జ‌గ‌న్ జైలుకే.. పొన్నవోలు కంటతడి సంకేతమదేనా?

ఏపీలో కూట‌మి అధికారంలోకి రాబోతోందా.. వైసీపీ అంత‌ర్గ‌త స‌ర్వేల్లో ఆ విష‌యం స్ప‌ష్ట‌మైందా.. కూట‌మి అధికారంలోకి రాగానే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా.. జ‌గ‌న్ ప్ర‌మాదంలో ప‌డ‌బోతున్నారా..? ఐదేళ్ల కాలంలో   చేసిన త‌ప్పిదాల‌తో జగన్ కు కొత్త చిక్కులు చుట్టుముట్టబోతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. ఇలాంటి సందేహాల‌ను తెర‌పైకి తెచ్చింది ఎవ‌రో కాదు.. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి న‌మ్మినబంటుగా ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.  జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న‌ కేసుల విష‌యంలో న్యాయ స‌ల‌హాలో జ‌గ‌న్ ప‌క్షాన పొన్న‌వోలు ఉన్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన ఆరు రోజుల్లోనే ఏపీ అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ గా పొన్న‌వోలును జ‌గ‌న్ నియ‌మించారు. ఈ ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో పొన్న‌వోలు చేసిన అరాచ‌కాలు అన్నీఇన్నీ కావు.  మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై అక్ర‌మ కేసులు పెట్టి జైలుకు పంపించ‌డంలో పొన్న‌వోలుదే కీల‌క పాత్ర‌.. అయితే, చంద్ర‌బాబు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు నిర్దార‌ణ‌ చేయ‌లేక పోయారు. కేవ‌లం కావాల‌నే జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు చంద్ర‌బాబును దాదాపు మూడు నెల‌లు రాజ‌మండ్రి జైలులో ఉంచారు.  పొన్న‌వోలు తీరుపై తెలుగుదేశం శ్రేణుల‌తోపాటు కొంద‌రు వైసీపీ నేత‌ల్లోనూ ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్ర‌బాబుపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం ద్వారా జ‌గ‌న్ ఓట‌మికి పొన్న‌వోలు బీజం వేశారంటూ కొంద‌రు వైసీపీ నేత‌లు ఆవేద‌న  వ్య‌క్తం చేశారు. వారి అనుమాన‌మే ఇప్పుడు నిజం కాబోతుంది. కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌న్న ఓ స్ప‌ష్ట‌త రావ‌డంతో భావోద్వేగాన్ని ఆపుకోలేక పొన్న‌వోలు క‌న్నీరు పెట్టుకున్నారు.   ఏపీలో మే 13న అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌రిగింది. ఇత‌ర దేశాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఏపీకి త‌ర‌లి వ‌చ్చి మరీ తమ ఓటు హ‌క్కు  వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతాన్ని త‌గ్గించేందుకు వైసీపీ నేత‌లు పోలింగ్ రోజు పెద్ద ఎత్తున అల్ల‌ర్ల‌కు పాల్ప‌డ్డారు. ఓట‌ర్ల‌ను బెదిరించ‌డంతోపాటు.. టీడీపీ ఏజెంట్ల‌పై దాడులు సైతం చేశారు. అయినా, జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు అర్థ‌రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు  కూలైన్ల‌లో వేచి ఉండి మరీ తమ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. వైసీపీ కుట్ర‌ల‌ను ఛేదించుకొని ప్ర‌జ‌లు ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌టంతో గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ఏపీలో 81శాతానికి పైగా  పోలింగ్ న‌మోదైంది. దీంతో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని ప్ర‌తిఒక్క‌రికి అర్ధ‌మైంది. వైసీపీ అధిష్టానం నిర్వ‌హించిన అంత‌ర్గ‌త స‌ర్వేల్లోనూ కూట‌మి భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్ట‌మైంద‌ని తెలుస్తోంది. అదే విష‌యాన్ని జ‌గ‌న్ కు న‌మ్మిన‌బంటు పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి చెప్ప‌క‌నే చెప్పారు. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న అక్క‌డి వైసీపీ సానుభూతి ప‌రుల‌తో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో వైసీపీ ఓడిపోతోందనీ, జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌బోతున్నార‌ని చెప్ప‌క‌నే చెప్పారు.  ఎన్నిక‌ల త‌రువాత సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోర్టు అనుమ‌తితో లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. లండ‌న్ లోని ప‌లు ప్ర‌దేశాల్లో ఆయ‌న ప‌ర్య‌టిస్తున్న ఫొటోలు తాజాగా విడుద‌ల‌య్యాయి. మ‌రో వైపు ఏపీ అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డిసైతం లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. స్థానికంగా వైసీపీ సానుభూతి ప‌రుల‌తో పొన్న‌వోలు స‌మావేశం అయ్యారు. జ‌గ‌న్ తో స‌మావేశ‌మై మాట్లాడాల‌ని ఉంద‌ని, ఓ సారి స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని స్థానిక వైసీపీ సానుభూతి ప‌రులు పొన్న‌వోలును కోరారు. దీంతో పొన్న‌వోలు మాట్లాడుతూ.. భావోద్వేగానికి గుర‌య్యారు. ఓ ద‌శ‌లో క‌న్నీరు పెట్టుకున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒంట‌రిగా పోరాటం చేస్తున్నారు.. ఆయ‌న క‌ష్టం నాకు తెలుసు.. ఎంత ప్ర‌మాదంలో ఉన్నారో  తెలుసు. ఎవ‌రు మ‌నోడో తెలియ‌దు.. ఎవ‌రు ప‌రాయోడో తెలియ‌దు.. ఇప్ప‌టికీ జ‌గ‌న్ లెక్క‌చేయ‌డం లేదు.. ఏమైతే అది ఔతుందన్న ధీమాతో ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న ఎవ‌రితో మాట్లాడే ప‌రిస్థితిలో కూడా లేరు అంటూ జ‌గ‌న్ గురించి పొన్న‌వోలు చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో వైసీపీ నాయ‌కుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నది. వైసీపీ అనుకూల మీడియాలో మ‌రోసారి మ‌నమే అధికారంలోకి రాబోతున్నామ‌ని పోలింగ్ పూర్త‌యిన రోజునుంచి డంకా మోగిస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌మాదంలో ఉన్నారని తాజాగా పొన్న‌వోలు మాట్లాడ‌టంపై వైసీపీ కార్య‌క‌ర్త‌లోనూ ఓడిపోతున్నామ‌ని క్లారిటీ వ‌చ్చిన‌ట్ల‌యింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.  పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. జ‌గ‌న్ ప‌క్క‌న ఉన్న‌వారు ఎవ‌రు మ‌న‌వాళ్లో.. ఎవ‌రు ప‌రాయివాళ్లో తెలియ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ష‌ర్మిల‌ను ఉద్దేశించి ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు కొంద‌రు భావిస్తున్నారు. అయితే, ష‌ర్మిల‌ను దూరం చేసుకున్నది కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ఇంట్లో త‌ల్లి, చెల్లిని, ఆయ‌న, వైసీపీ నేత‌లు  మ‌నుషుల్లా చూడ‌లేదు.  అవ‌మానించి దూరం చేసుకున్నాడు. జ‌గ‌న్ చెప్పిన‌ట్లు న‌డుచుకున్న నేత‌లు మాత్ర‌మే వైసీపీలో మిగిలారు. ఇదిలాఉంటే, పొన్న‌వోలు వ్యాఖ్య‌ల్లో మ‌రో ఆందోళ‌న‌కూడా స్ప‌ష్టంగా క‌నిపించింది. జూన్‌ 4న ఫ‌లితాల్లో క‌చ్చితంగా కూట‌మి అధికారంలోకి రాబోతుంద‌ని ఆయ‌న‌కు తెలుసు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంది. ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ అరాచ‌క పాల‌న కార‌ణంగా మ‌రికొన్ని కేసులు న‌మోద‌య్యే అవ‌కాశ‌మూ ఉంది. దీనికి తోడు వైసీపీ ఓడిపోతే ఆ పార్టీని వీడేందుకు నేత‌లు సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌లు బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లారు. జ‌గ‌న్ జైలుకెళితే వైసీపీ పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. వీట‌న్నింటిని గుర్తుచేసుకొని పొన్న‌వోలు క‌న్నీరు పెట్టుకున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

కొడాలి నాని పరిస్థితి డౌటే?!

వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యం దెబ్బతిందన్న వార్తలు నాలుగు రోజుల క్రితం వచ్చిన సంగతి తెలిసిందే. నాన్‌స్టాప్ మద్యం తీర్థం, గుట్కా ప్రసాదం కారణంగా నాని ఆరోగ్యం చాలా టూమచ్‌గా డ్యామేజ్ అయిపోయిందన్న వార్తలు వచ్చాయి. అనుచరులతో మాట్లాడుతున్న నాని అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ఆయనకు ఇంటిదగ్గరే చికిత్స జరుగుతోందని ఆ వార్తల సారాశం. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్యం రాయిలాగా వుందని, ఆయన ఉక్కుముక్కలా, టేకు చెక్కలా, చింతపిక్కలా వున్నారని ఆయన అనుచరులు చెబుతూ వచ్చారు. ‘నానికి అనారోగ్యం’ అనే వార్తలను వారు ఖండించారు. అలాగే కొడాలి నాని ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో ఒక వీడియో పోస్టు అయింది. ఒక కుర్చీలో అడ్డదిడ్డంగా కూలబడి వున్న కొడాలి నాని ఫోన్ చూసుకుంటున్నట్టుగా ఆ ఎనిమిది క్షణాల వీడియో వుంది. ‘తనపై వచ్చిన అనారోగ్య వార్తలకు వీడియోతో చెక్ పెట్టిన కొడాలి నాని’ అనే వార్తలను జగన్ అనుకూల మీడియా భారీ స్థాయిలో వ్యాప్తి చేసింది. సరేలే.. మనిషి ఆరోగ్యంగానే వున్నాడుగా అని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా తెలుస్తున్న విషయం ఏమిటంటే, అది పాత వీడియో! ఎప్పటిలో పాత వీడియో ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసి నాని ఇప్పుడు ఆరోగ్యంగానే వున్నాడు అనే కలరింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని వున్న సైజుకి, ఆ వీడియోలో వున్న సంబంధం లేదు. తన ఆరోగ్యం బాగాలేదని వార్తలు భారీ స్థాయిలో వస్తే, ‘అయ్యా నేను బాగానే వున్నాను. నా ఆరోగ్యం మీద వస్తున్న పుకార్లని నమ్మొద్దు’ అని నాలుగు ముక్కలు చెప్తే సరిపోతుంది కదా.. అలా చెప్పకుండా ఒక అడ్డదిడ్డంగా కూర్చున్న ఎనిమిది క్షణాల నిడివి వున్న వీడియో పోస్టు చేశారంటే అర్థమేంటి? ఏదో సమ్‌థింగ్ రాంగ్ వుందని! అయినా ప్రజలకు తన నుంచి ఒక వీడియో మెసేజ్ పంపుతున్నామంటే ఎంత పద్ధతిగా వుండాలి? కొడాలి నాని ఎక్స్ అకౌంట్లో పెట్టిన ఆ వీడియోలో పద్ధతీ పాడూ లాంటివేవైనా వున్నాయా? కొడాలి నాని ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. గుడివాడ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎన్నికల ప్రచారంలో ముక్కుతూనో, మూలుగుతూనో నియోజకవర్గం అంతా తిరిగాడు. ఎన్నికల ముగిసిన తర్వాత ప్రజల్లో తిరగడం గానీ, పోనీ బయటకి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది వుంటే, తన ఇంట్లోనే ప్రజలతో, కార్యకర్తలతో కలసి మాట్లాడ్డం అంటూ జరగాలిగా.. అలాంటిదేమీ జరగడం లేదు. ఈయన బయటకి వెళ్ళడం లేదు.. ఇంట్లోకి ఎవరినీ రానివ్వడం లేదు.  విశ్వసనీయ సమాచారం ప్రకారం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి డౌట్‌గానే వున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరిస్తే భారీ స్థాయిలో ప్రచారం, ట్రోలింగ్ మొదలైపోతుంది కాబట్టి, ఇంట్లోనే ట్రీట్‌మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కౌంటింగ్ జరిగే జూన్ నాలుగో తేదీ నాటికి కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళి కాసేపు కూర్చునే స్థాయి ఆరోగ్యాన్ని అయినా తిరిగి అందించడానికి డాక్టర్లు తంటాలు పడుతున్నట్టు సమాచారం. కొడాలి నాని ఆరోగ్యం పాడైపోతే పాడైపోయి వుండొచ్చుగానీ, ప్రాణానికేం ప్రమాదం వుండకపోవచ్చు.. ఎందుకంటే, ఆయన కోలుకోవాలని, ప్రాణాలతో వుండాలని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నాయి మరి!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది!

వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోయారు.  రెండు వారాల కిందట ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. పోటీ హోరాహోరీగా జరుగుతుందని అంతా భావించినా పోలింగ్ తరువాత సీన్ అందరికీ అర్ధమైపోయింది.   తెలుగుదేశం కూటమిలో  ఉత్సాహం ఉరకలేస్తుంటే... వైసీపీ శిబిరంలో నైరాశ్యం తాండవిస్తోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కొందరు వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి గెలుపు ధీమా ఒలక పోస్తున్నా వారి ముఖాల్లో మాత్రం ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలక నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, పెనమలూరు, మైలవరంలలో అభ్యర్థుల గెలుపు ఓటములపై సాగుతున్న బెట్టింగుల తీరు ను బట్టి వైసీపీ అభ్యర్థుల దయనీయ స్థితి ఇట్టే అర్ధమైపోతుంది. ఈ నియోజకవర్గాలలో వైసీపీ విజయంపై బెట్టింగులకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. అదే సమయంలో కూటమి అభ్యర్థుల గెలుపు మీద కంటే వారి మెజారిటీల మీద పెద్ద ఎత్తున బెట్టింగులు కాయడానికి పందెం రాయుళ్లు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా గన్నవరంలో అయితే వల్లభనేని వంశీపై తెలుగుదేశం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పది వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని లక్షల రూపాయలు బెట్టింగులు కడుతున్నారు. అదే సమయంలో యార్లగడ్డకు అంత మెజారిటీ రాదని వైసీపీ వారు బెట్టింగులకు దిగుతున్నారంటే ఓటమి అంగీకరించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా గుడివాడలో కొడాలి నాని పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము విజయం సాధిస్తారంటూ పెద్ద ఎత్తున పందేలు ఒడ్డుతున్నారు. వెనిగండ్ల రాము విజయంపై నూజివీడుకు చెందిన కొందరు 20 లక్షల రూపాయలు పందెం ఒడ్డినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నాని విజయంపై పందెం కాయడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి చూస్తుంటే వైసీపీ నేతలు ఈ రెండు నియోజకవర్గాలలోనూ పరాజయాన్ని అంగీకరిచేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

లాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెడుతూ...

