ప్రకాశం బ్యారేజిపై 25న టీడీపీ మహాధర్నా
posted on Aug 19, 2012 @ 1:21PM
కృష్ణాడెల్టాకు నీటి విడుదల కోరుతూ ఈ నెల 25న విజయవాడ ప్రకాశం బ్యారేజిపై మహాధర్నా నిర్వహించనున్నట్టు టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం మచిలీపట్నంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ మహాధర్నాలో నాలుగు జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు పాల్గొంటారన్నారు. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లలో పుష్కలంగా నీరున్నా కృష్ణాడెల్టాను బీడుగా మారుస్తున్నారన్నారు. ఆగస్టులో కూడా డెల్టాలో తాగు నీటి ఎద్దడి ఉండటం సిగ్గుచేటని విమర్శించారు.