నారా లోకేష్.. వారసుడు కాదు.. నాయకుడు

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా  నారా లోకేష్ పరిపూర్ణ నాయకుడిగా వేగంగా ఎదుగుతున్నారు. అందలాన్ని ఎక్కించేది వారసత్వం కాదు... అర్హత అని పెద్దలు ఎప్పుడూ చెబుతూ వుంటారు. ఆ మాటకి నిలువెత్తు తార్కాణంగా నిలిచారు నారా లోకేష్. వారసత్వంతో మాత్రమే కాకుండా.. అర్హతతో అందలాన్ని సాధించుకున్న యువతరం నాయకుడు నారా లోకేష్.  వైసీపీ పిశాచాలు నారా లోకేష్ రాజకీయ అడుగులు ప్రారంభించకుందే ఆయనను టార్గెట్ చేసి పప్పు... పప్పు అని విషప్రచారం చేసినా, ఆహార్యాన్ని, ఆహారపు అలవాట్లనూ ఎద్దేవా చేస్తూ బాడీషేమింగ్ కు పాల్పడినా లెక్క చేయకుండా తన కృషితో, పట్టుదలతో తాను పప్పు కాదని... వైసీపీ నాయకుల తుప్పు వదిలించే నిప్పు అని   నిరూపించుకున్నారు.  యువ‌గ‌ళం పాద‌యాత్ర సమయంలో ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా లెక్కచేయకుండా ముందుకే సాగారు. ఫ‌లితంగా పార్టీని, వ్య‌క్తిగ‌త  గ్రాఫ్‌ను కూడా పెంచుకున్నారు. అత్యంత కీల‌క‌మైన స‌మ‌యంలో అధికార పార్టీని గ‌ద్దె దించడానికి తనవంతు భాగస్వామ్యాన్ని అందించారు. లోకేష్‌లోని క‌సికి తోడైన అవిర‌ళ కృషి.. ఆయనను పరిణితి చెందిన పెద్ద నాయకుల కోవలోకి చేర్చాయి.  2019 ఎన్నికలలో తాను ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని 2024 ఎన్నికలలో యాభై వేల ఓట్లతో గెలుస్తానని ప్రకటించి అంతకు మించి మెజారిటీతో విజయం సాధించి సత్తాచాటారు. అదీ తెలుగుదేశం పార్టీకి పట్టులేని నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తేనే తాను నాయకుడు అనిపించుకుంటానని చెప్పారు. ఆ ఒక్కమాటతోనే తాను వారసుడు కాదు.. నాయకుడు అనే విషయం ప్రూవ్ చేసుకున్నారు. 2024 ఎన్నికల సందర్భంగా ఆయన కృషిని మెచ్చిన ప్రజలు ఆయనకు 91 వేల మెజారిటీ ఇచ్చారు. అంటే, ప్రజలు ఆయన్ని నమ్మారు.. ఆయన పనితీరును నమ్మారు.. అందుకే పట్టం కట్టారు. ఈ విజయంతో ఇప్పటి వరకు వైసీపీ విమర్శలు, వ్యాఖ్యలు, ఆరోపణలు ఎగతాళి మాటలు అన్నీ గాలిలో కలిసిపోయాయి.  వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అచ్చిరాని స్థానం మంగళగిరి. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే. అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకుని తొలి ప్రయత్నంలో  ఓడిపోయిన తరువాత, పార్టీ అగ్రనేతలు, లోకేష్ శ్రేయోభిలాషులు అంతా కూడా ఆయనను మంగళగిరి విడిచి మరో సేఫ్ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు. అయితే లోకేష్ ఓడిన చోటనే గెలిచి  చూపుతానని పట్టుబట్టి మరీ మంగళగిరినే ఎంచుకున్నారు. సరే మంగళరి నుంచి లోకేష్ రెండో ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. అది అలాంటి ఇలాంటి విజయం కాదు.పార్టీకి పెద్దగా పట్టు లేని నియోజకవర్గం నుంచి లోకేష్ ఏకంగా 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అది మామూలు విషయం కాదు.  అది పక్కన పెడితే లోకేష్ లో విజయగర్వం అన్నది ఇసుమంతైనా కనిపించడం లేదు సరికదా గతం కంటే ఎక్కువ వినయం, జవాబుదారీ తనంతో  పరిశీలకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రజా నేతగా జన హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు.  రాష్ట్ర కేబినెట్ లో కీలక మంత్రిగా ప్రతి విషయంలోనూ జవాబుదారీ తనంతో  ఉంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆయన కమ్యూనిస్టు నేతలకు సారీ చెబుతూ చేసిన ట్వీట్ ఆయన పరిణితిని, జవాబుదా రీతనాన్ని, వినయ సంపదనూ ఎత్తి చూపింది. ఇంతకీ ఆయన కమ్యూనిస్టులకు సారీ ఎందుకు చెప్పారూ.. స్వయంగా ఆయన ఏమైనా వామపక్షాలను ఉద్దేశించి విమర్శలు ఏమైనా చేశారా? లేదా వామపక్ష సిద్ధాంతంపై ఏవైనా వ్యాఖ్యలు చేశారా? అంటే అదేం లేదు. మరెందుకంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం మడకశిరలో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడ పోలీసులు ఓవరేక్షన్ చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి వామపక్ష నేతలు ఏవైనా సమస్యలను తీసుకువెడుతూ మెమోరాండం సమర్పించే అవకాశాలున్నాయన్న అనుమానంతో పలువురు కమ్యూనిస్టు నేతలను అదుపులోనికి తీసుకున్నారు. ఇప్పటికే పలు మార్లు ముఖ్యమంత్రి తన పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించడం, ముందస్తు అరెస్టులు చేయడం వంటివి తగదని విస్పష్టంగా చెప్పారు. అయితే మడకశిర పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరేక్షన్ చేశారు. దీనికే లోకేష్ కమ్యూనిస్టులకు సారీ చెబుతూ ట్వీట్ చేశారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అసలు ఒక రాజకీయనాయకుడు సారీ చెప్పడం అనేది ఇప్పటి రాజీకీయ వాతావరణంలో ఎవరూ కనీసం ఊహించను కూడా ఊహించలేరు. అటువంటిది నారా లోకేష్ సారీ చెప్పారు.  ఆయన పరిణితి, హుందాతనం, వినయం, జవాబుదారీ తనం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీలకు అతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  ఒక రాజకీయ నాయకుడి నుంచి జనం ఆశించే వినయం, జవాబుదారీ తనం నూటికి నూరుపాళ్లూ ఉన్న సంస్కారవంతమైన నేతగా లోకేష్ ప్రశంసలు అందుకుంటున్నారు.  

దిక్కూ దివాణం లేని ధర్మాన!

మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు రాజకీయ భవితవ్యం ఏమిటి..? తాజా ఎన్నికల్లో ఒక సర్పంచ్ చేతిలో ఏభై వేలకు పైగా ఓట్ల తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన అనంతరం ధర్మాన ఆలోచన ఏమిటి..? వైసిపిలోకి వచ్చిన నాటి నుండి రాజకీయాలపై విరక్తి మాటలు మాట్లాడే ధర్మాన.. ఈ ఓటమి తరువాత రాజకీయాల నుండి రిటైర్ అవ్వనున్నారా..? తన తనయుడి రాజకీయ ప్రస్థానం కొనసాగించడానికి వేరొక పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి..  ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ రాజకీయ నేత.. స్థానికంగానే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఓ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.. అసెంబ్లీలో ధర్మాన ప్రసంగాలను చాలామంది ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటారు. మాస్ లీడర్‌గా మంచి ఫాలోయింగ్‌తో పాటు, అంతే స్థాయిలో అవినీతి ఆరోపణలు సైతం మూటగట్టుకున్నారు ధర్మాన ప్రసాదరావు. కాంగ్రెస్ హయంలో, తరువాత వైసిపిలో చేరిన తరువాత సైతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం, ఉత్తరాంధ్ర పరిధిలో, అందులో ముఖ్యంగా తన సొంత జిల్లా శ్రీకాకుళంలో ప్రతీ నియోజకవర్గంలో తన అనుయాయులను బలపరుచుకుని.. ప్రతీ చోట తన మాట చెల్లుబాటు అయ్యేలా.. తన పనులు, తనవారి పనులు క్షణాల్లో జరిగేలా.. మొత్తం సిస్టం మొత్తం తనకు అనుకూలంగా మార్చుకున్న ప్రొఫెషనల్ పొలిటీషియన్..  అలాంటి ప్రొఫెషనల్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ కెరియర్ గడచిన మూడేళ్ళుగా పూర్తిగా అస్తవ్యస్తంగా నడుస్తోంది. ఆడే మాట తప్పుగా దొర్లుతోంది.. వేసే అడుగు తడబడింది.. అందుకు ఫలితాలుగా నిలచాయి తాజా సాధారణ ఎన్నికలు.. రాష్ట్రం మొత్తం వన్ సైడ్ ఫలితాలు వచ్చినప్పటికీ శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ఓటమి మాత్రం అందులో భిన్నం.. ఘోరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ సీనియర్ పొలిటీషియన్ ను శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఓ సర్పంచ్ ఓడించారు. అదికూడా ఏభై వేలకు పైగా ఓట్ల తేడాతో.. దీంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలిచిన గోండు శంకర్.. ఇప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా మారగా.. ధర్మాన రాజకీయ భవిష్యత్ మాత్రం అయోమయంలో పడింది.  ఇంకోవైపు వైసిపికి వచ్చిన నాటి నుండి పార్టీలో గుర్తింపు కోసం ఆపసోపాలు పడ్డారు ధర్మాన ప్రసాదరావు. ఒక బలమైన వాగ్ధాటి, భారీగా మాస్ ఫాలోయింగ్ ఉన్న ధర్మాన ప్రసాదరావును వైసిపి ప్రభుత్వ పాలనలో తొలి మూడేళ్ళు పూర్తిగా దూరం పెట్టింది. తొలి దఫా మంత్రివర్గ కూర్పులో ధర్మానకు చోటు ఇవ్వకపోవడానికి తోడు, జిల్లాలో కీలక వ్యవహారాల్లో సైతం ఆయననూ దూరం పెడుతూ వచ్చింది. జిల్లాలో ధర్మాన వర్గీయులుగా ముద్ర పడ్డ నాయకులకు గుర్తింపు ఇవ్వకపోవడం, ఆయనను గతంలో విభేదించిన వారికి కీలక పదవులు ఇవ్వడం.. ధర్మాన కోటరీ తట్టుకోలేకపోయింది.   వాస్తవానికి 2024 సాధారణ ఎన్నికల బరిలో తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడును నిలపాలని ధర్మాన ప్రసాదరావు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికలకు రెండేళ్ళ ముందు నుండి ఆయన ప్రసంగాలు కూడా ఉండేవి.. తనకు రాజకీయాల్లో ఆసక్తి తగ్గింది అని, ఇకపై పోటీ చెయ్యనూ అంటూ అనేక వేదికల్లో చెప్పుకోస్తూ ఉండేవారు ధర్మాన ప్రసాదరావు.. అయితే వైసిపి అధినేత జగన్ మాత్రం ఈసారి తప్పక పోటీ చెయ్యాల్సిందే అని తెగేసి చెప్పడంతో అనివార్యంగా బరిలో నిలచారు ధర్మాన ప్రసాదరావు.  అయిష్టంగా బరిలో నిలిచి.. అనూహ్యంగా భారీ ఓటమి పాలైన ధర్మాన ప్రసాదరావు రాజకీయ భవితవ్యంపై ఇప్పుడు నీలినీడలు అలముకున్నాయి. అయితే గడచిన కొన్ని రోజులుగా ధర్మాన ప్రసాదరావుపై వస్తున్న వార్తలు, శ్రీకాకుళం జిల్లా వాసులనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలపై గడచిన అయిదేళ్లుగా అనాసక్తి ప్రదర్శిస్తున్న ధర్మాన ప్రసాదరావు రాజకీయాల నుండి తప్పుకుంటారా..? తన తనయుడిని మెయిన్ స్క్రీన్ పైకి తెచ్చి కధ నడిపిస్తారా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సిక్కోలులో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపధ్యంలోనే ధర్మాన ప్రసాదరావు తనయుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం ఘనంగా మొదలు పెట్టడానికి మరో పార్టీలోకి వెళతారు అన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. దానికి సంబంధించి తెరవెనుక ఏర్పాట్లు కూడా చక చకా జరిగిపోతున్నట్టు భోగట్టా.. ఈ నేపధ్యంలో ధర్మాన భవిష్యత్ నిర్ణయం ఏమిటి.. తన తనయుడి పొలిటికల్ జర్నీని ధర్మాన ఎలా డిజైన్ చేశారు అనే సస్పెన్స్ మరి కొన్ని రోజుల్లోనే వీడనుంది.

