయితే, ఇది ఐదేళ్ళ నాటి కథ. ఇప్పుడు పరిస్థ్తితి వేరు. ఇప్పుడు కమల దళం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. కొవిడ్ కొంత, ఇతరత్రా కారణాల వలన చేత ఇంకొంత మొత్తానికి, పార్టీ ఇమేజ్ గట్టిగానే దెబ్బతింది. అయినా, ఇప్పటికీ, బీజేపీ పతనమైన స్థాయిలో ప్రతిపక్షాలు పుంజుకోలేదు. బీజేపీ ఖాళీ చేసిన పోలితిఅల్  స్పేస్’ ను భర్తీ చేసే పార్టీ ఏదీ కనిపించడం లేదు. మరోవంక అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరో ఆరేడు నెలల్లో, వచ్చే ఫిబ్రవరిలోగా  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.      ఈ నేపద్యంలో, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఉత్తర ప్రదేశ్’లో పార్టీ పరిస్థితిని, ఎన్నికల సంసిద్దతను సమీక్షించుకునే పనికి శ్రీకారం చుట్టారు.  బీజేపీ నేతలతో  ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో సమావేశమయ్యారు. బెంగాల్లో తగిలిన ఎదురుదెబ్బ నేపధ్యంగా జరిగిన ఈ సమవేశంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా,ఇతర నాయకులు పాల్గొన్నారు. అయితే, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్’ మాత్రం సమావేశంలో పాల్గొనలేదు.ఈ సమావేశంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంతో పాటు మరికొన్ని అంశాలు చర్చకు వచ్చాయని వార్తలొచ్చాయి. అయితే ఈ సమావేశం తర్వాత యూపీ బీజేపీ, అటు ప్రభుత్వంలో సమూల మార్పులు మాత్రం రానున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యూపీ బీజేపీని, అటు ప్రభుత్వాన్ని సమూలంగా మార్పులు చేయాలని ఆర్ఎస్ఎస్  సహకార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే ప్రధానితో సహా బీజేపీ అగ్రనేతలకు సూచించారు.   ఈ నేపధ్యంలో  సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రి వర్గ విస్తరణకు సిద్దమయ్యారు. ఈ సారి  ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన అరవింద శర్మను కేబినెట్‌లోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం యోగి కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి  ఆరింటినీ అత్యంత శక్తిమంతమైన నేతలతో నింపాలని యోగికి బీజేపీ అధిష్ఠానం సూచించింది. ఈ నేపథ్యంలోనే యోగి మంత్రివర్గ విస్తరణకు రెడీ అయ్యారు.ఎప్పుడైన ముహూర్తం ఖరారు అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.  కరోనా పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురు దెబ్బల నేపథ్యంలో యూపీ బీజేపీని కొంచెం ముందుగానే మేల్కొంది. క్రింది స్థాయి నుంచి, కార్యకర్తలలో నీటిక స్థైర్యాన్ని నిపండంతో పాటుగా, ప్రతిపక్షాలను ఎదుర్కునే ఊ హరచనకు శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా ఇక ఇక్కడి నుంచి, పార్టీ ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు, చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబందించిన రోడ్ మ్యాప్‌ను కూడా సిద్దం చేశారు.ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్యకు తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని  పార్టీ, సంఘ్ నాయకులు నిర్ణయానికి వచ్చారు. గత ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షునిగా పార్టీని విజయపథంలో నడిపించిన ఆయనకే మళ్ళీ పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. ఇదిలా ఉంటే, కమల దళం పరిస్థితి కొంత క్రిటికల్’గా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల పరిస్థితి మరింత అద్వాన్నంగా ఉందని, రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు.

టీచర్ పెళ్ళికి కట్నం ఎంతో తెలీయదు గానీ.. ఫైన్ మాత్రం రూ. 2 లక్షలు.. 

ప్రభుత్వం కరోనా నిబంధనలు ఉలంగిస్తే ఫైన్ పడుతుంది.  కరోనా సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల నిర్వహణపై ప్రభుత్వాలు కఠిన నిబంధలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇక ఈ కేసులు, ఫైన్ లు ఎవరికి వర్తిస్తుంది అనేది, కొనే కొన్ని కొన్నే సార్లు అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ మూడును బట్టికూడా ఉంటుంది. లేదంటే రిలేషన్ బట్టికూడా ఉంటుంది. ఇక కరోనా నిబంధనల్లో మొదటిది మాస్క్ లేకుంటే, అనవసరంగా బయటికి వస్తే ఫైన్, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ట్రాఫిక్ ఫైన్ కంటే కరోనా ఫైన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటిపైనే కరోనా నిబంధనల ఫైన్  కాదు. పెళ్లిళ్ల పైన కూడా విధిస్తున్నారు.. ఆ విషయం  అందరికి తెలిసిందే. అయినా ఏముంది.  ఫైన్ అంటే ఐదు వందలు, వేయి రూపాయలు, పది వేలు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు కూడా కరోనా మీద కాలువేసినట్టే, తాజాగా ఆ పెళ్లి కొడుకు కట్టిన ఫైన్ తో మరో పెళ్లి  చేయొచ్చు.. ఇంతకీ ఆ ఫైన్ ఎంతనుకుంటున్నారా.. అక్షరాల  రెండు లక్షలు, అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకి మిడత విషయాలు తెలుసుకుందాం..  అది శ్రీకాకుళం జిల్లా. పాతపట్నం మండలం. చంద్రయ్యపేట గ్రామానికి చెందిన టీచర్ రాంబాబు తన పెళ్లి నిమిత్తం పాతపట్నం తహసీల్దార్ వద్ద పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ ఇచ్చే సమయంలో తహసీల్దార్ కరోనా నిబంధనలను రాంబాబుకు వివరించాడు.  అయితే ఏ వేడుకలైనా తప్పనిసరిగా స్థానిక తహసీల్దార్ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వాలు సర్క్యులర్‌లో పేర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌లో చేసుకునే పెళ్లిళ్లకు 20 మందికి మించి హాజరు కాకూడదన్న నిబంధన ఉండటంతో ధనవంతులు కూడా నిరాడంబరంగా వివాహాలు చేసుకుంటున్నారు.  అయితే చాలామంది ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించినందుకు అధికారులు ఈ   టీచర్ కి ఏకంగా రూ.2లక్షల ఫైన్ విధించారు. ఆ వేడుకలో 20 కాదు.. 50 కాదు.. ఏకంగా 250 మంది అతిథులు ఉన్నట్లు గుర్తించి అధికారులు షాకయ్యారు. దీంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రాంబాబుకు రూ.2లక్షల జరిమానా విధించారు. దీంతో అధికారుల కళ్లుగప్పి ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న రాంబాబుకు వారు విధించిన జరిమానా చూసి కోమాలోకి వెళ్లినంత పనైంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

విజయవాడలో సెంచరీ కొట్టిన పెట్రోల్.. 

