chanakya strategies exit poll

కూటమిదే అధికారం: చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ సర్వే!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎన్డీయే కూటమిదే పైచేయి అని చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. 25 పార్లమెంట్ స్థానాల్లో కూటమికి 17 నుంచి 18 స్థానాలు, వైసీపీకి 6 నుంచి 7 స్థానాలు దక్కుతాయని, 175 ఎమ్మెల్యే స్థానాల్లో కూటమికి 114 నుంచి 125 స్థానాలు, వైసీపీకి 39 నుంచి 49స్థానాలు దక్కుతాయని చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది.  పార్లమెంట్ నియోజకవర్గాలు శ్రీకాకుళం (కూటమి), విజయనగరం (హోరాహోరీ), అరకు (వైసీపీ), విశాఖపట్నం (కూటమి), అనకాపల్లి (కూటమి), కాకినాడ (కూటమి), రాజమండ్రి (కూటమి), అమలాపురం (కూటమి), నర్సాపూర్ (కూటమి), ఏలూరు (కూటమి), మచిలీపట్నం (కూటమి), విజయవాడ (హోరాహోరీ), గుంటూరు (కూటమి), నర్సరావుపేట (కూటమి), బాపట్ల (కూటమి), ఒంగోలు (కూటమి), నెల్లూరు (కూటమి), తిరుపతి (వైసీపీ), చిత్తూరు (వైసీపీ), రాజంపేట (వైసీపీ), కడప (వైసీపీ), నంద్యాల (వైసీపీ), కర్నూలు (కూటమి), అనంతపురం (కూటమి), హిందూపూర్ (కూటమి),  అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్ఛాపురం (కూటమి), టెక్కలి (కూటమి), పలాస (కూటమి), పాతపట్నం (కూటమి), ఆమదాలవలస (కూటమి), శ్రీకాకుళం (కూటమి), నరసన్నపేట (హోరాహోరీ). ఎచ్చెర్ల (వైసీపీ), రాజాం (ఎస్సీ) (కూటమి), బొబ్బిలి (కూటమి), చీపురుపల్లి (వైసీపీ), గజపతినగరం (హోరాహోరీ), నెల్లిమర్ల (హోరాహోరీ), విజయనగరం (కూటమి). పాలకొండ (ఎస్టీ) (కూటమి), కురుపాం (ఎస్టీ) (వైసీపీ), పార్వతీపురం (ఎస్సీ) (కూటమి), సాలూరు (ఎస్టీ) (వైసీపీ), అరకులోయ (ఎస్టీ) (కూటమి), పాడేరు (ఎస్టీ) (వైసీపీ), రంపచోడవరం (ఎస్టీ) (వైసీపీ). శృంగవరపుకోట (కూటమి), భీమిలి (కూటమి), విశాఖ తూర్పు (కూటమి), విశాఖ దక్షిణం (కూటమి), విశాఖ ఉత్తరం (హోరాహోరీ), విశాఖ పశ్చిమం (కూటమి), గాజువాక (కూటమి). చోడవరం (కూటమి), మాడుగుల (కూటమి), అనకాపల్లి (కూటమి), పెందుర్తి (కూటమి), ఎలమంచిలి (కూటమి), పాయకరావుపేట (కూటమి), నర్సీపట్నం (హోరాహోరీ). తుని (కూటమి), ప్రత్తిపాడు (కూటమి), పిఠాపురం (కూటమి), కాకినాడ రూరల్ (కూటమి), పెద్దాపురం (కూటమి), కాకినాడ సిటీ (కూటమి), జగ్గంపేట (కూటమి). అనపర్తి (కూటమి), రాజానగరం (కూటమి), రాజమహేంద్రవరం సిటీ (కూటమి), రాజమహేంద్రవరం రూరల్ (కూటమి), కొవ్వూరు (ఎస్సీ) (కూటమి), నిడదవోలు (కూటమి), గోపాలపురం (ఎస్సీ) (వైసీపీ). రామచంద్రపురం (వైసీపీ), ముమ్మిడివరం (కూటమి), అమలాపురం (ఎస్సీ) (కూటమి), రాజోలు (ఎస్సీ) (వైసీపీ), పి.