గుట్కా, సిగరెట్ కే షికార్ మత్  హో భాయ్ 

చెడు వ్యవసనాలకు అలవాటు పడ్డ సిరాజ్ అనే యువకుడు నిత్యం గుట్కాలు తింటూ ఉంటాడు. అతన్ని నిలువరించడం కుటుంబ సభ్యులకు పెద్ద తలనొప్పిగా  మారింది. ఈ నోటా ఆ నోటా సిరాజ్ గుట్కాలు తినడం అదే బస్తీలో ఉండే మౌలానా చెవిలో పడింది. ఇదే సమయంలో అక్కడ్నుంచి వెళుతున్న మౌలానా సిరాజ్ కు ఎదురు పడ్డాడు  సిరాజ్: సలాం వాలేకుం, కైరియత్ మౌలానా మౌలానా: ‘మై బయాన్ కర్నే జాతా హూ లోగా  గుట్కా  మార్కే  కైరియత్ సేట్ పూచ్తే    అరే బేవకూఫ్ అబ్ తక్ థా కైరియత్, తేరేకు దేఖ్తే  తేయిచ్ కైరియత్ కరాబ్ హోగయీ, చల్ నికల్. గుట్కా కా ఖాకే  కైరియత్ పూచ్ తా.  చిచోరే’ ఏక్ సాహెబ్ సే  హాత్ మిలాయా ఉస్ కే బాద్ మెరా హాత్ నార్మల్లీ  చోడ్ దియా బాద్ మే గలీజ్ బత్ బో‘ యే కాహాసే ఆగయా సిగరెట్ కా బత్ బో, చోడ్ దేవ్ భాయ్ సిగరెట్, గుట్కా, అపన్ మోమిన్ హై . అప్నే కౌమ్ కిత్నా గందే హోగయే . అపన్  బడీ గడ్ మే ఉతర్ గయే. అపన్ మోదీకో గాలియా దేరే . అపన్ కుద్ సయ్ నహే. అపన్  గందా జహెర్ దాల్ రే . కెమికల్ దాల్ రే,కలేజా కరాబ్ , పేప్ డే కరాబ్ , దిల్ కమ్ జోర్, ఉన్ కే బచ్చే బీ కమ్ జోర్ . కమ్ జోర్ బేటా క్యోం బావా గుట్కా కారా, ఇస్ లియే కమ్ జోర్. మై తో ఏక్ ముహీమ్ చలానా వాలా హుం. గుట్కా కానే వాలే బచ్చే కు  బచ్చీ నహీం దేనా,  గుట్కా కానే వాలే ఘర్ మే బచ్చీ బీ నహీ దేనా.  ఆమ్ కా  బీంజ్  దాలేతో ఆమ్ కా జాడ్. జైసీ బీంజ్ వైసా జాడ్ , ఆజ్మాకే దేఖో గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ మాలిక్ సిగరెట్ నై పీతా . సిగరెట్ అప్నేకు పిలారా. ఆమ్ దానీకే లియా గుట్కా, సిగరెట్ కంపెనీ చలారే. 60 సాల్ పార్ బీ  నహీ ఉహా జనాజా ఖబ్రస్తాన్ పహుంచ్ రా. సోచో భాయ్ . దూద్ పీయేతో కువ్వత్ ఆతీ గుట్కా, సిగరెట్ జహార్ , చోడ్ దేవ్  మేరాభాయ్ ’సమ్ జో మేరీ బాత్ కో మౌలానా : దేఖో యే బాజూ వాలే  క్యా కరే  నహీ గలత్ ఫ్యామీ  పైలాయే   ఏక్ బాజూవాలే పట్టా మేరా పాస్ ఆయే మౌలానా సాబ్ కబర్ మే ముర్దా జిందాహై కబర్ మే ముర్దా జిందాహై అల్లాకీ కసమ్ కబర్ మే ముర్దా జిందా   హై   మౌలానా సాబ్  బోత్ బోల్ రే  ఆప్ అప్నీ తరఫ్ సే తక్ రీర్ దాల్రే  ...మౌలానా సాబ్ ఏక్ కామ్ కరేంగే పూల్ బాగ్ కబరస్తాన్ జాయింగే ఏక్ సబ్బల్  పౌడా లాయేంగే. ఏక్ కబర్ ఖోదీంగే, కోన్ నికల్తే దేఖ్ లియేంగే టెన్షన్ ఖతమ్  .  తుమ్ హిత్ నే చీక్  మార్రే కబర్ జిందా హై ... జిందా హై...  పట్టా గయా సబ్బల్ లాయా పౌడా లాయా కబర్ కోదే కబర్ మేసే అడ్డీ నిక్ లే... పట్టా ఖుష్ హోగయా యే మౌలానా సాబ్      ముర్దా జిందాహై. జిందాహై బోల్రే మౌలాన్ సాబ్  అగ్లమ్ బగ్లమ్ దిఖ్ రా  భాయ్ . యే తీన్ మైనా కా ముర్దా దిఖ్రా ఇస్ లియే అడ్డీ నిక్ లే... కబ్ కే కీ 600 సాల్ పురానీ చీజ్ ఉఠాకే లేకే ఆకే కబర్ మే ముర్దా జిందా హై బోల్రే యే ఆదీ టాపిక్ హోగయే... పూరా తక్ రీర్ సునో ఆదీ సున్ కే ఇల్ జామ్ దాల్తే పురా సోనో, బాత్ పురా సునేతో మాలూమ్ హోతా ‘కుదా కీ కసమ్....  జో  మదీనా మే నబీ కహతే ...హదీస్ మే , ఇస్లాం మే జికర్ హై ... మగర్ కోదేతో ముర్దా  క్యోం నికల్ రా మై బతావుంగా అబ్ కాన్సెప్ట్ మై సమజ్ జాయియే’  అల్లా తాలానే  హర్ ఇన్ సాన్ కో దో జిసమ్  బనాయా . ఏక్ జిసమ్ దేఖే దునియామే బేజ్ దియా... ఏక్ జిసమ్ మే కసీఫ్ హై.... అల్లానే సేమ్ టు సేమ్ జిసమ్ బనాకే రఖా ఉపర్ . ఉస్ కా నామ్ జిస్ మే లతీఫ్...  యే లతీఫ్ అల్లాకే పాస్ రైతా... జిస్ మే కసీఫ్ జిస్ మే లతీఫ్ ఫరక్ యే సున్ లీ జియే సున్ లీ జియే .... జిస్ జిసమ్ సే పసీనా చుట్తా బత్ బో ఆతా, వో జిసమ్ పే మచ్చర్ బైట్తా... వో కసీఫ్ హై.  ఏక్ మర్తబా హాత్ కాట్ దో పూరీ దునియా మిల్ కర్ జోడ్ నై సక్తే ... వో కసీఫ్ హై ... హుజూర్ కో పసీనా నికల్ తాతా మగర్ కుష్ బూ దార్ హోతా... వో లతీఫ్ ...హుజూర్ కీ జిసమ్ పే మచ్చర్ నై బైట్ తీతీ.. వో లతీఫ్ హై  లతీఫ్ కో  హుజూర్  పవర్ ఫుల్  బనాయా.... హుజూర్ కీ సాయా నహీ పడ్ తీతీ వో లతీఫ్ హై   రూ నికల్ జాతీ.... ఆప్ డోలే మే లేకే జాతే... వో కసీఫ్ హై. ఆప్  కబర్ మే దఫ్నాతే ఉస్ మే లతీఫ్ హై ... రూ కసీఫ్ మే నై దాలే జాతీ.... రూ లతీఫ్ మే దాలే జాతీ కబర్ మే సబ్బల్ దాల్ కే కోదే అడ్డీ నిక్ లీతో కసీఫ్ హై జిస్ కా రూ లతీఫ్ మే దాలీ జాతీ....లతీఫ్ ఏక్ సెకన్ మే అమెరికా పహుంచ్ సక్ తా బోత్ పవర్ ఫుల్ . కబర్ మే లతీఫ్ నై దిక్ తా... మౌలానా:  ఏక్ పేర్ తలాక్ లేనేకే లియే డిసైడ్ హోగయే . మషోరాకే లియే మేరా పాస్ ఆయే . మియా బీవీ కో బిటాకే సమ్ జాదియా. ఔరత్ కబీ షోహర్ కు జవాబ్ నహీ దేనా బీవీ కో కుష్ రక్ నేకా తరీఖా ఔరత్ కు సరెండర్ కర్నేకా తరీఖా బీ  సునో. బీవీకా తారీఫ్ కర్నా బెహత్తరీన్ తరీకా హై ఉస్  దిన్ సే వో పేర్ సుదర్ గయే.  బీవీ  చాయ్ బనేకా షోహర్ కే లియే లేకే ఆయే షోహర్ దో చుస్తే చాయ్ పీయా షొహర్ కో యాద్ అయా తారీఫ్ కే బారే మేం బేగం  చాయ్ టేస్టీ హైఉస్ దిన్ సే  బేగం ఖుష్. ఆట్ సాల్ సే చాయోపే చాయ్ పీరా ఏక్ దిన్ బీ తారీఫ్ నైకరా మేరా షోహర్ ఆజ్ కరా తారీఫ్ కర్తే యిచ్ ఔరత్ సరెండర్. ఉస్ కే బాద్  షోహర్ తారీఫ్ , బీవీ పల్టాకే జవాబ్ నై దియే  తీన్ మైనే హోగయే  మొహబ్బత్  హోగయే తలాక్ కా జికర్ నై. ఇత్త యిచ్ లైఫ్ . అవురత్ కో తారీఫ్  కర్తే జారే ఔరత్ జవాబ్ నహీ  దేనా...చల్తే చల్తే మహబ్బత్ హోగయా దోనో మిల్ కర్ బిర్యానీ కానే నికల్ గయే ....పార్కోమే గుమ్ రే....ఔరత్ కో గాలీ నై దేనా ఔరత్ పల్టాకే జవాబ్ నహీ దేనా ఇత్తాహిచ్ లైఫ్ .... బడ్ కాయేతా ఆగ్ పైల్తా... ఔరత్ షొహర్ కో జవాబ్ నహీ దేనేసే ఆగ్ బుజ్ తీ....  ఏక్ సత్తర్ సాల్ కా ఏక్ బుడ్డా    అప్నీ బీవీ సే తుమహరా బావా షాదీమే సైకిల్ దియేచ్ నై యైసా దిక్తా  వో బుడ్డా సైకిల్ పే  బైట్ కే కబర్ మే జానే వాలా ... తుమ్ హారా భాయా మేరే కో  సలామ్ నై కరా... బవ్ నే సాబ్ కో సలామ్ కర్నా జరూరీ హై క్యా సాలే కో తుమ్ సలామ్ కరో .... తుమ్ హారా భాయ్   రుక్కా నై దియే మై షాదీ కో జాతా హిచ్ నై  ఇనూ చీఫ్ మినిస్టర్ హై క్యా ... బవ్ నే  సలామ్ కరేతో తు సలామ్ కర్ సాలా సలామ్ కర్నా జరూరీ హై క్యా ... బవ్ నే   సాలే కో సలామ్ కరేతో సాలే బవ్ నే బన్ తే క్యా...  ఏక్ సాబ్ గాడీ పే జారా సిగ్నల్ పడ్ గయా రెడ్ సిగ్నల్.. దేక్ తాయిచ్ నై చలే యిచ్ చల్రా పోలీస్ వాలా సీటీ మార్రా రుక్ రేయిచ్ నై .... పోలీస్ వాలా చీకా అరేయ్ రుక్  ... గాడీ వాలా రుక్ గయా క్యావుహా సాబ్ ... అరేయ్ రెడ్ సిగ్నల్ పడే గాడీ నై రోక్ రా.. మాఫ్ కర్నా సాబ్  ... రెడ్ సిగ్నల్ నై దికా సాబ్... అబే  కైకు నై దేఖా.... ఘర్ మే మేరా బీవీ అమ్మీకో బన్ రాయిచ్ నై... ఉస్ మే పరేషానీ మో గాడీ లేకే నికల్ గయా.. సాస్ బహు లడాయ్ హర్ గర్ మే చోటీ చోటీబాతో మే లడ్ లేరే ...దోనో ఔరత్ హై... దోనో కే తక్ లీఫ్ ఏఖ్ హై .దోనో అండర్ స్టాండ్ రహేనా చాహియేనా... సాస్ బహు చోటీ కాట్ లియే   ..చాయ్ మే శెక్కర్ కమ్ హై  తేరే అమ్మా యే యిచ్ సికేయే...శెక్కర్ కమ్ హైతో అమ్మీ కో గాలీ దేనా జరూరీ హై క్యా ... శెక్కర్ కమ్ దాల్ నేసే మేరే అమ్మీ కా నామ్ లియేనా మై ఇస్కీ మరద్ కా కామ్ కర్ తూ మ్ బోల్ సాలన్ మే నమ్మక్ దాల్ కే బద్ లా లే లితీ. అబ్ తుమ్ తుమారా బావాకో యాద్ కరో...  ఏక్ దిన్ బహూ బుడ్డీ కా కామ్ పహచాన్ దేతీ ఏక్ ముర్షద్ కనే గయీ సర్కార్ మేరా సాస్ మర్నేకా తావీజ్ దేవ్ ... ముర్షద్ పరేషాన్                                                                                                                                                                 - బదనపల్లి శ్రీనివాసాచారి 