కరోనా కల్లోలంతో జనాలు అల్లాడిపోతున్నారు... అటు చమురు కంపెనీలు మాత్రం బాదుడు ఆపడం లేదు. వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 26 పైసలను చమురు కంపెనీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి పెట్రోల్ రేట్ సెంచరీ కొట్టింది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.100.11 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 94.43గా ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.97.63, లీటర్‌ డీజిల్‌ రూ.92.54కు పెరిగింది. పెరుగుతున్న ధరలతో గతంలోనే రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటగా.. కొత్తగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టింది. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.93.94 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.84.89కి చేరింది.ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.19, డీజిల్ రూ.92.17కు పెరిగింది.చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.51 ఉండగా.. డీజిల్‌ రూ.89.65గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.97గా.. డీజిల్‌ ధర రూ.87.74 గా ఉంది.బెంగళూరులో బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.07.. డీజిల్‌ రూ.89.99 గా ఉంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్‌ ధరలు నిలకడగా కొనసాగుతూ వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం చమురు కంపెనీలు మళ్లీ బాదుడు పెంచేశాయి. వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ధరలు పెరగ్గా.. శుక్రవారం విరామం తర్వాత శనివారం ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ఈ నెలలో చమురు ధరలు దాదాపు 15సార్లు పెరిగాయి. మే నెలలోనే లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 పెరగడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలే కరోనాతో విధించిన లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న తమపై భారం మోపడం ఏంటని మండిపడుతున్నారు. 

బిర్యానీలో లెగ్‌పీస్‌ లేదు.. ప‌ద్ద‌తి ఇదేనా కేటీఆర్‌?

అన్నీ తిని చూడు.. బిర్యానీ తినిచూడు. తేడా ఏంటో.. ఆ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. అందుకే, ప‌ప్పు నుంచి పిజ్జా వ‌ర‌కూ ఎన్నిర‌కాల ఆహార ప‌దార్థాలు ఉన్నా.. వాట‌న్నింటిలోకి రారాజు బిర్యానీ. అందులోనూ చికెన్ బిర్యానీ టేస్టే సెప‌రేటు. ఆ చికెన్ బిర్యానీలోనూ లెగ్‌పీస్ వ‌స్తే ఆ మాజానే వేరు. అందుకే, లెగ్‌పీస్ బిర్యానీ కోసం ఫుల్ డిమాండ్‌. హోట‌ల్‌కి వెళితే లెగ్‌పీస్ బిర్యానీనే కావాలంటారు అంతా. ఇక‌, ఆన్‌లైన్లో చికెన్ బిర్యానీ ఆర్డ‌ర్ పెడితే.. లెగ్‌పీస్ కోసం స్పెష‌ల్‌గా రిక్వెస్ట్ చేస్తుంటారు చాలామంది. ఇక, డ‌బుల్ మాసాలా అడిగేవారూ ఎక్కువే. లేటెస్ట్‌గా, లాక్‌డౌన్ టైమ్‌లో ఓ యువకుడు జొమాటోలో చికెన్ లెగ్‌పీస్ బిర్యానీ విత్ ఎక్స్‌ట్రా మ‌సాలా.. ఆర్డ‌ర్ చేశాడు. కానీ, అత‌నికి లెగ్‌పీస్ రాలేదు, డ‌బుల్ మాసాలా కూడా ఇవ్వ‌లేదు. దీంతో.. అత‌గాడికి చిర్రెత్తుకొచ్చింది.. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో కంప్లైంట్ చేశాడు, ఆ ట్వీట్‌కు కేటీఆర్ సైతం రిప్లై ఇచ్చాడు. ఆ రెండు ట్వీట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయం కోరుతూ తనను ట్యాగ్ చేసిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా బదులిచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏదైనా కష్టం వచ్చి కేటీఆర్ ను సంప్రదిస్తే ఫర్వాలేదు కానీ, బిర్యానీలో మసాలా తక్కువైందంటూ ఓ నెటిజన్ తనను ట్యాగ్ చేయడంతో ఆయన అవాక్క‌య్యారు.  తోటకూరి రఘుపతి అనే వ్యక్తి  తాను జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశానని తెలిపాడు. ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ తో బిర్యానీ కావాలని తాను ఆర్డర్ చేస్తే, అవేవీ లేకుండానే తనకు చికెన్ బిర్యానీ డెలివరీ ఇచ్చారని ఆ వ్యక్తి వాపోయాడు. జొమాటో వాళ్లు ప్రజలకు ఇలాగేనా సేవ చేసేది? అంటూ ఆ వ్యక్తి మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. దీనికి నన్నెందుకు ట్యాగ్ చేయడం బ్రదర్? ఈ విషయంలో నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అని ప్రశ్నించారు. నెట్టింట ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వేల సంఖ్యలో లైకులు, వందల సంఖ్యలో రీట్వీట్లు వస్తున్నాయి. అన్నింటికీ మించి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ట్వీట్‌పై కామెంట్ చేశాడు. తన కార్యాలయం వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ స్పందించాల్సిందేనని.. స్మైలీ ఎమోజీ జతచేశారు ఓవైసీ. కాసేపటి తర్వాత ఆ యువకుడు తన ట్వీట్‌ను తొలగించాడు. 

ఇంటికి చేరిన ఆనంద‌య్య‌.. మందు పంపిణీపై మండే క్లారిటీ..

ఆనంద‌య్య ఎక్క‌డ‌? ఆనంద‌య్యతో ర‌హ‌స్యంగా మందు త‌యారు చేయిస్తున్నారా? ఆ మందును ప్ర‌ముఖుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నారా? ఆనంద‌య్య మందు ఫార్ములాను కొట్టేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోందా? ఆనంద‌య్య‌పై పెద్ద‌ల ఒత్తిడి ఉందా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు, అంత‌కుమించి అనుమానాల మ‌ధ్య ఆనంద‌య్య ఇంటికి చేరాడు. వారం రోజుల అజ్ఞాతం త‌ర్వాత ఆయ‌న నింటికి చేర‌డం ఉత్కంఠ రేపుతోంది.  ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. మందు పంపిణీ ఆగ‌డంతో పాటు ఆయ‌న సైతం అడ్ర‌స్ లేకుండా పోయారు. ర‌హ‌స్య ప్రాంతాల్లో మందు త‌యారు చేస్తున్న వీడియోలు మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చాయి కానీ, ఆయ‌న మాత్రం ప్ర‌జ‌ల ముందుకు రాలేదు. దీంతో, అనుమానాలు పెరిగిపోయాయి. ఉత్కంఠ రేపిన ఆనంద‌య్య అజ్ఞాత‌వాసానికి ముగింపు ప‌లుకుతూ.. తాజాగా ఆయ‌న కృష్ణపట్నం రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. వారం తర్వాత వచ్చిన ఆనందయ్యను కలిసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, డీఎస్పీ ఆధ్వర్యంలో ఆనందయ్య నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇత‌ర ప్రాంతాల నుంచి కృష్ణపట్నానికి రాకపోకలు నిషేధించారు. మ‌రోవైపు, ఆనందయ్య ఔషధంపై ఆయుష్ శాఖ అధ్యయనం కొనసాగుతోంది. అటు, ఆనందయ్య మందు వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ అంశాలపై ఆయుష్ శాఖ కమిషనర్ రాములు స్పందించారు. ఆనందయ్య ఔషధంపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుందని వెల్లడించారు. ఔషధ పరీక్షలపై శ‌నివారం సీసీఆర్ఏఎస్ చివరి నివేదిక కూడా రానుంది. అన్ని నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుందని రాములు తెలిపారు. చివరి రిపోర్డ్‌తో పాటు హైకోర్టు తీర్పు కూడా వచ్చాక.. సోమ‌వారం ఔషధ పంపిణీపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వచ్చిన నివేదికలు సానుకూలంగానే వచ్చాయని అన్నారు. ఆనందయ్య మందు తీసుకున్న చాలామందిని ఫోన్ ద్వారా సంప్రదించామని, వారి సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాల్సి ఉందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. పంపిణీకి ముందు, ఔషధానికి ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద‌ని ఆయుష్ శాఖ క‌మిష‌న‌ర్ రాములు చెప్పారు.