చెన్సైలో లేడీస్ హాస్టల్లో లాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెడుతూ శరణిత (32) అనే మహిళ మరణించారు. ఎంబీబీఎస్ చదివిన శరణిత కోయంబత్తూరులో డాక్టర్‌గా ప్రాక్టీస్ట్ చేస్తున్నారు. ఆమె భర్త కూడా డాక్టరే. శరణిత ప్రస్తుతం పీజీ చదువుతున్నారు. దానికి సంబంధించిన ఒక పరీక్ష రాయడం కోసం ఆమె చెన్నైకి వచ్చి లేడీస్ హాస్టల్లో వుంటున్నారు. సోమవారం నాడు ఆమెకు భర్త ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఆయన లేడీస్ హాస్టల్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారు. వారు తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్ళి చూశారు. లోపల చేతుల్లో లాప్‌టాప్, లాప్‌టాప్ ఛార్జర్ పట్టుకుని వున్న శరణిత కుప్పకూలిపోయి కనిపించారు. ఆమె అప్పటికే చనిపోయారు. లాప్‌టాప్ ఛార్జర్ కేబుల్ డ్యామేజ్ అవడం వల్ల కరెంట్ షాక్ కొట్టి ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది.

కవిత బెయిల్ పిటిషన్  విచారణ మంగళవారానికి వాయిదా 

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో క‌విత బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణను ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖ‌లైన బెయిల్ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ రేపు తదుపరి విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. కాగా, త‌న పిటిష‌న్ల‌లో క‌విత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె స‌వాల్ చేశారు.  క‌విత త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాది విక్ర‌మ్ చౌద‌రి ఆమె అరెస్టులో ద‌ర్యాప్తు సంస్థ‌లు చ‌ట్టాన్ని ఉల్లంఘించాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈడీ, సీబీఐలు కౌంట‌ర్ అఫిడ‌విట్ల‌ను దాఖ‌లు చేశాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తదుపరి విచార‌ణ జ‌ర‌గ‌నుంది.  కాగా, ఫ‌లితం ఎలా ఉన్నా వాద‌న‌లు చాలా బాగా ఉన్నాయ‌ని విక్ర‌మ్ చౌద‌రిని జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా క‌విత త‌ర‌ఫు న్యాయ‌వాది ప‌లు కీల‌క విష‌యాల‌ను న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండ‌ర్ టేకింగ్ ఇచ్చింద‌ని.. క‌విత వేసిన రిట్ పిటిష‌న్ సుప్రీంలో పెండింగులో ఉండ‌డంతో విచార‌ణ ముందుకు సాగ‌డం లేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసింద‌ని తెలిపారు. తాము ఇచ్చిన అండ‌ర్ టేకింగ్ త‌దుప‌రి వాయిదా వ‌ర‌కే అని అందులో స్పష్టం చేశారని చెప్పారు.  సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండ‌గానే 41 (ఏ) ప్ర‌కారం స‌మ‌న్లు జారీ చేశార‌ని విక్ర‌మ్ చౌద‌రి గుర్తు చేశారు. సీఆర్‌పీసీ 161 ప్ర‌కారం మొద‌ట నోటీసులు ఇచ్చిన‌వారు,  ఆ త‌ర్వాత 41 (ఏ)కు ఎందుకు మారారో తెలియ‌ద‌న్నారు. సుప్రీంలో విచార‌ణ జ‌రుగుతుండ‌గానే ఈడీ బృందం క‌విత ఇంట్లో ఉంద‌ని చెప్పారు. అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింద‌ని తెలిపారు.  అలాగే జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండ‌గానే క‌విత‌ను ప్ర‌శ్నించాలంటూ సీబీఐ పిటిష‌న్ వేసింది. ఆ పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం అంగీక‌రించింది. కానీ, దీని గురించి ఆమెకు మాత్రం ఎలాంటి స‌మాచారం లేద‌ని చెప్పుకొచ్చారు. సీఆర్‌పీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం సీబీఐ ప్ర‌శ్నించాలంటే క‌విత వాద‌న కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత క‌నీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసింద‌న్నారు. రేపు మ‌ధ్యాహ్నం కౌంట‌ర్ వాద‌న‌లు వినిపిస్తామ‌ని న్యాయ‌స్థానానికి ఈడీ తెలిపింది

తిరుగుబాటు మొదలయ్యింది! ఇప్పుడు భారతి సిమెంట్! 4 త‌రువాత తాడేప‌ల్లి ప్యాలెస్‌!

భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీపై ప్రజలు తిరుగుబాటు చేశారు. కడప జిల్లాలో యర్రగుంట్ల వద్ద ఉన్న ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి వచ్చి ఆ కంపెనీ లారీలను అడ్డుకున్నారు. భార‌తి సిమెంట్స్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.  కాలుష్యం కారణాలతో … పలు గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతి సిమెంట్ పరిశ్రమ నుంచి వచ్చే వాహనాల కారణంగా దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ వాహనాలను ఆపివేసి వారు త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.  ప్రభుత్వం జోక్యం చేసుకొని భారతీ సిమెంట్  కాలుష్యం నుంచి కాపాడాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతి సిమెంట్స్‌గా చలామణిలో ఉన్న రఘురాం సిమెంట్స్‌.. క్విడ్‌ ప్రోకో ద్వారా జ‌గ‌న్ ఆస్థి అయింది.  వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జమానాలో మేళ్లు పొందినవాళ్లు ముడుపులు సమర్పించేసుకోగా.. విజయసాయిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న బ్యాంకు... ఇంటికే వచ్చి రుణం ఇచ్చేసింది.  అప్ప‌ట్లో జ‌గ‌న్ చేతిలో చిల్లిగవ్వ లేకుండానే   సిమెంట్ ఫ్యాక్ట‌రీ పెట్టేశారు. భార‌తి సిమెంట్స్ విష‌యంలో సీబీఐ అభియోగాలు రుజువైతే.. నిందితులకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది.   అలా... భారతి సిమెంట్ పరిశ్రమను సీఎం జగన్ తన భార్య భారతి పేరు మీద ఏర్పాటు చేశారు. ఇది ఉత్పత్తి ప్రారంభించక ముందే పదిహేనేళ్ల కిందటే… 51 శాతం వాటాను ఫ్రాన్స్ కు చెందిన వికాట్ అనే కంపెనీకి రూ. రెండు వేల కోట్లకు అమ్మేశారు. అయితే విచిత్రంగా  రెండు వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చిన వికాట్.. పేర్లలోనే కనిపిస్తుంది. మొత్తం పరిశ్రమను జగన్ కుటుంబసభ్యులే నిర్వహిస్తూంటారు. ఏపీలో వైసీపీ వచ్చాక భారతి సిమెంట్స్ మాత్రమే అత్యధికంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే ఈ ఫ్యాక్టరీ కనీస కాలుష్య ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు గతంలో పలుమార్లు ధర్నాలు నిర్వహించారు. అప్పట్లో ఫ్యాక్టరీ యాజమాన్యం ఏవేవో హామీలు ఇచ్చి సర్దుబాటు చేసింది. కానీ అమలు చేయలేదు. ఇప్పుడు ప్రజలు తెరపైకి వస్తున్నారు.  ఇప్పుడు భారతి సిమెంట్స్ పై ప్ర‌జ‌లు తిరుగుబాటు చేశారు. నాలుగో తేదీ తర్వాత తాడేప‌ల్లి ప్యాలెస్‌పై దాడి జ‌ర‌గ‌వ‌చ్చు.  ఏమైనా జరగొచ్చన్న సెటైర్లు ఏపీలో వినిపిస్తున్నాయి.  - ఎం.కె. ఫ‌జ‌ల్‌  

జగన్ 12వ జైలు వార్షికోత్సవం!

