30వేల పైచిలుకు మెజారిటీతో పవన్ విజయం.. జేడీ లక్ష్మీనారాయణ జోస్యం

పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయంపై ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో పవన్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత కూడా ఎన్నికల తరువాత ప్లేటు ఫిరాయించేసి తానెప్పుడూ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించలేదనీ, వైసీపీ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా తాను విమర్శల విషయంలో సంయమనం పాటించాననీ చెప్పుకున్నారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి అన్నా, ఆయన కుటుంబం అన్నా తనకు ఎంతో గౌరవాభిమానాలున్నాయని చెప్పారు. ప్రజారాజ్యం అభ్యర్థిగా తాను గతంలో ఎన్నికలలో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక వైసీపీ శ్రేణులు కూడా విజయంపై ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. దీంతో పిఠాపురంలో గెలిచేది ఎవరన్న దానిపై కాకుండా అక్కడ పవన్ కల్యాణ్ మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది.  ఈ తరుణంగా జేడీ లక్ష్మీనారాయణగా గుర్తింపు పొందిన సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధినేత వీవీ లక్ష్మీనారాయణ కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ దే విజయం అని చెప్పడమే కాకుండా ఆయనకు 30 వేల పైచిలుకు మెజారిటీ వస్తుందని జోస్యం చెప్పారు.  తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పిఠాపురంలో పవన్ కల్యాణ్ పెర్ఫార్మెన్స్ పై తన పరిశీలనను, అభిప్రాయాలను పంచుకున్నారు.  పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ముఫ్ఫై వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారనీ చెప్పారు. వాస్తవానికి పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ రికార్డు స్థాయి మెజారిటీతో అంటే దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం 30 వేల మెజారిటీ అని భావిస్తున్నారు.  మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా పని చేసిన లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న సమయంలో  కేసులను దర్యాప్తు చేశారు.   వీటిలో సత్యం కంప్యూటర్స్ కార్పొరేట్ కుంభకోణం, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసు, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. 2018లో ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన  ఆయన 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.   ఆ తరువాత ఆయన జనసేన నుంచి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచీ  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతులు, యువతలో చైతన్యం కలిగిస్తూ వచ్చారు.  ఇటీవలే ఆయన జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంపై లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

పిఠాపురంలో స్టిక్కర్ల వార్

పిఠాపురంలో  ఏది జరిగినా  సెన్సేషనే..! ఎందుకంటే..అక్కడ జనసేన అధినేత పవన్  పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసిన‌ప్ప‌ట్టి నుంచీ ట్రెండింగ్ లో ఉన్న సెగ్మెంట్ ఇది. అక్కడ ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్‌ కూడా అంతే ఆసక్తిగా కొన‌ సాగింది. యువ‌త అర్థ‌రాత్రి వ‌ర‌కు ఓటు వేశారు. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త…చాలా పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు… మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్‌ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్‌ చేయిస్తున్నారు.  జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అంటూ పవన్ అభిమానులు బైకులు, ఆటోలు, కార్లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. మనల్నెవడ్రా ఆపేది అనే కొటేషన్స్ తో రచ్చ చేస్తున్నారు.  ‘మా MLA పవన్' అంటూ రాయించుకుంటున్నారు.    అటు  జనసేన కార్యకర్తలకు ధీటుగా వైసీపీ అభ్యర్థి వంగా గీతా అభిమానులు కూడా స్టిక్కర్లు  వేయించుకుంటున్నారు.  కాబోయే డిప్యూటీ సీఎం వంగా గీతా అంటూ బైక్ లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు.  ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రిజల్ట్స్ కు ముందే పిఠాపురంలో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఫ్లెక్సీలతో హంగామా చేస్తున్నారు. పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ రేంజ్‌లో నడుస్తుందనడానికి ఈ సంఘ‌ట‌న‌లు అద్దం ప‌డుతున్నాయి.  పవన్‌ అనుచరులు మొదలు పెట్టిన మైండ్‌ గేమ్‌కి వైసీపీ  కౌంటర్‌ ఇస్తోంది. మేమేం తక్కువ అంటూ సేం క్యాప్షన్‌ని.. వైసీపీ కి అప్లై చేసి రాసేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి వంగా గీత కు పదవి కూడా ఇచ్చేశారు. వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ కార్ల వెనుక రాయించుకుంటున్నారు. టూవీలర్‌ల నెంబర్‌ ప్లేట్లను గీత పేరుతో నింపేస్తున్నారు.  ఇక్క‌డ‌ పొలిటికల్ హీట్  ఏ మాత్రం తగ్గడంలేదు.   పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్  బరిలో ఉండగా, వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేశారు. అయితే వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రచారం చివరి రోజు సీఎం వైఎస్ జగన్ ప్రకటించడంతో అక్కడి ఫలితం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 

చివరాఖరికి సజ్జల కూడా వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేశారుగా?

వైసీపీ ఓటమి ఖరారని తెలుగుదేశం కూటమి నేతలు, పరిశీలకులు, రాజకీయ పండితులు చెప్పడం కాదు. స్వయంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డే అంగీకరించేశారు. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కంఫర్ట్ బుల్ గా విజయం సాధించబోతోందని ఆయన అన్యాపదేశంగా కేడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అదే సమయంలో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామన్న జగన్ రెడ్డి మాటలు అబద్ధమని కూడా తేల్చేశారు. పోలింగ్ జరిగిన నాటి నుంచి చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేశారు. పోలిసులు పూర్తిగా తెలుగుదేశంతో కుమ్మక్కైపోయారు. నిజాయితీగా పని చేసే అధికారులను మార్చేశారు అంటే శోకన్నాలు పెట్టిన సజ్జల ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చి మాచర్లలో ఈవీఎం ధ్వంసమైనా తెలుగుదేశం రీపోలింగ్ కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదంటూ ప్రశ్నలు గుప్పించారు. రీపోలింగ్ డిమాండ్ చేయలేదంటే అక్కడ  తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా పోలింగ్ జరిగినట్లే కదా అని ఆయనే జవాబు కూడా చెప్పేశారు. సాధారణంగా విజయం సాధిస్తామని నమ్మకం ఉన్నపార్టీ రీపోలింగ్ కోసం డిమాండ్ చేయదు. అదే fవిాషయాన్ని సజ్జల చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆయన చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నానని భావిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు వ్యూహాల ముందు ఎవరూ పనికిరారని అన్యాపదేశంగా అంగీకరించేశారు. ఎవరైనా సరే చంద్రబాబు మాట వినాల్సిందేనని చెప్పారు. చివరాఖరికి మోడీ కూడా చంద్రబాబు ట్యూన్ కు డ్యాన్స్ చేయాల్సిందేనని సజ్జల అన్నారు. వాస్తవానికి సజ్జల   చెబుదామనుకున్నారంటే.. చంద్రబాబు పోల్ మేనేజ్ మెంట్ ద్వారా పోలింగ్ మొత్తం  తెలుగుదేశం కూటమికి అనుకూలంగా మారిపోయిందనీ, అందుకకు బీజేపీ సహకరించిందనీ చెప్పేశారు. అలా చెప్పడం ద్వారా ఆయన చంద్రబాబును పొగడడమే కాకుండా వైసీపీ ఓటమిని కూడా అంగీకరించేశారు. ఇక ఇప్పటి వరకూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ క్యాడర్  జారిపోకుండా ఉండేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు,  ఇచ్చిన హైప్ అన్నీ వ్యర్థంగా మారిపోయాయి.

