English | Telugu

Karthika Deepam2 : ఆ ఇద్దరిని అలా చూసేసిన జ్యోత్స్న.. కార్తిక్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2'(karthika depam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -110 లో.... జ్యోత్స్న ఫ్రెండ్స్ తన దగ్గరకి వస్తారు. అసలు నీతో పెళ్లి మీ బావకి ఇష్టం లేదు.. ఉంటే ఎంగేజ్ మెంట్ ని వదులుకొని ఆ పాప కోసం వెళ్తాడా అని అంటారు. మీ బావ తో పెళ్లి అనే ఆలోచన చేయకుంటే మంచిదని వాళ్ళ అంటుంటే.. అప్పుడే సుమిత్ర వచ్చి వాళ్లపై కోప్పడుతుంది. అసలు మీరు ఫ్రెండ్సేనా మంచిగా ఆలోచించాలి గానీ ఇలా మాట్లాడుతారా అని కోప్పడుతుంది. మేమ్ తప్పుగా ఏం అన్లేదు.. నిజం మాట్లాడాం.. మేమ్ వెళ్లి పోతున్నామంటూ జ్యోత్స్న ఫ్రెండ్స్ వెళ్లిపోతారు.

Guppedantha Manasu : రంగాను కౌగిలించుకున్న వసుధార...వామ్మో నిజమేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(guppedantha Manasu ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1140 లో..... రంగా అలియాస్ రిషికి తన కుటుంబం గురించి ఫొటోస్ తో వివరిస్తాడు శైలేంద్ర. వసుధర గురించి మాత్రం చెప్పకుండా ఫోటో రివర్స్ పెడతాడు. ఎందుకు వాళ్ళ గురించి చెప్పట్లేదని రిషి అడుగుతాడు. తను ఇప్పుడు స్టోరీ లో లేదని శైలేంద్ర అంటాడు. ఒకవేళ వస్తే అని రిషి అడుగుతాడు. వచ్చే ఛాన్స్ లేదు.. అందుకే చెప్పట్లేదని శైలేంద్ర అంటాడు. రేపు ఎలా ఉండాలో అర్థం అయింది కదా అని రంగాని శైలేంద్ర అడుగగానే.. అర్థం కాలేదు సర్ డైరెక్ట్ చూస్తే అర్థమవుతుందని రిషి అంటాడు. సరే చూపిస్తాను కానీ మన ప్లాన్ తెలిసిపోతుంది కదా అని శైలేంద్ర అంటాడు.

Brahmamudi : అప్పు మనసులో కళ్యాణ్.. అనుకున్నది సాధించిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -475 లో.. నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటని కావ్యని అడుగుతుంది ధాన్యలక్ష్మి. అసలు అది నీకెందుకు మాట ఇవ్వాలని స్వప్న కోప్పడుతుంది. ఏమో మీరు ఇద్దరు ఎలా ఈ ఇంటికి కోడళ్ళు అయ్యారు.. అందరి ఇష్టప్రకారమే కోడళ్ళు అయ్యారా అని రుద్రాణి అంటుంది‌. దాంతో స్వప్న కోప్పడుతుంది. మా అమ్మని ఏమైనా అంటే కొడుతానని రాహుల్ అనగానే.. మరి మా అమ్మని ఏమైనా అంటే నేను ఎలా ఊరుకుంటానని స్వప్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. కళ్యాణ్ మీ అమ్మ గారు చెప్పిన సంబంధం చేసుకుంటేనే ఈ నోళ్లు మూతపడతాయని కావ్య అంటుంది. ఇంకేంటి ఒప్పుకో అని రాజ్ వెటకారంగా మాట్లాడుతాడు. అనామిక చేసిన గాయం మానలేదు. అప్పుడే పెళ్లికి సిద్ధం గా లేనని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు.

ఆ తల్లీ కొడుకులు మళ్ళీ స్క్రీన్ మీదకు..ఖుషీలో ఫాన్స్

జానకి కలగనలేదు సీరియల్ లో అలనాటి అందాల నటి రాశి నటించిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు అమరదీప్ చౌదరి, కోడలిగా ప్రియాంక జైన్ నటించారు. ఐతే అమరదీప్ - రాశి బాండింగ్ చాలా క్యూట్ గా ఉంటుంది. రియల్ మదర్ అండ్ సన్ లా కనిపిస్తారు. ఐతే వీళ్ళు కలిసి ఒక షోలో కనిపించబోతున్నారు. ఆ పిక్స్ ని అమరదీప్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "మళ్ళీ ఇంకోసారి మా అమ్మతో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నాను..థ్యాంక్యూ సో మచ్ అమ్మా..నువ్వు ఒక్క స్మైల్ ఇస్తే చాలు పాజిటివ్ ఎనెర్జీ వచ్చేస్తుంది..ఎప్పటికీ మా అమ్మ నా లైఫ్ లో నా వెన్నెముకలా నిలబడుతుంది" అని పోస్ట్ చేసాడు.​    

ఎప్పటికి మారతార్రా మీరంతా ?

