నాల్గోరోజు పాదయాత్రలో నాగలి పట్టిన బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాల్గోరోజు పాదయాత్ర ఈరోజు ఉదయం తురకలపట్నం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఎల్‌జీబీ నగర్‌లో రహదారి పక్కన ఉన్న పంటపొలాలను పరిశీలించి, రైతులతో కలిసి నాగలి పట్టి పొలాన్ని దున్నారు. రైతుల నుంచి చంద్రబాబుకు అపూర్వ స్పందన లభించింది. అక్కడి నుంచి కొగిరి, రాగిమేకపల్లి, రాచూర్, ఎర్రబెంచి మీదుగా గరికమేకపల్లి వరకు చంద్రబాబు పాదయాత్ర సాగనుంది. రాత్రికి గరికమేకపల్లిలో చంద్రబాబు బస చేయనున్నారు. ఈ రోజు దాదాపు 18 కి.మీ వరకు చంద్రబాబు పాదయాత్రగా వెల్లనున్నారు. చంద్రబాబు పాదయాత్ర శుక్రవారం కర్ణాటక ప్రాంతంలో కూడా కొనసాగనుంది. ఆ తరువాత కోగిరకు వెళతారు. అనంతరం రాగిమేకలపల్లి, ఇదే గ్రామానికి అనుబంధంగా ఉన్న బీసీకాలనీ మీదుగా రాచూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 7కిలోమీటర్ల మేరకు కర్ణాటకలో పాదయాత్ర సాగిస్తారు. ఆ తరువాత ఎర్రమంచి మీదుగా రాప్తాడు నియోజకవర్గంలోని గరిమేకలపల్లికి వెళతారు. అక్కడే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువు ఎల్.నారాయణచౌదరి ఇంటిలో బస చేస్తారు.

జగన్ సంపాదనపై జడ్జి ప్రశ్న

ఈ రోజు కోర్ట్ లో వాదనలు వినిపించిన జగన్ న్యాయవాది అరెస్టు అక్రమమని, రాజకీయ కారణాలతో జైలుకు పంపించారని ఆరోపించారు. దీనికి స్పందించిన జడ్జి జగన్ అతి తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించగలిగారని జగన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అలాగే పది రూపాయల ముఖ విలువ కలిగిన షేర్‌లను రూ.350 ఎలా అమ్మారో చెప్పాలని ప్రశ్నించారు. ఇంకా జగన్ కేసుపై సిబిఐకి ఛార్జీషీట్ డెడ్‌లైన్ విధించింది. 2013 మార్చి 31వ తేదిలోగా ఈ కేసును ముగించాలని సిబిఐకి సూచించింది. తరుచూ ఛార్జీషీట్లు వేయవద్దని, ఒక్క ఛార్జీషీట్‌తోనే విచారణ ముగించాలని తెలిపింది. సిబిఐ మరింత సమయం కోరడంతో కోర్టు ఈ డెడ్ లైన్ విధించింది. విచారణ గడువు ముగిసిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని జగన్ కు కోర్టు సూచించింది. జగన్ తరఫున గోపాల సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్‌‌లు, సిబిఐ తరఫున అశోక్ బాన్, మోహన్ పరాశరణ్‌లు కోర్టులో తమ వాదనలు వినిపించారు.