పన్నెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. ఔను 2012 మే 27న జగన్ ను సీబీఐ అరెస్టు చేసింది. అంటే సరిగ్గా పుష్కర కాలం కిందట అన్న మాట. ఆ విధంగా చూస్తు జగన్ కు ఇది పన్నెండవ జైలు వార్షికోత్సవం. హైదరాబాద్ లోని దిల్ కుష్ గెస్ట్ హౌస్ లోఅక్రమాస్తుల కేసులో జగన్ ను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ పన్నెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున అరెస్టు చేసింది. వైసీపీ అధినేత జగన్ మత్తం 12 సీబీఐ, ఆరు ఈడీ కేసులలో ఏ1గా ఉన్నారు. ఈ కేసులన్నీ మనీల్యాండరింగ్, పీఎంఎల్ఏ ఉల్లంఘనలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇన్ని ఆర్థిక నేరాలలో ఎ1గా ఉన్న జగన్ 11 నెలల పాటు జైలులో ఉన్నారు.  సరిగ్గా 2014 ఎన్నికల ముందు బెయిలు లభించింది. అయితే బెయిలు లభించినా 2014 నుంచి 2019 ఎన్నికలలో విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే వరకూ ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరై సంతకం పెట్టాలన్న షరతుపై బెయిలు మంజూరైంది.  అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన కోర్టుకు హాజరు కావడం మానేశారు. అంతే కాకుండా తనపై ఉన్న కేసుల విచారణ జాప్యం అయ్యేలా చేయగలిగారు. దీనికి ఆయన ఈ కేసుల్లో ఇతర నిందితుల చేత పెద్ద ఎత్తున డిశ్చార్జ్ పిటిషన్లు వేయించారు.  అలాగే పదేళ్లుగా బెయిలుపైనే కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేనంటూ హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇదంతా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ వైసీపీ మద్దతు ఇవ్వడం వల్ల అందుకు ప్రతిగా బీజేపీ కేసుల విషయంలో జాప్యం జరిగేలా జగన్ కు మేలు చేకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి.    ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితం జూన్ 4న వెలువడ నుంది. ఇంత కాలం కేసుల వ్యవహారంలో బీజేపీ నుంచి సహాయ సహకారాలు అందాయి. అయితే ఈ ఎన్నికలలో బీజేపీ, తెలుగుదేశంలు పొత్తు పెట్టుకుని పోటీలో ఉండటంతో ముందు ముందు జగన్ కు బీజేపీ అండదండలు ఉండే అవకాశాలు పూజ్యం. ఎన్నికలలో ఫలితం జగన్ కు ప్రతికూలంగా వస్తే మాత్రం జగన్ మళ్లీ ప్రతి శుక్రవారం కోర్టులకు హాజరుకాక తప్పదని పరిశీలకులు అంటున్నారు. అదే విధంగా ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కొలువుదీరితే.. కోర్టుల్లో జగన్ కేసుల విచారణ జోరందుకోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.   ఒక సారి కేసుల విచారణ వేగం పుంజుకోవడమంటూ జరిగితే జగన్ చేయగలిగేది ఏమీ ఉండదు. ఏపీలో పోలింగ్ ట్రెండ్ ను బట్టి విజయం తెలుగుదేశం కూటమిదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సర్వేలూ, సెఫాలజిస్టులూ కూడా అదే చెబుతున్నారు. అదే జరిగితే ముందు ముందు జగన్ కు ఇక్కట్లు, ఇబ్బందులు తప్పవని చెప్పడానికి సందేహం అవసరం లేదు.

గౌతు శిరీష విజయం ఖాయమేనా?

పలాసలో మంత్రి సిదిరి అప్పలరాజు ఓటమి అనివార్యమేనా, స్వయంగా వైసీపీ నేతలే ఆయన ఓటమిని కోరుకుంటున్నారా? పలాస ప్రజానీకం కూడా అహంభావి అయిన సిదిరి అపపలరాజుకు మరో అవకాశం ఇవ్వకూడదని డిసైడైపోయి ఓటు వేశారా? అన్న ప్రశ్నలన్నిటికీ  ఔననే సమాధానం వస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సిదిరి అప్పలరాజు తీరు పూర్తిగా మారిపోయిందని జనం భావిస్తున్నారు. వైసీపీ క్యాడర్ కూడా అదే భావన వ్యక్తం చేస్తున్నారు.  పలాస నియోజకవర్గం మొదటి నుంచీ కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2019 ఎన్నికలలో సిదిరి అప్పలరాజు విజయానికి జగన్ వేవ్ మాత్రమే కారణమని పరిశీలకుల విశ్లేషణ. వాస్తవానికి సిదిరి అప్పలరాజు ఎన్నికలలో పోటీ చేయడం 2019లో అదే మొదటి సారి. ఆయనకు వైద్యుడిగా ఉన్న గుర్తింపు కారణంగా పది శాతం ఓట్లు పడితే మిగిలిన ఓట్లన్నీ కూడా జగన్ హవా కారణంగానే పోలయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి జగన్ హవా ఎటూ లేదు. వైద్యుడిగా సిదిరి అప్పలరాజుకు గతంలో ఉన్న మంచి పేరు, గుర్తింపు కూడా మటుమాయమయ్యాయి. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత సిదిరి అప్పలరాజు వ్యవహరించిన తీరు, ప్రదర్శించిన అహంభావం కారణంగా అటు ప్రజలు, ఇటు పార్టీ క్యాడర్ కూడా ఆయనకు దూరం జరిగారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో గౌతు శిరీష్ సిదిరి అప్పలరాజుకు ప్రత్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ జగన్ గాలిలో సిదిరి సునాయాసంగా విజయం సాధించారు. అయితే ఈ సారి ఆ పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. జగన్ సర్కార్ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు.. సిదిరి అప్పలరాజు తన వ్యవహారశైలితో తెచ్చుకున్న చెడ్డ పేరు ఆయన ఓటమికి బాటలు వేశాయని అంటున్నారు.  అదే సమయంలో మాజీ మంత్రి  సర్దార్ గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీష  గత ఎన్నికలలో ఓటమి తరువాత కూడా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు చేరువయ్యారు. గత ఎన్నికల సమయంలో సిదిరి అప్పల రాజు శిరీష్ బర్తపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆలస్యంగా తేలింది. దీంతో జనం మరోసారి సిదిరికి అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా నిర్ణయం ఏమిటన్నది సిదిరి ప్రచారం సమయంలోనే ప్రస్ఫుటంగా కనిపించిందంటున్నారు.   అన్నిటికీ మించి గత ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లలో భారీగా చీలిక వచ్చి సిదిరి అపపలరాజు విజయానికి దోహదపడింది. అయితే గతానికి భిన్నంగా ఆసారి ఆ మూడు పార్టీలూ కూటమిగా ఏర్పడి పోటీలో ఉండటంతో  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేకుండా పోయింది.  అలాగే గౌతు శిరీష తన ప్రచారంలో మంత్రిగా అప్పలరాజు వైఫల్యాలనూ, అవినీతిని ప్రజలలో ఎండగడట్టారు. మొత్తంమీద జగన్ సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకతకు సిదిరి అప్పలరాజు వ్యవహారశైలి కూడా వైసీపీని పలాసలో ప్రజలకు దూరం చేసిం, గౌతు శిరీష్ విజయానికి మార్గం సుగమం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మచిలీపట్నం జనసేన నేత కర్రి మహేశ్ కారును దహనం చేసిన వైసీపీ గూండాలు 