ఆట సందీప్‌ మాత్రమే కాదు ఆయన భార్య జ్యోతి రాజ్‌ కూడా మంచి డ్యాన్సరే. ఇప్పటికే పలు టీవీ షోల్లో వీళ్ళు కలిసే కనిపిస్తారు. సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ వాళ్ళ డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు జ్యోతి రాజ్‌ షేర్‌ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చేసిన మంచి పనికి అభిమానులు, నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలా మంది ఇళ్లల్లో చూస్తే ఆడవాళ్లు ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఉద్యోగం, హాబీస్ అన్నిట్లో ఉంటారు. కానీ ఇంట్లో మగవాళ్ళు, బయట మగవాళ్ళు చాలా చులకనగా చూస్తారు. వన్స్ పెళ్ళై పిల్లలు పుట్టారు అంటే ఆ మదర్స్ కి బాడీ వచ్చేస్తూ ఉంటుంది.

Brahmamudi : పెళ్ళికి రెడీగా లేను.. అప్పు మనసులో ఏం ఉందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'( Brahmamudi ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -474 లో... కళ్యాణ్ ని కావ్య పిలిచి అప్పుని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అయిన నీకు అప్పుపైన ప్రేమ ఏంటి? మీది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే.. అదే విషయం మీ అన్నయ్య నమ్మడం లేదు.. మీరు అప్పుని ప్రేమిస్తున్నారని ఆయన నాతో వాదిస్తున్నారని కావ్య అంటుంది. ఇప్పుడు చెప్పండి మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. అప్పు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటా అంతే అని కళ్యాణ్ అనగానే కావ్య రిలాక్స్ అవుతుంది. అయితే మీరు నాకూ ఇంకొక మాట కూడా ఇవ్వాలని కావ్య అనగానే ఏంటి పెళ్లి కి నేను రావద్దని చెప్తారా అని కళ్యాణ్ అంటాడు.

కెమెరా ముందు అలా హగ్ చేసుకున్న నమిత!

  ​స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -161 లో... సీతాకాంత్ ని రామలక్ష్మి ప్రేమగా చూస్తుంటే అప్పుడే కాఫీ పట్టుకొని మాణిక్యం వస్తాడు. కరెక్ట్ టైమ్ కి వస్తావని అతని పైన సీతాకాంత్ చిరాకు పడతాడు. రామలక్ష్మి నవ్వుకుంటుంది. అసలిప్పుడు నేనేం చేసానని మాణిక్యం అనుకుంటాడు. ఆ తర్వాత సర్ మీతో కలిసి బయటకు వెళ్లి చాలా రోజులు అవుతుంది.. సరదాగా అలా వెళదామా అని రామలక్ష్మి అడుగుతుంది. లేదు రామలక్ష్మి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని సీతకాంత్ చెప్తాడు. దాంతో రామలక్ష్మి డిస్సప్పాయింట్ అవుతుంది.

Guppedantha Manasu : వసుధారకి షాకిచ్చిన రిషి.. శైలేంద్రకి  నిజం తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1139 లో.. వసుధారకి రంగా ఇచ్చిన గిఫ్ట్ ఇస్తుంది రాధమ్మ. అది చూసిన వసుధార.. అసలు ఇందులో ఏముందని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది. అందులో రంగానే రిషి అని చెప్పే జ్ఞాపకాలు ఉంటాయి. వసుధార, రిషి ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఇచ్చుకున్న గిఫ్ట్ లు ఉంటాయి. అవి చూసిన వసు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరే రిషి సర్ ఆని నాకు తెలుసంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంతకీ సర్ ఎక్కడికి వెళ్లారని వసుధార అనుకుంటుంది. మరోవైపు రిషిగా నటించడం కోసం శైలేంద్రతో రంగా వెళ్తాడు.

నాకూ ఉండుంటే బాగుండేది కదా అనిపిస్తోంది

త్వరలో ఫ్రెండ్ షిప్ డే రాబోతోంది. ఇక ఈ కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ రెడీ ఐపోయింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఎవరి ఫ్రెండ్స్ తో వాళ్ళు వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇక ఇందులో ఆది కనిపించలేదు. కానీ పంచ్ ప్రసాద్ చాన్నాళ్ల తర్వాత కనిపించాడు. ఇక ప్రసాద్ రాగానే ఇంద్రజ డైలాగ్ వేసింది " ప్రసాద్ గారు ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా" అనేసరికి "మళ్ళీ రవ్వొద్దు" అనా అండి అని ప్రసాద్ పంచ్ వేసాడు. దానికి ఇంద్రజ పెట్టింగ్ ఫేస్ మాములుగా లేదు. ఇక ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏమిటి అని ఇంద్రజ అడిగేసరికి "తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్లేవారు ఫ్రెండ్, పీకల్దాకా తాగించేవాడు బెస్ట్ ఫ్రెండ్" అంటూ ఒక నాటీ అర్ధం చెప్పాడు నాటీ నరేష్. తర్వాత ఆదర్శ్, అన్షు కలిసి "నీ స్నేహం" మూవీలోంచి ఫ్రెండ్ షిప్ సాంగ్ కి చాలా క్యూట్ గా డాన్స్ చేసారు.