మహేష్‌ బాబు ఓపెన్ చేసిన షాపింగ్‌ మాల్‌ సీజ్

  ఒక రోజు క్రితం అంగరంగ వైభవంగా ప్రారంభమైన కూకట్ పల్లి సౌతిండియా షాపింగ్ మాల్ అనుకోని విపత్తును ఎదుర్కొంది. భారీ స్థాయి ప్రచారంతో, హీరో మహేశ్ బాబు చేతుల మీదుగా గురువారం ప్రారంభమైన ఈ షాపింగ్ మాల్ ను శుక్రవారం జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఏర్పటైందని వారు అంటున్నారు. భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనందున షాపింగ్ మాల్ను సీజ్ చేసినట్లు తెలిపారు. అట్టహాసంగా ప్రారంభమైన షాపింగ్ మాల్ ఇలా హఠాత్తుగా మూతపడటం విచిత్రమే! ఇప్పటి వరకు మహేష్ బాబు అనేక కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. వాటితో ఒప్పందం కుదుర్చుకునే ముందుకు ఇందుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకునే సిబ్బంది అన్ని వివరాలు ఆరా తీసిన తర్వాత, అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటనే మహేష్ బాబు ఓకే చెబుతారు. కానీ సౌతిండియా షాపింగ్ మాల్ విషయంలో మహేష్ బాబు యాడ్స్ చూసుకునే సిబ్బంది ఏమరు పాటుతో వ్యవహరించడం వల్లనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని, నింబంధనలు పట్టించుకోలేదని తెలిస్తే మహేష్ బాబు ఓపెనింగుకు వచ్చే వారే కాదని పలువరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ కు సుప్రీంలో షాక్, నో బెయిల్

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జగన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జగన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో హోరా హోరీ వాదనలు జరిగాయి. జగన్ అరెస్ట్ అక్రమమని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు లాయర్ వాదించారు. అయితే జగన్ అక్రమాస్తులపై దర్యాప్తుకు ఇంకా మూడు నెలల సమయం పడుతుందని, ఇప్పటికే మూడు వేల కోట్ల ఆస్తులను కనిపెట్టామని, వేలాది కోట్ల ఆస్తులను దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. విదేశీ నిధుల ప్రవాహనం దర్యాప్తు కొనసాగుతుందని కోర్టుకు తెలిపారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన హవాలా మనీ మార్గాలను కొన్నింటిని చేధించామని న్యాయవాది మోహన్ పరాశరణ్, అశోక్‌భట్ వాధించారు. జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను తారుమారు చేస్తారన్నారు. జగన్ సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని లాయర్లు కోర్టులో వాదించారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జగన్ ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని వేల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించగలిగారని జగన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు.

జగన్ బెయిల్ పై ఉత్కంఠ, నేడే విచారణ

జగన్ కి బెయిలొస్తుందా రాదా..? రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. సామాన్యులకుకూడా దీనిమీదే ఆసక్తి. శుక్రవారం జరగబోయే విచారణలో జగన్ కి బెయిలొస్తుందని కొందరు, రాదని కొందరు పోటీలుపడుతున్నారు. జగన్ కి బెయిల్ మంజూరౌతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలతో ఉంది. జగన్ వ్యతిరేకవర్గంమాత్రం ఆరునూరైనా బెయిల్ దొరకనే దొరకదంటూ గట్టిగానే ప్రచారం మొదలుపెట్టేసింది. రెండింటిలో ఏదినిజమవుతుందో తెలియని ఉత్మంఠ. గత నెల 28న విచారణ సమయంలో తాము లాయర్‌ను మార్చినందున సమయం కావాలన్న సిబిఐ అభ్యర్దన మేరకు సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. గతంలో బెయిల్‌ పిటీషన్‌పై విచారించిన సుప్రీం సీబీఐ తీరును ప్రశ్నించడం యువనేతకు కలిసొచ్చే అంశమని వారు చెప్తున్నారు. జగన్ తరపున మాజీ సోలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం, సీనియర్ న్యాయవాది అమన్ లేఖి వాదనలు వినిపించనుండగా... సిబిఐ తరపున మోహాన్ జైన్ స్థానంలో మోహాన్ పరాశరన్ వాదించనున్నారు. ఈసారి మోహాన్ పరాశరన్‌కు , గతంలో సిబిఐ తరపున వాదించిన అశోక్ భాన్ సహాయపడనున్నారు.