నాంపల్లికోర్టుకు బాంబు బెదిరింపు 

హైదరాబాద్ లో ఒకే రోజు రెండు ఫేక్ కాల్స్ వచ్చాయి. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నివాసముండే ప్రజా భవన్ కు ఉదయం ఉత్తుత్తి బాంబు బెదిరింపు వస్తే సాయంత్రం నాంపల్లిక్రిమినల్ కోర్టుకు ఇదే తరహా కాల్ వచ్చింది.   తెలంగాణ‌లో వ‌రుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఒకే రోజు ప్రజాభ‌వ‌న్‌, నాంప‌ల్లి కోర్టుకు ఇలా బాంబ్ బెదిరింపు ఫోన్ కాల్స్ రావ‌డం గ‌మ‌నార్హం. మొద‌ట ప్ర‌జాభ‌వ‌న్‌లో బాంబ్ పెట్టామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మంగ‌ళ‌వారం ఉద‌యం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సాయంతో విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు. కానీ, ఎలాంటి బాంబ్ లేక‌పోవ‌డంతో అంద‌రూ ఊపీరి పీల్చుకున్నారు. దాంతో ఈ ఫేక్ కాల్ చేసిన వ్య‌క్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఒక‌వైపు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే తాజాగా నాంప‌ల్లిలోని కోర్టుకు బాంబ్ బెదిరింపు కాల్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. నాంప‌ల్లి కోర్టులో బాంబు పెట్టామ‌ని, మ‌రి కాసేప‌ట్లో కూల్చేస్తామ‌ని ఆగంత‌కుడు పోలీసుల‌కు ఫోన్ చేశాడు. దీంతో వెంట‌నే అల‌ర్ట్ అయిన పోలీసులు హైకోర్టులో బాంబ్ స్క్వాడ్ బృందాల‌తో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. కానీ, ఎలాంటి బాంబ్ ఆన‌వాళ్లు ల‌భ్యం కాక‌పోవ‌డంతో ఫేక్ కాల్‌గా పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

గుడివాడ, గన్నవరం.. ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్లంటే?

సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎడు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో చివరి విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. ఆ తరువాత నాలుగు రోజులకు అంటే జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ సారి దేశ వ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ కనిపించనప్పటికీ, ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రిపోల్, పోస్ట్ పోల్ అంచనాలన్నీ తెలుగుదేశం కూటమి విజయాన్నే సూచిస్తున్నాయి.   ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ దగ్గర పడే కొద్దీ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లూ చేసేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు జూన్ 4 ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఆ తరువాత 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలౌతుంది.  ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓట్ల లెక్కింపు మచిలీపట్నంలోకి కృష్ణా వర్సిటీలో జరుగుతుంది.  జిల్లాలో అందరి దృష్టి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపైనే ఉంది. ఈ నియోజకవర్గాలలో ఉండటానికి పోటీలో పన్నెండీసి మంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే జరుగుతున్నది. గుడివాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ అభ్యర్థిగా,  తెలుగుదేశం తరఫున వెనిగండ్ల రాము పోటీ పడుతున్నారు. గుడివాడ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మొత్తం 17 రౌండ్లలో జరుగుతుంది.  ఫలితం మధ్యాహ్నానికే వచ్చేసే అవకాశం ఉంది. ఇక్కడ పోలింగ్ సరళిని బట్టి చూస్తే తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము స్పష్టమైన ఆధిక్యత సాధిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మరో వైపు వైసీపీ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.  ఇక గన్నవరం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ పోటీ ప్రధానంగా తెలుగుదేశం అభ్యర్థి  యార్గగడ్డ వెంకటరావు, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మధ్యే ఉంది. ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు 22 రౌండ్లలో సాగుతుంది. దీంతో ఈ నియోజకవర్గ ఫలితం తేలేందుకు ఒకింత ఆలస్యం కావచ్చునని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కూడా పోలింగ్ సరళిని బట్టి చూస్తే యార్లగడ్డ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. 

కవిత బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వ్ 

బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్ట్ అయి ఇన్ని రోజులైనా బెయిల్ విషయంలో ఇంకా  క్లారిటీ రాలేదు.   ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు దర్యాఫ్తు సంస్థల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తైన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.

కేటీఆర్ మాట్లాడ్డం బంద్‌ చేస్తే మంచిది!