గన్నవరం (ఎస్సీ) (వైసీపీ), కొత్తపేట (కూటమి), మండపేట (కూటమి). ఆచంట (హోరాహోరీ), పాలకొల్లు (కూటమి), నరసాపురం (కూటమి), భీమవరం (కూటమి), ఉండి (కూటమి), తణుకు (కూటమి), తాడేపల్లిగూడెం (కూటమి). ఉంగుటూరు (కూటమి), దెందులూరు (హోరాహోరీ), ఏలూరు (కూటమి), పోలవరం (వైసీపీ), చింతలపూడి (ఎస్సీ) (కూటమి), నూజివీడు (కూటమి), కైకలూరు (కూటమి). గన్నవరం (కూటమి), గుడివాడ (కూటమి), పెడన (కూటమి), మచిలీపట్నం (కూటమి), అవనిగడ్డ (కూటమి), పెనమలూరు (కూటమి), పామర్రు (వైసీపీ). తిరువూరు (ఎస్సీ) (వైసీపీ), విజయవాడ పశ్చిమ (కూటమి), విజయవాడ సెంట్రల్ (కూటమి), విజయవాడ తూర్పు (కూటమి), మైలవరం (కూటమి), నందిగామ (కూటమి), జగ్గయ్యపేట (కూటమి). తాడికొండ (ఎస్సీ) (కూటమి), మంగళగిరి (కూటమి), పొన్నూరు (కూటమి), తెనాలి (కూటమి), ప్రత్తిపాడు (ఎస్సీ) (వైసీపీ), గుంటూరు పశ్చిమ (కూటమి), గుంటూరు తూర్పు (వైసీపీ). పెదకూరపాడు (హోరాహోరీ), చిలకలూరిపేట (కూటమి), నరసరావుపేట (వైసీపీ), సత్తెనపల్లి (కూటమి), వినుకొండ (కూటమి), గురజాల (కూటమి), మాచర్ల (కూటమి). వేమూరు (కూటమి), రేపల్లె (కూటమి), బాపట్ల (వైసీపీ), పర్చూరు (కూటమి), అద్దంకి (కూటమి), చీరాల (హోరాహోరీ), సంతనూతలపాడు (కూటమి). యర్రగొండపాలెం (వైసీపీ), దర్శి (కూటమి), ఒంగోలు (కూటమి), కొండపి (కూటమి), మార్కాపురం (వైసీపీ), గిద్దలూరు (వైసీపీ), కనిగిరి (కూటమి). కందుకూరు (కూటమి), కావలి (హోరాహోరీ), ఆత్మకూర్ (వైసీపీ), కోవూరు (కూటమి), నెల్లూరు సిటీ (కూటమి), నెల్లూరు రూరల్ (కూటమి), ఉదయగిరి (కూటమి). సర్వేపల్లి (కూటమి), గూడూరు (ఎస్సీ) (కూటమి), సూళ్ళూరుపేట (ఎస్సీ ) (వైసీపీ), వెంకటగిరి (కూటమి), తిరుపతి (కూటమి), శ్రీకాళహస్తి (కూటమి), సత్యవేడు (ఎస్సీ) (వైసీపీ). చంద్రగిరి (కూటమి), నగరి (కూటమి), గంగాధర నెల్లూరు (ఎస్సీ) (వైసీపీ), చిత్తూరు (కూటమి), పూతలపట్టు (ఎస్సీ) (కూటమి), పలమనేరు (కూటమి), కుప్పం (కూటమి). రాజంపేట (వైసీపీ), కోడూరు (ఎస్సీ) (హోరాహోరీ), రాయచోటి (వైసీపీ), తంబళ్ళపల్లె (వైసీపీ), పీలేరు (కూటమి), మదనపల్లె (కూటమి), పుంగనూరు (వైసీపీ). బద్వేల్ (ఎస్సీ) (వైసీపీ), కడప (కూటమి), పులివెందుల (వైసీపీ), కమలాపురం (హోరాహోరీ), జమ్మలమడుగు (హోరాహోరీ), ప్రొద్దుటూరు (కూటమి), మైదుకూరు (కూటమి). ఆళ్ళగడ్డ (కూటమి), శ్రీశైలం (కూటమి), నందికొట్కూరు (ఎస్సీ (హోరాహోరీ), పాణ్యం (వైసీపీ), నంద్యాల (వైసీపీ), బనగానపల్లె (కూటమి), డోన్ (హోరాహోరీ). కర్నూలు (కూటమి), పత్తికొండ (కూటమి), కోడుమూరు (ఎస్సీ) (వైసీపీ), ఎమ్మిగనూరు (కూటమి), మంత్రాలయం (వైసీపీ), ఆదోని (వైసీపీ), ఆలూర్ (వైసీపీ). రాయదుర్గం (కూటమి), ఉరవకొండ (కూటమి), గుంతకల్ (హోరాహోరీ), తాడిపత్రి (కూటమి), సింగనమల (ఎస్సీ) (వైసీపీ), అనంతపురం (కూటమి), కళ్యాణదుర్గం (కూటమి). రాప్తాడు (కూటమి), మడకశిర (ఎస్సీ) (వైసీపీ), హిందూపూర్ (కూటమి), పెనుకొండ (కూటమి), పుట్టపర్తి (వైసీపీ), ధర్మవరం (హోరాహోరీ), కదిరి (కూటమి). ఓట్ల శాతం ఎన్డీయే కూటమి = 52 శాతం వైసీపీ = 43 శాతం ఇండియా కూటమి= 2.5 శాతం ఇతరులు = 2.5 శాతం