ఎపిలో త్రి కూటమి అభ్యర్థులు విజయపథంలో దూసుకెళ్లనున్నారు. పోలింగ్ తర్వాత ఈ అంచనాలు రావడంతో వైసీపీ నాయకత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.  ఓటమి భయంతోనే జనసేన శ్రేణులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వైసీపీ నేతలకు సహనం పూర్తిగా చచ్చిపోయిందనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం.  మచిలీపట్నం లోకసభ  జనసేన  అభ్యర్థి బాలశౌరి తరపున పని చేస్తున్న జనసేననేత కర్రి మహేష్ కారును  వైసీపీ గూండాలు పెట్రోల్ పోసి దహనం చేశారు. . ఎన్నికల ప్రచార సమయంలో బహిరంగంగా కర్రి మహేష్ ఇంట్లో దూసుకెళ్లి వైసీపీ గూండాలు  దాడులు చేశారు. ఈ దాడిలో కర్రి మహేష్ ప్రాణాలతో బయట పడినప్పటికీ ఇవ్వాళ మాత్రం చేదు అనుభవం నుంచి తప్పించుకోలేకపోయారు. . వైసీపీ గూండాలు అందరూ అర్దరాత్రి  కర్రి మహేశ్ కారుపై పెట్రోల్ పోసి  పూర్తిగా దహనం చేశారు.  ఎన్నికల ఫలితాలకు వారం రోజుల ముందు  వైసీపీ గూండాలు పూర్తిగా బరి తెగించారని మచిలీపట్నం జనసేన నేత వాడ వీరప్రతాప్ ఆరోపించారు. కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న భోగిరెడ్డి పల్లిలో కూడా వైసీపీ గూండాలు భౌతికదాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో పవన్ కళ్యాణ్ అభిమానులు గంపగుత్తగా బాలశౌరి అభ్యర్థిత్వాన్ని బలపరిచారన్నారు.   

విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం.. వెర్రితలలు వేస్తున్న వైసీపీ అతి!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఫలితం వచ్చే నెల 4న వెలువడనుంది. అయితే అంచనాలు, విశ్లేషణలూ అన్ని కూడా ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని తేల్చేస్తున్నాయి. వైసీపీ లీడర్లు, క్యాడర్ లో కూడా ఓటమి కళ కనిపిస్తోంది. వారి భాషలోనూ, బాడీ లాంగ్వేజ్ లోనూ కూడా ఓటమిని అంగీకరించేసిన తీరు వినిపిస్తోంది. కనిపిస్తోంది. అయితే కొందరు వైసీపీ నేతలు మాత్రం విజయంపై ధీమా పేరుతో చేస్తున్న అతి నవ్వుల పాలౌతోంది.  మంత్రి బొత్స సత్యనారాయణ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ విశాఖపట్నంలో జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా ప్రకటించేశారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఇంకా ఫలితాలు వెలువడ లేదు.. రాబోయేది వైసీపీ సర్కారే.. జూన్ 4 తరువాత చుక్కలు చూపిస్తాం జాగ్రత్త అంటూ అధికారులకు హెచ్చరికలు చేసేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే.. ఫలితాలు మరో 9 రోజుల్లో వెలువడనున్నాయి. కచ్చతమైన అంచనాలకు రావడానికి జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.   ఈ తరుణంలో విజయంపై నమ్మకం ఉన్న వారెవరైనా కామ్ గా ఉంటారు. సంచలన ఆరోపణలు, ప్రకటనల జోలికి వెళ్లరు. తెలుగుదేశం కూటమి నేతలు అదే చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెకేషన్ లో ఉన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విదేశీ పర్యటనలో సేదతీరుతున్నారు. జగన్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆక్కడ ఆయన చేస్తున్న అతి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఆయన లోని ఓటమి భయాన్ని కూడా ఎత్తి చూపుతోంది. ఆ విషయం పక్కన పెడితే  మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న కూటమి నేతల మాటల్లో విశ్వాసం కనిపిస్తోంది. వారు ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా మాట్లాడుతున్నారు. పోలింగ్ సరళిని హేతుబద్ధంగా వివరిస్తున్నారు. వారిలో ఎలాంటి ఆందోళనా కనిపించడం లేదు. అదే సమయంలో వైసీపీ నేతల్లో మాత్రం గాభరా, భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఒక వైపు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూనే మరో వైపు ఈ ఎన్నికల్లో తమకు ఘోర అన్యాయం జరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులు, అధికారయంత్రాంగాం, ఎన్నికల సంఘం అన్నీ తెలుగుదేశంతో కుమ్మక్కైపోయాయని ఆరోపిస్తే ఓటమి భయాన్ని బయటపెట్టుకుంటున్నారు. అధికారులకు, పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ తాము మళ్లీ అధికారంలోకి వస్తున్నామనీ, రాగానే మీ సంగతి చూస్తామంటూ పరోక్షంగా బెదరిస్తున్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార వైసీపీ ఆడమన్నట్లల్లా ఆడింది. అడుగులకు మడుగులొత్తింది. అటువంటి పోలీసు వ్యవస్థ నిజంగా మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చీమ తలకాయంత ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తుందని భావించజాలం. ఇదే పోలీసు వ్యవస్థ గత ఐదేళ్లుగా వైసీపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించింది. శుక్రవారం అరెస్టులతో వైసీపీ వ్యతిరేకులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆధారాలు, ఫిర్యాదులతో సంబంధం లేకుండానే కేవలం ఆరోపణలతో అర్ధరాత్రి అరెస్టులకు తెగబడింది. ఇవన్నీ వైసీపీ ఆదేశాల మేరకే చేసిందన్నది బహిరంగ రహస్యం.  మరో పక్క విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ బొత్స హడావుడి చేస్తుంటే కొందరు అతి రాయుళ్లు విశాఖలో హోటల్ రూమ్స్ అధిక ధరలకు ముందుగానే రిజర్వ్ చేసి పారేస్తున్నారు. విపక్ష నేతలకు వ్యతిరేకంగా ఈ ఐదేళ్ల కాలంలో నమోదైన ఏ కేసూ కూడా న్యాయస్థానంలో నిలబడిన దాఖలాలు లేవు. ఇంత అడ్డగోలుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసు వ్యవస్థ ఇప్పుడు వారి ఆదేశాలకు తలవంచడం లేదంటేనే ఆ పార్టీకి విజయావకాశాలు లేవని మెడమీద తలకాయ ఉన్న ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది.  కానీ వైసీపీలో కొందరు నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం కనీసం ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లుగా నిలబడటానికైనా ఎవరైనా మిగలాలి, అప్పటి వరకూ కార్యకర్తలలో ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో సూడో ప్రచారానికి తెరలేపారు. అదేమిటంటే వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు కోసం రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు విశాఖకు తరలి రానున్నారు. అందుకోసం ఇప్పటికే  విశాఖలోని హోటళ్లలో రూములన్నీ ముందుగానే రిజర్వ్ అయిపోయాయి అంటూ అందుకు ఆధారంగా ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తున్నారు. హోటళ్ల రూంల ధరలు పెరిగిపోయాయన్నది వాస్తవం. ఎందుకంటే పండుగలు, పబ్బాల సమయంలో పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు టికెట్ ధరలను ఆకాశమే హద్దుగా పెంచేయడం కద్దు. అదే విధంగా హోటల్ రూం చార్జీలను కూడా పెంచేస్తారు. ప్రస్తుతం విశాఖ  హోటళ్లలో రూమ్ లన్నీ రిజర్వ్ అయిపోయిన మాట వాస్తవం. వాస్తవ రేట్ల కంటే అధికంగా చెల్లించేందుకు అంగీకరిచేసి మరీ వైసీపీ నేతలు హోటల్ రూంలను బుక్ చేసేసుకున్నారు. అయితే వారు చెప్పిన తేదీకి తండోపతండాలుగా విశాఖ రావడానికి బస్సులలో కూడా ముందస్తు రిజర్వేషన్లు ఉండాలి కదా.. కానీ అటువంటి పరిస్థితి ఏదీ లేదు.  మరీ ముఖ్యంగా కడప నుంచి విశాఖకు రోజూ రెండు బస్సులు తిరుగుతాయి. ఆ బస్సుల్లో జగన్ ప్రమాణ స్వీకారం రోజున కనీసం ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా ముందుగా బుక్ కాలేదు. ఇది వాస్తవం. విశాఖ రావడానికి ఎవరూ ముందస్తు రిజర్వేషన్లు చేయించుకోకుండానే విశాఖ హోటళ్ల రూములన్నీ ఖాళీ లేకుండా ఎలా?  అక్కడికే వస్తున్నాం. హోటళ్లలో రూంలు ముందుగా బుక్ చేసుకుని ఆ తరువాత వాటిని క్యాన్సిల్ చేసుకున్నా క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. అయితే బస్సుల విషయంలో అలా కాదు. బుక్ చేసుకున్న తరువాత క్యాన్సిల్ చేసుకుంటే చచ్చినట్లు క్యాన్సిలేషన్ చార్జీలు కట్టాల్సిందే. అందుకే వైసీపీ ప్రచారం కోసం హోటళ్లు పెద్ద ఎత్తున బుక్ చేసేసింది. క్యాన్సిల్ చేసేసినా వచ్చే నష్టం ఉం లేదు కనుక. కానీ క్యాన్సిలేషన్ చార్జీలు భరించాల్సి వస్తుంది కనుక బస్సులలో సీట్లు బుక్ చేయలేదు. అదీ సంగతి. లేని హైప్ క్రియేట్ చేసి, నిజంగా అంత సీన్ ఉందని కనీసం క్యాడర్ నైనా నమ్మించాలన్న ప్రయాసతోనే జగన్ ప్రమాణ స్వీకారం రోజున విశాఖలో హోటల్ రూంలు ఖాళీలేకుండా బుక్ అయిపోయాయని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. 