అధికారంలో వున్నప్పుడు ఏం మాట్లాడినా అందరూ ఆహా, ఓహో అని చప్పట్లు చరుస్తారు. అధికారం పోయిన తర్వాత పట్టించుకునేవారే వుండరు. ముఖ్యంగా అధికారంలో వున్నప్పుడు తన మాటే వేదంగా నడిపించుకున్న కేటీఆర్ లాంటి వాళ్ళ మాటలకు అసలు విలువే వుండదు. ఆ విషయాన్ని అధికారం పోయి ఇంతకాలమైన గ్రహించలేని కేటీఆర్ తానింకా అధికారంలోనే వున్నాన్న భ్రమల్లో బతుకుతూ అదే ధో్రణిలో మాట్లాడుతున్నారు. ఆమధ్య ఉగాది రో్జున పంచాంగ శ్రవణం సందర్భంలో పంతులుగారు సాక్షాత్తూ కేటీఆర్ ముందే కూర్చుని, నోరు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం అని చిలక్కి చెప్పినట్టు చెప్పారు. ఎందుకంటే కేటీఆర్ చిలక కాదు కదా.. ఒక గండభేరుండం. అందుకే ఆ హితబోధ పట్టించుకోలేదు. ఎంత గండభేరుండమైనా గాలివాన ముందు తల వంచాల్సిందే కదా.. ప్రస్తుతం గాలివానలో చిక్కుకున్న కేటీఆర్ తల వంచడం మరచిపోయి తలెత్తి మాట్లాడుతున్నారు. చివరికి అవి తలవంపులుగా మారుతున్నాయి. ఆదిలాబాద్‌లో రైతులు ఆందోళన చేశారట. వాళ్ళ మీద పోలీసులు లాఠీఛార్జ్ చేశారట. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి, కేరళకి వెళ్ళడం సిగ్గుచేటు అని కేటీఆర్ ఒక స్టేట్‌మెంట్ మీడియా మొహాన కొట్టేసి చేతులు దులుపుకున్నారు. అక్కడితో తన పని అయిపోయిందని అనుకుని ఆయన రిలాక్స్ అయితే అవ్వచ్చేమో, కానీ ఆయనకు ఆ మాట అనడానికి నైతికంగా ఎంత అర్హత వుందే అర్థం చేసుకోవాలి. రైతుల ఆందోళన పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలనే ఉసిగొల్పి, పరిస్థితిని లాఠీఛార్జ్ వరకు వచ్చేలా రచ్చ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు. బీఆర్ఎస్ పరిపాలించిన పదేళ్ళ కాలంలో ఎవర్నయినా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారా? ఎవరూ నోరు ఎత్తకుండా ఆందోళనకారులందర్నీ బూటు కాళ్ళ కింద వేసి తొక్కేశారే... అప్పుడేమయ్యాయి ఈ నీతి సూత్రాలు? ఏదో సినిమాలో సునీల్ డైలాగ్ ఒకటి వుంటుంది.. సార్ రూల్స్ పెడతారు... పాటించరు... అని.. మీ తీరు అలాగే వుంది కేటీఆర్ గారూ! అందువల్ల మీరు ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మాటలు, ఫ్లాష్‌బ్యాక్ మరచిపోయి చేసే కామెంట్లు మానుకుంటే మంచిది.

చినజీయార్ స్వామి కాళ్లు మొక్కినప్పుడు తెలంగాణ గుర్తురాలేదా కేసీఆర్?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఏమైనా అభినవ గజనీయా? గతంలో ఆయన చేసినవేవీ ఆయనకు ఇప్పుడు గుర్తుకు లేవా? లేక తన కన్వీనియెన్స్ కోసం మరిచిపోయినట్లు నటిస్తున్నారా? ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం జయహే తెలంగాణకు ప్రసిద్ధ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించే విషయమై బీఆర్ఎస్ గగ్గోలు పెట్టేస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి సంగీతమందించడమా అంటూ గుండెలు బాదేసుకుంటోంది. అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు కీరవాణి పెత్తనమేంటని గొంతెత్తి అరుస్తోంది.  వాస్తవానికి కీరవాణి ఎప్పుడో మూడు దశాబ్దాల కిందటే.. హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అంతే కాదు ఆస్కార్ అవార్డు గెలుచుకుని యావత్ భారత దేశానికీ గర్వకారణంగా నిలిచారు. అటువంటి కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం అందిస్తుంటే బీఆర్ఎస్ నేతలు గంగవెర్రులెత్తిపోతున్నారు. ఇంత అన్యాయమా, ఇది తెలంగాణకు ద్రోహం చేయడం కాదా అంటూ ఊరూవాడా ఏకం చేసేస్తున్నారు. తన పార్టీ నేతలు, శ్రేణులూ ఇంత గొడవ చేస్తుంటే కేసీఆర్ మాత్రం పూర్తిగా మౌనముద్ర దాల్చారు. గజనీలా గతంలో తాను చేసినవేవీ గుర్తు లేనట్లు.. తన వాళ్ల వాచాలతను తీర్చుకోమని వదిలేసి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తున్నారు.  తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్లు పని చేసిన కేసీఆర్ తన హయాంలో ప్రోత్సహించిన వారంతా ఆంధ్రావ్యక్తులేనన్న సంగతిని కన్వీనియెంట్ గా మరచిపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి అందివచ్చిన అవకాశంగా భావించి తమ వారిని అవాకులూ చెవాకులూ పేలుతున్నా కిమ్మనకుండా ఊరుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగుతల్లికీ మల్లెపూదండ గీతాన్ని రచించినది తమిళుడైన శంకరంబాడీ సుందరాచారి. అలాగే అమరావతిపై విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం రచించినది తెలంగాణ వ్యక్తి అయిన సుద్దాల అశోక్ తేజ. ఈ విషయంలో ఆంధ్రులెవరూ ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదు. అంతెందుకు కేసీఆర్ మానస పుత్రిక, బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన మేఘా కృష్ణారెడ్డి. ఆ ప్రాజెక్టును ప్రారంభించినది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కేసీఆర్ గజినీలా మర్చిపోయారా? అప్పట్లో మేఘా కృష్ణారెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబెట్టడంపై అప్పటి మంత్రి హరీష్ రావు పూర్తిగా సమర్ధత ఆధారంగానే మెఘాకు కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పారు.   ఇక కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పునర్నిర్మించి యాద్రాద్రి ఆలయ చీఫ్ ఆర్టిటెక్ట్ ఆనంద సాయి కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. అదే ఆంధ్రప్రదేశ్ కు చెంది స్వామి చినజీయర్ స్వామిని కేసీఆర్ తన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి మరీ పాద సేవ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.  అలాగే విశాఖ పట్నానికి చెందిన స్వామి స్వరూపానంద స్వామికి కేసీఆర్  ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో విలువైన భూములను కట్టబెట్టిన సంగతీ  తెలిసిందే. ఇంతెందుకు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ జనమే ఉండేవారు. గజినీలా ఇప్పుడవన్నీమర్చిపోయి రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణ సెంటిమెంటు అంటూ యాగీ చేస్తే జనం నమ్మరు.  

బీజేపీ అపర చాణిక్యం! బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ ఖాతాలోకే!