chanikya exit poll say people mandate to tdp alliance

తెలుగుదేశం కూట‌మికే ప్ర‌జ‌లు ప‌ట్టం.. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి దాదాపు ఇర‌వై రోజులు కావొస్తున్నది. ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి మేమే అధికారంలోకి వ‌స్తున్నామ‌ని తెలుగుదేశం, వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రోసారి జ‌గ‌న్ సీఎం అవుతార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ.. పోలింగ్ స‌ర‌ళిని చూస్తే అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో అభివృద్ధిని మ‌రిచి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావ‌టంతో ప్ర‌జ‌లు విసిగిపోయారు. దీంతో గ‌తంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఓట‌ర్లు భారీగా తరలి వచ్చిత‌మ ఓటు హ‌క్కును వినియోగించుకొని ప్ర‌భుత్వంపై త‌మ వ్య‌తిరేక‌త‌ను స్ప‌ష్టం చేశారు. అర్ధ‌రాత్రి 2గంట‌ల వ‌ర‌కు దాదాపు 300 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొన‌సాగిందంటే వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉందో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. స‌ర్వే సంస్థ‌లు సైతం అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే   స్ప‌ష్ట‌మైన మెజార్టీతో  తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చింది. ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నిర్వ‌హించిన ఎగ్జిట్ పోల్ ను  చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే సంస్థ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుంది. తెలుగుదేశం కూటమికి  కూట‌మికి 52శాతం ఓట్లు,  వైసీపీకి 43శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 2.50శాతం, ఇత‌రుల‌కు 2.50 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని  చాణక్య స్ట్రటజీస్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఏపీలోని 13 ఉమ్మ‌డి జిల్లాల్లో  తెలుగుదేశం కూట‌మికే అత్య‌ధిక సీట్లు వ‌స్తాయ‌ని తేలింది. మొత్తం 175 స్థానాల్లో తెలుగుదేశం కూట‌మికి 114 నుంచి 125 సీట్లు,  వైసీపీకి 39 నుంచి 49 స్థానాలు, ఇత‌రుల‌కు ఒక స్థానం వ‌స్తుంద‌ని పేర్కొంది.  లోక్‌స‌భ స్థానాల్లో  తెలుగుదేశం కూట‌మికి 17 నుంచి 18 , వైసీపీకి 6 నుంచి 7 స్థానాలు  వ‌స్తాయ‌ని తేల్చింది.  అర‌కు, నంద్యాల‌, క‌డ‌ప‌, తిరుప‌తి, రాజంపేట‌, చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన అన్ని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులే విజ‌యం సాధిస్తార‌ని, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట్ స్థానంలో ఇరు పార్టీల మ‌ధ్య హోరాహరీ పోరు జరిగిందనీ   చాణ‌క్య స్ట్రాట‌జీస్‌ ఎగ్జిట్ పోల్ తేల్చింది.  రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్య‌ర్థులు పోటీ చేసిన‌ప్ప‌టికీ వారి ఓటు బ్యాంకు కేవ‌లం 3శాతంలోపే ఉంటుంద‌ని, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్ ష‌ర్మిల ప్ర‌భావం పెద్ద‌గా లేన‌ప్ప‌టికీ.. క‌డ‌ప పార్ల‌మెంట్ స్థానంలో మాత్రం గ‌ట్టి పోటీ ఇచ్చార‌ని చాణ‌క్య స్ట్రాట‌జీస్ పేర్కొంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి 40శాతం ఓట్లు పోల‌య్యాయి. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో టీడీపీకి 47శాతం ఓట్లు పోల‌య్యాయి.  2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి 50శాతం ఓట్లు పోల‌వ‌గా.. ప్ర‌స్తుతం 43శాతం మాత్ర‌మే ఓట్లు పోల‌య్యాయి. తెలుగుదేశం పార్టీకి జ‌న‌సేన‌, బీజేపీకూడా తోడుకావ‌డంతో   కూట‌మికి 52శాతం పోల‌యిన‌ట్లు చాణ‌క్య స్ట్రాట‌జీస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో కీల‌కంగా భావిస్తున్న కుప్పం, పిఠాపురం, హింద‌పూరం, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాన్‌, బాల‌కృష్ణ‌, నారా లోకేశ్  భారీ మెజారిటీతో విజయం సాధించడం తధ్యమని ఈ ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది.   ఉమ్మ‌డి జిల్లాల వారిగా తెలుగుదేశం, వైసీపీ లు గెలుచుకునే సీట్ల చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం ఇలా ఉన్నాయి. శ్రీ‌కాకుళం జిల్లాలో తెలుగుదేశం కూట‌మి -7, వైసీపీ -2, ట‌ఫ్ ఫైట్ -1 విజ‌య‌న‌గ‌రం జిల్లాలో   కూట‌మి-4, వైసీపీ-3, ట‌ఫ్ ఫైట్ - 2 విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాలో  కూట‌మి- -11, వైసీపీ -2, ట‌ఫ్ ఫైట్ -2  పశ్చిమ గోదావ‌రి జిల్లాలో   కూట‌మి -11, వైసీపీ - 2, ట‌ఫ్ ఫైట్ - 2 ఈస్ట్ గోదావ‌రి జిల్లాలో   కూట‌మి - 15, వైసీపీ - 3, ట‌ఫ్ ఫైట్ -1 కృష్ణా జిల్లాలో   కూట‌మి - 13, వైసీపీ - 2, ట‌ఫ్ ఫైట్ -1 గుంటూరు జిల్లాలో   కూట‌మి - 13, వైసీపీ -3, ట‌ప్ ఫైట్-1 నెల్లూరు జిల్లాలో   కూట‌మి - 07,  వైసీపీ - 2, ట‌ఫ్ ఫైట్ -1 క‌డ‌ప జిల్లాలో   కూట‌మి - 2, వైసీపీ - 4, ట‌ఫ్ ఫైట్ - 4 క‌ర్నూల్ జిల్లాలో   కూట‌మి - 6, వైసీపీ - 6, ట‌ఫ్ ఫైట్ - 2. అనంత‌పురం జిల్లాలో కూట‌మి -9, వైసీపీ - 3, ట‌ఫ్ ఫైట్ - 2 చిత్తూరు జిల్లాలో  కూట‌మి - 7, వైసీపీ - 4, ట‌ఫ్ ఫైట్ - 3  వైసీపీ ఓట‌మికి, తెలుగుదేశం కూట‌మి విజయానికి కారణాలేమిటన్నది పరిశీలిస్తే..  - వైసీపీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం ఏపీ రాజ‌ధాని లేని రాష్ట్రంగా మార్చేశార‌నే అప‌వాదు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగిస్తాన‌ని ప్ర‌తిప‌క్షం నేత హోదాలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అమ‌రాతి రాజ‌ధానిని విస్మ‌రించి మూడు రాజ‌ధానుల పేరుతో ఐదేళ్లు కాలం గ‌డిపేశారు. విశాఖ కేంద్రంగా రాజ‌ధాని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. విశాఖ న‌గ‌రంతో పాటు జిల్లాలో భూ క‌బ్జాలు పెరిగిపోయాయి. దీంతో ప్ర‌జ‌లు వైసీపీ ప్ర‌భుత్వంపై కొంత‌ వ్య‌తిరేక‌తతో ఉన్నారు. - ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మెజార్టీ ఓట‌ర్లు తెలుగుదేశం కూట‌మికి, గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ ఓట‌ర్లు  వైసీపీకి ఓట్లు వేసిన‌ట్లు స‌ర్వేలో తేలింది.  - ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు తెలుగుదేశం కూట‌మికి అనుకూలంగా మారడానికి జ‌గ‌న్ హ‌యాంలో జీరో అభివృద్ధి ఒక‌టి. ఏపీలో ఎలాంటి ప‌రిశ్ర‌మ‌లు రాక‌పోవ‌టంతో ఉపాధికోసం ప్ర‌జ‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లారు.  -  పోలింగ్ కు రెండు రోజుల ముందే హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు స‌హా ఇత‌ర రాష్ట్రాలు, విదేశాల నుంచి పెద్ద సంఖ్య‌లో ఓట‌ర్లు ఏపీకి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. వీరిలో 80శాతంకుపైగా తెలుగుదేశం  అనుకూల ఓటర్లే. - వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు కేవ‌లం దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై మాత్ర‌మే ప్ర‌భావితం చూపిస్తున్నాయి. ఈ వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా రూర‌ల్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప‌ల్లెల్లో వృద్ధులు, పెన్ష‌న్ దారులు ఎక్కువ‌గా వైసీపీ వైపు మొగ్గుచూప‌గా.. ప‌ల్లెల్లో విద్యావంతులు, ప‌ట్ట‌ణ ప్రాంతాల ఓట‌ర్లు అధికంగా  తెలుగుదేశం కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచారు. - నిరుద్యోగులు సైతం కూట‌మి వైపు మొగ్గుచూపారు. దీనికి కార‌ణం.. ప్ర‌తీయేటా జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తామంటూ గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట అమ‌లు కాలేద‌ని నిరుద్యోగులు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇదేస‌మ‌యంలో   కూట‌మి అధికారంలోకి వ‌స్తే నిరుద్యోగ భృతి వ‌స్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. దీంతో 90శాతం మంది నిరుద్యోగులు కూట‌మివైపే మొగ్గుచూపారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే ఉపాధి దొరుకుతుంద‌ని నిరుద్యోగులు న‌మ్ముతున్నారు.  - తెలుగుదేశం సూప‌ర్ సిక్స్ మేనిఫెస్టోకు క్షేత్ర స్థాయిలో మంచి ఫ‌లిత‌మే వ‌చ్చింది. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, మూడు గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితం, ప్ర‌తి మ‌హిళ‌కు నెల‌కు రూ. 