ధర్మభిక్షం ఆదర్శప్రాయుడన్న కేసీఆర్
హైదరాబాద్: మాజీ ఎంపీ ధర్మబిక్షం పార్థీవ శరీరానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే. చంద్రశేఖరరావు నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్ధం సీపీఐ రాష్ర్ట కార్యాలయం మఖ్ధూం భవన్లో ఉంచిన ధర్మభిక్షం భౌతికకాయాన్ని కేసీఆర్ సందర్శించారు. ధర్మానికి ధర్మభిక్షం ప్రతీక అని, ప్రజసామ్య విలువలు పాటించే వారికి ఆదర్శపాయుడని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం కుటుంబానికి కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు.
కాగా, మాజీ ఎంపీ, సీపీఐ పార్టీ నేత ధర్మభిక్షం పార్థీవ శరీరానికి పలువురు ప్రముఖులు మఖ్ధూం భవన్లో నివాళులర్పించారు. ధర్మబిక్షం భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో కేసీఆర్, పోచారం, ఈటెల రాజేందర్, దత్తాత్రేయ, జానారె డ్డి, ఉప్పునూతుల, మోత్కుపల్లి, దేవేందర్గౌడ్, మంత్రి పితాని సత్యనారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్యలున్నారు.