వైసీపీ ఊహలు... పిచ్చి పీక్స్!

పోలింగ్ జరగడానికి ముందు వైసీపీ ‘వైనాట్ 175’ అని ఊగారుగానీ, పోలింగ్ అయిపోయిన తర్వాత ఓటర్ల రెస్పాన్స్ చూసి వాళ్ళకు పరిస్థితి అర్థమైపోయింది. అంతకుముందు ‘బుస్’ అన్నవాళ్ళు ఇప్పుడు ‘తుస్’ అని కూడా అనడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యాలు, ఉత్తుత్తి బిల్డప్పులు ప్రదర్శిస్తున్నప్పటికీ, వైసీపీ నాయకులు - కార్యకర్తలు అందరి మనసులలో ‘జూన్ 4 తర్వాత నా పరిస్థితి ఏమిటి దేవుడా’ అన్న ఆలోచనే మెదులుతోంది. అయితే మొన్నామధ్య వరకు జగన్ ఈసారి కూడా గెలుస్తాడు అని వేణుస్వామి చెప్పడం చూసి వైసీపీ వర్గాలు నిజమే అనుకున్నాయి. అయితే కేసీఆర్ గెలుస్తాడని వేణుస్వామి చెప్పాడు. కేసీఆర్ తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. అప్పటి నుంచి వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. లేటస్ట్.గా ఐపీఎల్‌లో గెలుస్తారని వేణు స్వామి చెప్పిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఫైనల్స్.లో దఢేల్‌మనడంతో మరోసారి వైసీపీ వర్గాల గుండెల్లో బాంబులు పేలాయి. మొదట్లో జగన్ గెలుస్తాడని వేణుస్వామి చెప్పగానే మురిసి ముద్దయిపోయిన ఈ బ్యాచ్, వేణుస్వామి జగన్ గెలుస్తాడని కాకుండా చంద్రబాబు గెలుస్తాడని చెప్పినట్లయితే ఎంత బాగుండేదో అనుకుంటున్నారు. వేణుస్వామి చెప్పిన మాటల మీద నమ్మకం పోయింది గానీ, ఇప్పుడు వైసీపీ నాయకులు తాము గెలవబోతున్నామనే దానికి మరికొన్ని‘ఆధారాలను’ చూపిస్తూ ఆనందపడిపోతున్నారు. ఆ ‘ఆధారాలు’ ఏమిటో చూస్తే, కొంతమంది వైసీపీ నాయకుల మెంటల్ కండీషన్ ఏ స్థాయిలో వుంది అర్థమవుతుంది. ఆధారం-1: జూన్ 3వ తేదీ నుంచి దాదాపు పదీ పదిహేను రోజులపాటు వైజాగ్‌లో వున్న హోటళ్ళన్నిటిలోనూ రూమ్స్ మొత్తం బుక్కయిపోయాయి. అంటే అర్థం ఏమిటి.. ఈ ఎన్నికలలో జగన్ గెలవబోతున్నాడు. దాంతో వైజాగ్‌లో రాజధాని హడావిడి మొదలైపోతుంది. పైగా ప్రమాణ స్వీకారం కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి రూమ్స్ బుక్ అయిపోయాయి. వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం లేకపోతే వైజాగ్‌లో ఈ స్థాయిలో హోటల్ రూమ్స్ ఎందుకు బుక్ అవుతాయి? ఆధారం-2: సాధారణంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుంటే వర్షాలు కురవవు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నా, జగన్ ముఖ్యమంత్రిగా వున్నా వర్షాలు బాగా కురుస్తాయి. మామూలు మేఘాలు మాత్రమే కాకుండా ‘క్యుములోనింబస్’ మేఘాలు కూడా ఏర్పడుతూ వుంటాయి. జూన్ నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం వాళ్ళు చెబుతున్నారు. అంటే, వర్షాలు బాగా కురవబోతున్నాయి కాబట్టి, జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆధారం-3:  సాక్షి మీడియా వాళ్ళు ఏపీలో జనం ముందు మైకులు పెట్టి ఎవరు గెలుస్తారు అని అడిగితే, జగనే గెలుస్తాడు అని చెబుతున్నారు. అంటే అర్థమేంటి? జగనే గెలుస్తాడు. ఆధారం-4: పోలింగ్‌కి కొద్ది రోజుల ముందు జగన్ తన నివాసంలో రాజశ్యామల యాగం చేయించాడు కాబట్టి కంపల్సరీ జగన్ గెలుస్తాడు. ఇవే కాక, ఇలాంటి వింత వింత ఆధారాలను నమ్ముకుని, వైసీపీ వర్గాలు ఊహల్లో బతికేస్తున్నాయి.

కన్ఫమ్.. పెనమలూరు విజేత... బోడె ప్రసాద్!

కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి బోడె ప్రసాద్ విక్టరీ ఖాయమైంది. పెడన నుంచి పారిపోయి వచ్చి, ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి, ఇంతకాలం రౌడీరాజ్యం నడిపించారు. అక్కడ నుంచి ప్రజలు తరిమిన నేపథ్యంలో పెనమలూరు స్థానం నుంచి రంగంలోకి దిగారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బోడె ప్రసాద్‌ని రంగంలో నిలపడంతోనే ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఒక పర్యాయం ఎమ్మెల్యేగా సేవలు చేసి, ఆ తర్వాతి కాలంలో ఓడిపోయినా నియోజకవర్గ ప్రజల సేవలోనే వున్న బోడె ప్రసాద్ మరోసారి టీడీపీ నుంచి పోటీ చేయడం నియోజకవర్గ ఓటర్లకు సంతోషాన్ని కలిగించింది. ఎక్కడి నుంచో పారిపోయి తమ నియోజకవర్గానికి వచ్చిన దుష్టగ్రహాన్ని వదిలించుకునే మార్గం దొరికిందని సంతోషించారు. మే పదమూడున తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిని గమనించిన రాజకీయ పరిశీలకులు ఈ స్థానం నుంచి బోడె ప్రసాద్ విక్టరి కన్ఫమ్ అని క్లియర్‌గా చెబుతున్నారు. తెలుగుదేశం నాయకత్వం పెనమలూరు స్థానం నుంచి బోడె ప్రసాద్‌ని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు జోగి రమేష్ మైండ్ గేమ్ ప్రదర్శించారు. ఇక తన విజయం ఫిక్సయిపోయిందని బిల్డప్పు ఇస్తూ బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. అయితే అదంతా వాపే తప్ప బలుపు కాదని ఆ తర్వాత జోగి రమేష్‌కి అర్థమైంది. జనంలో తనకు బలం లేదని ప్రచారం సందర్బంగా పూర్తిగా అర్థం చేసుకున్న ఆయన జనబలం ఎలాగూ లేదు కాబట్టి, ధనబలం, అధికార బలం, రౌడీల బలంతో అయినా విజయం సాధించాలని ఫిక్సయ్యారు. జనాన్ని ప్రలోభాలకు గురిచేయడం, అధికార దుర్వినియోగం చేయడం దగ్గర్నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరపడం వరకు జోగి రమేష్ చేయని అడ్డదారి ప్రయత్నాలు లేవు.  గత 20 ఏళ్ళ చరిత్రలో పెనమలూరు నియోజకవర్గంలో ఏనాడూ ఘర్షణలు జరగలేదు. పెడన నుంచి పారిపోయి వచ్చిన జోగి రమేష్ పుణ్యమా అని ఇక్కడ కూడా ఘర్షణల సంస్కృతి ప్రవేశించింది.  జోగి రమేష్ తరహాలో అడ్డుగోలు వ్యవహారాల్లో తలదూర్చకుండా, స్ట్రెయిట్ ఫార్వర్డ్.గా వుండే బోడె ప్రసాద్ వైపు పెనమలూరు ప్రజలు నిలిచారు. ఆయన ప్రచారం చేస్తున్న సమయంలోనే ఆయన ఏ స్థాయి విజయం సాధించబోతున్నారనేది స్పష్టంగా అర్థమైంది. అది చూసి ఓర్చుకోలేని జోగి రమేష్ టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద భౌతిక దాడులకు తన గూండాలను ప్రోత్సహించారు. ఆ దాడులను కూడా టీడీపీ కేడర్ విజయవంతంగా తిప్పికొట్టారు. మాటకు మాట, చేతకు చేత అన్నట్టుగా బోడె ప్రసాద్ బలంగా నిలవడంతో జోగి రమేష్‌కి తోక ముడవక తప్పలేదు. నియోజకవర్గంలో పోలింగ్ సరళిని గమనించిన జోగి రమేష్ తన ఓటమి ఖాయమని ఫిక్సయ్యారు. అందుకే అప్పటి నుంచి అయ్యగారి నోటి నుంచి వాయిస్ లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత నియోజకవర్గం నుంచి పెట్టేబేడా సర్దుకుని నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయే ఆలోచనలో జోగి రమేష్ ఉన్నట్టు తెలుస్తోంది.

వేణుస్వామి లెక్క తప్పుతుందా? హైదరాబాద్ టీం కూడా పాయే!

తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు, జోతిష్యం చెబుతూ సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాలో నిత్యం కనిపించే స్వామి వేణుస్వామి.  సినీ తారల జీవితాలను టార్గెట్ చేసుకొని ఆయన చెప్పే జోతిష్యం ట్రెండింగ్, ట్రోలింగ్‌ అవుతుంటాయి.  జాతకాల పేరుతో తనకు ఇష్టం లేని వాళ్లపై పిచ్చికూతలు కూసే వేణుస్వామి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. ఆ హీరో చనిపోతాడని.. ఈ హీరోయిన్ చనిపోతుందని ఇలా చావు జోస్యాలు చెప్పిన చ‌రిత్ర కూడా ఈ స్వామిది.  అయితే ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలపై కూడా ఆయ‌న నోటి దూల తీర్చుకుంటున్నారు.  డబ్బుల కోసం ఎలా కావాలంటే అలా జాతకాలు చెబుతాడని పేరు తెచ్చుకున్న ఆయన,  వైసీపీ పెయిడ్ చానల్స్ లో జగన్ గెలుస్తాడని జోస్యాలు చెబుతూ హడావుడి చేస్తున్నారు. ఏపీకి మళ్లీ జగనే సీఎం అవుతారంటూ,  పేరు మోసిన జ్యోతిష్యుడు వేణుస్వామి ప‌లు ఇంటర్వ్యూలో చెబుతూనే వున్నారు.  నేను రోజుకో మాట మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకుడిని కాదు, జ్యోతిష్యుడిన‌నే ద‌బాయిస్తుంటారాయ‌న‌. ఒక్కసారి చెప్పిన మాట మీదే నేను నిలబడతాను. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైంద‌నేది ఆయ‌న జోస్యం.  ఇటీవ‌ల స్వామి చెప్పిన జోస్యం క‌నీసం ఒక్క‌టైనా నిజ‌మైందా అంటే.....వేణుస్వామి కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. ఏం అయింది.... కేసీఆర్ ఓడిపోయారు. వేణుస్వామీ హైదరాబాద్ టీం, ఐపీఎల్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.. కానీ కనీస పోటీ ఇవ్వలేదు. ఇదే వేణుస్వామి గత మూడు నెలలుగా జగన్ గెలుస్తాడని చెబుతున్నారు.. అది విష‌యం... ఇప్పుడీ స్వామి ప‌రిస్థితి ఎలా వుందంటే ఆ స్వామివి, పిచ్చికూత‌ల‌ని వైసీపీ ఫ్యాన్స్ కూడా కొట్టి ప‌డేస్తున్నారు. స్వామి మాట‌లు న‌మ్మి ఎవ‌రూ బెట్టింగ్ పెట్ట‌వ‌ద్ద‌ని జ‌గ‌న్ అభిమానులే చెబుతున్నారు.  సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయాల వరకూ ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయ్యాన‌ని చెబుతుంటారు ఈ స్వామి.  వాస్తవానికి ఆయన చెప్పినవాటిల్లో జరిగినవి ఏమైనా ఉన్నాయా అంటే వాటిని వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. జరగనవైతే లెక్కబెట్టలేనంత ఉంటాయి. వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి రాజకీయ నేతల జాతకాలు నా వద్ద ఉన్నాయి. అయితే ఆయన జాతకం ప్రకారం వైఎస్ జగన్‌కు తిరుగు ఉండదు. చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదు. కాబట్టి ఆయనకు ఎలాంటి రాజయోగం లేదు. పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి రాలేడు. కానీ ఓ పార్టీ మాత్రం ఏపీలో ఉండదు అంటూ వేణుస్వామి జోస్యం పేరుతో ఇలా త‌న నోటి దూల తీర్చుకుంటున్నాడు.   అయితే ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన పరిస్థితులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో అభిప్రాయలు విభిన్నంగా కనిపిస్తున్నాయి. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

