English | Telugu

Brahmamudi : అగ్నిసాక్షిగా ప్రమాణం చేయని రాజ్.. తనని అపర్ణ కోడలిగా అంగీకరించగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -361 లో.. నాపై కోపంతో కావ్యకి బాధ్యతలు అప్పజెప్పింది కానీ అసలు కావ్య అంటే మా అక్కకి ఇష్టం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. నగలు ఇచ్చి మళ్ళీ తీసుకుంది. ఇంతవరకు ఇవ్వలేదు దీన్ని బట్టే తెలుస్తుందని ధాన్యలక్ష్మి అంటుంది. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదంటూ అపర్ణ కోపంగా లోపలికి వెళ్లి నగలు తీసుకొని వస్తుంది.

ఆ రుద్రాణికి సపోర్ట్ చేసి మాట్లాడినందుకు అనవసరంగా ఆ కావ్య నగలు వచ్చేలా చేసినట్టు అయిందని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత కావ్యకి నగలు ఇచ్చి అపర్ణ వెళ్ళిపోతుంది. అపర్ణ గదిలోకి కావ్య వస్తుంటే.. నీకు ఎంత దైర్యం నా గదిలోకి వస్తున్నావంటూ అపర్ణ కోప్పడుతుంది. కావ్య వెళ్లిపోతుంటే ఎందుకు వచ్చావ్? ఎందుకు వెళ్తున్నావ్ అంటూ అడుగుతుంది. మీరు నన్ను కోడలిగా ఒప్పుకున్నారా లేద అనే డౌట్ ఉండేది.. సమాధానం దొరికింది.. అందుకే వెళ్తున్నానని కావ్య అంటుంది. మీ గదిలోకి వచ్చే వీలు లేదు. అలాంటిది మీ మనసులో కోడలిగా స్థానం ఇస్తారని ఎలా అనుకుంటానని కావ్య అంటుంది. నిన్ను ఎప్పుడు కోడలిగా ఒప్పుకోను.. నువ్వు ఈ ఇంటి కోడలు స్థానంలో ఉన్నావ్ కాబట్టి నువు ఈ నగలు వేసుకొని తీరాలని అపర్ణ అంటుంది. ఆ తర్వాత కనకానికి కావ్య ఫోన్ చేసి ఈ రోజు మా పెళ్లి రోజు రాత్రి పార్టీకి మా ఆయన రమ్మని చెప్పారని కావ్య చెప్తుంది. ఆ తర్వాత కావ్య పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.


మరొకవైపు ధాన్యలక్ష్మి, రుద్రాణి ఇద్దరు అపర్ణ దగ్గరకు వెళ్లి.. కావ్య వచ్చింది కానీ రాజ్ ఇంకా రాలేదు. తనకి ఈ పూజ ఇష్టం లేదేమోనని అనగానే.. నేను వెళ్లి తీసుకొస్తానంటూ అపర్ణ వెళ్తుంది. ఆ తర్వాత కావ్య, రాజ్ లు పూజ చేస్తారు. మీరు అగ్నిసాక్షిగా ప్రమాణం చేయండి అని పంతులు గారు చెప్పగానే.. నువ్వు హారతి పట్టుకో అపర్ణ అని ఇందిరాదేవి చెప్తుంది.. కావ్య అగ్నిపై చెయ్ పెడుతుంది. రాజ్ కావ్య విడాకుల పత్రాలు ఇచ్చింది గుర్తుకు చేసుకుంటూ తను అగ్నిపై చెయ్ పెట్టబోతుంటే.. అపర్ణ హారతి పళ్లెం కిందకి పడేస్తుంది. అయ్యో వేడి ఎక్కువ అయి చేయి కాలిందని‌ అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ అగ్నిసాక్షిగా ప్రమాణం చెయ్ అని ఇందిరాదేవి చెప్తుంది. నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉంది అంటూ రాజ్ వెళ్లిపోతాడు. కాసేపటికి పార్టీకి ఇంకా రెడీ అవ్వలేదా అని అనుకుంటు కావ్య దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. తరువాయి భాగంలో కావ్య విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టి నాకు ఇచ్చిందని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.