జగన్ ఆస్తులకు తాళాలేసిన ఈడీ

  ఈడీ ఆస్తుల్ని అటాచ్ చేయడం జగన్ కి ఊహించని మరో ఎదురుదెబ్బ. 51 కోట్ల విలువైన ఆస్తులకు దాదాపుగా ఈడీ తాళాలువేసినట్టే లెక్కని ఆర్ధిక నిపుణులు, న్యాయ నిపుణుల అంచనా.. జనని ఇన్ ఫ్రాస్ట్రక్టర్ కి చెందిన 13 ఎకరాల భూమి, హెటిరో డ్రగ్స్ కి చెంది 36 ఎకరాల భూమి, జగతి పబ్లికేషన్స్ కి సంబంధించిన పధ్నాలుగున్నరకోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను ఈడీ సీజ్ చేసింది. ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సుల్ని తుంగలో తొక్కిన వై.ఎస్ ప్రభుత్వం 75 ఎకరాల భూమిని అయినవాళ్లకు కట్టబెట్టిందని ఈడీ తేల్చింది. దొడ్డిదారిన లాభపడ్డ అరబిందో ఫార్మా, హెటిరో సంస్థలు జగన్ సంస్థల్లో వెనకదారిగుండా దాదాపు 30కోట్ల రూపాయల పెట్టుబడులుపెట్టారని ఈడీ చెబుతోంది. జగన్ ఆక్రమ ఆస్తుల కేసులో మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని ఈడీ నిర్ధారించింది. సిబిఐ ఈ కేసుకి సంబంధించి దాఖలు చేసిన చార్జ్ షీట్లని ఈడీ క్షుణ్ణంగా పరిశీలించింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ తోపాటు తనకి సహకరించిన మరికొందరిచుట్టూ ఉచ్చు మరింతగా బిగిసే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసుల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పీకల్లోతు కూరుకుపోయినట్టేనని కూడా చాలామంది అనుకుంటున్నారు.

జగన్ బెయిల్ పై తారాస్థాయి బెట్టింగులాట

  జగన్ కి బెయిలొస్తుందా రాదా..? రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. సామాన్యులకుకూడా దీనిమీదే ఆసక్తి. శుక్రవారం జరగబోయే విచారణలో జగన్ కి బెయిలొస్తుందని కొందరు, రాదని కొందరు పోటీలుపడి పందాలు కట్టుకుంటున్నారు. ఈ బెట్టింగుల స్థాయి కోట్లరూపాయల్లో జరుగుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరల్డ్ కప్ మ్యాచ్ మీదకూడా ఇంతపెద్దమొత్తంలో బెట్టింగులాట జరగలేదని బెట్టింగుల్లో ఆరితేరినవాళ్లుకూడా నోరెళ్లబెడుతున్నారని సమాచారం. జగన్ కి బెయిల్ మంజూరౌతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలతో ఉంది. జగన్ వ్యతిరేకవర్గంమాత్రం ఆరునూరైనా బెయిల్ దొరకనే దొరకదంటూ గట్టిగానే ప్రచారం మొదలుపెట్టేసింది. రెండింటిలో ఏదినిజమవుతుందో తెలియని ఉత్మంఠ పెరిగిపోవడంతో బెట్టింగు రాయుళ్ల పని మూడుపూలు ఆరుకాయలుగా సాగుతోందని వినికిడి. కొందరు కాస్త తెలివితేటల్ని ఉపయోగించి అయినవాళ్లతోనే రెండువైపులా పందేలుపెట్టి నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ కి కూడా సిద్ధపడి బెట్టింగులు కట్టుకుంటున్నారని గోదావరిజిల్లాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంట్లో ఇద్దరుంటే చెరోపక్క బెట్టింగ్ భారీగా పెట్టేస్తే రెండిట్లో ఏదోఒకటి కచ్చితంగా నిజమవ్వాలిగనక దెబ్బతినకుండా జాగ్రత్తపడొచ్చని చాలామంది పార్టీలకతీతంగా ప్లాన్ చేస్తున్నారనికూడా వినికిడి.

కింగ్‌ఫిషర్ ఇంజనీర్ భార్య ఆత్మహత్య

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లో పనిచేస్తున్న ఓ ఇంజనీర్ కు ఆర్నెల్లుగా జీతాలు రాకపోవడంతో ఆ కుటుంబం అతలాకుతలమైంది. దీంతో ఢిల్లీకి చెందిన ఓ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ ఇంజనీర్ మనస్ భార్య సుస్మితా చక్రవర్తి ( 45) గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. మనస్ చక్రవర్తి పలం ప్రాంతంలోని మంగళపురి కాలనీలోని డీడీఏ ఫ్లాట్‌లో ఉంటున్నారు. మృతురాలు రాసిన సూసైడ్ నోట్‌ ప్రకారం.. “తన భర్తకు గత ఆరు నెలలుగా వేతనం రావడం లేదని, తాము తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాము. తన భర్త, కుమారుడు తనను ఎంతో బాగా చూసుకుంటున్నారు. వారిని తాను ఎంతగానో ప్రేమిస్తున్నాను” అని రాసిపెట్టి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్తకు యాభై ఏళ్లు కాగా, కుమారుడికి పద్దెనిమిదేళ్లు. అతను ప్రస్తుతం అస్సాంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