తడబడిన తెలుగు తేజాలు!

పారిస్ ఒలింపిక్స్.లో పాల్గొన్న మన తెలుగు తేజాలు సింధు, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, నిఖత్ జరీన్ సంచలనాలు సృష్టిస్తారని ఆశించాం. వాళ్ళు అలా పతకాలు గెలవగానే ఇలా పండగ చేసుకోవడానికి సిద్ధంగా వున్నాం. కానీ, జీవితమే ఒక ఆట... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. మరి జీవితంలో ఒక భాగం అయిన ‘ఆట’ అయితే... ఎన్నెన్నో మలుపులు. మన తెలుగు తేజాల విషయంలో కూడా ఊహించని మలుపులు వచ్చాయి. సంచలనాలకు కొద్ది దూరంలో వుండగానే పరాజయం పలకరించింది. అయినప్పటికీ బాధపడాల్సింది ఏమీ లేదు. ప్రయత్నం చేయడం ప్రతిభ అయితే, ఫలితాన్ని ఆశించకపోవడం ప్రజ్ఞ అనిపించుకుంటుంది. ఈసారికి మన తెలుగు తేజాలు ఒలింపిక్స్ స్థాయిలో పోరాటం చేసి విజయం దగ్గర వరకూ వెళ్ళారని సంతృప్తి పడాలి. వారి పోరాటం కొనసాగించడానికి ప్రోత్సాహం అందించాలి. రియో ఒలింపిక్స్.లో రజతం, టోక్యో ఒలింపిక్స్.లో కాంస్యం సాధించి, ఈసారి కూడా హాట్ ఫేవరెట్‌గా వుండి, ఈసారి స్వర్ణం సాధిస్తుందన్న ఆశను కలిగించిన పి.వి. సింధు ఈసారి క్వార్టర్స్‌కు కూడా చేరకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్  ఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి హే బిన్‌జియావో చేతిలో సింధు 19-21, 14-21తో ఓటమి చవిచూసింది.  బ్యాడ్మింటన్‌లో భారత్‌కి తొలి డబుల్స్ పతకాన్ని అందిస్తారని అందరూ ఆశించిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి జోడీ నిరాశపరచింది. గురువారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో ఈ జోడీ 21-13, 21-14, 21-16 తేడాతో మలేసియాకి చెందిన ఆరోన్ - సో వూయీ చేతిలో ఓడిపోయారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆశల్ని పెంచిన బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ప్రి-క్వార్టర్స్‌లో ముగిసింది.  50 కేజీల విభాగంలో పోటీప‌డ్డ నిఖ‌త్ జ‌రీన్‌ చైనాకు చెందిన వూ యూకి నిఖత్ జరీన్ పోటీ ఇవ్వలేకపోయింది.  5-0 తేడాతో నిఖ‌త్ బాక్సింగ్ బౌట్‌ను కోల్పోయింది. మొత్తమ్మీద మన ముగ్గురు తెలుగు తేజాలూ ఒకేరేజు (గురువారం) నాడు ఒలింపిక్స్ పోటీ నుంచి నిష్క్రమించారు. ఈ ఓటమి నుంచి ఈ ముగ్గురూ పాఠాలు నేర్చుకుంటారని, ఈసారి ఒలింపిక్స్.లో పతకాలను సాధిస్తారని, భారత పతాకాన్ని విశ్వవీధిలో రెపరెపలాడిస్తారని ఆశిద్దాం.

వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం.. ఇంతకీ ఎక్కడున్నాడు?

గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసిన పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారు. వంశీని అరెస్టు చేయడానికి మూడు పోలీసు బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ పేరు 71వ ముద్దాయిగా ఉంది. ఈ దాడిలో వంశీ నేరుగా పాల్గొనపోయినా దాడికి వైసీపీ కార్యకర్తలను ప్రేరేపించింది వంశీయేనని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం పోలీసులు వంశీ సొంత మనుషుల్లా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగానే  దాడి తరువాత పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. వైసీపీ సర్కార్ పతనమై.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే పోలీసులు కేసును సీరియస్ గా పట్టించుకుంటున్నారు. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో గత నెల 9న పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. వారిలో వంశీకి అత్యంత సన్నిహితులైన బాపులపాడు ఎంపీపీ నగేష్, మరో  ముగ్గురు ఉన్నారు. ఇంకా పలువురు పరారీలో ఉన్నారు.  అయితే తెలుగుదేశం శ్రేణులు మాత్రం పోలీసులు వంశీ సహా కీలక నిందితులను వదిలేశారని ఆరోపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వంశీ నియోజకర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలను తీవ్రంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా, నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా  తమ పార్టీ  కార్యకర్తలు, నాయకులపై పలు అక్రమకేసులు కూడా పెట్టించారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వంశీ విజయవాడ వదిలిన కుటుంబంతో సహాక హైదరాబాద్ కు మకాం మార్చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో అడుగు పెట్టింది కూడా లేదు. దీంతో వంశీ కోసం మూడు పోలీసు బృందాలు గురువారం (ఆగస్టు 1) హైదరాబాద్ చేరుకున్నాయి. అయితే పోలీసులు చాలా తాపీగా స్పందించారనీ, వంశీ ఇప్పటికే దేశం దాటేశారన్న వార్తలు వినవస్తున్నాయి.  పులవర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లే చేసి వదిలివేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో వంశీ అరెస్టు వారిని ఒకింత శాంత పరిచే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై మొట్టమొదట అనుచిత వ్యాఖ్యలు చేసింది వల్లభనేని వంశీయే అన్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో వంశీ పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలన్న ఎస్పీ విస్పష్ట ఆదేశాలతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అవసరమైతే లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేయాలని భావిస్తున్నారు. 

