jagan illigal party offices

రాష్ట్రమంతటా వైసీపీ పాము పిల్లలే!

జగన్ అధికారంలో చేసిన ఘనకార్యం రుషికొండ ప్యాలెస్‌ ఇచ్చిన షాక్ నుంచి నుంచి ఆంధ్రప్రదేశ్ జనాలు తేరుకునే లోపే, ఈసారి పార్టీ ఆఫీసుల రూపంలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ దిక్కుమాలిన వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా  వున్న 26 జిల్లాల్లో చాలా విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో పార్టీ ఆఫీసుల పేరుతో ప్యాలెస్‌లను కడుతోంది. తాడేపల్లి ప్రాంతంలోని ప్రధాన కార్యాలయాన్ని కూలగొట్టిన తర్వాత, తల్లిపాముని చంపిన తర్వాత పుట్టలోంచి పిల్లపాములు బయటపడ్డట్టు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసుల పేరుతో వైసీపీ చేసిన అక్రమాలు బయటకి వస్తున్నాయి. ఆ పిల్ల పాములను కూడా చంపాల్సిన అవసరం వుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వైసీపీ అక్రమ ఆఫీసుల వివరాలు ఇవిగో... 1. శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జాతీయ రహదారి పక్కన వున్న రెండు కోట్ల విలువైన ఎకరంన్నర ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులూ లేకుండా వైసీపీ పార్టీ ఆఫీసుని కడుతున్నారు. దీని నిర్మాణం తుది దశలో వుంది. 2. విజయనగరం జిల్లా:  విజయనగరం మహారాజుల భూమిలో జగన్ పార్టీ పాగా వేసింది. మూడున్నర కోట్ల విలువ చేసే ఎకరం భూమిలో అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసు నిర్మిస్తోంది. ఈ ఆఫీసు నిర్మాణం 85 శాతం పూర్తయింది. 3. పార్వతీపురం మన్యం జిల్లా:  గతంలో రైతు శిక్షణ కేంద్రాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేసిన రెండు కోట్ల విలువ చేసే ఎకరం పావు భూమి మీద జగన్ కన్ను పడింది. అంతే.. అనుమతులు లేకుండా వైసీపీ పార్టీ ఆఫీసు నిర్మాణం ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఈ కట్టడం నిర్మాణం తుది దశలో వుంది. 4. విశాఖపట్నం జిల్లా:  రెవెన్యూ ఉద్యోగుల కోసం కేటాయించిన రెండెకరాల భూమిని జగన్ కాటేశాడు. ఈ భూమి విలువ అక్షరాలా వంద కోట్లు. అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసు నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. 5. అనకాపల్లి జిల్లా: కాపు భవనానికి శంకుస్థాపన చేసి, 50 లక్షలు కూడా కేటాయించిన 1.75 ఎకరాల భూమిని జగన్ పార్టీ సొంతం చేసుసుకుంది. ఈ భూమి విలువ 15 కోట్లు. ఈ భవనం నిర్మాణం పూర్తి చేసుకుంది. దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు. 6. అల్లూరి సీతారామరాజు జిల్లా:  గిరిజనులు సాగు చేసుకునే రెండకరాల భూమిని వైసీపీ సొంతం చేసుకుంది. ఈ భూమి విలువ ఐదు కోట్లు. ఇది తమ సాగుభూమి అని గిరిజనులు అడ్డుకోవడంతో వైసీపీకి బ్రేకులు పడ్డాయి.  ప్రస్తుతం ఈ భూమి వివాదం కోర్టులో వుంది. 7. కాకినాడ జిల్లా: 22ఎ నిషేధిత భూముల జాబితాలో వున్న 1.93 ఎకరాల భూమిలో వైసీపీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. ఈ భూమి విలువ 75 లక్షలు.  8. తూర్పు గోదావరి జిల్లా: ఆర్ అండ్ బి అతిథి గృహం వెనుక వున్న ఆర్ అండ్ బీకే చెందిన స్థలాన్ని వైసీపీ తన సొంతం చేసేసుకుంది. 45 కోట్ల విలువైన ఈ భూమిలో వైసీపీ కార్యాలయం నిర్మాణం పూర్తయింది. సహజంగానే ఈ నిర్మాణానికీ అనుమతి లేదు. 9. అంబేద్కర్ కోనసీమ జిల్లా: పది కోట్ల విలువైన, ఒక ఎకరం మందబయలు చెరువుభూమిలో తన కార్యాలయాన్ని నిర్మించడానికి వైసీపీ ప్రయత్నించింది. అయితే ఈ భూమి వివాదం ఇప్పుడు కోర్టులో వుంది. 10. పశ్చిమ గోదావరి జిల్లా: ఏడు కోట్ల విలువైన 0.72 ఎకరాల విస్తీ్ర్ణం గల విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఉద్దేశించిన భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయ నిర్మాణానికి వైసీపీ పూనుకుంది. ఇక్కడ పనులు ప్రస్తుతం శ్లాబ్ వరకు చేరుకున్నాయి. 11. ఏలూరు జిల్లా: స్టేడియాన్ని నిర్మించే ప్రతిపాదన వున్న క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన ఐదు కోట్ల విలువైన రెండెకరాల భూమిని వైసీపీ కొట్టేసింది. అనుమతులు లేకుండా కార్యాలయాన్ని నిర్మించేసింది. 12. ఎన్టీఆర్ జిల్లా: గతంలో వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదించిన కార్మిక శాఖకు చెందిన 50 కోట్ల విలువైన ఎకరం భూమిని వైసీపీ సొంతం చేసేసుకుంది. ఇక్కడ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం మొదటి అంతస్తు శ్లాబ్ పూర్తి చేసుకుంది. 13. కృష్ణా జిల్లా: మచిలీపట్నం కోర్టు సెంటర్లోని రద్దీ ప్రదేశంలో వున్న 60 కోట్ల విలువైన రెండెకరాల భూమిలో జగన్ తన పార్టీ కార్యకలాపాల కోసం ఇంద్రభవనం లాంటి భవంతిని నిర్మించారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేవు. 14. గుంటూరు జిల్లా: మొన్న కూలగొట్టిన భవనం ఈ జిల్లాలోదే. బోట్ యార్డుకు చెందిన రెండెకరాల భూమిలో  వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మించడానికి శ్లాబ్ కూడా వేశారు. అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వం కూలగొట్టింది. 15. పల్నాడు జిల్లా: కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం పక్కనే వున్న 22.50 కోట్ల విలువైన 1.50 ఎకరాల అగ్రహారం భూమిలో అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసు నిర్మించారు. 16. బాపట్ల జిల్లా:  బైపాస్ రోడ్డు పక్కన ఆర్టీసీకి కేటాయించిన నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన 1.64 ఎకరాల భూమిలో అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయం 90 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 17. ప్రకాశం జిల్లా: జాతీయ రహదారి పక్కనే వున్న జలవనరుల శాఖకు చెందిన 1.64 ఎకరాల భూమిలో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారభమైంది. నాలుగున్నర కోట్ల విలువైన ఈ భూమిలో అనుమతులు తీసుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. 18. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: పది కోట్లు విలువైన టిడ్కో ఇళ్ళకు కేటాయించిన రెండు ఎకరాల భూమిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం 90 శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది. 19. కర్నూలు జిల్లా: వంద కోట్ల విలువైన 1.60 ఎకరాల భూమి. కర్నూలు నడిబొడ్డున వున్న ఈ భూమిని గతంలో ఏపీ ఆగ్రోస్ సంస్థకు కేటాయించారు. ఆ భూమిని జగన్ తన పార్టీకి మళ్ళించుకుని, ఎలాంటి అనుమతులు లేకుండా కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. 20. నంద్యాల జిల్లా: జగనన్న కాలనీ పక్కనే వున్న ఏడు కోట్ల విలువ చేసే ఎకరం భూమిలో ఎలాంటి అనుమతులూ లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి పునాదులు వేశారు. 21. వైఎస్సార్ కడప జిల్లా: కడప ముఖద్వారం దగ్గర వున్న 30 కోట్ల విలువైన రెండెకరాల కమర్షియల్ భూమిని కొట్టేసి, అనుమతులు లేకుండా జగన్ నిర్మి్స్తున్ వైసీపీ కార్యాలయం నిర్మాణం పూర్తయ్యే దశలో వుంది. 22. అన్నమయ్య జిల్లా: ఇక్కడ గయాళు భూమిలో పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. ఇటువంటి వాటికి భూమిని ఇవ్వకూడదు. అందువల్ల ఆ భూమిని రికార్డులలో ఏడబ్ల్యు భూమిగా మార్చి సొంతం చేసుకున్నారు. ఇక్కడ పార్టీ ఆఫీసు నిర్మాణం పూర్తయ్యే దశలో వుంది. అనుమతులు లేవు. 1.61 ఎకరాల విస్తీర్ణం వున్న ఈ భూమి విలువ 12 కోట్ల రూపాయలు. 23. అనంతపురం జిల్లా: జలవనరుల శాఖకు చెంది. 45 కోట్ల విలువైన 1.50 ఎకరాల భూమిలో అనుమతి లేకుండా నిర్మించిన వైసీపీ ఆఫీసు తుది మెరుగులు దిద్దుకుంటోంది. 24: శ్రీ సత్యసాయి జిల్లా: విమానాశ్రయం ఎదురుగా వున్న 20 కోట్ల విలువైన 1.30 ఎకరాల భూమిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఆఫీసు పూర్తయ్యే దశలో వుంది. 25. తిరుపతి జిల్లా: విమానాశ్రయానికి సమీపంలో వున్న 14 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తి చేశారు. 26: చిత్తూరు జిల్లా: ఇతరుల ఆధీనంలో వున్న 17 కోట్ల విలువైన 2 ఎకరాల భూమి మీద పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం జగన్ కన్నేశాడు. అనుమతులు లేకుండా నిర్మాణం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ భూమి వివాదం కోర్టులో వుంది. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 677.50 కోట్ల విలువైన 42.24 ఎకరాల ప్రభుత్వ భూమిని జగన్ తన పార్టీ కార్యాలయ పేరుతో స్వాహా చేసేశాడు.

