పరిటాల కోటలో చంద్రబాబు పాదయాత్ర

 

 

వస్తున్నా మీకోసం పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన పార్టీ నేతలను, కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందన వస్తుండటంతో 2014 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గురువారం మధ్యాహ్నం పెనుగొండ రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు ఉప్పర్ల సంఘంతో సమావేశమయ్యారు. ఉప్పర్ల సంఘం సభ్యులు తమ సమస్యలను బాబు వద్ద మొరపెట్టుకున్నారు. కాగా 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గురువారం ఉదయం సోమందేపల్లి నుంచి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటాపురం తాండి, రొద్దం దర్గా సర్కిల్, కోనాపురం క్రాస్‌రోడ్స్ మీదుగా మహదేవపురి వరకు యాత్ర సాగనుంది. సాయంత్రం ఎల్‌జీబీ నగర్ క్రాస్‌రోడ్సకు చేరుకుని రాత్రికి అక్కడే బసచేయనున్నారు. ఈరోజు దాదాపు 14 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.