జగనాసురుడి ఆట కట్టించాలంటే...?!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) గడచిన ఐదేళ్ళ  జగన్ విధ్వంసక పాలనలో  ఆయన తరచూ చెప్పిన మాటలు... విలువలు, విశ్వ‘ష’నీయత, అవినీతి రహిత పాలన, కులవివక్ష లేకుండా పక్షపాతం లేని పాలన! పేదవాళ్ళకు పెత్తందార్లకు  మధ్య యుద్ధం... దుష్టచతుష్టయం! ఇలా  ఐదేళ్ళు  కాలకూట  విష సర్పానికి చిక్కిన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. దేశంలో ఎక్కడా జరగని  రాజ్యహింస ఆంధ్రప్రదేశ్‌లో  జరిగింది. బడుగు బలహీన వర్గాల  జీవితాలు  ఛిద్రం అయ్యాయి!  అబ్దుల్  సలాం లాంటి  పేద కుటుంబం నిండు ప్రాణాలు వికృత  పాలెగాడి పోలీసు దమనకాండకు గాల్లో కలిసిపోయాయి!  దళితులపై జరిగిన అకృత్యాలకు అంతే లేదు! శిరోముండనం దగ్గర నుండి  చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసే వరకు నిరాటంకంగా కొనసాగింది. పెద్దిరెడ్డి రాజ్యంలో  దురాగతాలు చెప్పడానికి ఇక్కడ  సమయం సరిపోదు! దళిత  జడ్జి రామకృష్ణకు  అంతులేని  వేధింపులు.  పారిశ్రామిక వేత్తలు  రాష్ట్రం నుండి  పరారయ్యారు! ఇంత చేసిన జగన్రెడ్డి జాతీయ స్థాయిలో ఇష్యూ చేస్తున్నారంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక డార్క్ సీక్రెట్ ఉంటుంది! జగన్ ఏం చేసినా కచ్చితంగా ఒక పథకం ప్రకారం అడుగులు వేస్తారు. రాష్ట్రాన్ని అల్లరి చేయాలి! జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపించాలి! నేను అనేవాణ్ణి ఒకణ్ణి ఉన్నాను, ఎక్కడికీ వెళ్ళలేదు అని ఈ రాష్ట్రం వైపు చూసే  పారిశ్రామికవేత్తలకు వార్నింగ్ ఇవ్వడం మొదటిది!  జస్ట్ 100 కోట్ల లిక్కర్ స్కామ్‌కే... ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం సహా కేసీఆర్ కూతురు నెలల తరబడి ఊచలు లెక్కెడుతున్నారు!!  మరి జగన్‌ను  రక్షిస్తున్నది ఎవరు?   జగన్ రెడ్డి ముడ్డి క్రింద  32 పాత కేసులు..!  కొత్తగా ల్యాండ్, శాండ్, వైన్స్, మైన్స్.లో బయట పడబోయే లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు. ఈ దశలో ప్రజల దృష్టి మరల్చి  రచ్చ రచ్చ  చేయాలి!  కేసులు నమోదయితే  రాజకీయ కక్షసాధింపు అని నానా యాగి చేయ్యచ్చు.  క్రూరమైన ఆలోచనలు కలిగిన జగన్  ఆంధ్రుల పాలిట  ఒక  శాపం! కేంద్ర మాజీ మంత్రి మర్రి శశిధర్ ఏనాడో చెప్పారు  ఏపీకి   పొంచివున్న  ప్రళయం జగన్ రెడ్డి అని!   గడిచిన  ఐదేళ్ళ ఉప్పెన చూసారు కదా!   కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలన్నర కూడా కాకుండానే జాతీయస్థాయిలో గోలగోల చేస్తూ ఏకంగా రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. టీడీపీ, జనసేన జగన్ రెడ్డిని ఏదో ట్రోల్ మెటీరియల్ కింద చూస్తున్నారు. కానీ... అదొక నటోరియస్ క్రిమినల్ మైండ్ సెట్ అని తెలుసుకోలేకపోతున్నారు. మళ్లీ జగన్ వేళ్ళూనుకుంటే... వైఎస్సార్సీపీ ఊపిరి పోసుకుంటే అనే ఆలోచనే... పారిశ్రామికవేత్తల వెన్నులోంచి వణుకు పుట్టిస్తోంది! మరి రాష్ట్రంలో,  కేంద్రంలో కూటమి ప్రభుత్వం వుంది . జగన్మోహన్ రెడ్డి కానీ, అతని అనుచరులకు గానీ, నాయకులకు గానీ వారి ప్రభుత్వం పోయిందన్న భయం ఎక్కడ లేదు..! అదే అబద్దాలు.. అవే సాక్షి విషపు రాతలు.. అవే కల్పితాలు.. అవేకట్టు కథలు.. అదే హింస..! ఆఫీసుల్లో ఫైల్స్ తగలబెట్టే స్థాయిలో అధికారులు ఉన్నారు అంటే? ఇంకా వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులు స్లీపర్ సెల్స్.లాగా రాష్ట్రం మొత్తం సెక్రటేరియట్ నుంచి సీఎంఓ వరకు మంత్రుల కార్యాలయాల్లోకి చొచ్చుకొచ్చారనేది పచ్చి నిజం.  తెలుగుదేశం పార్టీ , నితీష్ కుమార్ మద్దతుతో  కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. అయినప్పటికి  జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సాక్షిపత్రికలో భారతి రెడ్డి  ఎలా బరితెగించి ప్రవర్తిస్తున్నారు? ఎవరి అండతో వీరంతా  రెచ్చిపోతున్నారు?  సాయిరెడ్డి కోరగానే  అమిత్ షా అపాయింట్ ఇస్తారు. పార్లమెంట్‌లో  ఎన్డీయే బిల్లులకు మా పార్టీ  పూర్తి మద్దతు ఇస్తుంది అని  బీజేపీ పెద్దలతో  టచ్‌లో  వుంటారు!  అదే సమయంలో డీకే శివకుమార్ ద్వారా  కాంగ్రెస్ అధిష్ఠానంతో  టచ్‌లో  వుండటం...  దేశంలో  ఏ రాజకీయ  నాయకుడికీ  సాధ్యపడని  రాజనీతి జగన్ సొంతం!  జగన్ రాజనీతిలో నీతి మాత్రం  వుండదు జగన్  రాజకీయ  అవినీతి ద్వారా సంపాదించిన లక్షల కోట్ల బ్లాక్ మనీ నోట్ల సంచులతో ఢిల్లీ పెద్దలను కొడుతుంటే వారు కాదని ఎలా అనగలరు?  నేటి  రాజకీయంలో  అవినీతి మరకలేని  పార్టీ ఒక్కటి అంటే ఒక్కటి అయినా ఉందా?   ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన విషయనికి వస్తే  రాష్ట్రానికి ఆర్థిక జవసత్వాలు ఎలా సమకూర్చాలి? పెట్టుబడులు ఎలా తీసుకురావాలి? ఈ రాష్ట్రాన్ని సన్ రైజ్  స్టేట్‌గా ఎలా ముందుకు తీసుకెళ్లాలి! అమరావతి, పోలవరం బృహత్ ప్రణాళికతో ఎలా పరుగులు పెట్టించాలి? లా అండ్ ఆర్డర్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? అనే విషయంలో చంద్రబాబుపై  ఎవరికీ ఏ విధమైన  అపోహలు, భిన్నాభిప్రాయాలు లేవు. ఇవన్నీ ఆయన మాత్రమే చేయగలరు అని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. వారి నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారు. చంద్రబాబు 40 ఏళ్ళ  రాజకీయ జీవితం వేరు! గడచిన  ఈ  ఐదేళ్ళ  జగన్ పాలన వేరు.  సంప్రదాయ  రాజకీయ  ముఖ చిత్రాన్ని జగన్ పాలన సమూలంగా  మార్చివేసింది.  మీకు ఊహ తెలిసాక  ఎంతో మంది  ముఖ్యమంత్రులను, ప్రధానులను  చూసి వుంటారు!  జగన్ పాలన ధోరణి గతంలో  మనం ఎన్నడూ చూడలేదు!  ఈ పరిస్థితికి  కారణం ఏంటి?  వ్యవస్థల విధ్వంసం...  అధికారులను పాలేర్లను  చేసి  తన గొడ్ల చావిడిలో కట్టేయటం!  రూల్ ఆఫ్  లా   పూర్తిగా  పక్కన పెట్టేసి  రెడ్డి గారికి పాచి పని చేయటంలో  పోటీ పడటం!   మరి ఇటువంటి  పరిస్థితిలో  రాష్ట్రా ప్రజలకు ఏంకావాలి?  కూటమి  పార్టీల  కార్యకర్తల  ఆకాంక్షలు ఏంటి? ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయటంలో చంద్రబాబు విజన్ ఎంత అవసరమో అదే సమయంలో ఏకకాలంలో నేరచరిత్ర ఉన్న అధికారుల పోస్టింగ్ విషయంలో జగ్రత్తలు  తీసుకోవటం కూడా అంతే అవసరి. అయితే ఈ విషయంలో చంద్రబాబు సరైన శ్రద్ధ తీసుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే చంద్రబాబు తన సొంత మనుషులని కొంతమందిని నమ్మి పక్కన పెట్టుకోవాలి..! అన్నీ చంద్రబాబు చేయాలంటే సాధ్యపడే పని కానే కాదు..! జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూడండి. నాడు నేడు జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు జగన్ కోసం ప్రాణమిచ్చే  నాయకులు బోలెడు మంది ఉన్నారు!   అదే చంద్రబాబు విషయంలో అలా ఉందా?  చంద్రబాబు కోసం ప్రాణాలకు ఇచ్చే నాయకులు ఆ పార్టీలో ఉన్నారా?  నాకు తెలిసి లేరు! కానీ, టీడీపీలో చంద్రబాబు కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు.  చంద్రబాబు గత కొన్ని రోజులుగా శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తూ పోతున్నారు. అదొక పద్ధతి అదొక విధానం..! జనానికి కూటమి కార్యకర్తలకు కావాల్సింది శ్వేత పత్రాలు కాదు యాక్షన్..! ఒకపక్క చంద్రబాబు నాయుడు మార్కు పాలన కొనసాగిస్తూనే మరొకపక్క పవన్ కళ్యాణ్ లోకేష్ నేతృత్వంలో పక్కా ప్రణాళికతో ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక తప్పుడు అధికారిని తప్పుడుపనులు చేసిన రాజకీయ నాయకుడిని శిక్షిస్తున్నారు అనే సంకేతం  ప్రజల్లోకి  వెళ్ళాలి!   ఐదు సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని అంధకారం చేసి విధ్వంసానికి పాల్పడ్డ వాళ్లలో ఒక్కళ్ళలోనైనా భయం అనేది మచ్చుకైనా కనిపిస్తోందా..? అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌కు  కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. కృష్ణాకు కొత్తగా వచ్చిన ఎస్సీ గంగాధర్.. మాజీ మంత్రి  కొడాలి నానికి అనుకూలంగా  వ్యవహరిస్తున్నారని, ఎస్సీ ఇటీవల గుడివాడ వచ్చి రాత్రంతా అక్కడే గడిపారంటూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి జోక్యం చేసుకుని.. అంగళ్లు ఘటనను గుర్తుచేశారు. గంగాధర్ అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడే టీడీపీ నేతలు, శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అంటకాగారని వివరించారు. దీంతో “వైకాపా వీర విధేయుడని తెలిసీ ఆయనకు జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వడం విచిత్రంగా ఉంది” అంటూ పలువురు ఎమ్మెల్యేలు అనుకోవడం వినిపించింది.  కొడాలి నాని పీఏ లక్ష్మోజీపై గుర్తుతెలియని వ్యక్తులెవరో ఇటీవల దాడి చేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. కానీ ఈ నెల 17న కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్.. ఆ వెంటనే గుడివాడ వచ్చి లక్ష్మోజీని పరామర్శించారు. దగ్గరుండి మరీ కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో నెలన్నర క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం నత్తనడకతో వైసీపీ అధికారులు జారుకొంటున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన పలువురు అధికారులు.. ఐదేళ్లూ ఇష్టా రాజ్యం వ్యవహరించి, ప్రభుత్వం మారగానే ఇక్కడే పాగా వేయటం నిత్యకృత్యం అయింది! కొంతమంది  చీకూచింతా లేకుండా  హాయిగా  కేంద్ర సేవలకు తిరిగి వెళ్ళిపోతారు. పన్నుల శాఖలో డిప్యుటేషన్‌పై వచ్చి పనిచేసి ఇటీవలే ఒక రెడ్డి చెప్పకుండా వెళ్లి పోతే, తాజాగా ఐ అండ్ పీఆర్ మాజీ కమీషనర్ విజయ్‌కుమార్ రెడ్డి కలకత్తాలో తేలారు. అక్కడ రీజినల్ పీఐబీ ఇంచార్జిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఏపీలో ఐదేళ్లపాటు పని చేసిన ఆయన హయాంలో సమాచార శాఖలో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఆధారాలతో పాత్రికేయ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్ర సర్వీసు అధికారులు తిరిగి వెళ్ళరాదంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు.ఈ మేరకు ప్రభుత్వం నోట్ కూడా విడుదల చేసింది. ఏమైందో తెలీదు కానీ ఏపీలో ఏకపక్షంగా, అడ్డగోలుగా వ్యవహరించిన విజయ్ కుమార్ రెడ్డి రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి నిదానంగా వ్యహారిస్తుండటం ఇదే అదనుగా అధికారులు జారుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కె.ఎస్.జవహర్ రెడ్డి, జగన్ ప్రభుత్వంలో దాదాపు ప్రతి అవినీతి, అక్రమానికీ ఏదో రూపంలో లింకున్న ధనుంజయ్ రెడ్డి, టీటీడీ పవిత్రతను దెబ్బతీసి కేవలం జగన్ కేసుల లాబీయింగ్ కోసమే పనిచేసిన ధర్మారెడ్డి పదవీ విరమణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరోవైపు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఇప్పుడు ‘‘మధుసూదన్‌రావూ’’ అంటూ పోలీసులను బెదిరించడాన్ని జనం చూశారు.  ఐదేళ్ల క్రితం జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు జాస్తి కిశోర్ లాంటి నిప్పులాంటి వారిని మాతృశాఖకు రిలీవ్ చేయలేదు. ఆరోపణలు లేని వారిని ఎందుకు పెట్టుకున్నారని కేంద్రం గట్టిగా అడిగితే, అప్పుడు పంపారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా కేంద్ర సర్వీసుల అధికారులు తిరిగి వెళ్లిపోతుంటే ఏమి జరుగుతుంది.? లేదా సమాచారం ఇచ్చి అనుమతితోనే వెళుతుంటే ఏమి సంకేతం ఇస్తున్నట్లు.? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. చంద్రబాబును సుపరిపాలనకు వదిలేయండి పవన్ కళ్యాణ్, లోకేష్ బాధిత ప్రజలు కూటమి కార్యకర్తల  ఆకాంక్షల కోసం తక్షణం పని ప్రారంభించాలని  పలువురు కోరుతున్నారు.  ఇది  జరగాలంటే  గతంలో  నిజాయితీగా పనిచేసి, జగన్ దాష్టీకాన్ని  ఎదుర్కొన్న  అధికారులు, విలువలే ఊపిరిగా బ్రతికే వ్యక్తులను నమ్మి భాధ్యతలు అప్పచెప్పాలి.

