English | Telugu

నీతోనే డాన్స్ సీజన్ 2 రెడీ...

నీతోనే డాన్స్ 2 . 0 రెడీ ఐపోయింది. ఇక డాన్స్ లవర్స్ కి పండగే పండగ. ఈ షో నెక్స్ట్ సీజన్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. దీనికి ఇంతకుముందులాగే శ్రీముఖి హోస్ట్ గా చేస్తోంది. ఈ నెల 23 న గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది ఈ సీజన్. అలాగే ప్రతి శని-ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. ఇందులో 10 జోడీలను తీసుకొచ్చారు. మళ్ళీ జడ్జ్ గా రాధ, సదా, తరుణ్ మాష్టర్ వచ్చేసారు. జోడీస్ గా మానస్-శుభశ్రీ రాయగురు, నయని పావని-ప్రిన్స్ యావర్, విశ్వ-నేహా, బాలాదిత్య -పూజా మూర్తి, దర్శినిగౌడ-పృథ్వీ శెట్టి, విష్ణు-వరలక్ష్మి, ఏక్ నాథ్-హరిక ప్రస్తుతానికి ఈ జంటలు తెలుస్తున్నాయి. ఇక మరో మూడు జంటలు ఎవరు అని తెలియాల్సి ఉంది.

ఈ జంటలు చేసిన పెర్ఫామెన్స్ మాములుగా లేదు. మంచి మాస్ మసాలా స్టెప్పులతో, రొమాంటిక్ డాన్స్ లతో అదరగొట్టారు. ఇలా కొంతమంది బిగ్ బాస్ సీజన్ 7 వాళ్ళు కొంతమంది సీరియల్ యాక్టర్స్ కనిపించరు. నీతోనే డాన్స్ సీజన్ 1 మంచి ఎంటర్టైన్ తో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సీజన్ 1 ఆట సందీప్-జ్యోతి రాజ్ టైటిల్ ని గెలుచుకున్నారు. ఇక ఈ సీజన్ 2 ప్రోమోలో మానస్ ని ఆట పట్టించింది శ్రీముఖి. "డ్యాన్స్ షో కదా మరి.. రొమాన్స్‌లు ఉంటాయి.. మన వైఫ్‌కి ఓకేనా " అనేసరికి "మన వైఫ్ ఏంటి" అంటూ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు మానస్. ఐతే సీజన్ 1 లో నటరాజ్ మాష్టర్ తో ఐన గొడవలు చూసాం.. ఆయన మంచి కంటెంట్ ఇచ్చారు. మరి ఈ సీజన్ లో చూడబోతే కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు. అంత గొడవలు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. మరి ఆ గొడవలు పెట్టే కాండిడేట్ ఎవరై ఉంటారు అని ఆడియన్స్ ఆలోచిస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.