ఖ‌బ‌డ్దార్‌.. చుక్క‌లు చూపిస్తా.. చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

తప్పు చేసిన వాళ్లకు చుక్కలు చూపిస్తా.. నాయకులు కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా పోరాడే వాళ్లకే భవిష్యత్తులో పదవులని తేల్చిచెప్పారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. టీడీపీని ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదని ఆయ‌న‌ హెచ్చరించారు.  జగన్‌ పాలనంతా అబద్ధాల అంకెల పైనే నడుస్తోందని.. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహానాడు వేదికగా శ్రేణులకు బోధించారు. మహానాడులో రెండో రోజు రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీరు సహా పలు తీర్మానాలపై చర్చ జరిగింది. రాష్ట్రానికి ఒక కన్ను అయిన అమరావతిని పొడిచేసిన జగన్‌.. రెండో కన్నుగా ఉన్న పోలవరానికీ అదేగతి పట్టిస్తున్నారని మండిప‌డ్డారు. రైతు ప్రభుత్వమని చెప్పుకొంటూ వారి కళ్లకు గంతలు కడుతున్నారని మండిపడ్డారు.    ‘‘సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారు. గత ప్రభుత్వ పథకాలను కొత్తవిగా చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వానిది మోసకారి సంక్షేమం.. నకిలీ నవరత్నాలు. క్షేత్రస్థాయిలో చర్చలు పెడితే ప్రభుత్వ మోసం తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని ఒకే కంపెనీకి అప్పగించారు. గతేడాది రాష్ట్రంలో మిగులు సౌర విద్యుత్ ఉందన్నారు. 10వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ కోసం టెండర్లు పిలిచారు. ప్రజలపై అదనంగా రూ.2.5లక్షల కోట్ల భారం వేశారు. ధరలు, పన్నులు పెంచారు.. అప్పులు తెచ్చి ఏం చేశారు? ఎక్కడికక్కడ దోచుకొనే కార్యక్రమాలు చేశారు. ప్రజల ముందు ఈ ప్రభుత్వం దోషిగా నిలబడే రోజు త్వరలోనే వస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.   మరోవైపు, సాగు రంగంపై మహానాడులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీర్మానం చేశారు. సాగు రంగానికి చేసే ఖర్చుపై ప్రభుత్వానికి స్పష్టతలేదన్నారు. 65లక్షల గాను 45లక్షల రైతు కుటుంబాలకే రైతు భరోసా ఇచ్చారని తెలిపారు. అర్హత కలిగిన రైతులకు సున్నా వడ్డీ పథకం ఇవ్వలేదని, ప్రభుత్వ చర్యలతో పంటల దిగుబడి తగ్గిపోయే పరిస్థితి నెలకొంటోందని చెప్పారు. కరోనా, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సోమిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

పీఎం మోదీ వెయిటింగ్ ఇక్క‌డ‌.. సీఎం మ‌మ‌త ఎక్క‌డ‌..?

సీఎం మమత కోసం పీఎం మోదీ వెయిటింగ్. నిమిష‌మో, రెండు నిమిషాలో కాదు. ఏకంగా అర‌గంట నిరీక్ష‌ణ‌. ఇక ఆమె రాద‌నుకుంటుండ‌గా.. స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చారు మ‌మ‌తా బెన‌ర్జీ. కాసేపు అలా కూర్చొని.. ఆ వెంట‌నే వెళ్లిపోయారు. పీఎం అయితేనేం..? మోదీ అయితేనేం..? మ‌మ‌తా.. సీఎం మ‌మ‌త ఇక్క‌డ.. అంటూ ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ త‌నను మొండిఘ‌టం అని ఎందుకు అంటారో మోదీకి తెలిసొచ్చేలా చేశారు. బెంగాల్ దంగ‌ల్‌పై ఓ మోస్తారు రివేంజ్ తీర్చుకున్నారు.  బీజేపీ, తృణ‌మూల్ మ‌ధ్య పార్టీ ప‌రంగా ఎంత‌గా విభేదాలు ఉన్నా.. అధికారిక కార్య‌క్ర‌మాల్లో మాత్రం ఆ భేదాభిప్రాయాలు చూపించేవాళ్లు కాదు. కేంద్ర‌, రాష్ట్ర సంబంధాల్లో హుందాగా వ్య‌వ‌హ‌రించేవాళ్లు ఆ ఇద్ద‌రు. కానీ, ఇదంతా గ‌తం. ఇప్పుడు నువ్వా-నేనా అన్న‌ట్టు త‌ల‌బ‌డుతున్నారు. తాను గెలిచాక మోదీ ఫోన్ చేసి.. విషెష్ చెప్ప‌లేద‌ని ఇప్ప‌టికే దీదీ.. మోదీపై అలిగారు కూడా. తాజాగా, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ఉండే ప్రోటోకాల్‌ను సైతం ప‌క్క‌నపెట్టి మోదీ నిర్వ‌హించే మీటింగ్‌కు డుమ్మా కొట్టాల‌ని చూశారు. ఆఖ‌రి క్ష‌ణం వ‌ర‌కూ వెళ్ల‌కుండా.. మోదీని వెయిట్ చేయించి.. చివ‌రాఖ‌రికి ఇలా వెళ్లి అలా వ‌చ్చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది.    యాస్ తుపాను విషయంపై ప్రధాని మోదీ నిర్వహించే సమీక్షా సమావేశానికి తాను హాజరు కానని, సీఎస్ హాజరవుతారని మొద‌ట‌ సీఎం మమత బెట్టు చేశారు. ప్రధాని మోదీ, గవర్నర్ ధన్కర్ ఆమె కోసం అర‌గంట పాటు వేచి చూశారు. ఇక మ‌మ‌త రాద‌నుకొని.. సమీక్షా సమావేశాన్ని ప్రారంభించారు. హఠాత్తుగా, 30 నిమిషాల ఆల‌స్యంగా.. సీఎం మమత సమావేశానికి హాజరయ్యారు. అయితే ఎక్కువ సేపు సమావేశంలో ఉండలేదు. తుపానుకు సంబంధించిన కొన్ని పత్రాలను మోదీకి సమర్పించి, అక్కడి నుంచి సీఎం మమత నిష్క్రమించారు. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌ధానిని అంతసేపు వెయిట్ చేయించ‌డం.. ప‌ద్ద‌తి కాద‌ని.. ఇది ప్రోటోకాల్‌కు విరుద్ధ‌మ‌ని.. పీఎంవో వ‌ర్గాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. అయినా.. మొండిఘ‌టం మ‌మ‌త ప‌ట్టించుకుంటేగా....