1500 ఇస్తామ‌ని చంద్ర‌బాబు ఇచ్చిన హామీని క్షేత్ర‌స్థాయిలోకి తీసుకెళ్ల‌డంలో తెలుగుదేశం నేత‌లు విజ‌య‌వంతం అయ్యారు.  - వైసీపీ ప్ర‌భుత్వం ఓట‌మికి మ‌రో ప్ర‌ధాన కార‌ణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.  దీనికితోడు ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోలు ఉండ‌టాన్ని వైసీపీ నేత‌లు కూడా త‌ప్పుబ‌ట్టారు. ఈ అంశంపై ప్ర‌జ‌లు బ‌హిరంగంగానే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా భూమిపై మీ హ‌క్కు ఏమిట‌ని నిల‌దీశారు. దీనికితోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు నేనుకూడా బాధితుడినే అంటూ కొంద‌రు ప్ర‌ముఖలు బ‌హిరంగంగా చెప్ప‌డంతో ప్ర‌జ‌ల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై భ‌యాందోళ‌నలు నెల‌కొన్నాయి.  - ప‌ట్టాదారు పాసు పుస్త‌కంపై జ‌గ‌న్ ఫొటో ఉండ‌టం ఏమిట‌ని  తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. నంద్యాల స‌భ‌లో పాసు పుస్త‌కాన్ని చింపేశారు. ఇది ఓట‌ర్ల‌ను, ముఖ్యంగా రైతుల‌ను బాగా ఆక‌ర్షించింది. అధికారంలోకిరాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దుపైనే రెండో సంత‌కం అని చంద్ర‌బాబు చెప్ప‌డంతో రైతులు అధిక‌శాతం మంది కూట‌మివైపు మొగ్గుచూపారు.  - కొత్త‌గా ఓటుహ‌క్కు పొందిన యువ‌తుల్లో 70శాతం మంది తెలుగుదేశం కూట‌మికే అనుకూలంగా ఓటు వేశారు. యువ‌కుల్లో  60శాతం మంది కూట‌మికి అనుకూలంగా ఓటు వేశారు.  - ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు ఈ ఎన్నిక‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వీరిలో అధిక‌శాతం  మంది ఓట‌ర్లు కూట‌మివైపు మొగ్గుచూపారు. ఈసారి 4.30ల‌క్ష‌ల‌కుపైగా పోస్ట‌ల్ ఓట్లు పోల‌య్యాయి. మెజార్టీ శాతం పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు తెలుగుదేశం కూట‌మికే ప‌డిన‌ట్లు చాణ‌క్య స్ట్రాట‌జీస్  ఎగ్జిట్ పోల్ తేల్చింది.

pioneer exit poll

కూటమిదే విజయం: పయనీర్ పోస్ట్ పోల్ సర్వే!

జగన్ ఎన్ని బటన్లు నొక్కినా, ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈవీఎంలలో కూటమి బటన్ నొక్కాడని తెలిసిపోయింది. తెలుగుదేశం కూటమిదే ఘన విజయం అని పయనీర్ పోస్ట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. 25 పార్లమెంట్ స్థానాల్లో కూటమికి 20 స్థానాలు, వైసీపీకి 5 స్థానాలు దక్కుతాయని, 175 ఎమ్మెల్యే స్థానాల్లో కూటమికి 144 స్థానాలు, వైసీపీకి 31 స్థానాలు దక్కుతాయని ‘పయనీర్’ స్పష్టం చేసింది. 