అసోం అల్లర్ల వెనక పాకిస్తాన్‌ కుట్ర

అసోంలో చెలరేగిన హింసాకాండ వెనక పాకిస్తాన్‌ కుట్ర దాగి ఉందని భారత సర్కారు గుర్తించింది. ఆ దేశానికి చెందిన కొన్ని బ్లాగుల్లో ఉంచిన నకిలీ ఫోటోలే హింసకు కారణమయ్యాయని... హోంశాఖ విచారణలో తేలింది. దీనిపై పాకిస్తాన్‌ను నిలదీసేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. మరోవైపు.. అల్లర్లు క్రమంగా మిగతా ప్రాంతాలకూ పాకుతుండడం ఆందోళన కలిగిస్తోంది..


 

అల్లర్ల వ్యవహారంపై విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టిన హోంశాఖ... వీటికి కారణమైన ఫోటోలు ఎలా వ్యాపించాయన్న దానిపై దృష్టి సారించింది. ఇంటర్‌నెట్‌లోని పలు సైట్లలో కనిపించిన ఈ నకిలీ ఫోటోలు.. పాకిస్తాన్‌ నుంచి అప్‌లోడ్‌ అయినట్లు.. హోంశాఖ కార్యదర్శి ఆర్‌ కే సింగ్‌ ప్రకటించారు. ఎక్కడో భూకంపం, తుఫాను వచ్చినప్పుడు చనిపోయిన వారి ఫోటోలను... అల్లర్లలో చనిపోయిన మైనార్టీలుగా   చూపిస్తూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. వెల్లడించారు. ఇప్పటికే ఈ ఫోటోలు ఉన్న 76 సైట్లను నిలిపివేశామని చెప్పారు.  ఈ విషయంపై వెంటనే పాకిస్తాన్‌ను వివరణ కోరుతామని.. అన్ని స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలని.. హోంశాఖ వర్గాలు అన్నాయి.
 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.