నాపై దాడికి ఈడీ ప్లాన్ చేసింది:  రాహుల్ గాంధీ

లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పార్లమెంట్‌లో తాను చేసిన ‘చక్రవ్యూహం’ ప్రసంగం అనంతరం తనపై దాడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేసిందని ఆరోపించారు. తనపై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు ఈడీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసిందని అన్నారు. చాయ్, బిస్కెట్లతో అధికారుల కోసం ఉత్సాహంతో ఎదురుచూస్తుంటానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన శుక్రవారం స్పందించారు. ‘‘నా చక్రవ్యూహ ప్రసంగం  నచ్చలేదు. నాపై దాడికి ప్లాన్ చేసినట్టు ఈడీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది. ఛాయ్, బిస్కెట్లతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటాను’’ అని అన్నారు. కాగా జులై 29న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2024పై రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శల దాడి చేశారు. బీజేపీ పార్టీ కమలం సింబల్‌ను ప్రదర్శించిన ఆయన.. 21వ శతాబ్దంలో కొత్త చక్రవ్యూహం సిద్ధమైందని విమర్శించారు.వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహంలో బంధించి చంపారని, తాను కొంచెం పరిశోధన చేసి చక్రవ్యూహాన్ని కనిపెట్టానని, 'పద్మవ్యూహం’ అని కూడా పిలవొచ్చని అన్నారు. ‘‘పద్మవ్యూహం అంటే 'కమలం ఏర్పడటం'. 21వ శతాబ్దంలో ఒక కొత్త 'చక్రవ్యూహం' ఏర్పడింది. అభిమన్యుడి మాదిరిగా భారతదేశంలోని యువకులు, రైతులు, మహిళలు, చిన్న-మధ్యతరహా వ్యాపారులు నేడు ఆరుగురు వ్యక్తుల కారణంగా నలిగిపోతున్నారు. చక్రవ్యూహంలో ఆరుగురు వ్యక్తులు నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ’’ అని అన్నారు.దేశంలోని రైతులు, కార్మికులు మరియు యువకులు భయాందోళనకు గురవుతున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.

వెంకటరెడ్డిపై వేటు పడింది!

ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఏపీఎండీసీ మాజీ ఎండి వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. జగన్ హయాంలో  ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి   నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయన పలు అవకతవకలకు, అక్రమాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.   ఈ నేపథ్యంలోనే  మైన్స్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో వెంకటరెడ్డి అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు రుజువవ్వడంతో వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చారు.  ఆ నివేదిక మేరకు ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఏపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన ఇసుక టెండర్లు, అగ్రిమెంట్లల్లో నిబంధనలు ఉల్లంఘించారని,  సుప్రీం కోర్టు, ఎన్జీటీ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారని, అలాగే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని విచారణలో తేలింది. దీంతో సెంట్రల్ సర్వీసెస్ రూల్స్ కింద ఆయనను సస్పెండ్ చేస్తే సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.  సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్ల కూడదంటూ వెంకటరెడ్డిని ఆదేశించారు.  కోస్ట్ గార్డ్ లో సీనియర్ సివిలియన్ ఆఫీసర్ గా పని చేస్తున్న వెంకటరెడ్డిని జగన్ ఏరి కోరి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటేషన్ పై తెచ్చుకున్నారు.  

దేశంలో బాబాలు పడ్డారు! నాయకులు సాష్టాంగ పడ్డారు!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) 2024 జులై 2న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 123 మంది మరణించారు. ఎనభై వేల మందికి పర్మిషన్‌ తీసుకుని, రెండున్నర లక్షల మందిని అనుమతించడం వల్ల తొక్కిసలాట జరిగింది. తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకున్న భోలే బాబా అసలు పేరు అక నారాయణ శంకర్‌ హరి, ఉరఫ్‌ సూరజ్‌ పాల్‌ జాతవ్‌. అతను గతంలో పోలీసు కానిస్టేబుల్‌, రేప్‌ కేసులో ఇరుక్కున్నందువల్ల ఉద్యోగం ఊడిపోయిందని చెపుతారు. అయితే, తనమీద కేసులేవీ లేవని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్యోద్యోగం నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నానని ఈ భోలే బాబా చెప్పుకుంటాడు. దళితుడిగా ఉద్యోగంలో చేరినా, ఇక ఇప్పుడు ఆ విషయం ఎక్కడా ఎత్తడు. అలిఘర్‌ గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డులో సువిశాలమైన స్థలంలో విలాసవంతమైన ‘ప్రవాస్‌ ఆశ్రమం’ ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఉండే వసతులన్నీ అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆస్తి వందల కోట్లు ఉంటుందని అంచనా. తన ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసుకోవడానికి, లీగల్‌ కేసుల్ని పరిష్కరించడానికి ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేశాడు. దాని పేరు శ్రీ నారాయణ హరి సకర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌. భోలే బాబా తెల్లని  సూట్‌ వేసుకుని, టై కట్టుకుని, నల్ల కళ్ళద్దాలతో సినిమా హీరోలాగా స్టైలిష్‌గా అభిమానులకి దర్శనమిస్తుంటాడు. ఆయనకు పెళ్లికాని యువతులు స్నానం చేయిస్తారు. అన్నం తినిపిస్తారు. మిగతా అన్ని పనులు చేస్తారు. టయోటా ఫార్చునర్‌లో బయలుదేరాడంటే వెంట మోటార్‌ సైకిళ్ల మీద కమెండోలు అనుసరిస్తారు. ఒక వివిఐపి వెళుతున్నట్టుగా వాళ్లు రోడ్డు ఆక్రమిస్తారు. ఏ అధికారం లేకపోయినా, ప్రజల మూర్ఖత్వమే తన బలం అన్నట్టు-అతని ప్రోటోకాల్‌ ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఈ విషయం ఏ మాత్రమూ పట్టించుకోవు. జన సామాన్యానికి అసౌకర్యం కలుగుతోందని పోలీసులు అడ్డగించరు. వివేకం నశించిన వారు ప్రభుత్వంలో, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నారు కాబట్టి, ఈ దేశంలో ఇలాంటి దొంగ బాబాల, సన్యాసుల ఆటలు సాగుతున్నాయి. హత్రాస్‌ తొక్కిసలాట మరణాలకు సంబంధించి-ఎఫ్‌.ఐ.ఆర్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యనిర్వహకుల పేర్లు చేర్చారు కానీ, అసలైన భోలే బాబా పేరు చేర్చలేదు. అంటే భోలే బాబాకు పరిపాలకులకు ఉన్న మైత్రీ బంధం స్పష్టంగా కనిపిస్తోంది కదా? రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ‘51ఎ’కి వ్యతిరేకంగా పాలకులు ప్రవర్తిస్తున్నట్లే కదా?  ఈ దొంగ బాబా అభిమానులు, ఆరాధకులు మాత్రం పేద కుటుంబాలకు చెందినవారు, నిమ్న కులాల వారు, వెనుకబడిన జాతుల వారు.ఈ బోలే బాబాకు అతీంద్రియ శక్తులున్నాయని, చనిపోయిన వారిని బతికిస్తాడని, అతని పాదాల కింద మట్టిని తీసుకుపోయి తమ దగ్గర ఉంచుకుంటే సుఖసంతోషాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మే ప్రజలకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? అదే నిజమైతే బోలేబాబా తన అద్భుత, అతీంద్రియ శక్తులతో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రాణం పోయాలి కదా? మరణించిన వారికి ఎందుకు అలా వదిలేశారూ? భోలే బాబా దర్శనం చేసుకున్న వారికి, ఆయన సత్సంగ్‌లో పాల్గొన్న వారికి ఆయురారోగ్యాలు లభించాలి కదా? ఐశ్వర్యవంతులు కావాలి కదా? మరి ఇన్నేళ్లుగా జనానికి ఇవి ఎందుకు లభ్యం కావడం లేదూ? దారిద్య్రం వారిని ఇంకా ఎందుకు వెంటాడుతూ ఉంది? ఆలోచించే పనే లేదా? బాబాలందరూ అతి సామాన్యమైన నేపథ్యంలోంచి వస్తారు. కానీ, సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. ప్రయివేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటారు. రాజకీయ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకుని, తమ దురాగతాలు బయటపడకుండా జాగ్రత్త పడతారు.  ఆశారాం బాపూ కావొచ్చు, గురుమీత్‌ రామ్‌ రహీమ్‌ కావొచ్చు, ఇచ్ఛాధారి భీమానంద్‌ చిత్రకూట్‌ వాలే కావచ్చు, చంద్రస్వామి కావచ్చు, స్వామి అమృత చైతన్య కావొచ్చు, స్వామి సదాచారి కావచ్చు, కృపాలూ కావొచ్చు, జగ్గీ వాస్‌దేవ్‌ కావొచ్చు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రవిశంకర్‌ కావొచ్చు, నిత్యానంద్‌ కైలాస్‌ కావొచ్చు, దేవ నాథన్‌ కావొచ్చు, వీళ్లందరి మీద అత్యాచారం కేసులున్నాయి. లేదా ఆదివాసుల, పేదల భూములు ఆక్రమించిన కేసులున్నాయి. లేదా పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలిగించిన కేసులున్నాయి. మరి పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ, షాలు ఏం చేస్తున్నట్టూ?దేశ నాయకులకు దొంగబాబాలకు తేడాయే లేకుండా పోయింది. ఇంకా వీరిని జైలుకు పంపేదెవరూ? స్వయాన భార్యను చంపినవాడు సద్గురుగా చలామణి అవుతున్నాడు. అతని యోగా సెంటరు నుంచి మాయమైన ఆరుగురి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.ఆదివాసుల భూములాక్రమించి ఈశా(ఈశ్వరా) ఫౌండేషన్‌ స్థాపించిన వాడికి ఈ పరిపాలకులు శిక్ష విధించగలరా? విధించలేరు. కారణం ఏమిటంటే వారు చేస్తున్న దురాగతాలు అలాంటివే కాబట్టి!  జస్టిస్‌ లోయను చంపించారనే ఆరోపణలున్న వారికి దేశంలో శిక్షే లేదు. ఒక ఫేక్‌ డిగ్రీతో చలామణి అవుతున్న వారి దగ్గర మన విద్వార్థిలోకం ‘నీట్‌’ పేపర్‌ లీకయ్యిందని మొరపెట్టుకుంటున్నారు. ఎలా ఉన్న దేశం! ఎలా అయిపోయిందీ?  దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నవారే ప్రజా స్వామ్య పరిరక్షణ గూర్చి మాట్లాడుతున్నారు. దొంగ సర్టిఫికెట్లు, దొంగ డిగ్రీలు సమర్పించి ఐఏఎస్‌లైన వారి మీద మీడియా తెగ ఉత్సాహం ప్రదర్శిస్తోంది. అది చేయాల్సిన పనే, దేశ ప్రజలు సంతోషిస్తున్నారు కూడా! మరి ప్రధాని మోడీ, అతని అనుచరుల సర్టిఫికెట్ల మీద ఈ మీడియా ఎందుకు ప్రశ్నించదూ? ఇలాంటి ఎన్నో విషయాల గూర్చి విసుగెత్తి ఈ దేశ ప్రజలు ప్రధాన మీడియాకు దూరమయ్యారు. విదేశీ మీడియాలో, యూట్యూబ్‌ ఛానళ్లలో వాస్తవాలు ఏరుకొంటున్నారు. ఓటర్లను అంధ విశ్వాసంలో ముంచి, జనాన్ని తమ భక్తులుగా/ అనుచరులుగా/ బాబాలు మార్చుకుంటూ ఉంటే- అంధ విశ్వాసంలో మునిగిన ఆ భక్తుల్నే ఈ దేశ నాయకులు తమ ఓటర్లుగా మార్చుకుంటున్నారు. వివేకం, విజ్ఞత లేని గొర్రెల్లాంటి జనమే వీరిరువురికీ అవసరం! బాబాలు ప్రజల్లో పుణ్యం, పాపం లాంటి భయాల్ని కలిగించి, ధన ప్రాప్తి లాంటి ఆశలు కల్పిస్తారు. దేశ నాయకులు అదే పని చేస్తున్నారు కదా? పుల్వామా అంటారు. పాకిస్థాన్‌ అంటారు. మెజారిటీ హిందువులకు మైనార్టీలయిన ముస్లింల వల్ల భద్రత లేదంటారు. భారత్‌లోకి చైనా, ఎన్నికిలో మీటర్లు చొచ్చుకుని వచ్చిందో, ఎంత భూమి ఆక్రమించిందో చెప్పండంటే మాత్రం నోరువిప్పరు. ఈ దేశ స్థాయిని ఇంతగా దిగజార్చిన నేటి ఈ ‘దేశభక్తి’ దేశ పాలకులకు-ఈ దేశ ప్రజలు ఏ విధమైన శిక్ష విధించాలి? ఒకరు జాతీయ స్థాయిలో, మరొకరు ప్రాంతీయ స్థాయిలో ఉన్నారు కానీ-మోసం చేయడంలో, ప్రజల ప్రాణాలు హరించడంలో భోలే బాబా అయినా, వేరే బాబా అయినా…  అందరూ ఒకటే! భోలే బాబా అక్కడ నిలబడి, మరణించిన వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి దొంగ దారిన పారిపోయాడు. పదిహేను రోజుల తర్వాత తన ఆశ్రమానికి తిరిగివచ్చి, చనిపోయిన వారికి సంతాపం/ నివాళి వంటివి ప్రకటించకుండా ‘‘చేసిన ఖర్మలకు ఎలాంటి వారైనా ఫలితం అనుభవిస్తారని, దాన్ని ఎవరూ తప్పించలేరన్’’ మెట్ట వేదాంతం వల్లించాడు. అంటే, ప్రజలు వారి ఖర్మానుసారమే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారన్నమాట! సంప్రదాయ వాదులకు నచ్చే ఒక అభూత కల్పన గురించి చూద్దాం- వాళ్లు పురాణాల్లో రాసుకున్నట్టు – సముద్ర మథనం జరిగింది, ఫలితంగా అమృతం, కామధేనువు, గరళం, అవినీతి వంటివి బయట పడ్డాయి. మొదటి రెండు మంచివి, దేవతలు తీసుకుపోయారు. మిగిలిన రెండింటిని ఈశ్వరుని ముందు పెట్టారు. ‘ఈ రెండిండినీ నేను స్వీకరించ లేను. ఒక్కటే స్వీకరిస్తాను. అయితే ఉన్న రెండింటిలో గరళాన్ని ఎవరూ భరించలేరు గనక, లోక కళ్యాణం కోసం నేను గరళం తాగుతున్నాను’ – అని శివుడు తాగేశాడు. మిగిలిన ‘అవినీతిని’ కొందరు భూ మండలం మీదున్న భారతదేశానికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న అతి పెద్ద రాజకీయ పార్టీ ఆ అవినీతిని మనసారా ఆహ్వానించి, స్వీకరించింది. తమ దగ్గర వాషింగ్‌ మిషన్‌ ఉందనీ అందులో ఎంతటి అవినీతినైనా ఉతికి శుభ్రపరుచుకుంటామనీ ప్రకటించింది. అప్పటి నుండి అవినీతి పరులైన రాజకీయ నాయకులు ఎక్కడ ఉన్నా వారిని ఆ పార్టీ ఆకర్షిస్తోంది. ఆ రకంగా దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చేస్తోంది. ఎంతటి అవినీతి జరిగినా, ఏమీ జరగనట్టు – తమ మూర్ఖత్వానికి అందమైన మేకప్‌ వేసి ఆ పార్టీ వారు దేశ ప్రజల ముందుకు తేగలుగుతున్నారు. ఎన్నికల బాండ్లు ఒక స్కామ్‌, రామాలయం ఒక స్కామ్‌, విదేశీ బొగ్గు అదానీ నుండి కొనాలనడం ఒక స్కామ్‌. బహిరంగంగా అందరికీ కనిపిస్తున్న విషయాలివి. ఈ దేశంలోని యువకులు మాత్రం పకోడీలు అమ్ముకోవాలని, పంచర్‌షాప్‌లు తెరుచుకోవాలని బీజేపీ నాయకులు ఉద్భోదిస్తున్నారు. డిగ్రీలు తీసుకోవడం దండగ అని కూడా చెపుతున్నారు. నిజమే దండగే! చరిత్రను వక్రీకరించి మొఘలుల కాలాన్ని తీసెయ్యడం, న్యాయ శాస్త్ర విద్యార్థులు ‘మనుస్మృతి’ చదవాలనడం  చేస్తున్నప్పుడు ఇక ఆ చదువుకు ఏ విలువ ఉంటుందీ?