ఉత్తరాదిలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి వున్నా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తొమ్మిది స్థానాలు గెల‌వ‌బోతోంది. ఏపీలో జగన్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా బీజేపీకి ప్రమాదం లేదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించడానికి వ్యూహాత్మ‌కంగా ఎత్తుగ‌డ‌లు వేసింది. సికింద్రాబాద్ సీటును ప‌ణంగా పెట్టి మొత్తం తెలంగాణాలో ఓట్ల‌ను త‌నకు అనుకూలంగా మ‌లచుకుంది. ఎంఐఎం సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండ‌ని పిలుపునివ్వ‌డంతో తెలంగాణా వ్యాప్తంగా హిందు ఓట‌ర్ల‌పై ప్ర‌భావం ప‌డి బీఆర్ ఎస్ ఓట్లు బీజేపీకి మ‌ళ్ళాయి. తెలంగాణాలో కాషాయ‌పార్టీకి బాగానే కలిసొచ్చింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి భారీ ఎత్తునే ప‌డ్డాయి.   గ్రౌండ్ లెవెల్లో 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్ని చూసిన‌ట్లైతే.... బీజేపీ 9, కాంగ్రెస్ 7, ఎంఐఎం 1. 1. ఆదిలాబాద్ః  కాంగ్రెస్ - బీజేపీ మ‌ధ్యే ఫైట్ క‌నిపిస్తోంది. అయినా బీజేపీకే ఎడ్జ్ వుంది.  మంత్రి సీత‌క్క బాగా వ‌ర్క్ చేశారు. పోల్ మేనేజ్‌మెంట్ బాగా చేశారు. బీజేపీకి గ‌ట్టి పోటీ ఇచ్చినా,  భైంసా, ఆదిలాబాద్ హిందుత్వ ఓటు బ్యాంక్ తో పాటు, ఈ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 4 గురు బీజేపీ ఎమ్మెల్యేలు వున్నారు. దీంతో బీజేపీ విజ‌యావ‌కాశాలు పెరిగాయి. ప్ర‌ధాన పోటీ  బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య వున్న‌ప్ప‌ట్టికీ ఇక్క‌డ బీజేపీకే గెలుపు అవ‌కాశాలున్నాయి.   2. నిజామాబాద్ః బీజేపీకే ఎడ్జ్ క‌నిపిస్తోంది. హిందుత్వ ఎజెండే ప‌ని చేసింది. బీజేపీ అభ్య‌ర్థి అర‌వింద్ ఇమేజ్ తో పాటు ఆయ‌న ప్ర‌సంగాలు,  డైలాగ్స్ ఓట‌ర్ల‌ను బాగానే ఆక‌ట్టుకున్నాయి. పైగా ఇక్క‌డి నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు బీజేపీకి వుండ‌టంతో అర‌వింద్‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. పోటీ బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య ఉన్నా బీజేపీకీ గెలుపు అవ‌కాశాలున్నాయి.  3. క‌రీంన‌గ‌ర్ః బీజేపీకే ఎడ్జ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. బండి సంజ‌య్‌కి సానుభూతి వ‌చ్చింది. ఆయ‌న స్వంత ఇమేజ్‌తో పాటు, మైనార్టీ ఓట్లు కూడా ప‌డ్డాయి. ఇక్క‌డ పోటీ బీజేపీ - బీఆర్ ఎస్ మ‌ధ్య ఉంది. కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థి.  ఇక్క‌డ బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కూడా చేతులెత్తేశారు. కాబ‌ట్టి బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.  4. పెద్ద‌ప‌ల్లిః 7 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మంత్రి శ్రీధ‌ర్ బాబు ఇంఛార్జ్ గా ప‌ని చేశారు.  బీజీపీ వీక్ అయినా బాగా పుంజుకుంది. పోల్ మేనేజ్‌మెంట్ స‌రిగా చేయ‌లేదు కాంగ్రెస్‌. దీంతో బీజేపీకి బాగా ప్ల‌స్ అయింది. మోడీ వేవ్ వుండ‌టంతో రెండు పార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ క‌నిపించింది. అయితే ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ వుంద‌ని చెప్ప‌వ‌చ్చు.  5. వరంగ‌ల్ః మంద‌కృష్ణ మాదిగ ప్ర‌భావం బాగా ప‌నిచేసింది. కాంగ్రెస్ మాదిగ‌ల్ని ప‌ట్టించుకోలేద‌నే ప్ర‌చారం ఓట‌ర్ల‌లో బాగా వెళ్ళింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ బ‌లంగా వుంది. ఎందుకంటే ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 3 చోట్ల బీజేపీ సెకెండ్ ప్లేస్ లో వుంది. ఇక్క‌డ బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థులు వీక్‌. బీజేపీ అభ్య‌ర్థి బీఆర్ ఎస్ నుంచి వ‌చ్చారు. ఆర్థికంగా కూడా బ‌ల‌మైన నేత.  బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య గ‌ట్టి పోటీ వున్న‌ప్ప‌ట్టికీ, బీజేపీకే ఎడ్జ్ వుంది.  6. భువ‌న‌గిరిః బీజేపీకే అనుకూలంగా వున్నా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ జోక్యంతో సీన్ మారింది. సి.ఎం. రేవంత్ రెడ్డి ఇక్క‌డ గెలుపును  ప్ర‌తిష్టాత్మ‌క‌గా తీసుకున్నారు. కోమ‌టి బ్ర‌ద‌ర్స్‌ను పొగుడుతూ సి.ఎం. చేసిన ప్ర‌సంగాలు వైర‌ల్ అయ్యాయి. సి.ఎం. అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి అనే డైలాగ్‌తో మొత్తం సీన్ మారింది. ఇక్క‌డ బీజేపీ గ‌ట్టి పోటీ ఇస్తున్న‌ప్ప‌ట్టికీ కాంగ్రెస్ అభ్యర్థికే గెలుపు అవ‌కాశాలున్నాయి. 7. న‌ల్గొండః కాంగ్రెస్ అభ్య‌ర్థికి అనుకూలంగా ఉంది. బీజేపీ గ‌ట్టి పోటీ ఇచ్చినా ఇక్క‌డ‌ గెలుపు కాంగ్రెస్ అభ్య‌ర్థిదే. 8. చేవెళ్ళః బీజేపీ భారీ మెజార్టీ తో ఇక్క‌డ గెల‌వ‌నుంది. బీజేపీ అభ్య‌ర్థి కుటుంబ‌నేప‌థ్యం, ఆయ‌న చేస్తున్న సామాజిక సేవా కార్యక్ర‌మాలతో పాటు మోడీ వేవ్ బాగా క‌లిసి వ‌చ్చింది. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రంజిత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స‌పోర్ట్ చేయ‌లేదు. బీఆర్ ఎస్ ఎఫెక్ట్ కూడా అంత‌గా లేదు. కాబ‌ట్టి ఈ నియోజ‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థి భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నారు. 9. మెద‌క్ః ఇక్క‌డ బీఆర్ ఎస్ - బీజేపీ మ‌ధ్యే పోటీ ఉన్న‌ప్ప‌ట్టికీ  ఎడ్జ్ బీజేపీకే వుంది. బీఆర్ఎస్‌కు 6 గురు ఎమ్మెల్యేలున్నా పోల్ మేనేజ్‌మెంట్ చేయ‌లేక‌పోయారు. బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద్‌రావు  ప్ర‌సంగాలు, ఆయ‌న మాట తీరు ప్ర‌జ‌ల్లో బాగా వెళ్ళింది. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి ప‌రిమితం అయింది. బీజేపీ అభ్య‌ర్థిగా గెలుపు అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. 