ప్రేమికుడిపై దాడి, ప్రియురాలిపై అత్యాచారం

చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కైగల్ జలపాతం వద్ద గుర్తు తెలియని దుండగులు ఓ ప్రేమజంటపై దాడి చేశారు. ప్రియురాలిపై అత్యాచారం చేసిన దుండగులు ప్రేమికుడు అడ్డురావడంతో అతనిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ప్రేమికులు ఇద్దరు కైగల్ జలపాతం వద్దకు రావడంతో గుర్తు తెలియని నలుగురు యువకుడి పై దాడి చేసి, అనంతరం వారు యువతిపై అత్యాచారం చేశారు. బాధితుల అరవటంతో చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి వచ్చారు. వారు వచ్చేసరికి నలుగురు యువకులు అక్కడి నుండి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స కోసం వి.కోట ఆసుపత్రికి తరలించారు. బాధితులు కర్నాటక రాష్ట్రంలోని బంగారుపేటకు చెందిన రంజిత, మునిరాజులుగా ఆ ప్రేమికులను గుర్తించినట్లుగా తెలుస్తోంది.

పర్యాటకులకు రక్షణ కరువు?

రాష్ట్రంలో పర్యాటకులకు రక్షణ కల్పించలేని వాతావరణం నెలకొంది.  ప్రత్యేకించి పూర్తిస్థాయి అభివృద్థి చెందిన టూరిస్టు ప్రాంతాలపైనే ప్రభుత్వం దృష్టిసారించింది. దీంతో కొత్తగా అభివృద్థి చెందాల్సిన పర్యాటక ప్రాంతాల గురించి అస్సలు ప్రణాళికే లేకుండా పోయింది. ప్రభుత్వమే ప్రణాళిక రూపొందించుకోకపోవటంతో ఇక్కడ పోలీసుల నుంచి తప్పించుకు తిరిగేవారు ఆశ్రయం పొందుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందని జలపాతాల వద్ద అయితే అస్సలు రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తమిళనాడు వంటి పొరుగురాష్ట్రాలను పరిశీలిస్తే జలపాతాలు వంటి వాటి దగ్గర రక్షణచర్యలు గట్టిగా ఏర్పాటు చేశారు. అందువల్ల అక్కడ మరణాలు, ఇతర క్రైమ్‌ జరిగే అవకాశాలు తక్కువ. రాష్ట్రంలో మాత్రం నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ చిత్తూరు జిల్లా భైరెడ్డిపల్లి మండలం కైగల్‌ జలపాతం వద్ద ఓ ప్రేమజంటను గుర్తుతెలియని కొందరు వేధించారు. కర్నాటకలోని బంగారుపేటకు చెందిన ఆ జంటలోని యువతిపై అత్యాచారం చేశారు.  ఈ జంటను చికిత్స నిమిత్తం వి.కోట ఆసుపత్రికి తరలించారు.

పరిటాల కోటలో చంద్రబాబు పాదయాత్ర

    వస్తున్నా మీకోసం పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన పార్టీ నేతలను, కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందన వస్తుండటంతో 2014 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గురువారం మధ్యాహ్నం పెనుగొండ రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు ఉప్పర్ల సంఘంతో సమావేశమయ్యారు. ఉప్పర్ల సంఘం సభ్యులు తమ సమస్యలను బాబు వద్ద మొరపెట్టుకున్నారు. కాగా 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గురువారం ఉదయం సోమందేపల్లి నుంచి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటాపురం తాండి, రొద్దం దర్గా సర్కిల్, కోనాపురం క్రాస్‌రోడ్స్ మీదుగా మహదేవపురి వరకు యాత్ర సాగనుంది. సాయంత్రం ఎల్‌జీబీ నగర్ క్రాస్‌రోడ్సకు చేరుకుని రాత్రికి అక్కడే బసచేయనున్నారు. ఈరోజు దాదాపు 14 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది.

