ముగ్గురు అమ్మాయిలతో గేల్ పార్టీ

వెస్టిండీస్ స్టార్ క్రిస్‌గేల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గేల్‌తోపాటు సహచరులు ఆండ్రీ రస్సెల్, డ్వేన్ స్మిత్‌ల హోటల్ గదుల్లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్ని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన ఈ గాళ్స్‌తో క్రికెటర్లు పార్టీలో మునిగితేలుతుండగా మంగళవారం తెల్లవారుజామున పోలీసుల కంటపడ్డారు. అరెస్టు చేసిన అమ్మాయిల్ని ఆ తర్వాత విడిచిపెట్టారు. ఆటగాళ్లు, టీమ్ అఫీషియల్స్‌కు మాత్రమే కేటాయించిన ఏడో ఫ్లోర్‌లోని గదులకు ఇతరుల్ని అనుమతించరు. కాగా న్యూజిలాండ్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరిన ఆనందంలో ఉన్న విండీస్ ఆటగాళ్లు తమ అతిథుల్ని గదులకు పిలిపించుకోవడం తప్పెలా అవుతుందని హోటల్ యాజమాన్యం ప్రశ్నిస్తోంది. కాగా, ఐసీసీ సూచనల కోసం తాము ఎదురుచూస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.