lavu as tdp parliamentery party leader

టీడీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా శ్రీకృష్ణదేవరాయలు

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు  లావు శ్రీకృష్ణదేవరాయలుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, బైరెడ్డి శబరిలను నియమించారు. కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని, పార్లమెంట్ విప్‌గా గంటి హరీష్‌లను ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం గురించి, రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు ఏం చేయాలన్న దాని మీద చర్చ జరిగింది.

vizag film nagar cultural center

వైజాగ్‌లో కూడా వైఎస్సార్ పేరు పీకేశారు!

జగన్ అధికారంలో వుండగా మాటమాటకీ, వెంట్రుక కూడా పీకలేరు అంటూ వుండేవారు. ఇప్పుడు వైసీపీ అధికారం పోయిన తర్వాత తెలుగు ప్రజలు పీకాల్సినవన్నీ పీకేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల అధీనంలో ఉన్న వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌కి గతంలో బలవంతంగా వైఎస్సార్ పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరుని కల్చరల్ సెంటర్ సభ్యులే పీకి అవతల పారేశారు. 2014లో ఏర్పాటైన VFNCC లో ప్రస్తుతం 16 వందలకు పైగా సభ్యులున్నారు. దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఎస్.రామారావు. బోర్డు మీద వున్న వైఎస్సార్ పేరు పీకేసిన శుభ సందర్భంలో కె.ఎస్.రామారావుతో కలిసి గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ హయాంలో అధికారం దన్నుతో ప్రస్తుత కమిటీ అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది. అడ్డగోలుగా సభ్యత్వాలు నమోదు చేసి, బైలా మార్చినట్టు ఫిర్యాదులు ఉన్నాయ్. గత ఐదేళ్ల కాలంలో VFNCCలో సినిమా పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుత  పాలకవర్గం స్వచ్చందంగా తప్పుకోక పోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గంటా శ్రీనివాస్ హెచ్చరించారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి అప్పట్లో చంద్రబాబు కల్చరల్ క్లబ్ ఏర్పాటుకు సహకరించారని, చంద్రబాబు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తామని కేఎస్ రామారావు చెప్పారు.

ycp office demolition

వైసీపీ ఆఫీసు బిల్డింగ్ కూల్చివేత – నిజాలు

• డొక్కా మాణిక్య వర ప్రసాద్ 05.01.2023న తాడేపల్లి సర్వే నెం. 202/A బోట్ యార్డు స్థలం వైసీపీ ఆఫీసుకు కేటాయించాలని దరఖాస్తు చేశారు. • తెనాలి సబ్ కలెక్టర్ 01.02.2023న ప్రపోజల్ పంపిస్తూ సి.ఆర్.డి.ఏ వారు 5.35 ఎకరాలు సీడ్ యాక్సస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారని ఈ భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్ శాఖ అనుమతి కావాలని నివేదించారు. • సిసిఎల్ఎ 02.02.2023నే దానిని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 07.02.2023వ తేదిన ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోకుండానే దీనిని కేబినెట్ లో పెట్టి ఆమోదం తీసుకున్నారు. • 16.02.2023న జిఓ నెం. 52 విడుదల చేస్తూ "ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని" అంతకుముందే వైసీపీ ఆఫీసు కోసం కొరిటపాడులో ఇచ్చిన 98 సెంట్ల స్థలాన్ని (జిఓ నెం. 362, తేది. 18.05.2022) వెనకకు తీసుకోవాలని నిర్దేశించారు. • అప్పటికే 02.02.2023న ఇరిగేషన్ శాఖ ఛీప్ ఇంజినీర్ శ్రీ సి. నారాయణ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాస్తూ సర్వే నెం. 202/A లోని బోటు యార్డ్ స్థలం పార్టీ ఆఫీసులకు ఇవ్వడం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చి తీర్పులకు విరుద్ధమని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో సచివాలయం కోసం ఇటువంటి స్థలాన్ని ఇచ్చిన కేసు ఇంకా విచారణలో ఉందని దానిని ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఆయన తన నివేదికలో ఆ సర్వే నంబర్లోని మొత్తం స్థలం 19 ఎకరాలు అని అందులో 9 ఎకరాలలో కాలవ పారుతుందని మరొక 5 ఎకరాలు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకి రెవెన్యు శాఖ కోరిందని మూడు ఎకరాలు మాత్రమే మిగిలిందని అది కూడా నది తీర ప్రాంతమని తెలియజేశారు. ఆ మిగిలిన స్థలంలో ఇరిగేషన్ శాఖ తరఫున శిక్షణ మరియు పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని కావున వైసీపీ పార్టీ ఆఫీసుకు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. • ఈ లెటర్ ను ఊటంకిస్తూనే పార్టీ ఆఫీసుకు స్థలాన్ని కేటాయించడం ఆ జిఓలోనే ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని నిర్దేశించడం అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడిని ఎత్తి చూపుతుంది. • జిఓను అనుసరించి ఇరిగేషన్ శాఖ అనుమతులను తీసుకోవాల్సిన సిసిఎల్ఎ గానీ, కలెక్టర్ గానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తాహశీల్దార్‌కు ఎండార్స్.మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తాహశీల్దార్ గారు 31.03.2023న స్థలాన్ని ఇరిగేషన్ అనుమతి లేకుండానే వైసీపీ పార్టీకి అప్పగించేశారు. • భవన నిర్మాణానికి సి.ఆర్.డి.ఏ నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండానే మొదలు పెట్టి కొనసాగించారు. ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోనందున భూమి కొరకు ఏ విధమైన లీజు ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. ఇది పూర్తి అధికార దుర్వినియోగం. • దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తులు ప్రజలు దాఖలు చేశారు. ఆ ఒత్తిడికి తలొగ్గి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ వారు 20.05.2024న వైసీపీ పార్టీ వారికి షోకాజ్ నోటీసు ఇస్తూ ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోవాలని కోరారు. • వైసీపీ సమాధానం రాకపోవడం వల్ల తిరిగి 01.06.2024న మరొక సారి నోటీసులు జారీ చేశారు. అంటే కౌంటింగ్ తేది. 04.06.2024కు ముందే ఇది జరిగింది. సమాధానం వైసీపీ ఇవ్వలేదు. • ఈ నేపథ్యంలో 14.06.2024న కూల్చివేత ఉత్తర్వులను తాడేపల్లి మున్సిపల్ కమీషనర్ వారు జారీ చేశారు. • కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం 10.06.2024న నోటీసు ఇస్తూ భవనం నిర్మిస్తున్న రాంకీ ఇన్ ఫ్రా సంస్థ మరియు వైసీపీ పార్టీ వారికి కూల్పివేత నోటీసులు ఇవ్వడం జరిగింది. 20.06.2024 వరకు సమాధానం రాలేదు.  • వైసీపీ 21.06.2024న హైకోర్టులో వేసిన కేసులో చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. అప్పటికే అనేక సార్లు అవకాశం ఇచ్చినా సమాధానం లేనందున 22.06.2024న అధికారులు నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చి వేశారు. సి. ఆర్.డి.ఏ చట్టం సెక్షన్ 115 ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చి వేసే హక్కు సి.ఆర్.డి.ఏ అధికారులకు ఉంది. సెక్షన్ 114 ప్రకారం ఈ అక్రమ నిర్మాణాలను కొనసాగించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుని మూడేళ్ళు జైలు శిక్ష విధించడానికి కూడా చట్టం అవకాశం కల్పించబడింది.

ycp office demolition

అమరావతికి వెళ్ళే రోడ్డుకి అడ్డంగా కట్టారు.. అందుకే లేపేశారు!

