English | Telugu

ఎంత అరిస్తే అంత లేస్తుంది...

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రతీ వారం వెరైటీ సెగ్మెంట్స్ తో ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇందులో రష్మీ పెట్టె కాన్సెప్ట్స్ కి ఎవ్వరైనా పడీపడీ నవ్వాల్సిందే. అలాంటి ఒక కాన్సెప్ట్ ని రష్మీ డిజైన్ చేసింది "అదే ఎంత అరిస్తే అంత లేస్తుంది" అంటే ఇందులో బూతేమీ లేదు. ఈ షోలో ఆది అండ్ టీమ్ తో ఈ గేమ్ ఆడించింది. ముందు ఉమాదేవిని పిలిచింది రష్మీ .. గట్టిగా అరవమని చెప్పింది. అలా ఎంత గట్టిగా అరిస్తే అంతలా ఆ స్పీకర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అదన్నమాట అసలు రష్మీ మాటకు అర్ధం. ఐతే ఉమాదేవి హాఫ్ సెంచరీ దాటేలా అరిచింది. ఆ తర్వాత వీణాని పిలిచాడు ఆది. ఒక్క గట్టి అరుపుతో 50 స్కోర్ చేసింది. దాంతో ఆది వేసిన డైలాగ్ మాములుగా లేదు. "ఒక్క అరుపుకే 50 కొట్టావంటే" అన్నాడు. దానికి సిగ్గుపడిపోయింది వీణ. తర్వాత మళ్ళీ అరిచి 80 స్కోర్ కొట్టింది. ఫైనల్ గా మహతిని  పిలిచాడు.

పృథ్వీ లఫూట్ గేమ్ స్టార్ట్ చేశాడు.. వార్నింగ్గా బొక్కా!

బిగ్ బాస్ హౌస్ లో సీజన్-5 లోని టాస్క్ ని తీసుకొచ్చాడు బిగ్ బాస్ అదే ప్రభావతి గేమ్. ఈ సారి ప్రభావతి (కోడి) 2.0 గా కాస్త బొద్దుగా ఎంట్రీ ఇచ్చింది. నేను అప్పుడప్పుడు గుడ్లను పంపిస్తాను. వాటిని జాగ్రత్తగా కాపాడాలి.. ఏ టీమ్ అయితే ఎక్కువ గుడ్లు తిరిగి ఇస్తారో వాళ్లకి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయంటూ ప్రభావతి చెప్పింది. దీంతో బుట్టలు పట్టుకొని కంటెస్టెంట్స్ రెడీ అయిపోయారు. ఈ టాస్కు మొదలుకాగానే పృథ్వీ అయితే రెచ్చిపోయాడు. ఆడ మగా తేడా లేకుండా ఒక్కొక్కరిని విసిరి పారేశాడు. దీంతో పృథ్వీని ఆపడానికి నబీల్, అభయ్, ఆదిత్య ముగ్గురూ ట్రై చేశారు. ఇక మధ్యమధ్యలో యష్మీ కూడా ట్రై చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన పృథ్వీ.. ఆదిత్య మెడ పట్టుకొని ఓ పక్కకి విసిరేశాడు. దీంతో మీరు నా నెక్ ప్రెస్ చేసి తిప్పేశారు.. ఇది కరెక్ట్ కాదంటూ ఆదిత్య కాసేపు అరిచాడు. అయిన సరే పృథ్వీ వెనక్కి తగ్గలేదు. ఇక పృథ్వీని సోనియా కమాన్ కమాన్ అంటు రెచ్చగొట్టింది.

Brahmamudi : ఏ భర్త ఇవ్వని ఆఫర్ భార్యకి ఇచ్చిన రాజ్..  షాక్ లో కావ్య!

స్టార్ మా టీవీలో  ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -518 లో.....ఇందిరాదేవి సీతారామయ్యలు కావ్య దగ్గరికి వస్తారు. తను రానని చెప్పడంతో తిరిగివెళ్ళిపోతారు. ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్లేసరికి అందరూ కావ్య కోసం వెయిట్ చేస్తుంటారు. కావ్య రాకపోవడంతో ఆ మహారాణి ఎక్కడ కార్ లో ఉందా కార్ డోర్ నేనే తీసి తనని తీసుకొని రావాలా అని రాజ్ వెటకారంగా మాట్లాడతాడు. కావ్య ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. రానని చెప్పిందని ఇందిరాదేవి చెప్తుంది. నాకు తెలుసు తనకి పొగరు అని నేను ఇప్పుడు వెళ్లి కాళ్ళు పట్టుకొని రమ్మని బ్రతిమాలాలా అని రాజ్ అంటాడు. నువ్వు వెళితే కావ్య వస్తుందని ఇందిరాదేవి చెప్తుంది.

