మిస్ వరల్డ్ 2012 గా చైనా ముద్దుగుమ్మ

అందాల పోటీల్లోనూ చైనా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. స్వదేశంలో నిర్వహించిన మిస్ వరల్డ్-2012 పోటీల్లో చైనాకు చెందిన యు వెన్ సియా టైటిల్‌ను గెలుచుకుని డ్రాగన్ సత్తా చాటింది. భారతదేశం నుంచి గట్టి పోటీ ఇచ్చిన వన్యా మిశ్రా కేవలం టాప్ 7 వరకు వచ్చినా.. చివర్లో తడబడింది. చైనాకు మిస్ వరల్డ్ టైటిల్ దక్కడం ఇది రెండోసారి.


గత సంవత్సరపు విజేత వెనిజులాకు చెందిన ఇవియన్ సర్కోస్ చేతులమీదుగా మిస్‌వరల్డ్ కిరీటాన్ని వెన్ సియా అందుకుంది. బీజింగ్‌లోని డాంగ్‌షింగ్ ఫిట్‌నెస్ సెంటర్లో అంగరంగ వైభోగంగా ఈ టైటిల్ ప్రదాన కార్యక్రమం జరిగింది. 23 ఏళ్ల వెన్ ప్రస్తుతం సంగీతాన్ని అభ్యసిస్తోంది. భవిష్యత్తులో సంగీత ఉపాధ్యాయినిగానే స్థిరపడాలనుకుంటోంది. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా మిస్ వేల్స్ సోఫీ మౌల్డ్స్, రెండో రన్నరప్‌గా మిస్ ఆస్ట్రేలియా జెస్సికా కహావతి నిలిచారు.

మిస్ ఇండియా వన్యా మిశ్రా టాప్ 7కు మించి పైకి వెళ్లలేకపోయినా, ఆమెకు 'మిస్ సోషల్ మీడియా', 'బ్యూటీ విత్ ఎ పర్పస్' టైటిళ్లు దక్కడం కొంత ఊరట

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.