మచిలీపట్నంలోనూ వైసీపీ అక్రమ కట్టడం!

వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమ కట్టడాల నిర్మాణానికి పాల్పడింది. ఇప్పటికే తాడేపల్లి ప్రాంతంలో అక్రమ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చింది. అలాగే విశాఖ, అనకాపల్లిలో వున్న కట్టడాల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారింది. మచిలీపట్నంలో కూడా వైసీపీ పార్టీ కార్యాలయం పేరుతో అక్రమ కట్టడాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.

మచిలీపట్నం పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో అధునాతన సదుపాయాలతో నిర్మాణం వైసీసీ కార్యాలయం నిర్మాణం పూర్తి అయ్యే దశలో వుంది. ఇప్పుడు అధికారులు ఈ కట్టడం మీద దృష్టి సారించారు. పోలీసు గ్రౌండ్స్.లో వున్న రెండెరకాల స్థలాన్ని మునిసిపాలిటీలో మూజువాణి ఓటుతో ఆమోదించుకుని వైసీపీ కృష్ణాజిల్లా కార్యాలయ నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి ఈ భూమి పోలీసు శాఖది. పోలీసు శాఖపై ఒత్తిడి తెచ్చి.. మునిసిపాలిటీ పాలక మండలి అనుమతితో ఈ అక్రమన నిర్మాణం చేపట్టారు. ఈ భూమిపై నిజానికి మునిసిపాలిటీకి అధికారం లేదు. పైగా ఒక రాజకీయ పార్టీకి 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ మునిసిపాలిటీ పాలక మండలి ఆమోదం తెలపటం అభ్యంతరకరమని అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాదించింది. కానీ అధికార బలంతో ఈ భూమిని జగన్ పార్టీ స్వాధీనం చేసుకుంది. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో భోగరాజు సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి యూనియన్ బ్యాంకు ముందుకు వచ్చింది. కానీ ప్రభుత్వం  భూమి ఇవ్వలేదు. ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంపీ బాలశౌరి కృషి చేశారు. అయితే, బాలశౌరి మీద వ్యతిరేకతతో అప్పటి ఎమ్మెల్యే పేర్నినాని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పోలీసు పేరేడ్ గ్రౌండ్‌లో నిర్మించిన జగన్ పార్టీ కార్యాలయంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. 

Teluguone gnews banner

కడప టీడీపీలో అసమ్మతి సెగలు

  కడప అసెంబ్లీ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు బహిరంగమయ్యాయి. ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్ల ఆమె భర్త,  టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పట్ల దేశం నాయకులు పలువురు నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన వారిని,ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి వైసిపి నుంచి వచ్చిన వారికి  ప్రాధాన్యమిస్తున్నారు అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ దేవుని కడపలోంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారికి మంచి బుద్ది ప్రసాదించాలని అక్కడి దేవుని కడప ఆలయంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం సమర్పించారు.  ఈ కార్యక్రమం కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలను బట్టబయలు చేసింది. స్థానిక ఎన్నికలు జరుగనున్న  నేపథ్యంలో ఎమ్మెల్యే పట్ల, శ్రీనివాస్ రెడ్డి పట్ల వ్యతిరేకత తెలియజేస్తూ అసమ్మతి నాయకులు గుంపు కట్టడం నియోజకవర్గ తెలుగుదేశం రాజకీయాల్లో  రచ్చగా మారింది. టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా సీనియర్ కార్యకర్తలు,నాయకుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అది నుండి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మండిపడ్డారు. ఇటీవల పార్టీల చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను తొక్కేస్తుందంటూ ఆవేదన వ్యక్తంచేశారు.  కార్యక్రమం అనంతరం కమలాపురం సీనియర్ నాయకుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని కలిశారు. కడప నియోజవర్గ టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, మురళి, కొండాసుబ్బయ్య, మహిళా నేతలు, యువ కార్యకర్తలు, నాయకులు పుత్తా నరసింహ రెడ్డి వద్ద వారి ఆవేదన వ్యక్తం చేస్తూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆగడాలకు తట్టుకోలేకపోతున్నామని,అంబేద్కర్ రాజ్యాంగం కడపలో నడవడం లేది శ్రీనివాసరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు.  ఎమ్మెల్యే గెలుపు కోసం పోరాటం చేస్తే గెలిచాక మమ్మల్నివెలివేసిందని, వైసీపీ కార్పోరేటర్లను పార్టీలో చేర్చుకొని వారికి పెద్దపీట వేస్తున్నారని,వారి కాళ్ల దగ్గర ఉన్న వారికే పార్టీ పదవులు, ఇన్‌ఛార్జులు, పనులు కట్టబెడుతున్నారని అన్నారు.ఇంత సీనియార్టీ ఉన్న మమ్మల్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమని, మా సమస్యలను  అధిష్టానం దృష్టికి తీసుకెళ్లండి అంటూ ఆయన్ను కోరారు. ఈ మేరకు పుత్తాకు వినతి పత్రం సమర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడును ,లోకేష్ బాబును కలిసే విధంగా ఏర్పాట్లు చేయాని కోరారు.