10. మ‌ల్కాజ్‌గిరిః ఎన్నిక‌ల‌కు ముందే ఈటెలకు ఒన్ సైడ్ అనే ప్ర‌చారం జ‌రిగింది. ఇక్క‌డ గెల‌వ‌డాన్ని ఈటెల ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ప్ర‌చారం చేశారు. ఆయ‌న కోడ‌లు బాగా యాక్టివ్‌గా తిరిగారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి నాన్ లోకల్ కావ‌డంతో ఇక్క‌డ పోటీ బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య వుంది. అయితే ఇక్క‌డ ఈటెల గెలుపు ఒన్ సైడ్ అని చెప్ప‌వ‌చ్చు.  11. నాగ‌ర్‌క‌ర్నూల్ః కాంగ్రెస్ పార్టీకి ఈజీ గా గెలిచే సీటు అనుకున్నారు. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో పోల్ మేనేజ్‌మెంట్‌లో వెనుక‌బ‌డ్డారు. అంత‌గా ప్ర‌చారం చేయ‌లేదు. కాంగ్రెస్ పార్టీ మాల అభ్య‌ర్థిని బ‌రిలో దింపింది. అయితే ఇక్క‌డ‌ మాదిగ ఓట్లు ఎక్కువ‌గా వున్నారు కాబ‌ట్టి వాళ్ళే కీల‌కం. వాళ్ళంతా బీజేపీ వైపే మ‌ళ్ళారు. బీజేపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ యువ‌కుడు. మాదిగ కుల‌స్థుడు. అత‌ని  తండ్రి గ‌తంలో మంత్రిగా చేశారు. ఇవ‌న్నీ భ‌ర‌త్‌కు బాగా క‌ల‌సి వ‌చ్చాయి. దీంతో పాటు క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నాగ‌ర్ క‌ర్నూల్‌లో వుండ‌టంతో అదీ ప్ల‌స్ అయింది. 2019 లో బీఆర్ ఎస్ నుంచి రాములు 2 ల‌క్ష‌ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు భ‌ర‌త్‌కు తండ్రికి ల‌భించిన ఓట్లు ప్ల‌స్ అవుతాయ‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. నాగ‌ర్ క‌ర్నూల్‌లో  బీజేపీ భారీ మెజార్టీతో గెల‌వ‌బోతోంది. 12. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ః ఇక్క‌డ‌  బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. సి.ఎం. స్వంత నియోజ‌క‌వ‌ర్గం. బీజేపీ అభ్య‌ర్థి డికె అరుణ‌కి స్థానికంగా మంచి ప‌ట్టు వుంది. ఆర్థిక బ‌లం వుంది. గెలిస్తే మంత్రి అవుతారు. మోదీ వేవ్ క‌లిసి వ‌స్తుంద‌నుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి వంశీ గెలుపు కోసం సి.ఎం. రేవంత్ బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. అయితే బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారి మ‌ధ్య కొంత ఆధిప‌త్య‌పోరు క‌నిపించింది. అది  కాంగ్రెస్‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. మ‌రో వైపు బీఆర్ ఎస్ ఓట్లు కూడా బీజేపీకే ప‌డ్డాయి. సి.ఎం. రేవంత్‌రెడ్డి ఎనిమిది స‌భ‌ల్లో పాల్గొని ప్ర‌చారం చేశారు. పోటీ బీజేపీ కాంగ్రెస్ మ‌ధ్య ఉన్న  కాంగ్రెస్ కే ఎడ్జ్ క‌నిపిస్తోంది. 13. ఖ‌మ్మంః కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. బీజేపీ సెకెండ్ ప్లేస్‌కు ఎదిగింది. ట్రైబ‌ల్ ఏరియా లో బీజేపీ బాగా బ‌ల‌ప‌డింది.  బీఆర్ఎస్‌ 3వ స్థానానికి ప‌డిపోయింది. ఇక్క‌డ భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది. 14. మ‌హ‌బూబాబాద్ః కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉంది. బీఆర్ఎస్ గ‌ట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్‌లో ఆధిప‌త్య పోరు కాంగ్రెస్‌కు క‌లిసి వ‌చ్చింది.  15. జ‌హీరాబాద్ః బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. ఇక్క‌డ గెలుపు అవ‌కాశం బీజేపీకే వుంది. పోల్‌మేజేజ్‌మెంట్ గ‌ట్టిగా చేసింది బీజేపీ. నార్త్ ఇండియా వాళ్ళు ఇక్క‌డ ఒట‌ర్లుగా ఉన్నారు. వారి ఆధిప‌త్యం ఎక్కువ‌. ఆర్థికంగా బ‌ల‌మైన వ్య‌క్తి వుండ‌టంతో అది బీజేపీకి క‌లిసి వ‌చ్చింది. కామారెడ్డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, ఈ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో వుండ‌టం బీజేపీకి క‌లిసి వ‌చ్చింది. ప్ర‌స్తుత బీజేపీ అభ్య‌ర్థి... గ‌తంలో బీఆర్ ఎస్ నుంచి 2 సార్లు గెలిచారు. ఇప్పుడు బిజేపీలోకి వ‌చ్చి పోటీ చేశారు. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థికి హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయం అనిపిస్తోంది. 16. సికింద్రాబాద్ః కాంగ్రెస్ - బీజేపీ మ‌ధ్యే పోటీ వుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లిం ఓట్లు 6 ల‌క్ష‌కు పైగా వున్నాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థి దానం నాగేంద‌ర్ ఆర్థికంగా బ‌ల‌వంతుడు. పోల్ మేనేజ్‌మెంట్ చేయ‌డంలో ఆయ‌న‌కు తిరుగులేదు. పైగా ఎంఐఎం త‌మ అభ్య‌ర్థిని పోటీలో పెట్ట‌క‌పోవ‌డం, కాంగ్రెస్‌కు క‌లిసి వ‌స్తుంది. ఎంఐఎం వ్యూహాత్మ‌కంగా, ఉద్దేశ‌పూర్వ‌కంగానే కాంగ్రెస్‌కు ఓటు వేయ‌మ‌ని, బీజేపీని ఓడించ‌మ‌ని పిలుపునిచ్చింది. ఎంఐఎం చేసిన ప్ర‌చారం, మొత్తం తెలంగాణాలో హిందూ ఓట్ల‌పై ప్ర‌భావం చూపింది.  బిజెపి-ఎంఐఎం క‌లిసి గేమ్ ప్లాన్ ప్లే చేయ‌డంతో బీజేపీ తెలంగాణాలో భారీ ఎత్తున సీట్లు గెలిచే అవ‌కాశం దొరికింది. బీజేపీ ఎత్తుగ‌డ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి భారీ న‌ష్టం చేకూర్చింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రో వైపు కిష‌న్‌రెడ్డి డ‌బ్బు పంచ‌లేదు. లోక‌ల్‌గా అందుబాటులో వుండ‌ర‌నే ప్ర‌చారం కూడా ఆయ‌న‌కు మైన‌స్ చేసింది.  మొత్తానికి ఎంఐఎం ప్ర‌చారం, సికింద్రాబాద్‌లో డ్యామేజ్ చేసినా, తెలంగాణాలో బీజేపీకి అలా క‌లిసివ‌చ్చింది. 17. హైద‌రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌ఫున పోటీ చేసిన బీజేపీ అభ్య‌ర్థి యూట్యూబ్ వ్యూస్ మీద చూపిన  ఆస‌క్తి ఓట‌ర్ల‌పై చూపించ‌లేదు. కేవ‌లం సోష‌ల్ మీడియా ప్ర‌చారాన్నే న‌మ్ముకుని న‌ట‌న‌లో జీవించారు. గొప్ప న‌టిగా పేరు పొందారు కానీ రాజ‌కీయ నాయ‌కురాలిగా రాణించ‌లేక‌పోయారు. బీజేపీ అభ్య‌ర్థి ఎంఐఎం అభ్య‌ర్థికి క‌నీస పోటీ ఇవ్వ‌లేక‌పోయారు. ఎప్ప‌ట్టి లాగా భారీ మెజార్టీతో ఎంఐఎం ఈ సారి కూడా విజ‌యం సాధించ‌నుంది.  - ఎం.కె. ఫ‌జ‌ల్‌

