గాయత్రీ దేవి హత్యకు కీలకంగా మారిన తిలోత్తమ గాజు
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. జరగబోయేది ముందే పసిగట్టే వరం వున్న ఓ యువతి కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. మర్డర్మిస్టరీ, ఆత్మలు మళ్లీ రావడం, తమని హత్య చేసిన వారు ఎవరో నయనికి హింట్ ఇవ్వడం వంటి ఆసక్తికర అంశాల నేపథ్యంలో ఈ సీరియల్ ని రూపొందించారు. ఆద్యంతం ఆసక్తికర మలుపులతో, ట్విస్ట్ లతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ సాగుతోంది. కన్నడ నటీనటులు అషికా గోపాల్, చందూ గౌడ ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర, విష్ణు ప్రియ, భావనా రెడ్డి, అనిల్ చౌదరి, శ్రీసత్య, నిహారిక నటించారు.