Eto Vellipoyindhi Manasu : యాగం ఆపడానికి దుష్టశక్తులు ప్రయత్నం.. మరి అది జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 204 లో.....యాగం ఆపాలని శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. శ్రీలత యాగం పనులు చేస్తుంటే.. మాణిక్యం వద్దని అనడం తో మాణిక్యాన్ని రెచ్చగొట్టి యాగం ఆపాలని శ్రీవల్లి అనుకుంటుంది. మాణిక్యంతో మా అత్తయ్యతో అలా అంటావా అని అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. చూడండి బావ గారు అత్తయ్యని అలా అన్నాడంటూ చెప్తుంది.. నేను అలా అనలేదని మాణిక్యం అంటాడు. అప్పుడే స్వామిజీ కలుగుజేసుకుని అలా అంటే తప్పేంటి ఇది పవిత్రమైంది.. అందుకే అందరు ముట్టుకోకుడదు అన్నాడని అనగానే.. అందరు సైలెంట్ అయిపోతారు.

ఫిదా మూవీలో సాయి పల్లవి కి డబ్బింగ్...ఆ బాడ్కోని నేనే 

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. శివాజీ రావడమేమో కానీ కమెడియన్స్ లో నిద్రపోతున్న జోష్ ని నిద్రలేపాడు. దాంతో వాళ్ళు కామెడీ స్కిట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఈ షోలో తాగుబోతు రమేష్ తనను తాను తిట్టుకున్నాడు. ఎందుకంటే సాయి పల్లవి అంటే తనకు ఎంతో ఇష్టమట. ఎంత అందంగా ఉంటది..ఫిదా సినిమాలో "బాడ్కో బలిసిందారా" అంటది కదా ఆ బాడ్కోని నేనే" అంటూ తెగ సంబరపడిపోతూ ఏంటేంటో వాగేశాడు. ఈ స్కిట్ ఇలా ఉండబోతుంటే బులెట్ భాస్కర్- రష్మీ కలిసి ఒక స్కిట్ వేశారు "బయట వర్షం వస్తుంది జాగ్రత్త" అంటాడు భాస్కర్.

జానీ మాస్టర్ వివాదంపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందన...

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని.. అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్న యువతి ఫిర్యాదు చేసిన  సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం అందరిని ఆలోచింపచేసేలా చేస్తుంది. ఈ విషయంలో చిన్మయి శ్రీపాద తన స్పందనను ట్వీట్ చేసింది. తానూ గమనించిన విషయాలను కూడా చెప్పింది. "జానీ  ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నారనేది ముఖ్యం కాదు. రేపిస్టులు, నేరస్థులు ఈ దేశంలో ప్రతి పార్టీలోనూ ఉన్నారు. అతను ఎవరి ఫ్యాన్ అన్న విషయం కూడా ముఖ్యం కాదు. నేషనల్ అవార్డు విన్నరా కాదా అన్నది కూడా ఇక్కడ ముఖ్యం కాదు.

Eto Vellipoyindhi Manasu : అడుగడుగునా యాగానికి అడ్డంకులే.. భార్యాభర్తలు కలిసి పూర్తిచేయగలరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -203 లో...... రామలక్ష్మి మోకాళ్ళ పై ప్రదక్షిణలు చేస్తుంటే అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఇలా పీడ కల వచ్చింది అందుకే ఇలా చేస్తే మంచి జరుగుతుందని, ప్లీజ్ ఆపకండి అని రామలక్ష్మి అంటుంది. ఏం చేసిన మీ గురించి కదా బాబు ఆపకండి అని సుజాత అనగానే.. సరే అని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి ప్రదక్షిణ పూర్తి చేస్తుంది. శ్రీవల్లి తన ముందు కొబ్బరి చిప్పలు వేస్తుంది దానిపై కాలు వెయ్యడంతో గుచ్చుకొని రక్తం వస్తుంది.