జగన్ బెయిల్ పై ఉత్కంఠ, నేడే విచారణ

జగన్ కి బెయిలొస్తుందా రాదా..? రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. సామాన్యులకుకూడా దీనిమీదే ఆసక్తి. శుక్రవారం జరగబోయే విచారణలో జగన్ కి బెయిలొస్తుందని కొందరు, రాదని కొందరు పోటీలుపడుతున్నారు. జగన్ కి బెయిల్ మంజూరౌతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలతో ఉంది. జగన్ వ్యతిరేకవర్గంమాత్రం ఆరునూరైనా బెయిల్ దొరకనే దొరకదంటూ గట్టిగానే ప్రచారం మొదలుపెట్టేసింది. రెండింటిలో ఏదినిజమవుతుందో తెలియని ఉత్మంఠ. గత నెల 28న విచారణ సమయంలో తాము లాయర్‌ను మార్చినందున సమయం కావాలన్న సిబిఐ అభ్యర్దన మేరకు సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. గతంలో బెయిల్‌ పిటీషన్‌పై విచారించిన సుప్రీం సీబీఐ తీరును ప్రశ్నించడం యువనేతకు కలిసొచ్చే అంశమని వారు చెప్తున్నారు. జగన్ తరపున మాజీ సోలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం, సీనియర్ న్యాయవాది అమన్ లేఖి వాదనలు వినిపించనుండగా... సిబిఐ తరపున మోహాన్ జైన్ స్థానంలో మోహాన్ పరాశరన్ వాదించనున్నారు. ఈసారి మోహాన్ పరాశరన్‌కు , గతంలో సిబిఐ తరపున వాదించిన అశోక్ భాన్ సహాయపడనున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.