పిన్నెల్లికి మరో మూడు కేసుల్లోనూ బెయిలు

వైసీపీ మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం (మే28) షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై ఆయనపై నమోదైన కేసులో ఇప్పటికే హైకోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే పిన్నెల్లిపై తెలుగుదేశం ఏజెంట్ పై దాడి ఘటనకు సంబంధించి మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఇలా ఉండగా ఆ మూడు కేసులలో కూడా పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ మూడు కేసులలో కూడా ఏపీ హైకోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసింది. ఈ ఏ కేసులలోనూ కూడా జూన్ 6వ తేదీ వరకూ పిన్నెల్లిపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. బెయిలు మంజూరు చేస్తూ కోర్టు పిన్నెల్లికి కొన్ని షరతులు విధించింది. కోర్టు విధించిన షరతుల మేరకు పిన్నెల్లి ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ మాచర్లలో అడుగు పెట్టకూడదు. అలాగే  నరసరావుపేటలో ఆయన ఉండే నివాసం చిరునామా ఇవ్వాలనీ, అదే విధంగా ఆయన పాస్ పోర్టును సరెండర్ చేసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజు హాజరు వేయించుకోవాలి. అయితే కౌంటింగ్ రోజు మాచర్లకు వెళ్లోచ్చని కోర్టు పేర్కొంది. అయితే ఆ రోజు కూడా ఆర్వో ముందు హాజరవ్వాలని పేర్కొంది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి కనుకనే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కోర్టు తన ఉత్తర్వ్యులలో స్పష్టం చేసింది. 

వచ్చాడండీ.. వయ్యారి గోరంట్ల మాధవ్!

జనం మర్చేపోయారు.. వైసీపీ దండుపాళ్యం బ్యాచ్’లో ఈ ‘నగ్న శిఖామణి’ ఒకడు వున్నాడు కదూ.. తన దిశ మొలతో దేశం దశదిశలూ నిర్ఘాంతపోయేలా చేసిన ‘వీడియో స్టార్’ గోరంట్ల మాధవ్ నేనూ ఉన్నానంటూ లైన్లోకి వచ్చేశాడు. ఈయనగారి ముఖం చూసినా ‘ఆ వీడియో’ గుర్తొచ్చే స్థాయిలో పాపులర్ అయిన ఈ అందగాడు ఈ ఎన్నికలలో జగన్ పార్టీకి జాతీయ స్థాయిలో జనం నిర్ఘాంతపోయే స్థాయిలో సీట్లు వస్తాయని చెబుతున్నాడు. కొద్దికాలం క్రితం ఫోన్లో ఈయన వీడియో చూసి జనాలు ఒక పూట భోజనం చేయడం కూడా మానుకున్నారు. అలాంటి పెద్దమనిషి ఇప్పుడు ఫ్యూచర్ చెప్పడానికి బయల్దేరాడు. ఈయనకి మళ్ళీ ఎంపీ టిక్కెట్ వస్తుందో రాదో ఈయనకే తెలియక జగన్ గేటు దగ్గర పడిగాపులు కాసిన గోరంట్ల, జగన్ టిక్కెట్ ఇవ్వను పొమ్మంటే వెర్రి నవ్వు నవ్వుకుంటూ తప్పుకున్న మాధవ్... ఇప్పుడు తనకు అన్నీ తెలిసినట్టుగా బిల్డప్పు ఇస్తున్నాడు. వైసీపీలో అందరూ మళ్ళీ గెలుస్తామని బిల్డప్పు ఇస్తున్నారు కాబట్టి, నేను కూడా ఇవ్వకపోతే బాగోదు అన్నట్టుగా తాను కూడా గప్పాలు పలుకుతూ ఆత్మానందం చెందుతున్నాడు. వైసీపీలో వున్న ప్రతి అడ్డమైన వాడికీ ఒక దిక్కుమాలిన ముహూర్తం దొరికింది. ప్రతివాడూ ఆ ముహూర్తానికి జగన్ ప్రమాణ స్వీకారం వుంటుందని చెబుతూ నోటి తుత్తర తీర్చుకుంటున్నారు. ఆ బ్యాచ్‌లో ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా చేరాడు. జూన్ 9న ఉదయం 9 గంటల 35 నిమిషాలకు రుషికొండలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాడని కూడా ఈయన చెప్పేస్తున్నాడు. జగన్ మళ్ళీ సీఎం అవుతాడంటూ జోస్యం చెప్పడం కాదు.. రాబోయే రోజుల్లో ఈయనగారి బూతు వీడియో సంగతి మళ్ళీ తవ్వి తీస్తారు.. అప్పుడుంటది అసలు సినిమా.

