Read more!

English | Telugu

Krishna Mukunda Murari : ఆదర్శ్ పంతం.. వాళ్ళని దెయ్యమై వేధిస్తున్న ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -422 లో.. ఆదర్శ్ అన్న మాటలకి కృష్ణ బాధపడుతుంటే.. అప్పుడే నందు వచ్చి అన్నయ్య అన్న మాటలకి బాధపడుతున్నావా అని అడుగుతుంది. నేను నా సంతోషం కోసమే ఇలా చేసానా అని నందుతో కృష్ణ చెప్తు బాధపడుతుంది. ఆదర్శ్ అన్నయ్య తప్ప నిన్ను ఎవరు తప్పుగా ఏం అనుకోవట్లేదు.. మాకు తెలుసు కదా నువ్వు ఎలాంటి దానివోనని నందు అంటుంది.

ఆ తర్వాత ముకుంద దెయ్యంగా వచ్చిందన్న భయంలోనే మధు ఉంటాడు. మాకు ఎవరికి కన్పించని తను నీకే ఎందుకు కన్పిస్తుందని నందు అంటుంది. ఆ తర్వాత అందరు కలిసి అలాంటిదేం లేదు నువు వెళ్లి వదిలేసి వచ్చిన మందు తాగుపో అని చెప్తారు. కాసేపటికి కృష్ణ దగ్గరకి మురారి వచ్చి.. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, జరిగిపోయిన దానిని మనం మార్చలేం కదా అని మురారి అంటాడు. రేపు హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్తున్నామని కృష్ణకి మురారి చెప్తాడు. ఆ తర్వాత ఆదర్శ్ డ్రింక్ చేస్తుంటే అప్పుడే సుమలత వచ్చి.. ఎందుకు అందరిపై ద్వేషం పెంచుకుంటున్నావని అడుగుతుంది. నువ్వు ఇలా చేస్తే మీ అమ్మ ఏం అనుకుంటుందని సుమలత అనగానే.. మా అమ్మకి జరిగిన మోసం తెలిసి దానికి కారణమైన వాళ్ళ సంగతి చెప్తుందని ఆదర్శ్ అంటాడు.

మరుసటి రోజు ఉదయం కృష్ణని మురారి లేపి కాఫీ ఇస్తాడు. ఆ తర్వాత రేవతి దగ్గరికి ఆదర్శ్ వచ్చి.. నా దగ్గరికి వచ్చి టీ ఇవ్వాలంటే బయపడుతున్నారా అని టీ తీసుకొని తాగుతాడు. అందరు ఉన్నారు ఆదర్శదంపతులు ఎక్కడ అని అనగానే.. మళ్ళీ మొదలు పెట్టావా అని నందు అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి వస్తారు. మళ్ళీ ఏదో ఒకటి కృష్ణని ఆదర్శ్ అంటూనే ఉంటాడు. మురారికి కోపం వస్తుంది. ఆ తర్వాత కృష్ణ మురారి హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్తారు. దార్లో వెళ్తుంటే కృష్ణ చీర బైక్ లో ఇరుక్కొని కిందపడతారు. కృష్ణకి చిన్న గాయం అవుతుంది. ముకుంద కార్ లో నవ్వుతు వెళ్తుండడం మురారి చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.