English | Telugu

Brahmamudi : అగ్నిసాక్షిగా ప్రమాణం చేయని రాజ్.. తనని అపర్ణ కోడలిగా అంగీకరించగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -361 లో.. నాపై కోపంతో కావ్యకి బాధ్యతలు అప్పజెప్పింది కానీ అసలు కావ్య అంటే మా అక్కకి ఇష్టం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. నగలు ఇచ్చి మళ్ళీ తీసుకుంది. ఇంతవరకు ఇవ్వలేదు దీన్ని బట్టే తెలుస్తుందని ధాన్యలక్ష్మి అంటుంది. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదంటూ అపర్ణ కోపంగా లోపలికి వెళ్లి నగలు తీసుకొని వస్తుంది.

ఆ రుద్రాణికి సపోర్ట్ చేసి మాట్లాడినందుకు అనవసరంగా ఆ కావ్య నగలు వచ్చేలా చేసినట్టు అయిందని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత కావ్యకి నగలు ఇచ్చి అపర్ణ వెళ్ళిపోతుంది. అపర్ణ గదిలోకి కావ్య వస్తుంటే.. నీకు ఎంత దైర్యం నా గదిలోకి వస్తున్నావంటూ అపర్ణ కోప్పడుతుంది. కావ్య వెళ్లిపోతుంటే ఎందుకు వచ్చావ్? ఎందుకు వెళ్తున్నావ్ అంటూ అడుగుతుంది. మీరు నన్ను కోడలిగా ఒప్పుకున్నారా లేద అనే డౌట్ ఉండేది.. సమాధానం దొరికింది.. అందుకే వెళ్తున్నానని కావ్య అంటుంది. మీ గదిలోకి వచ్చే వీలు లేదు. అలాంటిది మీ మనసులో కోడలిగా స్థానం ఇస్తారని ఎలా అనుకుంటానని కావ్య అంటుంది. నిన్ను ఎప్పుడు కోడలిగా ఒప్పుకోను.. నువ్వు ఈ ఇంటి కోడలు స్థానంలో ఉన్నావ్ కాబట్టి నువు ఈ నగలు వేసుకొని తీరాలని అపర్ణ అంటుంది. ఆ తర్వాత కనకానికి కావ్య ఫోన్ చేసి ఈ రోజు మా పెళ్లి రోజు రాత్రి పార్టీకి మా ఆయన రమ్మని చెప్పారని కావ్య చెప్తుంది. ఆ తర్వాత కావ్య పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.


మరొకవైపు ధాన్యలక్ష్మి, రుద్రాణి ఇద్దరు అపర్ణ దగ్గరకు వెళ్లి.. కావ్య వచ్చింది కానీ రాజ్ ఇంకా రాలేదు. తనకి ఈ పూజ ఇష్టం లేదేమోనని అనగానే.. నేను వెళ్లి తీసుకొస్తానంటూ అపర్ణ వెళ్తుంది. ఆ తర్వాత కావ్య, రాజ్ లు పూజ చేస్తారు. మీరు అగ్నిసాక్షిగా ప్రమాణం చేయండి అని పంతులు గారు చెప్పగానే.. నువ్వు హారతి పట్టుకో అపర్ణ అని ఇందిరాదేవి చెప్తుంది.. కావ్య అగ్నిపై చెయ్ పెడుతుంది. రాజ్ కావ్య విడాకుల పత్రాలు ఇచ్చింది గుర్తుకు చేసుకుంటూ తను అగ్నిపై చెయ్ పెట్టబోతుంటే.. అపర్ణ హారతి పళ్లెం కిందకి పడేస్తుంది. అయ్యో వేడి ఎక్కువ అయి చేయి కాలిందని‌ అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ అగ్నిసాక్షిగా ప్రమాణం చెయ్ అని ఇందిరాదేవి చెప్తుంది. నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉంది అంటూ రాజ్ వెళ్లిపోతాడు. కాసేపటికి పార్టీకి ఇంకా రెడీ అవ్వలేదా అని అనుకుంటు కావ్య దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. తరువాయి భాగంలో కావ్య విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టి నాకు ఇచ్చిందని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.