కేసీఆర్ లో జూబ్లీ గాభరా?

బీఆర్ఎస్ ను జూబ్లీ ఉప ఎన్నికలు గాభరా పెడుతున్నాయా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ కవిత విషయంలో పునరాలోచిస్తున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్నసమాధానమే వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ రెడీ అయ్యింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ వెలువడుతుందని అంటున్నారు. దీంతో తమ సిట్టింగ్ సీటును ఎలాగైనా కైవశం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ కు కవిత వ్యవహారం ఇబ్బంది పెడుతున్నది. జూబ్లీ ఉప ఎన్నికలో కవిత తెలంగాణ  జాగృతి తరఫున అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు ఉండటంతో బీఆర్ఎస్ లో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  అధికారంలో ఉన్నంత కాలం విపక్షాలను నానా ఇబ్బందులకూ గురి చేసి ఆ పార్టీల్లో చీలికలకు ప్రోత్సహించిన బీఆర్ఎస్.. ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తులు పెచ్చరిల్లడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరీ ముఖ్యంగా కవిత తిరుగుబావుటా ఆ పార్టీని ఊపిరితీసుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాజకీయాలలో గత కొంత కాలంగా కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ అయిన సంగతి విదితమే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలకు హరీష్ బాధ్యుడంటూ ఆమె చేసిన ఆరోపణలు, విమర్శలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేసి తప్పుచేశామా అన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సస్పెన్షన్ కు గురైన కవిత ఎక్కడా వెనక్కు తగ్గకుండా ముందుకు సాగడమే కాకుండా జూబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ జాగృతి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత  అలీఖాన్ ను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. తమ ఓటమి ఖాయమన్న భయం బీఆర్ఎస్ లో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే భావనకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడో, రేపో కేసీఆర్ కవితను తన ఫామ్ హౌస్ కు పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.   ఆమెతో చర్చించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాగృతి అభ్యర్థిని నిలబెట్టకుండా బుజ్జగించే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఆ వర్గాలు అంటున్నాయి.  ఒక వేళ జూబ్లీ ఉప ఎన్నికలో కవిత కనుక జాగృతి అభ్యర్థిని నిలబెట్టడమంటూ జరిగితే బీఆర్ఎస్ ఓట్లు చీలి ఓటమి పాలవుతామన్న భయంతో పాటు   అది అధికార పార్టీకి లాభం చేసే అవకాశం ఉంటుందన్న భావనతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితతో చర్చించడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  

విజయవాడ ఉత్సవ్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

శరన్నవరాత్రులను పురస్కరించుకుని బెజవాడలో దసరా ఉత్సవ్ నిర్వమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. మైసూరు ఉత్సవాలను తలదన్నేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలలని తలపెట్టింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఘనంగా చేసింది. అయితే ఈ ఉత్సవాల నిర్వహణకు ఎంపిక చేసిన స్థలాలలో ఒకటి దుర్గగుడికి చెందినదని పేర్కొంటూ ఆలయ భూమిలో వ్యాపార  కార్యక్రమాల నిర్వహణ ఏమిటంటూ వైసీపీ సీనియర్వి నేత పేర్నినాని విమర్శలు గుప్పించారు. ఆయన విమర్శలను ఆధారం చేసుకుని కొన్ని సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. హై కోర్టు  సింగిల్ బెంచ్ ఆలయభూమిలో వ్యాపార కార్యక్రమాలను వీల్లేదంటూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఆ స్టేను సవాల్ చేస్తూ కొన్ని హిందూ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్ సుప్రీం కోర్టు సోమవారం (సెప్టెంబర్ 22) విచారించి విజయవాడ ఉత్సవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఉత్సవాల నిర్వహణను నిలిపివేయాలంటూ కొన్ని సంఘాల దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో విజయవాడ ఉత్సవ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. 