అమరావతికి ఇక అడ్డుపడేవాడే లేడు. ఎవడు అడ్డుపడినా నేలమట్టం అయిపోతాడు. ఇప్పుడు అమరావతి రోడ్డుకి అడ్డంగా వున్న జగన్ పార్టీ ఆఫీసు కూలిపోయింది. ఇది శాంపిల్ మాత్రమే. రాజధాని  సీడ్ ఆక్సిస్ రోడ్డుకి అడ్డంగా వైసీపీ పార్టీ ఆఫీసు కట్టారు మరి. సరిగ్గా సీడ్ యాక్సిస్ రోడ్డుకి ప్రపోజ్ చేయబడిన స్థలంలో, పార్టీ ఆఫీస్ కోసం లీజుకు తీసుకుని పర్మిషన్లు లేకుండా నిర్మాణం చేయబడిన స్థలం. అందువల్లే అత్యవసరంగా నిర్ణయం తీసుకున్నారు మరి. యాగి చేస్తే రాజధానికి రోడ్డు లేకుండా చేయాలనుకున్న నీ బుద్ధి బయటపడుతుంది చూస్కో మిస్టర్ జగన్.

revanth compitetion with chandrababu

రేవంత్‌రెడ్డి... 6 గంటలు ఓవర్ టైమ్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పుడు తన పనిగంటలను మరో ఆరుగంటలు పెంచుకుని ఓవర్ టైమ్ చేయాలని ఫిక్సయ్యారు. రేవంత్ ఇలా 6 గంటలు ఓవర్‌టైమ్ చేయడానికి కారణమెవరో తెలుసా? ఇంకెవరు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు అరగంట కూడా పనిచేయని ముఖ్యమంత్రి జగన్ వున్నాడు కాబట్టి, రోజుకు 12 గంటలు పనిచేసే రేవంత్‌రెడ్డికి పోటీయే ఉండేది కాదు. మరిప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి రోజుకు 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు పగ్గాలు తీసుకున్నారు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి 12 గంటల దగ్గరే ఆగిపోతే ఎలా? చంద్రబాబు నాయుడితో ఆయన, ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ పోటీ పడాలంటే పనిగంటలను పెంచుకోవాల్సిన అవసరం వుంది కదా.. అందుకే రేవంత్ 18 గంటల పరిశ్రమకు షిఫ్టయ్యారు. ఈ విషయాన్ని రేవంత్ ‌రెడ్డే స్వయంగా చెప్పారు. హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం నాకు వచ్చింది. ఆయన 18 గంటలు పని చేస్తున్నప్పుడు నేను 12 గంటలే పనిచేస్తే ఎలా? అందుకే నాతోపాటు తెలంగాణ నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందే. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడాలి. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

cleansing started from tirumala

శ్రీవారి సన్నిధి నుంచే ప్రక్షాళనకు శ్రీకారం!

జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో తిరుమల పవిత్రతను అన్ని విధాలుగా భ్రష్టుపట్టించేశారు. అన్న ప్రసాద నాణ్యత నుంచి, భక్తులకు సౌకర్యాల వరకూ అన్నిటా కోత విధించారు. కొండపై అన్యమత ప్రచారం మొదలుకుని అన్యమతస్థులకు టీటీడీలో కొలువుల వరకూ ఏది పడితే అది చేసేశారు. అంతేనా నాస్తికుడిననని బాహాటంగా చాటి, తిరుమలేశుని విగ్రహాన్ని నల్లరాతి బండగా అభివర్ణించిన భూమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించడం వరకూ సకల అపచారాలకూ పాల్పడ్డారు.   వాస్తవానికి గతంలో అంటే వైఎస్ హయాంలో భూమనను టీటీడీ చైర్మన్ గా నియమించిన సమయంలోనే పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దైవాన్నినమ్మని నాస్తికుడికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడమేమిటని పలువురు ఆగ్రహం వ్యక్త  చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ కూడా అదే చేశారు. భూమన కూడా టీటీడీ చైర్మన్ గా తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యాల మెరుగు పరచడానికి కాకుండా తన కుమారుడు తిరుపతి నుంచి ఎన్నిక అయ్యేందుకు అవసరమైన నిధులను సరఫరా చేసే ఏటీఎంలా తన పదవిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు. తిరుపతి అభివృద్ధికి శ్రీవారి నిధులను వినియోగించేందుకు టీటీడీ బోర్డు అనుమతి ఇచ్చేలా ఆయన చక్రం తిప్పారు. వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డిని వరుసగా రెండు పర్యాయాలు జగన్ టీటీడీ చైర్మన్ గా నియమించడమే వివాదాస్పదమైంది. ఆయన పదవీ కాలం ముగియగానే జగన్ భూమనను నియమించారు. సరే వీరి హయంలో తిరుమలకు వచ్చే యాత్రకులు నరకం అనుభవించారంటే అతిశయోక్తి కాదు. అన్న ప్రసాదం నాణ్యత నాసిరకంగా మారిపోయింది. క్యూలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు గతంలో టీటీడీ సరఫరా చేసే అన్న ప్రసాదం జల ప్రసాదమూ కూడా బంద్ అయిపోయాయి. ఇక యాత్రికులకు కాటేజీల అద్దెను ఆకాశమే హద్దుగా పెంచేశారు. రద్దీ పెరిగిన ప్రతిసారీ యాత్రికులకు కొండకు రావద్దంటూ టీటీడీ ప్రకటనలు జారీ చేయడం పరిపాటిగా మారిపోయేది. ఇక నడకదారి భక్తల ప్రాణాలకు పూచీ లేని పరిస్థితి ఏర్పడింది. వన్య ప్రాణుల నుంచి రక్షణకు కర్రలు సరఫరా చేసి నవ్వుల పాలైంది.   తిరుమల పవిత్రతను మంటగలిపి యాత్రికులు కొండకు రాకుండా చేయడమే ధ్యేయమా అన్నట్లుగా జగన్ హయాంలో  పరిస్థితి మారిపోయింది. అందుకే  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తరువాత తిరుమల దేవుని దర్శించుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి నుంచే ప్రక్షాళనకు శ్రీకారం చుడతానని ప్రకటించారు. అన్నట్లుగానే చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన రోజుల వ్యవధిలోనూ ప్రక్షాళన ఆరంభమైంది. అందుకు సంబంధించి మార్పు స్పష్టంగా కళ్లకు కడుతోంది. శ్రీవారి అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది. క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, జల ప్రసాదం అందుతున్నాయి. పిల్లలకు పాలు అందిస్తున్నారు. తిరుమల కొండపై గత ఐదేళ్లుగా కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిశుభ్రత, పారిశుద్ధ్యం ఇప్పుడు అడుగడుగునా కనిపిస్తున్నాయి. భక్తులు ఈ మార్పుల పట్ల హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి. 

ycp building collaps

మచిలీపట్నంలోనూ వైసీపీ అక్రమ కట్టడం!

వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమ కట్టడాల నిర్మాణానికి పాల్పడింది. ఇప్పటికే తాడేపల్లి ప్రాంతంలో అక్రమ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చింది. అలాగే విశాఖ, అనకాపల్లిలో వున్న కట్టడాల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారింది. మచిలీపట్నంలో కూడా వైసీపీ పార్టీ కార్యాలయం పేరుతో అక్రమ కట్టడాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో అధునాతన సదుపాయాలతో నిర్మాణం వైసీసీ కార్యాలయం నిర్మాణం పూర్తి అయ్యే దశలో వుంది. ఇప్పుడు అధికారులు ఈ కట్టడం మీద దృష్టి సారించారు. పోలీసు గ్రౌండ్స్.లో వున్న రెండెరకాల స్థలాన్ని మునిసిపాలిటీలో మూజువాణి ఓటుతో ఆమోదించుకుని వైసీపీ కృష్ణాజిల్లా కార్యాలయ నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి ఈ భూమి పోలీసు శాఖది. పోలీసు శాఖపై ఒత్తిడి తెచ్చి.. మునిసిపాలిటీ పాలక మండలి అనుమతితో ఈ అక్రమన నిర్మాణం చేపట్టారు. ఈ భూమిపై నిజానికి మునిసిపాలిటీకి అధికారం లేదు. పైగా ఒక రాజకీయ పార్టీకి 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ మునిసిపాలిటీ పాలక మండలి ఆమోదం తెలపటం అభ్యంతరకరమని అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాదించింది. కానీ అధికార బలంతో ఈ భూమిని జగన్ పార్టీ స్వాధీనం చేసుకుంది. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో భోగరాజు సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి యూనియన్ బ్యాంకు ముందుకు వచ్చింది. కానీ ప్రభుత్వం  భూమి ఇవ్వలేదు. ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంపీ బాలశౌరి కృషి చేశారు. అయితే, బాలశౌరి మీద వ్యతిరేకతతో అప్పటి ఎమ్మెల్యే పేర్నినాని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పోలీసు పేరేడ్ గ్రౌండ్‌లో నిర్మించిన జగన్ పార్టీ కార్యాలయంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. 

mudragada padmanabham comments

లేడీ ప్రహ్లాదుడు.. ముద్రగడ క్రాంతి!

ముద్రగడ పద్మనాభరెడ్డికి వయసు పెరగడం వల్ల చాదస్తం బాగా పెరిగింది. దానికితోడు తన ప్రాణానికి ప్రాణమైన జగన్ పార్టీ మటాష్ అయిపోవడంతో ఆయనకి బుర్ర తిరిగిపోయంది. వీటితోపాటుగా ఆయన తన కులం కూడా మార్చుకుని ‘పద్మనాభరెడ్డి’గా మారిపోవడంతో ప్రస్తుతం ఆయన దానికి సంబంధించిన కన్‌ఫ్యూజల్లో వున్నారు. పైగా ఒకప్పుడు హవా నడిపించిన ఆయన మాట ఎవరూ వినడం లేదు. పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు. ఇన్ని ఒత్తిడులు మీద పడటం వల్ల ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. శుక్రవారం నాడు ఆయన విడుదల చేసిన ఒక వీడియో ఆయన చాదస్తానికి పరాకాష్టగా నిలిచింది. తనను ఎవరో వేధిస్తున్నారట.. అలా వేధించడం ఎందుకు.. ఒకేసారి నా కుటుంబాన్ని చంపేయండి అని ఆయన ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాపులకు పవన్ కళ్యాణ్ ఏమేం చేయాలనే విషయంలో ఉచిత సలహాలు ఇచ్చేశారు. తమరు ఇప్పుడు ‘కాపు’ కాదు.. ‘రెడ్డి’.. మా విషయాలు మాట్లాడే అర్హత తమరికి లేదు అని కాపు నాయకులు గట్టిగా వార్నింగ్ ఇచ్చినా, ఆయన అనవసరంగా కాపుల విషయాల్లోకి దూరుతున్నారు.  కాకపోతే, ముద్రగడ ఎంత హిరణ్యకశిపుడి తరహాలో వ్యవహరిస్తున్నప్పటికీ, ఆయన ఇంట్లోనే లేడీ ప్రహ్లాదుడి జననం జరిగింది. ఆ లేడీ ప్రహ్లాదుడు తండ్రికి వాత పెట్టడంలో చాలా యాక్టివ్‌గా వున్నారు.. ఆ లేడీ ప్రహ్లాదుడు మరెవరో కాదు.. ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె ముద్రగడ క్రాంతి. ముద్రగడ పద్మనాభం ‘కాపు’గా వున్న సమయంలో ఆయన పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ‘రెడ్డి’గా మారిన తర్వాత చేసిన వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించారు. ‘‘నాన్నా.. మీరు పేరు  మార్చుకున్నారు గానీ, ఆలోచనా విధానం మార్చుకోలేదు.. ముందు ఆలోచనా విధానం మార్చుకోండి’’ అని అట్లకాడ కాల్చి వాత పెట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్స్.లో ఆమె ఒక పోస్టు పెట్టారు. ‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. కానీ, ఆయన తన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని ఏనాడూ ప్రశ్నించని నా తండ్రికి ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించే అర్హత వుందా? పేరు మార్చుకున్న తర్వాత ఆయనకి కాపుల గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడుంది? సమాజానికి ఏం చేయాలనే విషయంలో పవన్ కళ్యాణ్‌కి స్పష్టత వుంది. నా తండ్రికి మాత్రం ఏ అర్హతా లేదు. ఇప్పటికైనా నా తండ్రి శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి, విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నాను. ఇంకోసారి పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తాను’’ అని క్రాంతా ఆ పోస్టులో పేర్కొన్నారు.  లేడీ ప్రహ్లాదుడు క్రాంతి పెట్టిన పోస్టు చూసి, ఇప్పటికైనా ఆధునిక హిరణ్యకశిపుడు ముద్రగడ పద్మనాభం తన పవన్ కళ్యాణ్ ద్వేషాన్ని మానుకుంటే మంచింది.

Sukesh letter from Tihar Jail to sell Rishikonda Palace to me

రిషికొండ ప్యాలెస్ నాకు అమ్మేయాలని తీహార్ జైలు నుంచి సుఖేష్ లేఖ

సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అంటే ఇదేనేమో... గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం తనకూ, తనకు సంబంధించిన వారికి దోచి పెట్టడానికే పని చేసింది అని చెప్పడానికే ఇంతకన్నా పెద్ద నిదర్శనం మరోటి ఉండదు. కరడు గట్టిన నేరగాళ్లు ఉండే తీహార్ జైలు నుంచి ఎపిలో కూటమి ప్రభుత్వానికి వచ్చిన లేఖతో బండారం బయటపడింది. కోట్లాది రూపాయలు పోసి కట్టిన రిషికొండ ప్యాలెస్ పై సంఘ విద్రోహశక్తుల కన్ను పడింది.దోచుకుని,  దోచి పెట్టిన జగన్ అధికారం కోల్పోవడంతో రిషికొండ ప్యాలెస్ కథ కంచికి చేరిపోయింది.  తీహార్ జైల్లో ఉన్న ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ విశాఖలోని రుషికొండ ప్యాలెస్ అంశంపై స్పందించాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జైలు నుంచి లేఖ రాశాడు.  ఆ భవనాన్ని తనకు విక్రయించాలని, లేకపోతే లీజుకైనా ఇవ్వాలని సుఖేశ్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశాడు. మార్కెట్ ధర కంటే 20 శాతం అధికంగా చెల్లిస్తానని ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు. తన లేఖను భవన కొనుగోలుకు అంగీకార పత్రంగా పరిగణించాలని తెలిపాడు. ఆర్థిక మోసాల ఆరోపణలపై తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ కు జైలు నుంచి లేఖలు రాయడం కొత్త కాదు. దేశంలో సంచలనం సృష్టించే అంశాలను లక్ష్యంగా చేసుకుని లేఖలు రాయడం అతడికి అలవాటే. ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.   విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ నిధులతో జగన్ రిషికొండ ప్యాలెస్ నిర్మించారు. అయితే అనూహ్యంగా జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో రిషికొండ ప్యాలెస్ పై అందరి కన్ను పడింది. ఈ ప్యాలెస్ తనకు అమ్మి వేయాలని ఆర్థిక నేరాలకు పాల్పడి తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రబాబుకు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

YCP office in Tadepalli was demolished due to violation of rules

నిబంధనల ఉల్లంఘన వల్లే తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చి వేత

నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ‌ ఉద‌యం 5.30 గంట‌ల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్‌డిఏ అధికారులు కూల్చేశారు. ఫస్ట్‌ ఫ్లోర్‌ పూర్తయి, శ్లాబ్ కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.కూల్చే స‌మ‌యంలో అటుగా కార్యకర్తలు, నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. త‌ర్వాత‌ భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉ‍న్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్‌డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సీఆర్‌డీఏ కమిషనర్‌ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సీఆర్‌డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి లో స్థలం కబ్జా చేసి... వైసీపీ కడుతున్న పార్టీ ఆఫీస్ ని కూల్చేసిన సిఆర్డిఎ  అధికారులు కూల్చేసిన తర్వాత బోర్డు మీద చూస్లే బోట్ యార్డ్ అని ఉంది.  17 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి, అందులో 2 ఎకరాలలో పార్టీ ఆఫీస్ను  జగన్ కడుతున్నారు.  ఇది బకింగ్ హామ్ కెనాల్  దగ్గర లో ఉంది.  కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఇది. కేవలం 1000 రూపాయలకే ఈ స్థలాన్ని  లీజు ఇవ్వడం టూ మచ్ అని నెటిజన్లు అంటున్నారు.  ఇది కృష్ణ బ్యారేజ్ కి దగ్గర లో ఉంది.  ఇరిగేషన్ భూమిని ఆక్రమించి, అనధికారికంగా వైసిపి కడుతున్న పార్టీ నిర్మాణాన్ని కూల్చివేయడం పట్ల పలువురు హ ర్షం వెలిబుచ్చారు.  అధికారం తలకెక్కిన జగన్ ఏకంగా  తాడేపల్లిలో 202/ఎ 1 సర్వే నెంబర్లోని 2ఎకరాల ఇరిగేషన్ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించుకున్నారు. జగన్. 2 ఎకరాల్లో భవనాలు కట్టి మిగిలిన 15 ఎకరాలు నొక్కేయాలని వైకాపా నేతలు  ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.  స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం  అసలే లేదు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం 17 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేయాలని చూశారు.  ఇది జగన్ ఎత్తుగడ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  సీఆర్డీఏ, ఎంటిఎంసి, రెవెన్యూ శాఖలు ఇరిగేషన్ భూమిని వైసీపీకి హ్యాండోవర్ చేయలేదు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కబ్జా చేసింది.  వైసిపి కార్యాలయం నిర్మాణానికి కనీసం ముందస్తు దరఖాస్తు చేసుకోలేదు వైసీపీ ప్రభుత్వం.   ప్లాన్ కోసం  కూడా వైసీపీ దరఖాస్తు చేయలేదు   ఇరిగేషన్ భూమిని కబ్జా చేసి, ఏ ఒక్క అనుమతి లేకుండా వైసిపి కార్యాలయ నిర్మాణం జరిగింది.  వైసీపీ కబ్జాలపై టిడిపి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు  ఇంతకు ముందు ఫిర్యాదు  చేశారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  సీఆర్డీఏ, ఎంటిఎంసీ కమిషనర్లకు  వేర్వేరుగా ఫిర్యాదు  చేసినట్లు తెలుస్తోంది.  ఏంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగింది. వైసీపీ కబ్జా చేసిన ఇరిగేషన్ భూమి స్వాధీనం అయ్యింది.  వైసీపీ కార్యాలయం కట్టిన ఆ 2 ఎకరాలు  బోటు యార్డ్ స్థలమని, మత్యకారులకి చెందిన స్థలమని చెప్తున్నారు. మత్స్యకారులకు చెందిన 2 ఎకరాల బోటు యార్డ్ స్థలాన్ని కబ్జా చేసి, పార్టీ ఆఫీస్  జగన్ రెడ్డి కడుతున్నట్లు తెలుస్తోంది.  స్థలాన్ని ఏడాదికి రూ. 1000 లెక్కన 33 ఏళ్లకి లీజుకి జగన్ ప్రభుత్వం ఇచ్చింది.కోట్ల రూపాయల విలువైన స్థలం కేవలం  1000 రూపాయలకే  లీజు కు ఇవ్వడం   దారుణమని పరిశీలకులు అంటున్నారు.  ప్రభుత్వం మారటం తో మత్స్యకారుల ఫిర్యాదు మేరకు జగన్ అక్రమంగా కడుతున్న పార్టీ ఆఫీస్ ని టిడిపి ప్రభుత్వం కూల్చేసింది.  నిబంధనల ప్రకారమ నోటీసులు ఇచ్చి, నోటీసులకు స్పందించకపోవటం తో  అధికారులు కూల్చేశారు.అది అక్రమ కట్టడమని, నిర్మాణం ఆపాలని జగన్ ప్రభుత్వానికి  సిఆర్డిఎ అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలు ఆపలేదు.  జగన్ రెడ్డి కబ్జా నుంచి 2 ఎకరాల స్థలాన్ని  కూటమి ప్రభుత్వం కాపాడింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ మత్స్యకారుల అవసరానికే ఉపయోగిస్తారు. అప్పట్లో బోట్ యార్డ్ ప్రాపర్టీ అని బోర్డులపై రాసి ఉన్నప్పటికీ  జగన్  వైసీపీ పార్టీ ఆఫీస్ పేరుతో  కబ్జా చేశారు.   నాడు ప్రజావేదిక కూల్చివేతను  జగన్ సమర్ధించారు.  "అక్రమంగా కట్టిన భవనంలో ఉంటూ ప్రజలకు సంబంధించిన పరిపాలన నిర్ణయాలు తీసుకోవటంపై అంతరాత్మను ప్రశ్నించుకోవాలి".అని జగన్ వ్యాఖ్యలు చేశారు.  మరి ప్రభుత్వ బోటు యార్డు స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టే ముందు జగన్  అంతరాత్మను ప్రశ్నించుకోలేదా?  కూల్చివేత తో ఆపకుండా శిథిలాలు తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆనవాళ్లు కనిపించకుండా చేయాలని, అక్కడ మరో నిర్మాణం చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  కూల్చివేసిన చోట అభివృద్ధికి బాట వేయాలన్న వాదన వినిపిస్తోంది. తాడేపల్లిలోని 17 ఎకరాల ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలంలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచినీళ్లు కల్పించేందుకు, 2019కి  ముందు  టిడిపి ప్రభుత్వం సంకల్పించింది. అదే  మంచి నీటి ప్లాంట్ ఏర్పాటుకి కూడా సన్నాహకాలు ప్రారంభమయ్యాయి.  అయితే మంచి ఖరీదైన  స్థలం కావటంలో, నాడు సియంగా ఉన్న జగన్ రెడ్డి దీని పై కన్నేసి ఉంచారు. తాడేపల్లి వాసులకు మంచి నీటిని అందించాల్సిన చోటుని కబ్జా చేసి, తమ పార్టీ కార్యాలయం కోసం జగన్  కబ్జా చేసారు.ప్రభుత్వం మారడంతో వైసీపీ యత్నానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, వైసీపీ కబ్జా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడింది. .

Cleansing of jagan batch officers start

జగన్ బ్యాచ్ ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రక్షాళన షురూ!

జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో వైసీపీ కార్యకర్తల స్థాయికి దిగజారి పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రక్షాళనకు  చంద్రబాబు సర్కార్  శ్రీకారం చుట్టింది.  జగన్ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు ముగ్గురి వై బదిలీ వేటు వేసిన చంద్రబాబు సర్కార్ రానున్న రోజులలో  మరింత మందిపై చర్యలకు సమాయత్తమౌతోంది.   మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డిని ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ  చేయడంతో పాటు ఫైర్ సర్వీసు డీజీగా ఉన్న సునీల్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సునీల్ స్థానంలో  శంకబ్రత బగ్చీ నియమితులయ్యారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డిని ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ నుంచి రిలీవ్ చేస్తూ, డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జగన్ బ్యాచ్ అధికారులపై చర్యలకు శ్రీకారం చుట్టారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో  ఆయన దన్ను చూసుకుని ఇష్టారీతిగా వ్యవహరించిన ఐపిఎస్, ఐఏఎస్‌లకు ఇక శంకరిగిరి మాన్యాలు తప్పవన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా జగన్ బ్యాచ్ అధకారుల కారణంగా నానా వేధింపులకు గురైన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలలో హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని అత్యంత అప్రాధాన్యతా పోస్టు అయిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి పంపించారు. కసిరెడ్డి డీజీపీగా ఉన్న సమయంలో జగన్ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి. వివిధ సమస్యలపై ఫిర్యాదులు, వినతి పత్రాలు ఇచ్చేందుకు తన వద్దకు వచ్చిన తెలుగుదేశం నేతలకు ఆయన కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వని సందర్భాలున్నాయి.  అదే సమయంలో  వైసీపీ నేతలకు మాత్రం రాచమర్యాదలతో స్వాగతాలు లభించేవి. స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ చేసినా కూడా కసిరెడ్డి స్పందించని సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి రాజేంద్రనాధ్‌రెడ్డిని అత్యంత అప్రాధాన్య శాఖకు బదిలీ చేయడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరైతే అసలు ఆయనకు ఆ మాత్రం పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉండాల్సిందని అంటున్నారు.   ఇక జగన్ అండ చూసుకుని చెలరేగిపోయిన సునీల్   సీఐడీని దుర్వినియోగం చేసి, టీడీపీ కార్యకర్తలను అమానుషంగా-అమానవీయంగా వేధించి, కేసులు పెట్టించిన సునీల్‌కు పోస్టింగ్ ఇవ్వక పోవడం ద్వారా తాను కఠినంగా వ్యవహరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.    సోషల్‌మీడియా పోస్టింగుల పేరుతో కొన్ని డజన్ల మంది టీడీపీ కార్యకర్తలను వేధించిన సునీల్ బృందం అరాచకాలపై, తెలుగుదేశం గతంలోనే పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే అప్పట్లో ఎంపి రఘురామకృష్ణంరాజును కస్టోడియల్  టార్చర్‌కు గురిచేసిన వైనం.. లోక్‌సభ స్పీకర్, సభాహక్కుల సంఘం వరకూ వెళ్లింది. ప్రస్తుత బదిలీల్లో సునీల్ కూడా ఉండటం, ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో జగన్ బ్యాచ్ అధికారుల విషయంలో చంద్రబాబు సర్కార్ సీరియస్ గా వ్యవహరిస్తోందని స్పష్టమైంది.  అలాగే మరో జగన్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి రిషాంత్ రెడ్డి తీరు అప్పట్లోనే తీవ్ర విమర్శలకు గురైంది. చంద్రబాబు అంగళ్లులో ప్రచారానికి వెళ్లిన సందర్భంలో జరిగిన ఘటనలు, ఆ సమయంలో రిషాంత్ నేరుగా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశంపై విమర్శలు గుప్పించిన తీరు సంచలనం సృష్టించిన సంగడతి తెలిసిందే. రిషాంత్ రెడ్డి పోలీసు అధికారిగా కాకుండా జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు పాటించారని అప్పట్లోనే పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆయనకు కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రానున్న రోజులలో మరింత మంది అధికారులపై కూడా వేటు తప్పదని తెలుస్తోంది. 

ycp office demolition

వైజాగ్, అనకాపల్లిలోనూ కూల్చివేతలు?

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, భవిష్యత్తులో ప్రభుత్వాలు అనుసరించడానికి ఒక మార్గాన్ని సెట్ చేశారు. అదే, ప్రభుత్వం కూల్చేయదల్చుకుంటే దేన్నయినా కూల్చేయవచ్చు. ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికని ప్రభుత్వమే కూల్చేయడాన్ని మించిన గొప్ప విషయం మరొకటి వుంటుందా? ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం కూడా కూల్చివేతలు ప్రారంభించింది. కాకపోతే జగన్ ప్రభుత్వమంతా అడ్డగోలుగా కాకుండా చట్టప్రకారం కూల్చివేస్తోంది. తాడేపల్లి సమీపంలోని సీతానగరం పరిధిలో వున్న బోట్ యార్డుకు సంబంధించిన రెండెకరాల స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీసుని ప్రభుత్వం చక్కగా కూలగొట్టింది. ఈ కట్టడం అక్రమమని ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ అధికారులు ఆ ఫిర్యాదులను పరిశీలించారు. సదరు కట్టడం అక్రమమని తేలడంతో కూల్చేశారు.  కూల్చివేతల పరంపర తాడేపల్లి ఆఫీసుతోనే ఆగేట్టులేదండోయ్.. విశాఖపట్నంలో నిర్మించిన వైసీపీ ఆఫీసు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదేనట. ఎండాడలోని సర్వేనంబర్ 175/4లో రెండెకరాల స్థలంలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేశారని ఫిర్యాదులు అందాయి. దాంతో వైజాగ్ జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే తదుపరి చర్యలు వుంటాయని నోటీసులు జారీ చేశారు. దీనికి వైసీపీ వాళ్ళు ఇచ్చే వివరణ ఎలాగూ సంతృప్తికరంగా వుండదు.. ఎందుకంటే, ఇది అధికార బలంతో అక్రమంగా నిర్మించిన కట్టడం కాబట్టి. అందువల్ల ఈ కట్టడాన్ని కూడా త్వరలో పొక్లెయినర్లు ముద్దాడే అవకాశాలున్నాయి. అనకాపల్లిలోనూ వైసీపీది ఇదే వరస. జీవీఎంసీ అనుమతి లేకుండా పార్టీ ఆఫీసు పేరుతో ఒక ప్యాలెస్ నిర్మించారు. హైవే సమీపంలో 1.75 ఎకరాలను 33 సంవత్సరాలకు లీజుకు తీసుకుని, ఏడాదికి వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించే విధంగా సెట్ చేసుకున్నారు. అనుమతుల్లాంటివేవీ అేకుండా భారీ కట్టడం నిర్మించేశారు. దీని మీద కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం అతి త్వరలో దీనికి కూడా స్పాట్ పెట్టే అవకాశం వుంది.

kodali nani should buy cut drawer

కొడాలి నాని.. కొత్త డ్రాయర్లు!

నమస్తే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని, ఉరఫ్ గుట్కా నాని అన్నా.. ఆరోగ్యం ఎలా వుందన్నా? నువ్వు గుడివాడలో ఓడిపోయిన వెంటనే ఒకసారి బయట కనిపించి, ‘తెలుగుదేశం వాళ్ళ నుంచి నన్ను కాపాడండయ్యా’ అని పోలీసులకు మొరపెట్టుకున్నావు. పులి లాంటి మా అన్న ఇలా బేలగా మాడ్లాడ్తన్నాడేంటని నేను బాగా ఫీలయ్యాను. ఆ తర్వాత మొన్న జగన్‌తో మీటింగ్ జరిగిన తర్వాత నువ్వు మీడియాతో మాట్లాడుతూ, నీదైన స్టైల్లో అవాకులు, చవాకులు పేలావు. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నువ్వు మారిపోయావేమోనని అప్పటి వరకూ భయపడిచచ్చిన నాకు, మొన్న నువ్వు ‘పీకుతాడా’, ‘వెధవలు’ అని నీ శైలిలో రెచ్చిపోవడం చూసి చాలా ఆనందం కలిగింది. మా కొడాలి నాని అన్న ఏంటి.. మారడం ఏంటి? నువ్వు మనిషివైతే కదా మారడానికి. నువ్వు మనిషివి కాదంటే ఏ పశువువో అన్నానని అనుకోకన్నోయ్.. నా దృష్టిలో నువ్వు మనిషివే కాదు.. దేవుడివి!  ఈ నారా లోకేష్ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ప్రారంభమైపోయిందన్నా. మీ పార్టీ ఆఫీసునే కూల్చేయడంతో శుభారంభం చేశారంటే ఫ్యూచరు ఏ రేంజ్‌లో వుంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే భయమేస్తందన్నా. ముఖ్యంగా నా భయం నీ గురించే అన్నా. నిన్ను డ్రాయర్ మీద గుడివాడ వీధుల్లో నడిపించే బాధ్యత తనదని నారా లోకేష్ ఆల్రెడీ ప్రకటించాడు. మొదట్లో లోకేష్ కామెంట్లని లైట్‌గా తీసుకున్నానుగానీ, పరిస్థితి చూస్తుంటే లోకేష్ చెప్పింది జరిగేట్టే వుంది అన్నా. జరగబోయేది ఆపే పరిస్థితి ఎలాగూ కనిపించడం లేదు కాబట్టి, మన జాగ్రత్తలో మనం వుంటే మంచిదన్నా. ఆ జాగ్రత్తలు చెప్పడానికే నీకీ లేఖ రాస్తున్నా. త్వరలో నువ్వు గుడివాడ రోడ్ల మీద డ్రాయర్‌తో నడవటం ఖాయం కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా నువ్వు కొత్త డ్రాయర్లు కొనుక్కో అన్నా. ఎలక్షన్ల హడావిడిలో పడి డ్రాయర్లు కొనుక్కున్నావో లేదో. నిన్ను సడెన్‌గా డ్రాయర్ మీద రోడ్డు మీద నిలబెట్టినప్పుడు ఆ డ్రాయర్లు చిరిగిపోయి వున్నాయనుకో.. చూడ్డానికి బాగోదు. అందుకని, కొత్త డ్రాయర్లు కొనుక్కుని వాడుతూ వుండు. ఎందుకంటే, ఏ నిమిషంలో అయినా నువ్వు డ్రాయర్ ధారణతో రోడ్డు మీద నిలబడాల్సి వచ్చేట్టుంది. అలాగే, నువ్వు కట్ డ్రాయర్లతో రోడ్డు మీద నడుస్తుంటే జనం చూడలేక చస్తారు. అందువల్ల నువ్వు ఆ కట్ టైప్ కాకుండా నిక్కర్ టైప్ డ్రాయర్లు కొనుక్కో. ఆ విధంగా గుడివాడ ప్రజలకు మేలు చేసినవాడివి అవుతావు. సరే, ఉంటానన్నా.. త్వరలో నిన్ను గుడివాడ రోడ్ల మీద కేవలం డ్రాయర్‌తో నడుస్తావుగా.. అప్పుడు నిన్ను కలుస్తాలే.. బైబై.. ఇట్లు.. నీ అభిమాని.