సీఎస్ జవహర్ రెడ్డి.. ఎటేపమ్మ ఒంటరి నడక!?

సీఎస్ జవహర్ రెడ్డి నిబంధనలకు నిలువుపాతరేసి.. అడ్డగోలుగా జగన్ తో అంటకాగిన జవహర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు ఎవరకూ కూడా ఆయనకు మద్దతుగా నోరు మెదపడం లేదు. విశాఖలో భూ దందాకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఇప్పుడు అండగా నిలిచి మాట్లాడే వారే కరవయ్యారు. వైసీపీ అనుకూల అధికారిగా ముద్రపడిన ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఖండించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆయనకు కూడా తనపై ఆరోపణలను ఖండించి ఊరుకోవడమే కానీ, ఆరోపణలు చేసిన వారిపై పోలీసు కేసు పెట్టడం కానీ, కోర్టుకు వెళ్లడం కానీ చేయడానికి రెడీగా లేనట్లు కనిపిస్తున్నది. తొలుత జనసేన నాయకుడు ఒకరు భూ దందా వ్యవహారాన్ని బయటపెట్టగానే జవహర్ రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ ఓ లేఖ రాశారు. తక్షణం ఆరోపణలను ఉపసంహరించుకోకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే తన ఆరోపణలకు ఆధారాలున్నాయనీ, తగ్గేదే లేదనీ సదరు జనసేన నేత మీడియా ముఖంగా ప్రకటించడంతో జవహర్ రెడ్డి మౌనం దాల్చారు.  సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కూడా జవహర్ రెడ్డికి అన్ డ్యూ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. జవహర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, కరోనా సమయంలో హెల్త్ సెక్రటరీగా కీలక పదవులను అనుభవించిన జవహర్ రెడ్డిని సీఎం జగన్ సీనియర్లను సైతం తోసి రాజని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.  ఇక ఆ క్షణం నుంచీ జవహర్ రెడ్డి జగన్ ఆడమన్నట్లల్లా ఆడారన్న విమర్శలు ఉన్నాయి. జవహర్ రెడ్డి నిర్ణయాలన్నీ జగన్ ను మెప్పించడం కోసమే అన్నట్లుగా ఉన్నయని తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తోంది.  ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రలో ఎస్సీ భూములను బినామీల పేరిట కొనుగోలు చేశారన్న ఆరోపణలకు ఆయన ఇటీవల విశాఖ ప్రైవేటు పర్యటన బలం చేకూర్చింది.  కాగా భూముల దందాలో వైసీపీ నేతల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఖండించడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదు.  సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలను ఖండించడానికి ఇంత వరకూ జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నారు.   తన అధికారాలను దుర్వినియోగం చేసి మరీ వైసీపీకి పూర్తి మద్దతుగా నిలిచిన జవహర్ రెడ్డి ఇప్పుడు ఎటువైపు నుంచీ మద్దతూ అండా లేకుండా ఒంటరిగా మిగిలిపోయారు. జవహర్‌రెడ్డి చీఫ్‌ సెక్రటరీ కాదు..చీప్‌ సెక్రటరీ అంటూ  సోమిరెడ్డి చంద్రమేహన్ రెడ్డి వంటి వారు విమర్శలు గుప్పిస్తున్నా వైపీపీ నుంచి  ఎక్కడా సౌండ్ వినిపించడం లేదు.  మొత్తం మీద ఎవరి ప్రాపకం కోసం జవహర్ రెడ్డి తన హోదాను, ప్రతిష్టను ఫణంగా పెట్టి పని చేశారో వారే వదిలేయడంతో ఆయన పూర్తిగా ఒంటరి అయిపోయారు.

ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు

హైదరాబాద్ మహా నగరంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్.. ప్రస్తుత ప్రజాభవన్‌లోనే బాంబు పెట్టామని అగంతకులు హెచ్చరించారు. మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు హుటాహుటీన చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలంగాణ డిప్యూటీ భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. బాంబు బెదిరంపుతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సిబ్బంది సహా అందరినీ భవన్ నుంచి ఖాళీ చేయించి బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు జరుపుతోంది.  మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్‌ చేసిన ఆగంతకుడిని ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

లిక్కర్ స్కాంలో సుప్రీంలో కేజ్రీవాల్ కు చుక్కెదురు 

మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.బెయిల్ పొడిగింపు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. బెయిల్ పొడిగింపు పిటిషన్ పై తక్షణ విచారణ కోరుతూ ఆయన తరపు లాయర్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. ఈ పిటిషన్ గురించి గత వారం ప్రధాన బెంచ్‌ ముందుకు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. ఈ కేసులో తీర్పు రిజర్వ్ లో ఉన్నందుకు పిటిషన్‌ లిస్టింగ్ పై తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసులో జూన్ 1 వరకూ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.  అయితే, వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన బరువు నెల రోజుల వ్యవధిలో అకారణంగా 7 కేజీల మేర తగ్గిందన్నారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు ఇతర వైద్య పరీక్షల కోసం ఏడు రోజుల సమయం పడుతుందని, ఇందుకు అనుగుణంగా బెయిల్ పొడిగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్టు తెలిపారు. మే 10 న ఆయన తీహాడ్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. 

సార్వత్రిక ఫలితాల తరువాత కింగ్ మేకర్ చంద్రబాబే!

సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. వచ్చే నెల 1న జరిగే తుదివిడత పోలింగ్ తరువాత  జూన్ 4న ఫలితాలు వెలువడటమే తరువాయి. ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ తరువాత పరిశీలకులు, రాజకీయపండితులు ఒక అంచనాకు అయితే వచ్చేశారు. గత రెండు ఎన్నికల తరహాలో ఈ సారి బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అసవరమైనన్ని స్థానాలు సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని గట్టిగా వినిపిస్తున్నది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్నాటక, బీహార్, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలలో బీజేపీ బాగా వెనుకబడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అంటే బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలలో విజయం లభించే అవకాశాలు అంతగా లేవని చెబుతున్నారు. దీంతో బీజేపీ అనివార్యంగా ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదు. ఇక బీజేపీకి అత్యంత నమ్మకమైన మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, జేడీఎస్, షిండే వర్గం శివసేనలు కూడా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అవి కూడా చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   దీంతో  బీజేపీకి  ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతుగా చెప్పుకోదగ్గ స్థానాలతో నిలిచే పార్టీ ఏదన్న ప్రశ్నకు సెఫాలజిస్టులు తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెబుతున్నారు.  ఔను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయేలో చేరిన సంగతి తెలిసిందే. సో.. మరో సారి మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొలువుదీరేందుకు ఆ పార్టీకి తెలుగుదేశం అండ గట్టిగా అవసరమౌతుందని చెబుతున్నారు. సెఫాలజిస్టుల అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి 15కు పైగా లోక్ సభస్థానాలలో విజయం సాధిస్తుంది. అప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీదే కీ రోల్ అవుతుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కింగ్ మేకర్ గా మారుతారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ కు కచ్చితంగా మేలు జరుగుతుంది. 

