English | Telugu

Krishna Mukunda Murari : ఆదర్శ్ పంతం.. వాళ్ళని దెయ్యమై వేధిస్తున్న ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -422 లో.. ఆదర్శ్ అన్న మాటలకి కృష్ణ బాధపడుతుంటే.. అప్పుడే నందు వచ్చి అన్నయ్య అన్న మాటలకి బాధపడుతున్నావా అని అడుగుతుంది. నేను నా సంతోషం కోసమే ఇలా చేసానా అని నందుతో కృష్ణ చెప్తు బాధపడుతుంది. ఆదర్శ్ అన్నయ్య తప్ప నిన్ను ఎవరు తప్పుగా ఏం అనుకోవట్లేదు.. మాకు తెలుసు కదా నువ్వు ఎలాంటి దానివోనని నందు అంటుంది.

ఆ తర్వాత ముకుంద దెయ్యంగా వచ్చిందన్న భయంలోనే మధు ఉంటాడు. మాకు ఎవరికి కన్పించని తను నీకే ఎందుకు కన్పిస్తుందని నందు అంటుంది. ఆ తర్వాత అందరు కలిసి అలాంటిదేం లేదు నువు వెళ్లి వదిలేసి వచ్చిన మందు తాగుపో అని చెప్తారు. కాసేపటికి కృష్ణ దగ్గరకి మురారి వచ్చి.. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, జరిగిపోయిన దానిని మనం మార్చలేం కదా అని మురారి అంటాడు. రేపు హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్తున్నామని కృష్ణకి మురారి చెప్తాడు. ఆ తర్వాత ఆదర్శ్ డ్రింక్ చేస్తుంటే అప్పుడే సుమలత వచ్చి.. ఎందుకు అందరిపై ద్వేషం పెంచుకుంటున్నావని అడుగుతుంది. నువ్వు ఇలా చేస్తే మీ అమ్మ ఏం అనుకుంటుందని సుమలత అనగానే.. మా అమ్మకి జరిగిన మోసం తెలిసి దానికి కారణమైన వాళ్ళ సంగతి చెప్తుందని ఆదర్శ్ అంటాడు.

మరుసటి రోజు ఉదయం కృష్ణని మురారి లేపి కాఫీ ఇస్తాడు. ఆ తర్వాత రేవతి దగ్గరికి ఆదర్శ్ వచ్చి.. నా దగ్గరికి వచ్చి టీ ఇవ్వాలంటే బయపడుతున్నారా అని టీ తీసుకొని తాగుతాడు. అందరు ఉన్నారు ఆదర్శదంపతులు ఎక్కడ అని అనగానే.. మళ్ళీ మొదలు పెట్టావా అని నందు అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి వస్తారు. మళ్ళీ ఏదో ఒకటి కృష్ణని ఆదర్శ్ అంటూనే ఉంటాడు. మురారికి కోపం వస్తుంది. ఆ తర్వాత కృష్ణ మురారి హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్తారు. దార్లో వెళ్తుంటే కృష్ణ చీర బైక్ లో ఇరుక్కొని కిందపడతారు. కృష్ణకి చిన్న గాయం అవుతుంది. ముకుంద కార్ లో నవ్వుతు వెళ్తుండడం మురారి చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.