పుస్తక పఠనం ద్వారా క్రియేటివ్ థింకింగ్.. నారా లోకేష్

ఇటీవలి కాలంలో పుస్తక పఠనం అన్నది యువత, చిన్నారులలో బాగా తగ్గిపోయిందని ఆంద్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 22) అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే గణబాబు గ్రంథాలయాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడు నారా దేవాంశ్ ను ప్రస్తావించారు. ఇటీవల తాను లండన్ పర్యటనకు వెళ్లిన సమయంలో తాను ఐదు పుస్తకాలను కొని తిరిగి వచ్చాకా దేవాంశ్ కు ఇచ్చాననీ, వాటిని అతడు ఐదు రజులలో చదివేశాడనీ చెప్పారు. తన కుమారుడికి పఠనాశక్తి ఎక్కువ అన్న లోకేష్.. పుస్తకాలు చదవడం అన్నది చాలా మంచి అలవాటని అన్నారు. రాష్ట్రంలో గ్రంథాలయాలకు పెద్ద పీట వేయడం ద్వారా యువత, పిల్లలలో పఠనాశక్తి పెంపొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రపంచ స్థాయి గ్రంథాలయాల అభివృద్ధి కోసం షోబాబెవలపర్స్ సంస్థ వంద కోట్ల రూపాయలతో ముందుకు వచ్చిందన్నారు. రెండేళ్లలో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయనీ, వాటిని 26కు పెంచుతామనీ చెప్పారు. ఇక పోతే గ్రంధాలయాల్లో పుస్తకాల కొనుగోలు కూడా సరిగా జరగడంలేదన్న ఆయన.. అవసరమైన పుస్తకాల జాబితాను ఇస్తే ఆ మేరకు పుస్తకాలను కొనుగోలు చేసి వాటిని గ్రంధాలయాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.  మొబైల్స్‌కి పిల్లలను దూరంగా ఉంచుతూ.. లైబ్రరీలకు దగ్గర చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేష్ చెప్పారు.  

దేశమంతటా ఎస్ఐఆర్.. కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం!

ఓట్ చోరీ ఆరోపణల విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల సంఘంపై ప్రజా విశ్వాసం దెబ్బతినేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనకు, ఆయన చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలన్న కృత నిశ్చయానికి వచ్చింది. ఇందు కోసం ఓటర్ల జాబితాలోని అవకత వకలను సవరించాలన్న నిర్ణయం తీసుకుంది. అందు కోసం బీహార్  చేపట్టిన విధంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఓటర్ల జాబితాలను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేయాలని నిర్ణయించింది. బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఐఆర్ పై వచ్చిన అన్ని ఆరోపణలకూ వివరణ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎస్ఐఆర్ ద్వారా మాత్రమే ఓటర్ల జాబితాలోని అవక తవకలు, లోపాలను సరిద్దిద్దడం సాధ్యమౌతుందని భావిస్తోంది. గత దశాబ్దాలలో జరిగిన పట్టణీకరణ, కార్మికుల వలసలు వంటి కారణాలతో  ఓటర్ల జాబితాలో చేరిన డూప్లికేట్ ఎంట్రీలు, దొంగ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ చేపట్టింది.  అది సత్ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు అదే విధానాన్ని దేశ వ్యాప్తంగా అములు చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే.. ఓటర్ల జాబితాల అంశం ప్రతి సారి వివాదాస్పదమవుతోంది. అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు.. కుట్రపూరితంగా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తప్పుడు మార్గాల్లో ఓటర్లను చేర్చించడానికి చేసిన ప్రయత్నాలు నకిలీ, దొంగ ఓట్లు పెద్ద సంఖ్యలో జాబితాలో చోటు చేసుకోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ హయాంలో అధికా రుల్ని సైతం బెదిరించి వేల దొంగ ఓట్లు చేర్పించడం.. అసలైన ఓటర్లను తొలగించడం వంటివి జరిగాయన్న ఆరోపణలు రావడం విదితమే. ఇలాంటి వాటినన్నిటినీ ఎస్ఐఆర్ ద్వారా సరిదిద్దడానికి అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. 