ప్రేమజంటపై దాడి, ప్రియురాలిపై అత్యాచారం

  చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కైగల్ జలపాతం వద్ద గుర్తు తెలియని దుండగులు ఓ ప్రేమజంటపై దాడి  చేశారు.  ప్రియురాలిపై అత్యాచారం చేసిన దుండగులు ప్రేమికుడు అడ్డురావడంతో అతనిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ప్రేమికులు ఇద్దరు కైగల్ జలపాతం వద్దకు రావడంతో గుర్తు తెలియని నలుగురు యువకుడి పై దాడి చేసి, అనంతరం వారు యువతిపై అత్యాచారం చేశారు. బాధితుల అరవటంతో చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి వచ్చారు. వారు వచ్చేసరికి నలుగురు యువకులు అక్కడి నుండి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స కోసం వి.కోట ఆసుపత్రికి తరలించారు. బాధితులు కర్నాటక రాష్ట్రంలోని బంగారుపేటకు చెందిన రంజిత, మునిరాజులుగా ఆ ప్రేమికులను గుర్తించినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు పాదయాత్రలో జూ.ఎన్టీఆర్

చంద్రబాబు చేస్తున్న వస్తున్నా మీ కోసం పాదయాత్రలో జూ.ఎన్టీఆర్ పాల్గొననున్నారు. మళ్ళీ అన్న గారి కుటుంబం కలుస్తుండటంతోపార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. హరికృష్ణ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో అన్ని విభేదాలు పక్కన పెట్టి యాత్ర ప్రారంభంలో మొత్తం తానై వ్యవహరించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా దూరమే అని అందరూ భావించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడుకు దగ్గరవుతున్నారు. చంద్రబాబు చేపట్టిన 117 రోజుల వస్తున్నా మీకోసం పాదయాత్రలో జూనియర్ పాల్గొననున్నారు. బాబు యాత్ర అనంతపురం, కర్నూలు జిల్లాల తర్వాత మహబూబ్‌నగర్‌లో ఉంటుంది. ఇక్కడకు రాగానే జూనియర్ ఎన్టీఆర్ బాబు యాత్రలో పాల్గొని పార్టీకి అండగా ఉన్నానని, పార్టీతోనే ఉన్నానని కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపనున్నారు. నందమూరి, నారా కుటుంబాలు విభేదాలు పక్కన పెట్టి కలిసి నడిస్తే టిడిపి కార్యకర్తలకు పండగే అని చెప్పవచ్చు.

మహాత్ముడిపై రామ్ గోపాల్ వర్మ వల్గర్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ ఏదో ఒకటి మాట్లాడుతూ ఎప్పుడు వివాదాల్లో ఉండాలనుకుంటాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతు పబ్లిసిటి కోసం పాకులాడుతుంటాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. కాని ఈ సారి వర్మ ఏకంగా మన జాతిపిత మహాత్మాగాంధీ పైన నోరు పారేసుకున్నాడు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అన్న గాంధీజీ బోధనలపై వల్గర్ కామెంట్స్ చేశాడు. దేశ విదేశాల్లో గాంధీజీని మహాత్ముడిగా పొగుడుతుంటే భారతీయుడు అయిన రామ్ గోపాల్ వర్మ ఆయన పై ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేయడం దురదృష్టకరమని గాంధేయవాదులు దుయ్యబడుతున్నారు.  గాంధీజీ పైన వర్మ చేసిన వల్గర్ కామెంట్స్: Am so glad that Gandhijis father had sex with his wife and one of his spermetozoas had become Bapuji I shudder that if Gandhijis father and mother dint have sex all of us poor Indians would have been still under British If Gamdhijis father was a nobody in comparison to Gandhiji does that mean that all fathers don't matter except for their physiologicals? If Gandhijis son Harilal turned out to be such a bum does that prove Gandhijis father was far better than Bapuji as a father? If Gandhiji was the father of the nation than was his father the Grandfather of the nation? If any of u know can u please tell me the name of the name of the grandmother of the nation? Who is the mother of the nation? What did Gandhijis father have that nehrujis mother dint have?  