తెలంగాణపై రెమాల్ తుఫాన్ ప్రభావం...13 మంది మృత్యువాత 

రెమాల్ తుపాను ప్రభావం తెలంగాణపైనా పడింది. అకాల వర్షం అన్నదాతలకు నష్టం మిగల్చడమే కాదు, పలుచోట్ల అమాయకుల ప్రాణాలు బలిగొంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వానతో జనజీవనం స్తంభించింది. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే వర్షబీభత్సానికి వేర్వేరు చోట్ల ఏడుగురు మృత్యువాత పడ్డారు. తాడూరు శివారు ఇంద్రకల్‌ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలి నలుగురు మృతి చెందారు. ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. తెలకపల్లి మండల శివారులో పిడుగు పడి లక్ష్మణ్ అనే 13 ఏండ్ల బాలుడు చనిపోయాడు. తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో వ్యవసాయ క్షేత్రం వద్ద పొలం పనులు చేస్తున్న కుమ్మరి వెంకటయ్య అనే రైతు మృతి చెందాడు. రేకుల షెడ్డు ఇటుక పడి మరో వ్యక్తి విగతజీవిగా మారాడు. గాయపడ్డవారితో పాటు మృతదేహాలను నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రభుత్వాసుత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో వేసవి విడిది కోసం ఇంటికొచ్చిన ఇద్దరి ఉసురు తీసింది గాలివాన. వ్యవసాయ పొలం వద్దకెళ్లి సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు కోళ్ల ఫామ్‌ గోడకూలి ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చెట్టు విరిగి ద్విచక్రవాహనంపై పడటంతో, దానిపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి వద్ద ట్రాక్టర్‌పై చెట్టుపడి 5 మందికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లాలో ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. రేకుల ఇళ్లపైన కప్పులు గాలికి కొట్టుకుపోయాయి. పానగల్ రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లి సైదులు అనే యువకుడు గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లాలో చెట్లు కరెంట్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్‌ను సైతం అకాలవర్షం అతలాకుతలం చేసింది. ఎండ తాకిడి నుంచి వాహనదారులకు ఉపశమనం కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన, గ్రీన్ మ్యాట్ షెడ్ కూలిపోయి ఓ బస్సు, ఇన్నోవాపై పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మల్కాజిగిరి, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి.

 యెర్నేని సీతాదేవి ఇక లేరు 

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన యెర్నేని సీతాదేవి ఈ ఉదయం కన్నమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ముదినేపల్లి నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీతాదేవి విజయ డెయిరీ డైరెక్టర్‌ గానూ పనిచేశారు. ఆమె స్వస్థలం కైకలూరు మండలంలోని కోడూరు. 2013లో సీతాదేవి బీజేపీలో చేరారు. సీతాదేవి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త నాగేంద్రనాథ్ (చిట్టి) ఏపీ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. నిరుడు ఆయన కన్నుమూశారు. నాగేంద్రనాథ్-సీతాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కైకలూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీతాదేవి మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

వైసీపీకి సీన్ రివర్స్!

జగన్ కు ఏ విషయమైనా సరే రివర్స్ లో జరిగితేనే ఇష్టం. ఆయన 2019లో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రివర్స్ లోనే పాలన సాగించారు. అంత వరకూ అభివృద్ధిలో అగ్రస్థానం వైపు దూసుకు వెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆపోజిట్ గా పరుగులు పెట్టించారు. వేగంగా నిర్మాణం అవుతున్న అమరావతిని నిర్వీర్యం చేసేశారు. ఠాఠ్ అమరావతి ఒక్కటే రాజధాని ఏమిటి?  ఏపీకి మూడు రాజధానులు కావాలి అంటూ కొత్త నినాదం తీసుకుని పాలనను రివర్స్ గేర్ లో  నడిపారు. ఆంధ్ర ప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం పురోగతిని స్తంభింప చేసేశారు. రివర్స్ టెండరింగ్ అంటూ తిరోగమనానికి శ్రీకారం చుట్టారు.  ఐదేళ్ల పాలన తరువాత ఆయనకు ఇప్పుడు 2019 ఫలితం రివర్స్ లో రావడం ఖాయమైపోయిందని పరిశీలకులే కాదు, ప్రజలూ ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ రివర్స్ ఫలితం ఆయన కోరుకున్నదేనంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.  ఔను మే 13న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ట్రెండ్ చూసిన తరువాత వైసీపీయే ఈ సారి  తమకు 2019నాటి ఎన్నికలకు పూర్తి రివర్స్ గా రానున్నాయని అంగీకరించేస్తున్నారు.  అంతే కాదు ఇప్పుడు వైసీపీ మాటలు కూడా 2019 ఫలితాల సమయంలో మాట్లాడిన మాటలకు పూర్తి రివర్స్ గా ఉన్నాయి. అదే ఇంకా అర్ధం కాని వారెవరైనా ఉంటే వారికి కూడా ఫలితం అర్ధమయ్యేలా చేస్తున్నది.  అప్పట్లో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు ఆ పాత్ర అధికార పార్టీగా ఉన్న వైసీపీ పోషిస్తోంది. ఎన్నికలకు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం తనకు ఏ కోశానా లేదని పోలింగ్ కు ముందు వైసీపీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. పోలింగ్ ముగిసిన క్షణం నుంచీ వైసీపీ నేతలు అదే పాట పాడుతున్నారు.   

మార్పు కనిపించేస్తోందిగా? వైసీపీకి సీన్ అర్ధం అయిపోయిందా?

ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారుతోందన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఇంత కాలం వైసీపీ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు ఇప్పుడు తటస్థంగా ఉంటున్నారు. అంతే కాదు ఎన్నికల సంఘం పలువురు పోలీసు అధికారులపై వేటు వేసింది. అలా వేటు పడిన స్థానంలో వచ్చిన వారు.. మరింత మందిని కీలక విధులకు దూరం చేశారు. మరింత మందిపై నిఘా పెట్టారు. ఈ మార్పు ఒక్క సారిగా పోలీసు వ్యవస్థలో కింది నుంచి పై దాకా ఉలిక్కిపడేలా చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో, ఒక పార్టీతో అంటకాగితే జరిగే పరిణామాలేమిటో తేటతెల్లం చేసింది. దీంతో ఏపీ పోలీసుల తీరు ఒక్కసారిగా మారిపోయింది. గత ఐదేళ్లూ ఒక తీరు.. గత కొద్ది రోజులుగా మారో తీరుగా మారిపోయింది.   వైసీపీ హయాంలో అంటే గత ఐదేళ్లుగా పోలీసు అధికారులకు పదోన్నతులు, కీలక పోస్టింగులకు వారిపై ఉన్న అభియోగాలూ, అధికార పార్టీకి అనుకూలంగా పని చేయడానికి సై అనడమే అర్హతలుగా మారాయి. ఇప్పుడు అలా కీలక  పోస్టింగులలో వచ్చి తిష్ట వేసిన వారికి ఇప్పుడు స్థాన చలనం కలిగింది.  ఇక మిగిలిన వారిలో భయం మొదలైంది. దీంతో మొత్తం పరిస్థితి వైసీపీకి రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని చెప్పడానికి  వైసీపీ పెద్దల మాటలను కింది స్థాయి పోలీసులే ఖాతరు చేయకపోవడాన్ని ఉదాహరణగా పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ బాధితులపైనే కేసుల నమోదుకు పరిమితమైన పోలీసులు ఇప్పుడు వైసీపీ కేడర్, నాయకులపై కూడా యాక్షన్ తీసుకోవడానికి, కేసులు నమోదు చేయడానికి వెనుకాడటం లేదు.   రాష్ట్రంలో మారిన  ఈ పరిస్థితే జూన్ 4న ఫలితం ఎలా ఉండబోతోందో చెబుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్రజల నాడి ఎలా ఉందో, ప్రజల మొగ్గు ఎటువైపు ఉందో అందరి కంటే నిక్కచ్చిగా, కచ్చితంగా అంచనా వేయగలిగేది క్షేత్ర స్థాయిలో పోలింగ్ విధులు నిర్వహించిన పోలీసులే అని అంటున్నారు.