ప్రశ్న మీదే... ఆన్సర్ మీదే! కరోనాతో మారిన ఎగ్జామ్ సీన్....

కరోనా మహమ్మారితో అంతా తలకిందులవుతోంది. ఎవరూ, ఎప్పుడూ ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. వైరస్ కారణంగా లాక్  డౌన్లతో ఏడాదిన్నరగా విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. స్కూళ్లు, కాలేజీలు మూతపడటంతో చదవులు అటకెక్కాయి. తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరీక్షలు మినహాయిస్తే.. మిగితావన్ని రద్దువుతున్నాయి. ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నా.. పూర్తి స్థాయిలో అందరికి చేరడం లేదు. కరోనాతో చదువు, పరీక్షల విధానంలోనూ మార్పులు వస్తున్నాయి. ఇలానే గోవా ఐఐటీ చేసిన కొత్త తరహా ప్లాన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  సాధారణంగా ప్రాథమిక తరగతుల నుంచి ఉన్నత విద్య వరకు పరీక్షల్లో ఎక్కడైనా సరే.. ప్రశ్నపత్రం ఇచ్చి జవాబులు రాయమంటారు. కానీ ప్రశ్నలు, జవాబులు కూడా మీరే రాసుకోండి అని అంటే.. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా ఇలానే చేసింది. అనలాగ్ సర్క్యూట్స్ ఎగ్జామ్‌లో పరీక్ష పేపర్ ను ఇలానే ఇచ్చింది. సెమిస్టర్‌లో నేర్చుకున్నదానిని బట్టి ఈ పరీక్షలో సొంతంగా ప్రశ్నలు తయారుచేసి దానికి జవాబులు రాసి ఇవ్వాలని ఐఐటీ కోరింది. ఇది చూసిన విద్యార్థులు తొలుత షాకయ్యారు. దీంతో  పరీక్షకు హాజరైన  విద్యార్థులు.. ఆ పేపర్ చూసి షాకయ్యారు. ఆ తర్వాత కోలుకుని తమకు తోచినది, వచ్చినది, తెలిసినది రాసి ఎగ్జామ్ ముగించారు. ఎవరో ఈ పేపర్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.  ఐఐటీ గోవా ఇచ్చిన ఆ పేపర్‌లో మొత్తం సెమిస్టర్‌లో మీకు ఇచ్చిన లెక్చర్ మెటీరియల్స్ నుంచి 60 మార్కుల ప్రశ్నలు రూపొందించండి అని ఉంది. ‘‘మీరు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారనే దానిని ఇది తెలియజేస్తుంది. ప్రశ్నలు తయారుచేసిన తర్వాత రెండు గంటల్లో జవాబులు కూడా రాయండి’’ అని ఆ పేపర్‌లో రాసి ఉంది. కరోనా కారణంగా బోర్డు పరీక్షలను రద్దు చేయాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తుంటే ఐఐటీ గోవా క్వశ్చన్ పేపర్ మాత్రం సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది.  విద్యార్థులు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారనేది ఈ దెబ్బతో తేలిపోతుందంటూ ఐఐటీ గోవాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐఐటీ గోవా తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానం విద్యార్థుల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు. విద్యార్థులను అంచనా వేసేందుకు ఈ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుందని, ప్రశ్నలు తయారు చేసి జవాబులు రాయడం అంత సులభమైన విషయం ఏమీ కాదని అంటున్నారు. ఈ దెబ్బతో తనకు ఏం తెలుసు? ఏమి తెలియదు? అన్న విషయం విద్యార్థులకు పూర్తిగా బోధపడుతుందని మరికొందరు కామెంట్ చేశారు.

పీఎంజేజేబీవై కరోనాకు వర్తిస్తుంది ..

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహామ్మారి ఇప్పట్లో వదిలేలా లేదు. ఈ  ప్రాణాంతక మహామ్మారి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుందని, శాస్త్ర వేత్తలు,నిపుణులు చెపుతున్నారు. నిజానికి, కొవిడ్ ఎవరిని ఎప్పుడు కాటేస్తుందో, ఏ కుటుంబం ఎప్పుడు ఎలా దిక్కులేని దీనావస్థకు చేరుతుందో, ఊహకు కూడా అందని విషయం. ఈ పరిస్థితిలో ఎవరికి ఏమైనా వారి మీద అధారపడిన వారికి ఒకింత ఆసరాగ నిలిచేది బీమా. ఇందులోనూ. అందరికి అందుబాటులో ఉండేవి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం (పీఎంజేజేబీవై). కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పాలసీలను తీసుకున్న వ్యక్తులు మరణిస్తే.. బీమా పరిహారం నామినీకి అందుతుంది. నిజానికి, ఈ బీమా పథకాలు కొవిడ్ కోసం తెచ్చిన పథకాలు కాదు. సామాన్య పరిస్థితులలో ప్రమాద వశాత్తు మరణించే పేద ప్రజల కుటుంబాలకు భరోసా కలిపించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లోనే ఈ బీమా యోజన తీసుకొచ్చింది. అయితే, ఇంతవరకు ఈ పథకాలు కొవిడ్ మరణాలకు వర్తిస్తాయా లేదా అన్న అనుమనాలున్నాయి. గుర్తింపు పొందిన బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న 18-70 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా ఈ  పాలసీలని తీసుకోవచ్చు. కేవలం సంవత్సరానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై)వార్షిక ప్రీమియుం కేవలం రూ.12 మాత్రమే, ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే రూ.2లక్షలు, శాశ్వత వైకల్యం ఏర్పడితే రూ.లక్ష చెల్లిస్తారు. కొవిడ్‌ మరణాలకూ ఈ పాలసీకి సంబంధం లేదు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం (పీఎంజేజేబీవై), వార్షిక ప్రీమియం రూ.330. ఆదాయంతో నిమిత్తం లేకుండా గుర్తింపు పొందిన బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న 18-50 ఏళ్ల లోపు వ్యక్తులు ఎవరైనా  దీనికి అర్హులు.  ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలున్నా.. పాలసీ ఒకటే ఇస్తారు. ఇది ఏటా జూన్‌ 1 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ పథకంలో కొత్తగా చేరితే.. నమోదు చేసిన 45 రోజుల తర్వాత మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుదారులు ఏ కారణంతో మరణించినా.. రూ.2లక్షల బీమా పరిహారం అందుతుంది. హత్య, ఆత్మహత్యలకూ ఇది వర్తిస్తుంది. కాబట్టి, కొవిడ్‌-19 కారణంగా మరణించిన వారికీ ఈ బీమా పాలసీ రూ.2లక్షల పరిహారం చెల్లిస్తుంది. పాలసీదారు చనిపోయిన 30 రోజుల్లోగా వారి నామినీలు సంబందిత బ్యాంకు శాఖను సప్రదిస్తే, బ్యాంకు ఆ క్లెయిం ఫారాన్ని సంబంధింత బీమా కంపెనీకి పంపిస్తుంది. కొవిడ్‌-19 కారణంగా చనిపోయిన వారి క్లెయింలను బీమా సంస్థలు వేగంగా పరిష్కరిస్తున్నాయి.