హైకోర్టును ఆశ్రయించిన  సినీ నటుడు  రాజ్ తరుణ్ 

సినీ నటుడు రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పదేళ్ల క్రితం తనను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడని లావణ్య పోలీసులకు  ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నటుడిపై కేసు నమోదయింది. దీంతో ఆయన ఈరోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుని పదేళ్లు కాపురం చేసిన తర్వాత మరో నటి మాల్వి మల్ హోత్రాతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు లేవంటూ కేసు నమోదు చేయలేదు. రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను రాజ్ తరుణ్ కొట్టి పారేస్తున్నారు. తాను లావణ్యతో సహజీవనం  చేసినట్టు ఆయన ఒప్పుకున్నారు. చట్టబద్దంగా వివాహం జరిగినట్టు ఎలాంటి ప్రూవ్ లేకపోవడంతో లావణ్య డిఫెన్స్ లో పడిపోయింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా సామి శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్  లావణ్య విషయంలో స్పందించారు. తాను లావణ్యకు వ్యతిరేకం కాదని కోర్టులో పోరాడతానన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆర్జే శేఖర్ భాషా కూడా ఉన్నారు. రాజ్ తరుణ్ తరపున ఆయన పోరాడుతున్న సంగతి తెలిసిందే. 

మూడుదశాబ్దాల వర్గీకరణ పోరాటానికి శుభం కార్డు!

ఎస్సీ వర్గీకరణకోసం మూడుదశాబ్దాల పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో  శుభం కార్డు పడింది.సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్రధాన ధర్మాసనం గురువారం (ఆగస్టు 1)  వర్గీకరణకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల  ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది వినా మిగిలిన ఆరుగురు న్యాయమూర్తులు వర్గీకరణను సమర్ధిస్తూ తీర్పు వెలువరించారు. సమానత్వహక్కుకు వర్గీకరణ భంగం కాదని తీర్పు పేర్కొంది. అలాగే ఆర్టికల్ 341/2కు భంగంకలగకూడదనీ, ఆర్టికల్ 15,16 లలో వర్గీకరణను వతిరేకించే అంశాలు లేవని ఆ తీర్పులో పేర్కొన్నారు.   దీనివల్ల ఉప వర్గాలకు న్యాయం చేకూరుతుందని, రాష్ట్రాలకు ఉప వర్గీకరణ లో అవకాశం ఇవ్వాలని, ఎస్సీల్లో క్రిమీలేయర్ గుర్తించడానికి అవకాశం ఇస్తూ తీర్పు చెప్పడం చారిత్రాత్మకం. మాదిగలకు గుర్తింపు తెచ్చిన మందకృష్ణ మాదిగ 1972 నుంచి ఉమ్మడి ఏపీలోమారిన ప్రతి సీఎం వద్దకు  వెళ్లి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.వర్గీకరణకు సహకరించాలని కోరేవారు. 2011జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ల జనాభా 1.38 కోట్లమంది ఉన్నారు. వారిలో మాలలు 55.70లక్షలు, మాదిగలు67.02 లక్షల మంది ఉన్నారు.అంటే 11లక్షలమంది మాదిగలు ఎక్కువ ఉన్నారు.మాలమాదిగలు 80 శాతంగా ఉండగా,మిగిలిన 20 శాతంగాఉన్న  57 ఉపకులాల్లోఉత్తరాంధ్ర రెల్లి కులానిది మూడో స్థానం.70శాతంగా ఉన్న మాదిగ,దాని ఉపకులాలు రిజర్వేషన్లు 10శాతం పొందుతున్నారు. 30శాతంగా ఉన్న మాలలు వారి ఉపకులాలు 90శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని వారి వాదన. 2000-2004మధ్య చంద్రబాబు వర్గీకరణ అమలు చేసారు. కాని మాలమహానాడు వ్యతిరేకించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  హైకోర్టు వర్గీకరణ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2004లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం హైకోర్ట్ తీర్పు ను సమర్దిస్తూ తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఆనేక పోరాటాలు,ఉద్యమాలు నడిచాయి.చివరికి ఎన్నికల ముందు ప్రధాని మోదీ హైదరాబాద్లో జరిగిన విశావరూప సదస్సుకు హాజరై వర్గీకరణ ను సమర్దిస్తూ మాట్లాడారు. వర్గీకరణకు మద్దతు తెలిపారు.  మందకృష్ణ మాదిగ  ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మం గెలిచిందని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని పోరాటంలో అమరులైన వీరులకు అంకిత మిస్తున్నామన్నారు. ఈ విజయంలో  చంద్రబాబు పాత్ర కీలకమనీ, వర్గీకరణ విజయం క్రెడిట్ ఆయనకే   చెందుతుందన్నారు.  ప్రధాని  మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు వర్గీకరణ తీర్పు పై హర్షం వ్యక్తం చేసారు. ఇలా ఉండగా వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును మాలమహానాడు వ్యతిరేకించింది. న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. ఏది ఏమైనా సుప్రీం ప్రధాన ధర్మాసనం తీర్పుతో వర్గీకరణ వివాదానికి శుభం కార్డు పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అమరావతి నిర్మాణం ఇక పరుగులు.. యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. గత ఐదేళ్ల జగన్ హయాంలో   మూడు రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిర్ణీత కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టించేందకు చంద్రబాబు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.  అమ‌రావ‌తిలో ఆగిపోయిన నిర్మాణాలు ఏవీ, ఏ ప‌నులు ఏంత మేర పూర్తి అయ్యాయి, నిలిచిపోయిన భ‌వ‌నాల  సామర్ధ్యం ఇప్పుడు ఎలా ఉంది. మరమ్మతులు చేసి వినియోగించుకోవడానికి అవకాశం ఉందా అన్న అంశాలపై సీఆర్డీయే దృష్టి సారించింది.  ఇప్పటికే అమ‌రావ‌తికి సంబంధించి అన్ని నివేదిక‌లు తెప్పించుకున్న సీఎం… కీల‌క  సీఆర్డీయే  సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరిన తరువాత  సీఆర్డీఏ  స‌మావేశం జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. ఈ స‌మావేశానికి సీఎం చంద్ర‌బాబుతో పాటు మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయణ సహా  11మంది స‌భ్యులు హ‌జ‌రుకానున్నారు.  ఆగిపోయిన నిర్మాణాలు ప‌నికొస్తాయా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు  అమ‌రావ‌తికి ఐఐటీ నిపుణులు రానున్నారు. అలాగే గ‌తంలో నిలిచిపోయిన భూసేక‌ర‌ణ‌, కొత్త‌గా దరఖాస్తు చేసుకున్న కంపెనీల‌కు భూ కేటాయింపులు, కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 15వేల కోట్ల నిధుల వ్యయం , అందుకు విధి విధానాలతో పాటు ఈ సమావేశంలో విధానప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకునే అవ‌కాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిర్మాణాల విష‌యంలో సీఎం అక్క‌డిక‌క్క‌డే సూచ‌న‌లు చేసే వీలుంద‌ని అంటున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అమ‌రావ‌తి నుండే అన్ని కార్య‌క‌లాపాలు జ‌రిగేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు.  అలాగే శాశ్వ‌త నిర్మాణాల‌ను నిర్దుష్ట గడువులోగా పూర్తి చేయాలని  సీఎం ఇప్ప‌టికే సీఆర్డీఏకు సూచించారు. అవ‌స‌రం అయితే సీఆర్డీఏలో ఉద్యోగుల సంఖ్య‌ను పెంచుతామని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