‘ఐరన్‌లెగ్’ వేణు స్వామి పరార్!

చేతికి దొరికినన్ని ‘భవిష్యత్తు జాతకాల’ రాళ్ళు విసిరి, ఆ రాళ్ళలో ఒక రాయి ఎక్కడో తగిలితే, ‘చూశారా నా గురి’ అని ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసే వేణు స్వామి గత కొద్ది రోజులుగా పరారీలో వున్నట్టు తెలుస్తోంది. గతంలో అనేకమంది సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద, ఆఖరికి వాళ్ళ ఆరోగ్యం, ప్రాణాల మీద కూడా తన ‘భవిష్యత్తు రాళ్ళు’ విసిరిన వేణు స్వామి ఈమధ్యకాలంలో రాజకీయ నాయకుల మీద కూడా ఆస్ట్రాలజీ రాళ్ళు విసురుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ తప్పకుండా గెలుస్తారని చెప్పిన వేణు స్వామి, కేసీఆర్ ఓడిపోవడంతో కొంతకాలం కిక్కురుమనలేదు. మళ్ళీ కొన్ని రాళ్ళు సమీకరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఈసారి కూడా గెలుస్తారని ఢంకా బజాయించి మరీ చెప్పారు. అలాగే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని తేల్చేశారు. అయితే మే 13న పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కి అంత సీన్ లేదని అర్థమైపోయింది. అలాగే ఐపీఎల్‌లో వేణుస్వామి ఏ జట్టు అయితే గెలుస్తుందని చెప్పారో అదే సన్ రైజర్స్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో వేణు స్వామి మీద సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. వేణు స్వామిని చాలామంది మరో ‘ఐరన్‌లెగ్’ శాస్త్రి-2 అని అభివర్ణిస్తున్నారు. ఇది ఇలా వుంటే, వేణు స్వామి ఎవరు గెలుస్తారని చెబితే వాళ్ళు వరసబెట్టి ఓడిపోతున్నారు. జగన్ కూడా గెలుస్తారని వేణు స్వామి చెప్పినప్పుడు మొదట్లో వైసీపీ వర్గాలు భలే అనుకున్నారు. కానీ, ఇప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్.తోపాటు వేణు స్వామి జోస్యం ఫ్యాక్టర్ కూడా వౌైసీపీ వర్గాలకు వణుకు పుట్టిస్తోంది. ఆయన ఎవరు గెలుస్తారంటే వాళ్ళు ఓడిపోతూ వుండటంతో ఈ ‘ఐరన్ లెగ్’ ప్రభావం తమ పార్టీ మీద వుంటుందోమోనని మూఢనమ్మకాలతో భయపడిపోతున్నారు. మొత్తమ్మీద ‘జ్యోతిషం’ అనే శాస్త్రాన్ని తన పబ్లిసిటీ కోసం సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగించుకున్న వేణు స్వామి కేసీఆర్, సన్ రైజర్స్ ఓటమి తర్వాత జనానికి, బుచికీ యూట్యూబ్ ఛానళ్ళకి అందుబాటులో లేకుండా పరార్ అయిపోయనట్టు తెలుస్తోంది. వైసీపీ వర్గాలు కూడా వేణు స్వామి మీద గుర్రుగా వుండటంతో, ముఖ్యంగా వాళ్ళకి దొరక్కుండా వుండాలని వేణు స్వామి అబ్ స్కాండ్ అయినట్టు  తెలుస్తోంది. 

సిక్కోలు జిల్లాలో తొలి ఫలితం.. తమ్మినేని ఫేట్ డిసైడ్ చేస్తుంది!

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఫలితాలు వచ్చే నెల 4న వెలువడతాయి. ఈ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టబోయేది ఎవరు? పరాజయం పాలై ఇంటికి చేరేదెవరు అన్నది తేలడానికి మరో ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ లోగా గెలుపు ఓటములపై పలు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఒక వరుస ప్రకారం జరుగుతుంది. ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తొలుత వెలువడుతుంది. చివరిగా పాతపట్నం నియోజకవర్గ ఫలితం వెలువడుతుంది. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకూ ఈ నెల 13న రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పాటే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక సిక్కోలు జిల్లా నుంచి మొదటిగా వెలువడబోయే ఫలితం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీ చేసిన ఆముదాలవలస నియోజకవర్గానిదే. ఈవీఎంలు ఎచ్చర్లలోని శివాని ఇంజినీరింగ్ కళాశాల స్టోర్ రూంలో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. నిబంధనల ప్రకారం తక్కువ పోలింగ్ కేంద్రాలున్న నియోజ కవర్గ ఫలితాలను ముందుగా ప్రకటిస్తారు. ఆ ప్రకారం చూసుకుంటే ముందుగా వెలువడే ఫలితం ఆముదాలవలస. ఎందుకంటే ఈ నియోజకవర్గ కౌంటింగ్ 19 రౌండ్లలో పూర్తి అవుతుంది. అంటే జిల్లాలో తొలి ఫలితం ఏపీ అసెంబ్లీ స్పీకర్ పోటీ చేసిన ఆముదాలవలస నియోజకవర్గానిదే ఔతుంది. ఇప్పటికే ఇక్కడి ఫలితం ఏమిటన్నదానిపై పరిశీలకులు, స్ట్రాటజిస్టులు ఒక అంచనాకు వచ్చేశారు. వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ పరాజయాన్ని అంగీకరించేసి చేతులెత్తేసిన  పరిస్థితి.  సో తొలి ఫలితం స్పీకర్ తమ్మినేని భవితవ్యాన్ని తేల్చేస్తుందన్న మాట. ఇక ఆతరువాత వరుసగా పలాస, ఇచ్చాపురం, నరసరావుపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాల ఫలితాలు వెలువడుతాయి. 323కు పైగా పోలింగ్ కేంద్రాలున్న పాతపట్నం నియోజకవర్గ ఫలితం చివరిగా వెలువడుతుంది. ఇక శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గ ఫలితం వెలువడేసరికి మధ్య రాత్రి అవుతుందని అంటున్నారు.