కరోనా భయంతో.. చచ్చిన పామును తిన్న వ్యక్తి.. 

ప్రపంచం అంత ఎక్కడ చూసిన ఒక్కటే మాట. కరోనా, కరోనా.ఈ కరోనా దెబ్బకు ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. ఇక శవాలు అయితే హిమాలయ పర్వతంల గుట్టలు గుట్టలు పడివున్నాయి. దేశం అంతే కన్నీటి సంద్రంలో మునిగి ఉంది.. ఆ కన్నీటితో రాజకీయ నాయకులు సమానం చేస్తున్నారు తప్పా.. ప్రజలకు మేలు కోరడం లేదు. వాక్సిన్ లేదు, వైద్యం లేదు, ఆక్సిజన్ లేదు, ఆసుపత్రిలో బెడ్లు లేదు. మన దేశ రాజకీయనాయకులకు మతి లేదు. అందుకే దేశమంటే మనుషులు అనుకోవడం లేదు దేశమంటే మాట్టే అనుకుంటున్నారు. అయితే శవాలను కాల్చడానికి సైతం డబ్బులు వసూల్ చేస్తున్నారు.  ఇది ఇలా ఉండగా కరొనకు ఇప్పటి వరకు సరైన వైద్యం లేదనే చెప్పాలి. అది ప్రజలను కంగారు పడుతున్నారు. కరోనా వస్తే ఏం మందులు వాడాలి అలోపతి ని నమ్మాలా ఆయుర్వేదం నమ్మాలా అని నిత్యం తికమక స్థితిలో పడుతున్నారు. ఎవరికి ఏది నచ్చితే ఆ కరోనా నుండి విముక్తి పొందుతున్నారు. కానీ కొంత మంది వ్యాధి ఎక్కువ అవ్వడంతో చనిపోతున్నారు. తాజాగా కరోనా కరోనా నుండి తప్పించుకోవడానికి ఒక వ్యక్తి పాము ను తిన్నాడు.. ఆ తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాగిన మత్తులోనే తాను పామును తినేశానని చెప్పాడు. కరోనా వైరస్ భయంతో జనం రకరకాల పనులు చేస్తుంటారు. కొందరు కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడంకోసం వింత వింత చేష్టలకు దిగుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి కరోనాకు విరుగుడు అంటూ చచ్చిన పామును తిన్నాడు. ఈ ఘటన తమిళనాడు వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయ్యింది. మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు అనే ఓ వ్యవసాయ కూలి. యాభై ఏళ్ల వయసున్న వడివేలు ఒకరోజు చచ్చిన కట్లపామును ఒకదానిని చేతబట్టి డాన్సులేశాడు. పాము కరోనాకి విరుగుడేనంటూ.. ఇక తనకు కరోనా రాదంటూ వ్యాఖ్యలు చేస్తూ అందరూ చూస్తుండగానే దానిని నమిలి తినేశాడు. పాము కరోనాకి విరుగుడేనంటూ.. ఇక తనకు కరోనా రాదంటూ వ్యాఖ్యలు చేస్తూ అందరూ చూస్తుండగానే దానిని నమిలి తినేశాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వైరల్ తీశారు. జిల్లా ఫారెస్ట్ అధికారుల దాకా ఆ వీడియో చేరడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించారు. చివరికి వడివేలుని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ టైంలో అతను ఫుల్‌గా తాగి ఉన్నాడని, అదృష్టవశాత్తూ అతను విష గ్రంథిని కొరకలేదని అధికారులు వెల్లడించారు. కాగా, ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నానని, కొందరు బలవంతం చేయించి ఆ పని చేయించారని వడివేలు వాపోతున్నాడు. కట్లపాము విషంలో న్యూరోటాక్సిన్స్ ఉంటాయని, అవి పక్షవాతాన్ని కలగజేస్తుందని ఫారెస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నానని, కొందరు బలవంతం చేయించి ఆ పని చేయించారని వడివేలు వాపోతున్నాడు. వడివేలును అరెస్ట్ చేయడంతో పాటు 7,000 రూపాయల ఫైన్ విధించారు.  

ఫైన్ క‌ట్ట‌నంటూ కిరికిరి.. ఖాకీల‌తో కొట్లాట‌.. లాక్‌డౌన్ ర‌చ్చ‌..