jagan violate sabha  traditions

సభా సంప్రదాయాల ఉల్లం‘ఘనుడు’ జగన్

ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు కాదు అన్నట్లుగా, జగన్ కు ఎన్ని పరాభవాలెదురైనా ఆహంభావ ధోరణి మారదు కాక మారదు.   కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ తాజా ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలైనా జగన్ తీరు మారలేదు.  మామూలు ఎమ్మెల్యే అయినా.. ఆయనకు ఆయన కోరిన మీదట ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంతో హుందాగా  సభ ఆవరణలోకి సొంత వాహనంలో రావడానికి, అలాగే మంత్రుల తరువాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెసులుబాటు కల్పించి తన ఉదారతను చాటుకున్నా జగన్ లో బలుపు తగ్గలేదు. సభలో సభా సంప్రదాయాలను పాటిస్తానని ప్రమాణం చేశారు. అయితే సంప్రదాయాలు పాటించడం తెలియదు. అహంకారమే తన భూషణంగా ఆయన భావిస్తారు. ఆయన అహంభావం కారణంగానే జనం ఇటీవలి ఎన్నికలలో  జనం కర్రు కాల్చి వాతపెట్టారు. అయినా జగన్ లో మార్పు రాలేదు. సభ సాక్షిగా సంప్రదాయాలను పాటిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన జగన్ వెంటనే ఆయన సభ బయటకు వెళ్లిపోయారు. తన పార్టీకి చెందిన సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించాలన్న కనీసం ఇంగితం కూడా ప్రదర్శించలేదు. సరే అది అయిపోయింది. ఇప్పుడు శనివారం (జూన్  22) సభలో స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఎన్నిక లాంఛనమే. ఆయన ఈ రోజు స్పీకర్ గా ఎన్నికవుతారు. సభా సంప్రదాయం ప్రకారం సభానాయకుడు, అధకార, విపక్ష సభ్యులు స్పీకర్ ను స్పీకర్ స్థానం వద్దకు తోడ్కొని పోయి అభినందనలు తెలపడం సంప్రదాయం. కానీ సభా సంప్రదాయాలను పాటిస్తానంటూ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ అలా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి డుమ్మా కొట్టేసి పులివెందుల చెక్కేశారు. నిజమే జగన్ మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు సభలో ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఆయన పార్టీకి విపక్ష హోదా రాలేదు కనుక ఆయన విపక్ష నేత కూడా కాదు. వైసీపీకి సభలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఒకరు. అయినా సభకు ఎన్నికైన ప్రతి సభ్యుడూ సంప్రదాయాలను పాటించాల్సిందే. అయితే జగన్ మాత్రం సభలో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి.. సభలో కూర్చోకుండా వెళ్లిపోయిన ఆయన రెండో రోజు సభకు గైర్హాజర్ అయ్యారు.   స్పీకర్ ఎన్నిక ఉందని తెలిసినా.. పులివెందుల పర్యటన పెట్టుకుని పారిపోయారు.   గత శాసనసభలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ్మినేని సీతారాం  స్పీకర్ గా ఎన్నికయ్యారు.  అప్పుడు తెలుగుదేశం అధినేత  చంద్రబాబు స్పీకర్ ఎంపిక కార్యక్రమంలో భాగం అయ్యారు. ఆయనను చెయిర్ వరకూ తీసుకెళ్లే కూర్చోబెట్టే సంప్రదాయాన్ని పాటించారు.  కానీ జగన్ మాత్రం ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని పాటించలేదు. తనకు హుందా తనం అంటే తెలియదని తనకు తానే ఈ చర్య ద్వారా చాటుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డికి మాత్రం అలా చేయాలని అనిపించడం లేదు.   

బీఎస్పీ.. ‘బహు’విధాలా పతనం!?

ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు దూరంగా నేల విడిచి సాము చేస్తే, ఏ రాజకీయ పార్టీకైనా సరే ప్రజాక్షేత్రంలో పరాభవం, ఎన్నికల యుద్ధంలో పరాజయం తప్పదు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) పరిస్థితి అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీలు పొత్తు  పెట్టుకుని రెండు పార్టీలూ రాజకీయ ప్రయోజనం పొందాయి.  2019 సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలూ కూడా ప్రజా క్షేత్రంలో బోల్తాపడ్డాయి. అప్పటి పొరపాట్లను సవరించుకుని విభేదాలను పరిష్కరించుకుని సజావుగా సీట్ల పంపకం చేసుకుని ఈ ఎన్నికలలో మెరుగైన ప్రదర్శన చేయగలిగాయి. రాష్ట్రంలో ఎదురు లేదు అనుకుంటూ విర్రవీగుతున్న కమలం రేకులను చాలా వరకూ ఈ కూటమి రాల్చేయగలిగింది. అయితే చేసింది ఇదే. ఈ రెండు పార్టీలూ కలిసి గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ప్రచారం చేపట్టాయి. రాజ్యాంగ హక్కులు, స్వేచ్ఛలు, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని, పాలక బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. బలహీనవర్గాలను, ఓబీసీలను, ముస్లింలను, క్రైస్తవులను బీజేపీకి వ్యతిరేకం చేయడంలో విజయం సాధించాయి. మండల్‌ సంవత్సరాల నాటి కుల సమీకరణాలను మరోసారి ప్రజల ముందుకు తీసుకు వచ్చాయి. ఫలితంగా ఈ రెండు పార్టీలూ కలిపి 43 లోక్‌ సభ స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఓటు వాటాను పెంచుకున్నాయి. దళితులను, మైనారిటీలను ఓటు బ్యాంకులుగా మార్చుకో గలిగాయి. ఇందుకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బి.ఎస్‌.పి) కేవలం 9.4 శాతం ఓట్లను మాత్రమే సంపాదించుకోగలిగింది. 2022  శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువ. ఈ పార్టీకి అనేక సంవత్సరాలుగా విధేయులుగా, విశ్వాసపాత్రులుగా ఉంటున్న  వర్గాలు కూడా కూడా  కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీ వైపు మళ్లిపోయారు. ఈ దళిత వర్గాలే కాదు, బహుజన సమాజ్ వాదీ పార్టీకి ఎన్నో ఏళ్ల పాటు మద్దతుగా నిలిచిన  ముస్లింలు, ఇతర  మైనారిటీ వర్గాలు, ఓబీసీలు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. వాస్తవానికి ఈ వర్గాలను,  తమవైపు తిప్పుకోవడానికి ఎన్నికల సమయంలోనే కాదు, అంతకు ముందు కూడా బీఎస్పీ పెద్దగా చేసిందేమీ లేదు. దాదాపు 24 ఏళ్ల కిందట   కాన్షీరామ్‌ నాయకత్వంలో ఒక ఉద్యమంగా ఆవిర్భవించిన బీఎస్పీ అచిరకాలంలోనే రాష్ట్రంలోని దళితులనే కాక, దేశవ్యాప్తంగా దళిత వర్గాలను, అల్ప సంఖ్యాక వర్గాలను  ఆకట్టుకుని  సంచలనం సృష్టించింది. ఎన్నికల అనంతర సంకీర్ణ ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలిచింది.   2007లో  బీఎస్పీ సొంతంగా ఘన విజయం సాధించి అధికారాన్ని   చేపట్టింది. ఆ తర్వాత ఈ పార్టీ సిద్ధాంతాలు మరింతగా విస్తరించాయి.  మరిన్ని వర్గాలను కూడగట్టుకోవడానికి  ప్రణాళికలు రచించినప్పటికీ పార్టీలో వైరుద్ధ్యాలు  ప్రారంభమయ్యాయి. ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల స్థాయి, వారి ప్రాధాన్యం బాగా పెరిగింది కానీ, అధికారాలను పంచడం, పాలనా వ్యవహారాల వికేంద్రీకరణ వంటి సామాజిక, ఆర్థిక సంస్కరణల ద్వారా వారి అభ్యున్నతిని సాధించడం మాత్రం జరగలేదు. కాగా, 2012 తర్వాత అధికారం నుంచి వైదొలగడంతో బీఎస్పీ కార్యకలాపాల్లో స్తబ్ధత చోటు చేసుకుంది. ఆందోళనలు, ఉద్యమాలు, ప్రదర్శనలతో రాష్ట్రాన్ని, పాలక పక్షాన్ని హోరెత్తించాల్సిన  బీఎస్పీ అధినేత్రి మాయావతి కేవలం మీడియా సమావేశాలు, ప్రెస్ రిలీజ్ లకు పరిమితమయ్యారు.దీంతో కార్యకర్తలలో ఉత్సాహం నీరుగారిపోయింది.  బీజేపీకి, కాంగ్రెస్‌-సమాజ్‌ వాదీ పార్టీ పొత్తు తమ పార్టీకి ఏ మాత్రం అవరోధం కాదని ఎన్నికల సమయంలో పదే పదే చెప్పిన మాయావతి, ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు చివరికి ఓట్లను కూడా చీల్చలేకపోయారు. ఇప్పుడు ఎన్నికలలో  ఘోర పరాజయం తరువాత మాయావతి ఆత్మవిమర్శ చేసుకోవడం మాని ఈవీఎంలను తప్పుపడుతున్నారు.   ముస్లింల నుంచి తమకు ఆశించిన మద్దతు లభించలేదని ఆ వర్గాన్ని విమర్శిస్తున్నారు.   తన కారణంగానే పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారవుతున్న విషయాన్ని మాత్రం ఆమె అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఈ పార్టీలో మళ్లీ జవజీవాలు నింపాలంటే ఆమె తన తీరును, వైఖరిని మార్చుకోవాలి.   లేకుంటే బీఎస్పీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఆ స్ఖానాన్ని బీఎస్పీ నుంచి చీలి కొత్త పార్టీగా  ఏర్పడిన ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) ఆక్రమించడానికి ఎంతో కాలం పట్టదన్నది పరిశీలకుల విశ్లేషణ.  