లక్ష్మీపార్వతికి గౌరవ ఆచార్య హోదా ఉపసంహరణ

వైసీపీ హయాంలో  లక్ష్మీపార్వతికి లభించిన హోదాలు, బాధ్యతలను ఆంధ్రావర్సిటీ ఇప్పుడు తొలగిం చింది.  వైపీపీ అధికార ప్రతినిథి, తెలుగు అకాడమీ మాజీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతికి ఆంధ్రావర్శిటీ ఇచ్చిన గౌరవ ఆచార్య హోదాను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. గౌరవ ఆచార్య హోదాలో లక్ష్మీపార్వతికి ఇంత వరకూ ఎటువంటి వేతనం చెల్లించలేదని ఆయన తెలిపారు. కాగా వైసీపీ హయాంలో ఆమెను తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు ఏయూలో గౌరవ ఆచార్య హోదాతో పాటు విశ్వ విద్యాలయ పరిశోధకులకు మార్గదర్శనం వహించే బాధ్యత కూడా అప్పగించారు. ఇప్పుడు గౌరవ ఆచార్య హోదా ఉపసంహరించడంతో పాటు, పీహెచ్ డీ స్టూడెంట్స్ కు మార్గదర్శకురాలిగా వ్యవహరించే బాధ్యత నుంచి కూడా తప్పించారు.   

పొన్నవోలుకు ఆ అర్హత లేదు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనకు అదనపు భద్రత కల్పించాలంటూ పొన్నవోలు దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు తోసి పుచ్చింది. పొన్నవోలు పిటిషన్ పై గురువారం (ఆగస్టు1)న హైకోర్టులో విచారణ జరిగింది.  ఆ సందర్భంగా హైకోర్టు పోలీసు భద్రతకు పొన్నవోలుకు అర్హత లేదని పేర్కొంది. రాజ్యాంగ, చట్టబద్ధ పదవులు నిర్వహించడం  భద్రతకు అర్హత కాదని స్పష్టం చేసింది. ఎలాంటి ప్రాణహానీ లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా నిర్ధారించిందని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే సవాల్ చేసుకోవచ్చని పేర్కొన్న హైకోర్టు  ప్రాణహాని ఉందని నిర్ధారణ జరిగి, ప్రభుత్వం భద్రత కల్పిస్తే ఆ ఖర్చు పొన్నవోలే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

పారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన సింధు ప్రస్థానం.. చైనా షట్లర్ చేతిలో ఓటమి

పారిస్ ఒలింపిక్స్ లో తెలుగుతేజం, భారత ఏస్ షట్లర్ పీవీ సింధు ప్రయాణం ముగిసింది. వరుసగా మూడో ఒలింపిక్స్ లోనూ పతకం సాధించాలన్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. రియో ఒలింపిక్స్ లో రజతం, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సింధు పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగింది. అయితే క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఈ సారి చైనా గోడను బద్దలు కొట్టడంలో విఫలమైంది.   గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సింధూ.. చైనా క్రీడాకారిణి హే బిన్‌జియావో చేతిలో 19-21, 14-21తో ఓటమి చవిచూసింది.  తొలి గేమ్‌లో గెలిచే అవకాశం చేజార్చుకున్న సింధు ఆ తరువాత పుంజుకోలేకపోయింది. మ్యాచ్ ఆరంభంలోనే ఒత్తిడికి లోనైన సింధూ 1-5తో వెనకబడింది. ఆ తరువాత పుంజుకుని ప్రత్యర్థితో అంతరాన్ని 10-11కు తగ్గించింది. అనంతరం, చైనా క్రీడాకారిణి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో సింధూ కోలుకోలేకపోయింది.  ఇక రెండో గేమ్‌లో   బిన్‌జియావో సింధుపై పూర్తి ఆధిపత్యం సాధించింది.   టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ ఇదే బిన్‌జియావోను ఓడించి కాంస్య పతకాన్ని సాధించడం గమనార్హం. 

స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఏపీకి కేటాయించిన నిధులెన్ని?

స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నిధులెన్నో తెలపాలంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిలోక్ సభ  ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు బదులిచ్చారు. ఏపీలో స్మార్ట్ సిటీల పురోగతి, ఈ మిషన్ ఎప్పటి వరకూ కొనసాగిస్తారు? ఈ మిషన్ ను ఏమైనా కొత్త కార్యక్రమాలతో భర్తీ చేయాలనుకుంటున్నారా? అంటూ కేశినేని చిన్ని అగిగిన ప్రశ్నలకు సమాధానండా మంత్రి  తోఖాన్ సాహు 25 జూన్, 2015వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన  ఎస్.సి.ఎమ్  2025 మార్చి 31 వరకు అమ‌ల్లో వుంటుంద‌ని తెలిపారు. ఈ మిష‌న్ కింద‌ దాదాపు 100న‌గరాలు వుండ‌గా, అందులో ఎపి నుంచి కాకినాడ‌, తిరుప‌తి, అమ‌రావ‌తి వున్నాయ‌ని తెలిపారు.  ఎస్.సి.ఎమ్ కింద ఎంపికైన న‌గ‌ర ప్ర‌జ‌ల‌ అవ‌స‌రాలకు అనుగుణంగా ప్రాజెక్టులు, సౌక‌ర్యాల ప్రాధాన్య‌త  నిర్ణ‌యిస్తార‌ని వివరించారు. ప్రస్తుతం ఎస్.సి.ఎమ్ ను ఎలాంటి కొత్త కార్య‌క్ర‌మంలో భ‌ర్తీ చేయాల‌నే ప్ర‌తిపాద‌న లేద‌ని వివ‌రించారు. ఇక ఎపిలో ఎస్.సి.ఎమ్ కింద ఎంపికైన అమ‌రావ‌తి లో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రూ.1,048 కోట్ల రూపాయ‌లు నిధులు విడుద‌ల చేయ‌గా, 779.29 కోట్ల రూపాయ‌లు వినియోగించిన‌ట్లు చెప్పారు. అలాగే 20 ప్రాజెక్టులు గాను, 14 ప్రాజెక్టులే పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. కాకినాడ‌లో రూ.978 కోట్లుకి గాను రూ.783.57 కోట్లు, తిరుప‌తి లో రూ.578 కోట్ల‌కి గాను రూ.574 కోట్లు, విశాఖ‌ప‌ట్ట‌ణం లో రూ.986 కోట్ల‌కి గాను, 838.47 రూపాయ‌లు వినియోగించిన‌ట్లు తెలియ‌జేశారు. ఎపిలో మొత్తం 281 ప్రాజెక్టులు గాను, 234 ప్రాజెక్టులు మాత్ర‌మే పూర్తి చేసిన‌ట్లు వివ‌రించారు. అలాగే ఎపిలో  రూ.3,590.80 కోట్ల నిధులు విడుద‌ల చేయ‌గా, రూ.2,975.35 కోట్ల నిధులు మాత్ర‌మే వినియోగించిన‌ట్లు తెలిపారు.

