రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న శిశు మరణాలు

తిరుపతి రుయా ఆస్పత్రిలో శిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు మరో నలుగురు చిన్నారులు చనిపోయారు. మృత్యువాత పడిన వారంతా వాయల్పాడు, పుత్తూరు, మదనపల్లెలకు చెందినవారు. చికిత్స పొందుతున్నవారిలో 37 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఈ మేరకు తాజా మెడికల్ బులిటెన్ను శనివారం వైద్యులు విడుదల చేశారు. గత మూడు రోజుల్లో 19మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.


కాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో శిశు మరణాలపై ప్రభుత్వం స్పందించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యే వైద్య బృందం ఈరోజు మధ్యాహ్నం తిరుపతి వెళ్లనుంది. ఈ బృందంలో నీలోఫర్ వైద్యులు హిమబిందు, సుబ్రహ్మణ్యం, మురళీరావు ఉన్నారు. శిశువుల మరణాలపై వీరు ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.