ముగ్గురు అమ్మాయిలతో గేల్ పార్టీ

వెస్టిండీస్ స్టార్ క్రిస్‌గేల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గేల్‌తోపాటు సహచరులు ఆండ్రీ రస్సెల్, డ్వేన్ స్మిత్‌ల హోటల్ గదుల్లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్ని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన ఈ గాళ్స్‌తో క్రికెటర్లు పార్టీలో మునిగితేలుతుండగా మంగళవారం తెల్లవారుజామున పోలీసుల కంటపడ్డారు. అరెస్టు చేసిన అమ్మాయిల్ని ఆ తర్వాత విడిచిపెట్టారు. ఆటగాళ్లు, టీమ్ అఫీషియల్స్‌కు మాత్రమే కేటాయించిన ఏడో ఫ్లోర్‌లోని గదులకు ఇతరుల్ని అనుమతించరు. కాగా న్యూజిలాండ్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరిన ఆనందంలో ఉన్న విండీస్ ఆటగాళ్లు తమ అతిథుల్ని గదులకు పిలిపించుకోవడం తప్పెలా అవుతుందని హోటల్ యాజమాన్యం ప్రశ్నిస్తోంది. కాగా, ఐసీసీ సూచనల కోసం తాము ఎదురుచూస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.

యడ్యూరప్ప కొత్త పార్టీ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీకి రాజీనామా చేసిన యడ్యూరప్ప కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. దీనికి డిసెంబర్ నెలను ఆయన ముహూర్తంగా నిర్ణయించాడు. బీజేపీతో తనకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని, ఇకపై వేరేపార్టీలో చేరేందుకు తాను ఇష్టపడటం లేదని అందుకే కొత్త పార్టీ మొదలుపెట్టనున్నానని యడ్డి ప్రకటించాడు. బీజేపీలో తనకు తగని అవమానం జరిగిందని, పెద్ద నాయకులే తనను అవమానించారని యడ్డి పేర్కొన్నాడు. వాటిని సహించే శక్తిలేక పార్టీ నుంచి బయటకు వచ్చానని, పదవులు లభించక కాదని ఈ నాయకుడు అంటున్నాడు. ఇప్పడు మళ్లీ పదవి ఇస్తానని బీజేపీ ఆఫర్ చేసినా తిరిగి అక్కడికి వెళ్లేది లేదని స్పష్టంచేశాడు. ఇది పక్కనపెడితే… కుల సమీకరణలపై భారీగా ఆశలు పెట్టుకునే యడ్యూరప్ప పార్టీ స్థాపిస్తున్నాడు.

కుప్పం నుంచి పోటి అంటే కష్టం: నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ నేతగా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే చర్చలు పాదయాత్రతో పాటు మొదలైనాయి. పాదయాత్రలో కొందరు కుప్పం నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నించగా, కుప్పం ప్రజలకు చంద్రబాబు దేవుడు అని, అక్కడి నుండి తాను పోటీ చేస్తే కుప్పం ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. ఆయన రాజకీయాల గురించి పలు విషయాలను మీడియాతో చర్చించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, ఇపుడు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని అన్నారు. నేనెప్పుడూ రాజకీయాల నుంచి వేరు కాలేదని, 1995 నుంచే పార్టీ కోసం పని చేస్తున్నానని అన్నారు. 1999 నుంచి క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నానన్నారు. తన తండ్రి పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఇరువురు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని, వాటిని చెప్పుకునేందుకు బాబు కోసం రాత్రి రెండు గంటల వరకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయిందని వ్యాఖ్యానించారు. పాదయాత్ర జయప్రదం అవుతుందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో నకిలీనోట్ల దందా? ఆకర్షించే మార్జిన్‌మనీ!