5 నిమిషాలు ఆల‌స్య‌మైతే ఏమైత‌ది? ఇదీ ఆ యువ‌కుడి క్వ‌శ్చ‌న్‌. ఏమైత‌ది అంటే.. వెయ్యి రూపాయ‌లు ఫైన్ ప‌డుత‌ది.. ఇదీ పోలీసుల ఆన్స‌ర్‌. ఇంత మాత్రానికే అంత ఫైన్ వేస్తారా? మ‌ళ్లీ ప్ర‌శ్న‌. ఆ, వేస్తాం.. ఫైన్ క‌ట్టి పో.. ఖాకీల వ‌ర్ష‌న్‌. ఫైన్ లేదు.. ఏం లేదు.. నేను క‌ట్ట‌ను పో.. ఏం చేస్తారో చేసుకోండి.. అంటూ అత‌ను పోలీసుల‌పైకి తిర‌గ‌బ‌డ్డాడు. రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలిపాడు. అత‌న్ని అమాంతం పైకి లేపి.. బండ్లో వేసి.. అక్క‌డి నుంచి తీసుకెళ్లిపోయారు. ఇదీ సీన్‌... కొంద‌రు సిల్లీ రీజ‌న్స్‌కే రోడ్ల మీదికొస్తూ పోలీసుల‌ను ప‌రేషాన్ చేస్తున్నారు. అలాంటి వారి వ‌ల్లే.. లాక్‌డౌన్ రూల్స్‌ క‌ఠిన‌త‌రం చేశారు. లాక్‌డౌన్ టైమ్ అంటే టైమే. నిమిషం లేటైనా.. ఫైన్స్ బాదేస్తున్నారు. లేటెస్ట్‌గా.. ఓ యువకుడి విషయంలోనూ ఇలాగే జరిగింది. 5 నిమిషాలు ఆలస్యం అయినందున పోలీసులు రూ.1000 జరిమానా విధించారు. తాను విధులు ముగించుకుని వచ్చేసరికి లేటైందని చెబుతున్నా ఖాకీలు పట్టించుకోలేదు. ఇక డీటైల్స్ చూస్తే... యాదాద్రి భువనగిరికి చెందిన సురేష్ అనే యువకుడు హైదరాబాద్‌లో విధులు ముగించుకుని తిరిగి వచ్చాడు. అతను రావడం లాక్‌డౌన్ సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమైంది. దీంతో సురేష్ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడని పోలీసులు రూ.1000 ఫైన్ విధించారు. ‘5 నిమిషాల వ్యవధిలోనే 1000 రూపాయలు ఫైన్ వేయడమేంటి..?. ఫైన్ నేను కట్టను. అసలు చలానా వేయమని మీకు ఎవరు చెప్పారు..?. నేను ఒక్క రూపాయి కూడా కట్టను. నా బండికి ఏం లేవో చెప్పండి.. అన్ని పత్రాలున్నాయ్’ అని పోలీసులతో ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు.   అయినా, పోలీసులు వింటేగా. ఫైన్ క‌ట్టాల్సిందేనంటూ ప‌ట్టుబ‌ట్టారు. దీంతో విసుగెత్తిన సురేశ్‌.. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాడు. అతడ్ని బలవంతంగా పోలీసులు లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ న్యూస్ తెగ‌ వైర‌ల్‌ అవుతోంది. 

కొవిడ్ పై గ్రామస్తుల యుద్ధం.. సొంతంగానే కేర్ సెంటర్ 

దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. వేగంగా విస్తరిస్తూ రోజుల్లోనే లక్షలాది లక్షలాది మందిని బలి తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ పంజా విసిరింది. రోజూ వేలల్లో కేసులు నమోదు కాగా...  రోగులకు హాస్పిటల్స్ లో  బెడ్లు దొరకలేదు. బెడ్ దొరికనా ఆక్సిజన్ అందలేదు.. దీంతో అంతా చూస్తుండగానే జనాలు పిట్టల్లా రాలిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత దయనీయ పరిస్థితులు. ఇంట్లోనే సెల్ఫ్ ఐసో‌లేషన్‌లో ఉందామంటే ఇరుకు గదులతో ఇబ్బందులు.. ప్రైవేట్ దవాఖానాలో చేరాలంటే సరిపోని స్థోమత. ఇక పాజిటివ్ రోగులను పొలిమేరల్లో అడుగుపెట్టనివ్వని గ్రామాలు. నిత్యం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏకమైన ఒక ఊరి జనం.. తామే ఓ కొవిడ్ కేర్ సెంటర్ నిర్మించుకుని మిగతా పల్లెలకు ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు చుట్టుపక్కల పల్లెల్లోని కొవిడ్ బాధితులకు సైతం అండగా ఉంటున్నారు.  తూర్పు గోదావరి జిల్లా, గొల్లల మామిడాడ గ్రామస్తులు ఫస్ట్ వేవ్ లో కరోనావైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ తరువాత కేసులు తగ్గినా.. ప్రస్తుత సెకండ్ వేవ్‌లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. దగ్గరి బంధువులను, ప్రియమైన వారిని, స్నేహితులను కోల్పోయారు. చాలా మంది ప్రజలు ఆక్సిజన్ కొరతతో  చనిపోయారు. ఈ సంఘటనలతో గుణపాఠాలు నేర్చుకుని..   అటువంటి మరణాలను తగ్గించాలని నిర్ణయించారు.కొవిడ్ కేర్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఒకరికొకరు సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు.. బాధిత కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే యువత, వలంటీర్లతో పాటు గ్రామస్తులంతా చందాలు వేసుకుని దాదాపు రూ.50 లక్షలు సేకరించారు.  ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 30 పడకల సామర్థ్యంతో కొవిడ్ కేర్ సెంటర్‌ను సొంతంగా నిర్మించుకున్నారు. 30 బెడ్లకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శుక్రావరం ఈ కొవిడ్ కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. అన్ని పడకలలో ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న కోవిడ్ రోగులకు ఉచితంగా ప్రథమ చికిత్సతో పాటు పూర్తి స్థాయి చికిత్స, ఆక్సిజన్ అందిస్తున్నారు.  ప్రభుత్వాస్పత్రుల్లోని లోపాలు, ప్రైవేట్ దవాఖానాల దోపిడీని ఎదుర్కొనేందుకు  మామిడాడ గ్రామస్తులు చేసిన ప్రయత్నం... ఇప్పుడు ఇతర గ్రామాలకు స్పూర్తిగా నిలుస్తోంది. తమ గ్రామస్తులకే కాకుండా సమీప పల్లె జనాలకు సైతం చేయూతనిచ్చేందుకు  మామిడాడ గ్రామస్తులు సిద్ధమయ్యారు

ముక్క‌లుగా న‌రికి.. పాతేసి.. ప‌ల‌మ‌నేరులో ప‌రువుహ‌త్య‌..

ప్రేమ ఇది ఏమైనా అంటరాని సంబంధమా..? అక్రమ సంబంధం కంటే దారుణమైనదా..? ప్రేమిస్తే పిల్లలను చంపేస్తారా..? అసలు పరువు అంటే ఏంటి..? ఆ పరువు కోసం మరొకరి నిండు ప్రాణం తీసే హక్కు ఎవరికి ఉంది. మరి ప్రేమ ముసుగులో యువతీ యువకులు చేసే పనులు ఏంటి..? ప్రేమికులు స్వేచ్ఛగా పెళ్ళిచేసుకుని రోజులు ఎప్పుడు వస్తాయి. ప్రేమకు కులం, మతం, డబ్బు ఈ మూడు కొలమానాలా.. ప్రేమించుకున్న వాళ్ళను అవసరం అనుకుంటే కూర్చోబెట్టి మాట్లాడి విడదియ్యాలి గానీ, అసలు చంపడమేంటి. తాజాగా తన  కుమార్తెను ప్రేమించాడని..ఆ యువకుడ్ని ముక్కలుగా నరికాడు ఓ తండ్రి..  వివరాలు ఇలా..  చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో దారుణం చోటుచేసుకుంది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ధనశేఖర్‌ (23) అనే యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పెంగరగుంటకు చెందిన ఓ బాలికను ధనశేఖర్‌ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్న ధనశేఖర్ మృతదేహం సొంత పొలంలోనే కనిపించడంతో యువకుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.    డీఎస్పీ గంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తండ్రి బాబు తమ కుమారుడిని నరికి చంపాడని ధనశేఖర్‌ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు బాలిక తండ్రి కాల్‌డేటాను పరిశీలించారు. శనివారం రాత్రి 10గంటలకు బాలిక తండ్రి నుంచి ధనశేఖర్‌కు ఫోన్ కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో బాబును అరెస్ట్‌ చేసి విచారించగా.. శనివారం రాత్రి కుమార్తెతో ధనశేఖర్‌ ఉండటాన్ని చూశానని చెప్పారు. ధనశేఖర్‌ను కత్తితో నరికినట్లు బాలిక తండ్రి ఒప్పుకున్నాడు. గ్రామ శివారులోని బావిలో మృతదేహాన్ని పడేసినట్లు చెప్పాడు. సోమవారం బావిలో మృతదేహం తేలడాన్ని బాబు గమనించాడు. దీంతో మృతదేహాన్ని ముక్కలుగా చేసి పొలంలో పాతిపెట్టాడు. నేరం ఒప్పుకోవడంతో బాలిక తండ్రిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ చెప్పారు.   మానవతావన్ని మరిచి పోతున్నారు. అడవిలో మృగాలకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మానవుడు అనే పదానికి అర్థాన్ని మూర్ఖుడుగా మారుస్తున్నారు. కూతుర్ని ప్రేమించాడని హత్యలు చేస్తున్నారు. ఒక్కటి కాదు రేడు కొన్నీ వందల హత్యలు జరిగాయి. తెలంగాణాలో మంథాని, భువనగిరి సంఘటన, ప్రణయ్ అమృతాల ఘటన ఇలా చెపుతూపోతే వందలకు పైగా ఉన్నాయి. 