కాలినడకన ఇంద్రకీలాద్రిపైకి.. ఆపై క్యూలో వెళ్లి అమ్మవారి దర్శనం!

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ  అమ్మవారికి తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. శరన్నవరాత్రులు తొలి రోజైన సోమవారం (సెప్టెంబర్ 22) ఆయన కాలినడకన ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని సాధారణ బక్తుడిలా క్యూలో నిలుచుని అమ్మవారిని దర్శించుకున్నారు.   గత రెండు దశాబ్దాలుగా దేవినేని ఉమ శరన్నవరాత్రులు ప్రారంభమైన తొలి రోజున కాలినడకన ఇంద్రకీలాద్రి కొండకు చేరుకుని దుర్గమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పాటిస్తూ వస్తున్నారు. విజయవాడ వన్ టౌన్ లోని వినాయకుడి ఆలయం వద్ద నుంచి కాలినడకను ఇంద్రకీలాద్రి చేరుకుని క్యూలైన్ లో నిలుచుని సాధారణ భక్తుడిగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఏడాదీ అదే చేశారు. అంతకు ముందు వినాయకుడి గుడిలో దేవినేని ఉమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బాబు బిజీబిజీ.. ఆ ఐదు రోజులూ నో అప్పాయింట్ మెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. నిత్యం ప్రజలతో మమేకమౌతూ, ప్రజా సమస్యలన తెలుసుకుంటూనే.. అధికారిక కార్యక్రమాలలో కూడా షెడ్యూల్ ప్రకారం పంక్చువల్ గా హాజరౌతై ఉంటారు. అలాగే పార్టీ వ్యవహారాలకూ సమయం కేటాయిస్తారు. వీటన్నిటినీ ఉటంకిస్తూ.. టైమ్ మేనేజ్ మెంట్ లో ఆయనను కొట్టే వారే లేరని అధికారులే కాదు.. పార్టీ శ్రేణులు కూడా చెబుతుంటాయి. అలాంటిది ఈ వారంలో ఓ ఐదు రోజుల పాటు చంద్రబాబు యమా బిజీగా గడపబోతున్నారు. ఎటువంటి అప్పాయింట్ మెంట్లూ ఇవ్వరు. వ్యక్తిగత సమావేశాలకు అసలే అవకాశం లేదు. విశాఖ, అమరావతి, తిరుమల, బాపట్ల, బెజవాడలలో వరుస కార్యక్రమాలలో పాల్గొనేలా ఆయన షెడ్యూల్ ఉంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఐదు రోజుల పాటు ఆయన అప్పాయింట్ మెంట్ ఎవరికీ దొరకదు. ఇంతకీ విషయమేంటంటే.. మంగళవారం (సెప్టెంబర్ 22) నుంచీ రెండు రోజుల పాటు ఆయన విశాఖలో ఉంటారు. విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని దేశ, విదేశవీ పెట్టుబడి దారులతో చర్చిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తారు. ఇక సెప్టెంబర్ 24న అమరావతి వచ్చి అదే రోజు సాయంత్రం అదే రోజు సాయంత్రం ఆయన తిరుమలలో ఉంటారు. తరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక ఈ నెల 26న ఆయన సూర్యలంకలో బీచ్ ఫఎస్టివల్ ను ప్రారంభిస్తారు. ఆ తరువాత 29వ తేదీన బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.   

పరకామణి అవకతవకల కేసు.. సీఐడీకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు

తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి సొమ్ము అవకతవకల కేసును సీఐడీకి అప్పగిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ పై అభియోగాలను కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును నిలిపివేసిన హైకోర్టు  ఈ కేసును విచారించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా సీఐడీని ఆదేశించింది.జగన్ హయాంలో  తిరుమల పరకామణిలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  పరకామణిలో చోరీచేస్తూ పట్టుబడిన నిందితుడి నుంచి కొన్ని ఆస్తులను టీటీడీకి విరాళంగా అందజేయించి మిగిలిన ఆస్తులను అప్పట్లో టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు వాటాలుగా పంచుకున్నారన్న ఆరోపణల నిగ్గు తేల్చడానికి రంగం సిద్ధమైంది.    కేసు వివరాల్లోకి వెడితే.. తిరుమల పరకామణిలో రవికుమార్‌ ఓ మఠం తరఫున పనిచేసేవారు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ లెక్కించేవారు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు ఆయనపై  ఉన్నాయి.   2023 ఏప్రిల్‌ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులలో దాచుకోగా, అనుమానంతో సిబ్బంది తనిఖీలు చేయగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.  ఆయనపై అప్పటి ఏవీఎస్వో సతీష్‌కుమార్‌ ఫిర్యాదుతో రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆరోజు రవికుమార్ వద్ద లభ్యమైనవి 900 డాలర్లు వాటి విలువ అప్పట్లో అప్పట్లో  72 వేల రూపాయలుగా తేల్చారు. అంతకు ముందు చాలా కాలం నుంచీ కూడా రవికుమార్ పరకామణిలో  కోట్ల రూపాయలు కాజేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే రెడ్ హ్యాండెడ్ గా రవికుమార్ దొరికిపోయిన తరువాత  కొందరు వైసీపీయులు, అప్పటి టీటీడీలో పని చేస్తున్న కొందరు అధికారులు, పోలీసు అధికారులు రంగ ప్రవేశం చేసి తమ్మిని బమ్మిని చేసి కేసు నీరుగారిపోయేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పరకామణిలో కాజేసి రవికుమార్ సంపాదించిన ఆస్తులలో కొన్నిటిని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా రాయించి, మిగిలిన వాటిని బినామీల పేరిట స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఆ కారణంగానే నిందితుడు రవికుమార్ ను అరెస్టు చేయకుండా ఆ కేసును లోక్ అదాలత్ లో పెట్టి రాజీ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాడు లోక్ అదాలత్ రవికుమార్ పై కేసు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేసి.. సీఐడీ విచారణకు ఆదేశించింది.  

వల్లభనేని వంశీ వైసీపీలో ఉన్నారా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా వైసీపీలో ఉన్నారా? కాదు కాదు అసలు రాజకీయాలలో ఉన్నారా? అన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమౌతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు వల్లభనేని వంశీ గన్నవరం సమీపంలోనే నివాసం ఉంటున్నారు. అయినా వైసీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఆయన ఇంటి ఛాయలకు కూడా వెళ్లడం లేదు. అలాగే వంశీ కూడా పార్టీ వారితో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన వంశీ.. తెలుగుదేశం అగ్రనాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అయితే..  2024 లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ నోటికి తాళం వేసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో వంశీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమి తరువాత వంశీ నియోజకవర్గంలో పెద్దగా కనిపించింది లేదు.   ఆ తర్వాత  జైలు పాలయ్యారు. బెయిలుపై బయటకు వచ్చారు. అయినా రాజకీయాలలో కానీ, పార్టీ వ్యవహారాలలో కానీ కలుగజేసుకోవడం లేదు. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో గన్నవరం నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జిగా ఆయనను తప్పించి మరొకరిని నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలుత ఈ ఇన్ చార్జిగా వంశీ సతీమణి పంకజశ్రీ పేరు వినిపించినా, అందుకు పంకజశ్రీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో.. మరొకరి కోసం గాలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.   మొత్తం మీద జగన్ చెప్పిన వైసీపీ అందగాడు వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారనీ, త్వరలోనే రాజీనామా ప్రకటన వెలువడినా ఆశ్చర్యంలేదనీ పరిశీలకులు అంటున్నారు. 

జగన్ పై అనర్హత వేటుపై యనమల ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పరిశీలకులు, రాజ్యాంగ నిపుణులు, అసెంబ్లీ వ్యవహారాలు, నిబంధనలపై అవగాహన ఉన్నవారు అందరూ కూడా జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందే అంటున్నారు. అసెంబ్లీ నింబంధనల మేరకు వరుసగా 60 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుందంటున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ అయితే.. గైర్హాజర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాదు.. తదుపరి ఎన్నికలలో పోటీకి అనర్హులుగా కూడా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు ల్చాల్సి ఉందన్నారు.   వరుసగా 60 రోజులపాటు సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయవచ్చని రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్న యనమల రామకృష్ణుడు, తదుపరి ఎన్నికలలో వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించే విషయంపై న్యాయస్థానాల అభిప్రాయం తీసుకోవలసి ఉందని చెప్పారు.