నిన్నటి దాకా నకిలీనోట్ల చెలామణి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. గతంలో 40,60శాతం వాటాలపై ఈ నకిలీకరెన్సీ చెలామణి సాగేదట. ఇప్పుడు ఏకంగా 30శాతం చెల్లించి 70శాతం నికరలాభం సొంతం చేసుకోవచ్చనే వ్యాపారసూత్రం నకిలీకరెన్సీ తయారీదారులు ఫాలో అవుతున్నారట. ఈ మార్జిన్‌ మనీ ఎక్కువ మందిని ఆకర్షిస్తోందని సమాచారం. అందుకే ఈ లాభాన్ని సొంతం చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రయత్నాలు విస్తృతమయ్యాయి. ముందుగా 30శాతం చెల్లించి ఆ నకిలీకరెన్సీని సొంతం చేసుకున్న యువకులు కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందంజ వేస్తున్నారు. ప్రత్యేకించి ఎక్కువగా మనీ సర్కులేట్‌ అయ్యే ప్రదేశాలు గుర్తించి వాటిపైనే దృష్టిసారిస్తున్నారు. ప్రధానంగా పెట్రోలుబంకులు, ట్రావెల్‌ ఏజెన్సీలు, రైల్వేకౌంటర్లు తదితరాలపై ఈ యువకులు ఓ కన్నేసి ఉంచారు. తమకు అనుకూలమైన సమయంలో అంటే వృద్ధులు వంటివారు నిర్వహించేటప్పుడు తమ దగ్గర ఉన్న నకిలీ కరెన్సీని అక్కడ అందజేస్తున్నారు. అలానే కొందరు పెట్రోలు బంకు బాయ్స్‌ను కూడా ఎంపిక చేసుకుని వారి ద్వారా కూడా కరెన్సీని విస్తృతంగా చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కూకుట్‌పల్లిలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి రెండు లక్షల రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలోనూ ఈ నకిలీకరెన్సీ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ప్రత్యేకించి అనపర్తి, గొల్లల మామిడాడ ప్రాంతాలకు చెందిన ఒక సామాజికవర్గం ఈ కరెన్సీ చెలామణిలో కీలకపాత్ర పోషిస్తోందని సమాచారం. అయితే ఇటీవల రాజమండ్రి రైల్వేస్టేషనులో కూడా నకిలీకరెన్సీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌, చిత్తూరు జిల్లాల్లో కూడా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ప్రత్యేకించి ఈ నకిలీకరెన్సీని పశ్చిమబెంగాల్‌, ఓడిశా వంటి రాష్ట్రాల నుంచి రవాణా చేస్తున్నారని సమాచారం వెలుగులోకి వచ్చింది. ఏడాది నుంచి ఆరోపణలు వచ్చి నిందితులు దొరికినా పోలీసుశాఖ విచారణలో ముందడుగు వేయలేదు. దీని ఫలితంగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి.

గాంధీజీ పైన వర్మ వల్గర్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ ఏదో ఒకటి మాట్లాడుతూ ఎప్పుడు వివాదాల్లో ఉండాలనుకుంటాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతు పబ్లిసిటి కోసం పాకులాడుతుంటాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. కాని ఈ సారి వర్మ ఏకంగా మన జాతిపిత మహాత్మాగాంధీ పైన నోరు పారేసుకున్నాడు. గాంధీజీ చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అన్న గాంధీజీ పైన వర్మ వల్గర్ కామెంట్స్ చేశాడు. దేశ విదేశాల్లో గాంధీజీని మహాత్ముడిగా పొగుడుతుంటే భారతీయుడు అయిన రామ్ గోపాల్ వర్మ ఆయన పై ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేయడం దురదృష్టకరం.   గాంధీజీ పైన వర్మ చేసిన వల్గర్ కామెంట్స్: Am so glad that Gandhijis father had sex with his wife and one of his spermetozoas had become Bapuji I shudder that if Gandhijis father and mother dint have sex all of us poor Indians would have been still under British If Gamdhijis father was a nobody in comparison to Gandhiji does that mean that all fathers don't matter except for their physiologicals? If Gandhijis son Harilal turned out to be such a bum does that prove Gandhijis father was far better than Bapuji as a father? If Gandhiji was the father of the nation than was his father the Grandfather of the nation? If any of u know can u please tell me the name of the name of the grandmother of the nation? Who is the mother of the nation? What did Gandhijis father have that nehrujis mother dint have?