జ‌గ‌న్ రాయ‌బేరం.. ఛీకొట్టిన చెల్లెలు!?

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. ఈ ఫార్ములానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుస‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు.. సొంత చెల్లి, త‌ల్లి ప‌ట్ల‌ కూడా అదే ప‌ద్ద‌తిని అవ‌లంబించారు. అధికార అహంతో త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన వాళ్ల‌పై కేసులు పెట్టి, పోలీసుల‌తో కొట్టించి ఆనందం పొందారు. పైగా.. అన్నీ దేవుడే చూసుకుంటాడు అంటూ చిల‌కప‌లుకు ప‌లికేవారు. నిజంగానే జ‌గ‌న్ చిల‌క‌ ప‌లుకుల‌ను దేవుడు చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లున్నాడు. ఐదేళ్ల కాలంలో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌ను, ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్‌ పెట్టిన ఇబ్బందుల‌కు బ‌దులుగా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ చేత ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పించాడు.  క‌నీసం అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వ‌లేదు.  చ‌రిత్ర‌లో జ‌గ‌న్‌కు ఇచ్చిన త‌ర‌హా ట్రీట్‌మెంట్ ప్ర‌జ‌లు ఏ రాజ‌కీయ పార్టీకి ఇవ్వ‌లేదు. అధికారంలో ఉన్న‌న్నినాళ్లు త‌ల్లీ, చెల్లెళ్ల‌నుకూడా బ‌య‌ట‌కు నెట్టిన జ‌గ‌న్‌, ఇప్పుడు వారి విలువ తెలిసొచ్చి కాళ్ల‌బేరానికి వెళ్తున్న‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మికి ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌తో పాటు త‌న సొంత చెల్లి వైఎస్ ష‌ర్మిల‌కూడా ఓ కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో జ‌గ‌న్‌పై ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. సొంత బాబాయ్ హ‌త్య కేసులో ప్ర‌ధాన ముద్దాయిగా ఉన్న వ్య‌క్తికి క‌డ‌ప‌ ఎంపీ టికెట్ ఇవ్వ‌డంపై ఆమె తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదే క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధిగా ష‌ర్మిల బ‌రిలోకి దిగారు. అంతేకాదు.. క‌డ‌ప జిల్లా వ్యాప్తంగా ఆమె కాంగ్రెస్ అభ్య‌ర్థుల ప‌క్షాన ప్ర‌చారం నిర్వ‌హించి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదింపాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనం జగన్ ను ఛీ కొట్టారు. సొంత జిల్లా క‌డ‌పలోనూ జ‌గ‌న్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బే త‌గిలింది. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా త‌న కంచుకోట‌గా భావిస్తూ వ‌చ్చిన జ‌గ‌న్‌కు అక్క‌డి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణం ష‌ర్మిల ప్ర‌చార‌మేన‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుర్తించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతున్నది. ష‌ర్మిల‌ను త‌న‌వైపుకు తిప్పుకోక‌పోతే క‌డ‌ప జిల్లాలోనూ ప‌ట్టు సాధించడం సాధ్యం కాదన్న జ‌గ‌న్ కు భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. దీంతో త‌న త‌ల్లి విజ‌య‌మ్మ ద్వారా ష‌ర్మిల వ‌ద్ద‌కు జ‌గ‌న్ రాయ‌భారం న‌డుపుతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  అందితే జ‌ట్టు.. అంద‌క‌పోతే కాళ్లు అనే ఫార్మాల‌ను తు.చ. త‌ప్ప‌కుండా పాటిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ష‌ర్మిల వ‌ద్ద అదే ప‌ద్ద‌తిని అవ‌లంబిస్తున్నార‌ట‌. కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరాల‌ని కోరుతూ ష‌ర్మిల వ‌ద్ద‌కు రాయ‌బారం న‌డుపుతున్న‌ట్లు స‌మాచారం. అన్న నిజ‌స్వ‌రూపం తెలిసిన  ష‌ర్మిల‌.. ఛీ కొట్టిన‌ట్లు తెలుస్తోంది. నీ రాజ‌కీయ భ‌విష్య‌త్ బాగుండాలంటే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాల‌ని ష‌ర్మిల కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ చ‌ర్చ‌ల‌కు బ‌లం చేకూర్చుతూ ఇటీవ‌ల ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏపీ ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ష‌ర్మిల మాట్లాడుతూ.. పిల్ల కాలువ‌ల‌న్నీ స‌ముద్రంలో క‌ల‌వాల్సిందే అంటూ ప‌రోక్షంగా వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. అయినా  ఎలాగైనా ష‌ర్మిల‌ను మ‌ళ్లీ వైసీపీలోకి ఆహ్వానించి  ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ప‌ట్టుకోల్పోకుండా ఉండాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నార‌ని స‌మాచారం.  చిన్న‌పిల్లోడు అంటూ ఇన్నాళ్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెనుకేసుకొచ్చిన ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా హ‌త్య‌కేసులో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవ‌కాశం ఉంది. త‌న‌కు అండ‌గా ఉంటార‌నుకున్న ఎంపీ మిథున్ రెడ్డి  బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా మిగిలిన ఇద్ద‌రు వైసీపీ ఎంపీల‌తో క‌లిసి మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్నది. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపైనా మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది‌. నిజంగానే ఇలాంటి ప‌రిణామాలు ఉమ్మ‌డి ఎదురైతే క‌డ‌ప  జిల్లాలో బ‌లంగా నిల‌బ‌డాలంటే ష‌ర్మిల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే త‌ల్లి విజ‌య‌మ్మ ద్వారా వైసీపీలోకి రావాల‌ని ష‌ర్మిల‌పై ఒత్తిడి పెంచుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే జ‌గ‌న్ రాయ‌బారానికి ఛీ కొట్టిన ష‌ర్మిల  మున్ముందు కాలంలో అన్న‌కు ఎదుర‌య్యే ఇబ్బందుల‌నుచూసి మ‌న‌స్సు మార్చుకునే అవ‌కాశాలు ఉండొచ్చని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.