అరెస్టుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్.. జ‌గ‌న్ స‌ర్కారుకు బిగ్‌ షాక్‌..

ఎంపీ ర‌ఘురామ అరెస్ట్ ఎపిసోడ్‌లో ఏపీ స‌ర్కారుకు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. ర‌ఘురామ జైలు నుంచి బ‌య‌ట‌కు రావ‌డం.. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొంద‌టం.. ఆయ‌న కాళ్ల‌కు గాయాలు ఉన్నాయంటూ మెడిక‌ల్ రిపోర్ట్ ఇవ్వ‌డం.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డం.. ఆర్మీ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయి.. ఢిల్లీ ఎయిమ్స్‌కు ఎగిరిపోవ‌డం.. ఇలా ర‌ఘురామ విష‌యంలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం అనుకున్న‌ది ఒక‌టి.. అవుతున్న‌ది మ‌రొక‌టి. తాజాగా.. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ సైతం ర‌ఘురామ అరెస్ట్‌పై స్పందించింది.  ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన తీరు, తదనంతర పరిణామాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ రియాక్ట్ అయింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడి విషయంలో అంతర్గత విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. జూన్‌ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీని ఆదేశించింది. రఘురామ అరెస్టు తీరుపై ఆయన తనయుడు భరత్‌ ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ విధంగా స్పందించింది.   మ‌రోవైపు.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు గురువారం ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు పూర్త‌య్యాయి. రఘురామకు సిటీస్కాన్‌, ఎమ్మారై స్కాన్‌తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్‌ డ్యామేజ్‌ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన రెండు కాళ్లకు వైద్యులు పీవోపీ కట్టు కట్టారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రఘురామకు సూచించారు. రఘురామ ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీల్లేదని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు. పరీక్షల అనంతరం ఎయిమ్స్‌ నుంచి అధికారిక నివాసానికి రఘురామకృష్ణరాజు వెళ్లారు. 

అంత్యక్రియలు జరిగాక.. వారానికి తిరిగి వచ్చి .. 

అసలు ఈ కాలంలో ఏం జరుగుతుందో అర్థం అవ్వడం లేదు. ఈ మధ్య చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సీన్లు సినిమాలోనే జరుగుతాయి అనుకుంటాం కానీ ప్రత్యేకంగా చూస్తున్నాం. అదేంటంటే అంత్యక్రీయలు జరిగాక తిరిగివచ్చిన వ్యక్తి. అని.. పడే మీద ఉన్న వ్యక్తి లేచికూర్చున్నాడని. ఇలాంటి వార్తలు చాలా వింటూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి మరో మరొకటి ఉంది. ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..   ఒక వ్యక్తి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడ.. ఒక చోటుకి చేరిన తర్వాత అతనికి ఆరోగ్యం మందగించింది. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చేరాడు.  అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవర్ధన్ ప్రజాపత్ పరిస్థితి విషమించడంతో మరణించాడు. మూడు రోజులైనా గోవర్ధన్ శవాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అతని కుటుంబ సభ్యులు వచ్చారు అతని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా కన్నీరు కార్చారు.  చివరికి అతనికి హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రీయలు జరిపించారు. అంత్యక్రియలు జరిగిన వారం రోజుల తర్వాత ఓ వ్యక్తి సజీవంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు షాకైయ్యారు.  గోవర్ధన్ పొటోలను సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల్లో ప్రచురించిన పోలీసులు గుర్తిస్తే సమాచారం అందించాలని కోరారు. ఇవి చూసిన ఓంకార్‌లాల్ కుటుంబ సభ్యులు మార్చురీకి వెళ్లి శవాన్ని చూసి ఓంకార్‌గా పొరబడ్డారు. ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియులు నిర్వహించారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఓంకార్‌లాల్ ఇంటికొచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. జరిగిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చనిపోయాడనుకున్న కొడుకు ఇంటికి రావడంతో సంతోషంలో  మునిగిపోయారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లాలో జరిగింది. అతని పేరు ఓంకార్‌లాల్  అతనికి 40  సంవత్సరాలు. 

హే హ‌నుమా.. ఈ గొడ‌వేంటి గోవిందా..

