English | Telugu

ఎమోషన్ సీన్స్ చేసేటప్పుడు రజనీకాంత్, విజయ్ సేతుపతిని గుర్తుచేసుకోండి



గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి సర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ముఖేష్ రిషికి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. ఐతే రిషి సర్ ని ఒక అభిమాని చిన్న సలహా ఇచ్చారు. "సార్ నేను ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను..సార్ మీరు ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ మీద ద్రుష్టి పెట్టాలి, ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు మీరు లుక్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు.. అందంగా కనిపించడం ముఖ్యం కాదు అన్ని సీన్లలో ఎమోషన్ పండించాలి.. అప్పుడే జనాలు మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ కనెక్షన్ లేకపోతె ఒక పాత్ర ఎలివేట్ అవ్వదు.. ఒకసారి మీరే చూడండి విజయ్ సేతుపతి , రజనీకాంత్ వంటి వాళ్ళు ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు తమ లుక్స్ గురించి పట్టించుకోరు కానీ వారు ఎమోషన్స్‌ని పండించేసి జనాలను ఆకట్టుకుంటారు.

మీరు కూడా అలా చేయాలని ఆశిస్తున్నాను.. అలా చేస్తే భవిష్యత్తులో బాగా రాణిస్తారు. " అంటూ అద్భుతమైన సలహా ఇచ్చారు. రిషి సర్ చూస్తే చాలు ఆడియన్స్ గుండెల్లో గులాబీలు పూసినట్టు ఫీలవుతారు. రిషి, వసుధార రోల్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరిని తెలుగు అడియన్స్ గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తారు. అటు సోషల్ మీడియాలో కూడా వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది. మరి రిషి తన ఫ్యాన్ ఇచ్చిన సలహా చదివి ఫాలో అవుతాడా చూడాలి.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.