English | Telugu

Karthika Deepam2 : వాళ్ళిద్దరి పెళ్లి చేసిన దీప.. షాక్ లో కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -159 లో.... శ్రీధర్ ని దీప లోపలికి రాకుండా చేసి.. స్వప్న, శ్రీకాంత్ ల పెళ్లి ఆగిపోయేలా చేస్తుంది. పెళ్లి కొడుకు అమ్మాయి పోయే ఆస్తి పోయే అంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళండి అని దీప అనగానే.. ఇప్పుడు మా డాడ్ ని ఎలా ఆపారో తెలియదు కానీ ఆపారు.. కానీ ఇప్పుడు కాకపోయినా మళ్ళీ నాకు పెళ్లి చేస్తాడని స్వప్న అనగానే.. ఇప్పుడు మా పెళ్లి చేస్తేనే దీనికి సొల్యూషన్ అని కాశీ అంటాడు. దాంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత మాకు ఇప్పుడు పెళ్లి చెయ్యండి అంటూ దీపని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు.

Eto Vellipoyindhi Manasu : అనుకోకుండా ముద్దు పెట్టుకున్న భార్య.‌. ఆ ప్రాజెక్ట్ ఎవరికంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -210 లో.....కంపెనీ బోర్డు మెంబర్ శ్రీలత వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. మొన్న మనం అనుకున్న ప్రాజెక్ట్ కి రేపే బిట్ వేస్తున్నారు. సీతాకాంత్ కీ కాకుండా వేరే వాళ్లకు బిట్ వచ్చేలా చేస్తే మనకి టెన్ పర్సంట్ కమిషన్ ఇస్తానని అన్నారని అతను చెప్తాడు. సీతాకాంత్ బిట్ వెయ్యడానికి వెళ్తే కచ్చితంగా ఆ బిట్ తనకి వస్తుందని అతను అంటాడు. తను రాకుండా నేను చూస్తాను కదా అని శ్రీలత అంటుంది. వాళ్ళ మాటలన్నీ దూరం నుండి రామలక్ష్మి వింటుంది. మీ ప్లాన్ లో మీరు ఉన్నారు.. నా ప్లాన్ లో నేను ఉంటానని రామలక్ష్మి అనుకుంటుంది.

Eto Vellipoyindhi Manasu : అత్తకి వార్నింగ్ ఇచ్చిన కోడలు.. కౌంట్ డౌన్ మొదలైందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -209 లో.....సీతాకాంత్ డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. అప్పుడే శ్రీలత ఇంటికి వస్తుంది. అమ్మ గుడికి వెళ్ళావా అని సీతాకాంత్ అడుగుతాడు. అవును నువ్వు కోలుకుంటే వస్తానని మొక్కుకున్నానని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి శ్రీవల్లి హారతి ఇస్తుంది‌. అందరు ఇంట్లోకి వెళ్తారు. మీరు ఎక్కువసేపు నిల్చొని ఉండకండి. రెస్ట్ తీసుకుండి అని లోపలికి పంపిస్తుంది. ఆ తర్వాత ఈ ఎటాక్ కి కారణం మీరే అని నాకు డౌట్ ఉందని శ్రీలతతో రామలక్ష్మి మాట్లాడుతుంది. మీరు ఎంత నిజం దాచాలని చూసిన నిజం దాగదని రామలక్ష్మి అంటుంది.