జగన్ జిమ్మిక్కులు.. నవ్వుకుంటున్న జనం!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బుద్ధి చెప్పినా ఆయ‌న ఆలోచ‌న‌ల్లో మార్పు రావ‌డం లేదు. ఎంత‌ సేప‌టికీ చంద్ర‌బాబును గ‌ద్దె దించాలి.. చంద్ర‌బాబుకు బీజేపీకి దూరం చేయాలి.. తాను కేసుల నుంచి త‌ప్పించుకోవాల‌నే ఆలోచ‌నే త‌ప్ప‌.. రాష్ట్ర అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌న్న భావ‌న ఇసుమంతైనా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబును ఇబ్బంది పెట్టేందుకు, వైసీపీ ఉనికి కోసం జ‌గ‌న్ వేస్తున్న ఎత్తులు అంతే వేగంగా విక‌టిస్తున్నాయి. ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌రువాత కూడా జ‌గ‌న్ వైఖ‌రిలో మార్పు రాక‌పోవ‌డంతో వైసీపీని వీడేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో  వైఎస్సార్ జయంతి రోజున ఇడుపులపాయ‌కు వెళ్లిన జ‌గ‌న్‌కు అక్కడ వైసీపీ నేతలను వెతుక్కోవాల్సిన‌ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పాపాలకు కూటమి ప్ర‌భుత్వం నట్లు బిగిస్తుండ‌టంతో  వైసీపీ హ‌యాంలో రెచ్చిపోయిన‌ బడా నాయకులు వ‌ణికిపోతున్నారు. అంబటి రాంబాబు మిన‌హా  వైసీపీ పెద్ద‌లు ఇచ్చిన స్క్రిప్టు చ‌దివేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయి... వైసీపీని ఎప్పుడు వీడుదామా అని ఆ పార్టీ నేత‌లు ఎదురు చూస్తున్నారు. ఏపీలో వైసీపీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ల‌హాదారులు మాత్రం మా అంత మేధావులు ఎవ‌రూ లేర‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తూ.. బీజేపీ, చంద్ర‌బాబు మ‌ధ్య క‌య్యాలు పెట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలను చూసి ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు.  అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ సలహాదారులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అద్బుత‌మైన ఐడియాలు ఇచ్చి అడ్డంగా ముంచేశారు. ముఖ్యంగా వైనాట్ 175 అనే పెద్దపెద్ద ఫ్లెక్సీల మధ్య జగన్ చేత ర్యాంప్ వాక్ చెయ్యిస్తే.. జనాలు జేజేలు పలుకుతారని భావించారు. బస్సు యాత్ర, మధ్యలో బ్యాండేజీ డ్రామా చేయించారు. నిజంగా వేరే రాష్ట్రంలో అయ్యుంటే జ‌గ‌న్ నాట‌కాలు మ‌ళ్లీ ఫలించేవి. ఏపీ ప్ర‌జ‌లు చైత‌న్య‌వంతులు కావ‌డంతో ఒక్కఛాన్స్ ఇస్తే ఐదేళ్ల  నరకం చూపించిన జగన్‌కు.. సైలెంటుగానే   ఓటు ద్వారా వ‌యలెంటుగా రియాక్ట్ అయ్యారు. త‌ద్వారా కేవ‌లం 11 స్థానాల‌కే వైసీపీని ప‌రిమితం చేశారు. ప్ర‌జలే అలా ఆలోచిస్తే.. ఐదేళ్ల‌పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న చంద్ర‌బాబు నాయుడు, మూడోసారి కూడా దేశంలో అధికారాన్ని నిల‌బెట్టుకున్న బీజేపీ అగ్ర‌నేత‌లు ఏ స్థాయిలో ఆలోచిస్తార‌నే క‌నీస ఆలోచ‌న జ‌గ‌న్ కు లేక‌పోవ‌టంతో వారి ముందు కుప్పిగంతులేస్తూ  బొక్క‌బోర్లా ప‌డుతున్నాడు.  జ‌గ‌న్ స‌ల‌హా దారుల వ్యూహాలు ఎంత సిల్లీగా ఉన్నాయంటే.. రాజ‌కీయ విశ్లేష‌కులేకాదు.. ప్ర‌జ‌ల‌కూ న‌వ్వుకుంటున్నారు.  కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్ష పార్టీలు క‌నీసం ఆరు నెల‌లైనా స‌మ‌యం ఇస్తాయి. అప్ప‌టికీ ఇచ్చిన హామీల‌ను ప‌రిష్క‌రించ‌కుంటే ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాయి. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మ‌రుస‌టి రోజు నుంచి కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వాన్ని బెదిరింపుల‌తో హ‌నుమంతుడి ముందు కుప్పిగంతులు వేసిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓడిన వెంట‌నే మాకు రాజ్యసభలో 11 మంది, లోక్ సభలో న‌లుగురు మొత్తం కలిపి 15 మంది ఎంపీల బ‌లం ఉంది.. ఎన్‌డీఏ కూట‌మికి రాజ్యసభలో బలం లేదు.. మా మీద ఆధారపడాల్సిందే, మేము రాష్ట్ర ప్రయోజనాలకోసం మద్దతు ఇస్తాం అంటూ బీజేపీ అడకముందే ఏ2 విజయసాయి రెడ్డి చేత మీడియా ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పించాడు. త‌ద్వారా బీజేపీకి ట‌చ్‌లోకి వెళ్లి ఏపీలో చంద్ర‌బాబును ఇబ్బంది పెట్టాల‌నే వ్యూహాన్ని అమ‌లు చేశారు. కానీ, బీజేపీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ త‌రువాత విజయసాయి రెడ్డిని అమిత్ షా వ‌ద్ద‌కు పంపించాడు. అక్క‌డా ఫ‌లితం లేక‌పోవ‌డంతో.. నేరుగా బీజేపీని బ్లాక్‌మెయిల్  చెయ్యడానికి డిల్లీలో ధ‌ర్నాకు కూర్చున్నారు. ఏపీలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయి.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య‌లు చేస్తున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. శాంతిభ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయి ఏపీలో  రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలంటూ ఆ ధ‌ర్నా వేదిక‌గా జ‌గ‌న్ స‌హా, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ ధ‌ర్నాకు ఇండియా కూటమిలోని ఓ మూడునాలుగు పార్టీల నుండి ఒక్కో ఎంపీని రప్పించి తమ‌కు మ‌ద్ద‌తు చెప్పించుకున్నారు. వారితో రౌండ్ టేబుల్ ముచ్చ‌ట్లు పెట్టి.. న‌వ్వుతూ క‌బుర్లు చెప్పిన దృశ్యాల‌ను జాతీయ మీడియా ద్వారా బీజేపీకి తెలిసేలా చేశారు. త‌ద్వారా బీజేపీకి మాకు స‌హ‌క‌రించ‌క‌పోతే.. ఇండియా కూట‌మివైపు వెళ్తామ‌ని బెదిరించే ప్ర‌య‌త్నం చేశారు. బీజేపీ పెద్ద‌లు మాత్రం జ‌గ‌న్ ధ‌ర్నా గురించి ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. అయినా, బీజేపీ పెద్ద‌లు, చంద్ర‌బాబు మ‌ధ్య విద్వేషాలు సృష్టించే ప్ర‌య‌త్నాల‌ను జ‌గ‌న్ విర‌మించుకోలేదు.  జగన్‌తో పాటు తాడేపల్లి ప్యాలెస్‌లో విందు ఆరగించిన రాజ్‍దీప్ సర్దేశాయి దేశంలో పవర్‌ఫుల్‌ లీడర్ న‌రేంద్ర మోడీ అయితే.. రెండో ప‌వ‌ర్ ఫుల్ వ్య‌క్తి అమిత్ షా కాదు.. చంద్రబాబు నాయుడు అంటూ చెప్పుకొచ్చాడు. అవును ఇది నిజం అంటూ.. మోడీ, చంద్రబాబుల ఫ్లాష్ బ్యాక్, వివరిస్తూ ఒక డ్రామా పండించాడు. దీని వెనుక జ‌గ‌న్ కుట్ర‌కోణం ఉందని అంటున్నారు‌. అమిత్ షా దృష్టిలో చంద్ర‌బాబును విల‌న్‌గా చేయ‌డానికి జ‌గ‌న్ అండ్ కో ఆడిన ఆట‌లో భాగ‌మే ఇదంతాని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ఓ వైపు ఇండియా కూటమి.. లోక్‌స‌భ‌లో స్పీకర్ ఎన్నిక నుండి చంద్రబాబుకు గాలం వెయ్యడానికి ప్రయత్నిస్తూనే వుంది. మరో వైపు బడ్జెట్లో ఆంధ్రా పేరు ఎత్తితే.. బీజేపీని పార్లమెంటులో ర్యాగింగ్ చేస్తోంది. అదే స‌మ‌యంలో ఆంధ్రాకు బీజేపీకి బడ్జెట్లో చెప్పింది ఇవ్వడానికి ఖజానాలో ఏమీ పెట్టలేదు అంటూ కాంగ్రెస్ నేత‌ జయరాం రమేశే తెలివి తేటలు ఒలకబోస్తున్నాడు. బీజేపీ నుంచి చంద్ర‌బాబును దూరంచేయ‌డానికి ఇండియా కూట‌మి నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీఇన్నీ కావు. రాజ‌కీయాల్లో త‌ల‌పండిపోయిన బీజేపీ పెద్ద‌లు, చంద్ర‌బాబు ఇండియా కూట‌మి నేత‌ల డ్రామాల‌ను లైట్‌గా తీసుకుంటున్నారు. మ‌ధ్య‌లో జ‌గ‌న్ కుప్పిగంతుల‌ను చూసి కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు న‌వ్వుకుంటున్నారు‌. ఇదంతా ఒక‌లెక్క అయితే.. త్వ‌ర‌లో చంద్ర‌బాబు ఆడ‌బోయే ఆట‌కు జ‌గ‌న్ దిమ్మ‌తిర‌గ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. హ‌నుమంతుడి ముందు కుప్పిగంతులు వేసిన‌ట్లు ఎగురుతున్న వైసీపీ నేత‌ల‌కు త్వ‌ర‌లో గ‌ట్టి షాకిచ్చేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి‌. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు పాల‌న‌పై దృష్టిపెట్టారు. కలెక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీల వరకు ప్రక్షాళన పూర్త‌యింది. ఇక   వైసీపీ అవినీతి హయాంలో ఆ పార్టీ నేతల అవినీతి గుట్టు బయటపెట్టడానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు.   అటు రాజ్యసభ సభ్యులుకూడా వైసీపీని వీడ‌బోతున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. వైసీపీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యులు చేజారితే వైసీపీ గేమ్ క్లోజ్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తున్నది. త‌ద్వారా సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు ముందు జ‌గ‌న్ కుప్పిగంతులకు కూడా ఎండ్ కార్డ్ ప‌డ‌టం ఖాయం.

ఏపీలో .జాతీయ రహదారులకు కేటాయించిన నిధులెన్ని?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జాతీయ రహదారుల కోసం గత ఐదేళ్లలో కేటాయించిన నిధుల వివరాలు తెలపాలంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నించారు. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సంధించిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌, అనంత‌పురం, ఏలూరు జిల్లాల్లో గ‌త ఐదేళ్లుగా జాతీయ ర‌హ‌దారుల ప‌నుల కోసం కేటాయించిన నిధులు, విడుద‌ల చేసిన నిధులు, వాటి వినియోగం పై   విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్, హిందూపురం ఎంపి  బి.కె. పార్ధసారథి,  అనంతపురం ఎంపి అంబికా జి లక్ష్మీనారాయణ,  ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్,  చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావులు సమాధానం కోరారు. వా  విజ‌య‌వాడ‌,  అనంతపురం జిల్లాలలో  జాతీయ ర‌హ‌దారుల  లైన్ల  సంఖ్యను పెంచడానికి ఎన్‌హెచ్‌ లను అప్‌గ్రేడ్‌ చేయడానికి ఎంచుకున్న వివ‌రాలు?  ఆంధ్రప్రదేశ్‌లో ఈ పనులను పూర్తి చేయడానికి గ‌డువు  తెలియ‌జేయాల‌ని కోరారు.  ఈ ప్రశ్నలకు కేంద్ర  రోడ్డు, ర‌వాణా ర‌హాదారుల మంత్రి నితిన్ గ‌డ్క‌రీ బ‌దులిస్తూ  ఎపిలో రహదారులను మెరుగుపరచడానికి  అప్‌గ్రేడ్‌ చేయడానికి నిరంత‌రం డిపిఆర్ త‌యారు చేస్తుంటార‌ని తెలిపారు. అలాగే గత 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయరహదారుల అభివృద్ధి , నిర్వహణ పనుల కోసం  2019-20 ఏడాది గాను రూ.6,341 కోట్ల రూపాయలు, 2020-21 ఏడాది గాను రూ.4, 288 కోట్ల రూపాయలు, 2021-22 ఏడాది గాను రూ.5,913 కోట్ల రూపాయలు, 2022-23 ఏడాది గాను  రూ. 6,957 కోట్ల రూపాయలు, 2023-24 ఏడాది గాను రూ.11, 780 కోట్ల రూపాయల నిధులు కేటాయించి వినియోగించిన‌ట్లు  వివ‌రించారు.   ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం  2,380 కిలోమీట‌ర్ల జ‌రుగుతుండ‌గా,  92 లైన్ల పెంపు కోసం రు.51,429 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు  తెలిపారు. ఎపిలో అనుమ‌తి పొందాల్సిన  జాతీయ ర‌హ‌దారుల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.15,674 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు. ఇందులో 789 కిలోమీట‌ర్ల  జాతీయ ర‌హ‌దారి నిర్మాణం, 25 లైన్ల పెంపు వుంద‌న్నారు.