హ‌నుమంతుడు ఎక్క‌డ పుట్టాడు?  తిరుమ‌ల గిరుల్లోనా? క‌ర్ణాట‌క‌లోని కిష్కింధ‌లోనా? అనేదానిపై ఏళ్లుగా వివాదం చెల‌రేగుతూనే ఉంది. విస్తృత ప‌రిశోధ‌న‌లు, ప‌రిశీల‌న‌ల అనంత‌రం.. ఆ రామ‌భ‌క్తుడు తిరుమ‌ల గిరుల్లోనే జ‌న్మించాడంటూ టీటీడీ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. కాదు కాదు.. అంజ‌నీపుత్రుని పుట్టుక క‌ర్ణాట‌క‌లోని కిష్కింధ‌లోనే అంటూ అక్క‌డి సంస్థాన్ వాదిస్తోంది. అందుకే, హ‌నుమ జ‌న్మ‌స్థ‌లంపై క్లారిటీ కోసం తాజాగా ఇరుప‌క్షాలు స‌మావేశ‌మై చ‌ర్చించాయి. అందులోనూ, ఎలాంటి ఏకాభిప్రాయం రాకుండా చ‌ర్చ‌లు అర్థాంత‌రంగా ముగిశాయి. చ‌ర్చ‌లైతే ముగిసాయి కానీ.. ర‌చ్చ మాత్రం ఆగ‌లేదు. టీటీడీపై గోవిందానంద వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌గా.. వాటిని త‌ప్పుబ‌డుతూ.. తిరిగి కౌంట‌ర్ ఇచ్చారు టీటీడీ పండితులు.   తాజాగా, టీటీడీపై గోవిందానంద సరస్వతి మ‌రోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పుస్తకంలో అన్నీ తప్పులేనని తోచిపుచ్చారు. సంపూర్ణ అవగాహన, పరిశోధన చేయకుండా హనుమంతుడి జన్మస్థలాన్ని అసంపూర్ణ జ్ఞానంతో ప్రకటించారని తప్పుబట్టారు. టీటీడీ ప్రమాణంగా చూపిస్తున్న.. వెంకటాచలం మహత్యం సంకలనం తప్పుల తడక అని కొట్టిపారేశారు. వెంకటాచలం మహత్యం బుర్రలేని వారు రాశారని మండిపడ్డారు. ద్వాపరయుగం అంతంలో 5 వేల ఏళ్ల క్రితం పురాణాలు పుట్టాయని, టీటీడీ రామాయణాన్ని ప్రమాణంగా తీసుకోవడం లేదని గోవిందానంద విమర్శించారు. హనుమంతుడు పుట్టిన శ్లోకంతో తిధికి సంబంధం లేదన్నారు. కలియుగంలో హనుమంతుడు పుట్టినట్టు టీటీడీ పుస్తకం చెబుతోందని, టీటీడీ ప్రకారం హనుమంతుడు రాక్షసుడు.. రామాయణం ప్రకారం అప్సరస బిడ్డ అని తెలిపారు. అంజన హళ్లి ఇంకా పంపా సరోవరం ద‌గ్గ‌ర‌ ఉందని తెలిపారు. రామాయణంలో ఎక్కడా.. తిరుమల గురించి కానీ, వృషాద్రి, శేషాద్రి పర్వతాల గురించి కానీ లేద‌ని చెప్పారు. కొందరు కీర్తి కోసం ఒత్తిడితో హనుమంతుడి జన్మస్థలం తిరుమ‌ల కొండ‌లేనంటూ పండితుల చేత ప్ర‌క‌ట‌న‌ చేయించారని ఆరోపించారు. టీటీడీ పండితులు దారి తప్పారని, తిరుమలను హనుమంతుడి జన్మస్థలం అని ప్రకటించాక.. టీటీడీకి లాయర్ నోటీసులు వెళ్లాయని గోవిందానంద తెలిపారు.

ఏసీబీకి సుప్రీం నోటీసులు.. రేవంత్‌రెడ్డికి ఊర‌ట‌!

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి.. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌పై సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిలిపివేయాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత ధర్మాసనం తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. 4 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నాంపల్లిలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిలీఫ్‌ దొరికింది. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. ఏసీబీ చార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు  కనిపించలేదు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో చెప్పారు. టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం మోపింది. ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని పేర్కొంది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది. 2015లో వెలుగు చూసిన ఈ కేసులో అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. తాజాగా ఈడీ  దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది ఈడీ. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా... టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం. 

రోడ్డు మీద కొత్త జంట.. మందలించిన పోలీసులు.. ఏం జరిగిందో తెలుసా..? 

కరోనా సమయంలో చాలామంది సైలెంట్‌గా పెళ్లిళ్లు చేసుకున్నారు. కరోనా భయంతో ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా అతి తక్కువ మంది అతిథులతో వివాహ వేడుకను జరుపుకున్నారు. అయితే కొత్తగా పెళ్లైన జంటకు ఎంత టైం ఉన్న సరిపోదు. ఇక ఖాళీగా సమయం దొరికితే ఎంతో ఆనందం. లాక్ డౌన్ సమయంలో వివాహం జరిపితే మరింత హ్యాపీ. కొత్త జంటలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కానీ లాక్ డౌన్ లో ఓ కొత్త జంట పోలీసులకు షాక్ ఇచ్చింది. అదేదో స్కిట్ లో ఏ సుబ్బారావు గారు ఏం నడుస్తుంది.. అంటే మీ కంటే ముందు మీ పొట్ట నడుస్తుంది అన్నట్లు. ఇది అసలే కరోనా టైం నడుస్తుంది. ఈ లాక్ డౌన్ టైములో అందరూ బిక్కు బిక్కు మని ఇళ్లలో ఉంటే.. కొత్తగా పెళ్లి అయినా జంట ఇంట్లో ఉంది బోర్ కొట్టిందని రోడ్డు మీదికి వచ్చారు. అది కూడా ఒక కుక్క  పిల్లతో కలిసి కొత్త జంట రోడ్డుపైకి వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రోడ్డుపైకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటూ గట్టిగా నిలదీశారు. అది సైబరాబాద్. లాక్ డౌన్ కారణంగా గల్లీ గల్లీకి ప్రతి చోట పోలీసులు ఉన్నారు. సరిగ్గా మధ్యాహ్న సమయం. ఓ జంటను పోలీసుల ఆపారు. వారితో పాటు ఓ కుక్క పిల్ల కూడా ఉంది. చెక్ పోస్ట్ నెంబర్ 1 పోలీసులు ఆపిన తర్వాత తాము మెడిసిన్ కోసం వెళ్తున్నామని చెప్పారు . చెక్ పోస్ట్ నెంబర్ 2  దగ్గర మరో  సమాధానం చెప్పారు. ఇలా మూడు నాలుగు చేక్ పోస్ట్ లు దాటిన తర్వాత 5 వ  చెక్‌పోస్టు వద్ద పోలీసులు వారిని గట్టిగా నిలదీశారు. అసలు మీరు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? ఏం తీసుకురావడానికి వెళ్తున్నారని అడిగారు. దీంతో ఏమి సమాధానం చెప్పాలో తెలియక చివరికి సిల్లీగా కుక్కపిల్లకు జ్వరం వచ్చిందని చెప్పారు. దీంతో పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎక్కడ హాస్పిటల్ తెరిచి లేవని పోలీసులు తేల్చేశారు. దీంతో ఆ కొత్త జంటలో ఆయే మయంలో పడిపోయింది. అనవసరంగా రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారని పోలీసులు వారిని హెచ్చరించారు. దీంతో కొత్తజంట చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ కి గురయ్యారు. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలోనే తమకు వివాహం జరిగిందని, గత నెలరోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నానని , ఇంట్లో ఉండడంతో తమకు బోర్ కొడుతుందని , బయట తిరగాలన్న ఉద్దేశంతో రోడ్డుమీదికి వచ్చామని చెప్పారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొత్తజంట ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయాలి తప్ప బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . అంతేకాకుండా వారిద్దరిని కూడా పోలీసులు ఇంటి వరకు దిగబెట్టి మరొకసారి బయట కనబడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.