14 మే నుంచి 29 మే వరకు సేకరించిన అభిప్రాయల ప్రకారం ‘పయనీర్’ ఈ సర్వే ఫలితాలను వెల్లడించింది. పార్లమెంట్ నియోజకవర్గాలు శ్రీకాకుళం (కూటమి), విజయనగరం (కూటమి), అరకు (వైసీపీ), విశాఖపట్నం (కూటమి), అనకాపల్లి (కూటమి), కాకినాడ (కూటమి), రాజమండ్రి (కూటమి), అమలాపురం (కూటమి), నర్సాపూర్ (కూటమి), ఏలూరు (కూటమి), మచిలీపట్నం (కూటమి), విజయవాడ (కూటమి), గుంటూరు (కూటమి), నర్సరావుపేట (కూటమి), బాపట్ల (కూటమి), ఒంగోలు (కూటమి), నెల్లూరు (కూటమి), తిరుపతి (కూటమి), చిత్తూరు (కూటమి), రాజంపేట (వైసీపీ), కడప (వైసీపీ), నంద్యాల (వైసీపీ), కర్నూలు (వైసీపీ), అనంతపురం (కూటమి), హిందూపూర్ (కూటమి). అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్ఛాపురం (కూటమి), టెక్కలి (కూటమి), పలాస (కూటమి), పాతపట్నం (కూటమి), ఆమదాలవలస (కూటమి), శ్రీకాకుళం (కూటమి), నరసన్నపేట (కూటమి). ఎచ్చెర్ల (కూటమి), రాజాం (ఎస్సీ) (కూటమి), బొబ్బిలి (కూటమి), చీపురుపల్లి (వైసీపీ), గజపతినగరం (కూటమి), నెల్లిమర్ల (కూటమి), విజయనగరం (కూటమి). పాలకొండ (ఎస్టీ) (కూటమి), కురుపాం (ఎస్టీ) (వైసీపీ), పార్వతీపురం (ఎస్సీ) (వైసీపీ), సాలూరు (ఎస్టీ) (కూటమి), అరకులోయ (ఎస్టీ) (కూటమి), పాడేరు (ఎస్టీ) (కూటమి), రంపచోడవరం (ఎస్టీ) (వైసీపీ). శృంగవరపుకోట (కూటమి), భీమిలి (కూటమి), విశాఖ తూర్పు (కూటమి), విశాఖ దక్షిణం (కూటమి), విశాఖ ఉత్తరం (కూటమి), విశాఖ పశ్చిమం (కూటమి), గాజువాక (కూటమి). చోడవరం (కూటమి), మాడుగుల (కూటమి), అనకాపల్లి (కూటమి), పెందుర్తి (కూటమి), ఎలమంచిలి (కూటమి), పాయకరావుపేట (కూటమి), నర్సీపట్నం (కూటమి). తుని (కూటమి), ప్రత్తిపాడు (కూటమి), పిఠాపురం (కూటమి), కాకినాడ రూరల్ (కూటమి), పెద్దాపురం (కూటమి), కాకినాడ సిటీ (కూటమి), జగ్గంపేట (కూటమి). అనపర్తి (కూటమి), రాజానగరం (కూటమి), రాజమహేంద్రవరం సిటీ (కూటమి), రాజమహేంద్రవరం రూరల్ (కూటమి), కొవ్వూరు (ఎస్సీ) (కూటమి), నిడదవోలు (కూటమి), గోపాలపురం (ఎస్సీ) (కూటమి). రామచంద్రపురం (కూటమి), ముమ్మిడివరం (కూటమి), అమలాపురం (ఎస్సీ) (కూటమి), రాజోలు (ఎస్సీ) (కూటమి), పి.గన్నవరం (ఎస్సీ) (కూటమి), కొత్తపేట (కూటమి), మండపేట (కూటమి). ఆచంట (కూటమి), పాలకొల్లు (కూటమి), నరసాపురం (కూటమి), భీమవరం (కూటమి), ఉండి (కూటమి), తణుకు (కూటమి), తాడేపల్లిగూడెం (కూటమి). ఉంగుటూరు (కూటమి), దెందులూరు (కూటమి), ఏలూరు (కూటమి), పోలవరం (వైసీపీ), చింతలపూడి (ఎస్సీ) (కూటమి), నూజివీడు (కూటమి), కైకలూరు (కూటమి). గన్నవరం (కూటమి), గుడివాడ (కూటమి), పెడన (కూటమి), మచిలీపట్నం (కూటమి), అవనిగడ్డ (కూటమి), పెనమలూరు (కూటమి), పామర్రు (కూటమి). తిరువూరు (ఎస్సీ) (వైసీపీ), విజయవాడ పశ్చిమ (కూటమి), విజయవాడ సెంట్రల్ (కూటమి), విజయవాడ తూర్పు (కూటమి), మైలవరం (కూటమి), నందిగామ (కూటమి), జగ్గయ్యపేట (కూటమి). తాడికొండ (ఎస్సీ) (కూటమి), మంగళగిరి (కూటమి), పొన్నూరు (కూటమి), తెనాలి (కూటమి), ప్రత్తిపాడు (ఎస్సీ) (కూటమి), గుంటూరు పశ్చిమ (కూటమి), గుంటూరు తూర్పు (కూటమి). పెదకూరపాడు (కూటమి), చిలకలూరిపేట (కూటమి), నరసరావుపేట (వైసీపీ), సత్తెనపల్లి (కూటమి), వినుకొండ (కూటమి), గురజాల (కూటమి), మాచర్ల (కూటమి). వేమూరు (కూటమి), రేపల్లె (కూటమి), బాపట్ల (వైసీపీ), పర్చూరు (కూటమి), అద్దంకి (కూటమి), చీరాల (వైసీపీ), సంతనూతలపాడు (కూటమి). యర్రగొండపాలెం (వైసీపీ), దర్శి (కూటమి), ఒంగోలు (కూటమి), కొండపి (కూటమి), మార్కాపురం (కూటమి), గిద్దలూరు (కూటమి), కనిగిరి (కూటమి). కందుకూరు (కూటమి), కావలి (కూటమి), ఆత్మకూర్ (కూటమి), కోవూరు (కూటమి), నెల్లూరు సిటీ (కూటమి), నెల్లూరు రూరల్ (కూటమి), ఉదయగిరి (కూటమి). సర్వేపల్లి (కూటమి), గూడూరు (ఎస్సీ) (కూటమి), సూళ్ళూరుపేట (ఎస్సీ ) (వైసీపీ), వెంకటగిరి (కూటమి), తిరుపతి (కూటమి), శ్రీకాళహస్తి (కూటమి), సత్యవేడు (ఎస్సీ) (వైసీపీ). చంద్రగిరి (కూటమి), నగరి (కూటమి), గంగాధర నెల్లూరు (ఎస్సీ) (వైసీపీ), చిత్తూరు (కూటమి), పూతలపట్టు (ఎస్సీ) (కూటమి), పలమనేరు (కూటమి), కుప్పం (కూటమి). రాజంపేట (కూటమి), కోడూరు (ఎస్సీ) (వైసీపీ), రాయచోటి (వైసీపీ), తంబళ్ళపల్లె (వైసీపీ), పీలేరు (కూటమి), మదనపల్లె (కూటమి), పుంగనూరు (వైసీపీ). బద్వేల్ (ఎస్సీ) (వైసీపీ), కడప (కూటమి), పులివెందుల (వైసీపీ), కమలాపురం (వైసీపీ), జమ్మలమడుగు (కూటమి), ప్రొద్దుటూరు (వైసీపీ), మైదుకూరు (కూటమి). ఆళ్ళగడ్డ (కూటమి), శ్రీశైలం (కూటమి), నందికొట్కూరు (ఎస్సీ (వైసీపీ), పాణ్యం (వైసీపీ), నంద్యాల (వైసీపీ), బనగానపల్లె (కూటమి), డోన్ (కూటమి). కర్నూలు (కూటమి), పత్తికొండ (కూటమి), కోడుమూరు (ఎస్సీ) (వైసీపీ), ఎమ్మిగనూరు (కూటమి), మంత్రాలయం (వైసీపీ), ఆదోని (వైసీపీ), ఆలూర్ (వైసీపీ). రాయదుర్గం (కూటమి), ఉరవకొండ (కూటమి), గుంతకల్ (కూటమి), తాడిపత్రి (కూటమి), సింగనమల (ఎస్సీ) (వైసీపీ), అనంతపురం (కూటమి), కళ్యాణదుర్గం (కూటమి). రాప్తాడు (కూటమి), మడకశిర (ఎస్సీ) (వైసీపీ), హిందూపూర్ (కూటమి), పెనుకొండ (కూటమి), పుట్టపర్తి (కూటమి), ధర్మవరం (కూటమి), కదిరి (కూటమి). ఓట్ల శాతం ఎన్డీయే కూటమి = 52 శాతం వైసీపీ = 41 శాతం ఇండియా కూటమి= 4 శాతం ఇతరులు = 3 శాతం

jagan helped pawan to easy win in pithapuram

పిఠాపురంలో పవన్ విజయానికి జగన్ బాటలు!

ఎన్నికల ఫలితాలు సరిగ్గా మూడు రోజుల్లో వెలువడతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయని చెబుతున్నారు. అయితే సర్వేలు, అంచనాలూ తెలుగుదేశం కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఖాయమని చెబుతున్నాయి. పోలింగ్ తరువాత నుంచీ వైసీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వారికి కూడా రాబోయేది ఓటమే అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు ఘోర పరాజయం అన్న సంగతి తెలిసిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇక మరి కొద్ది గంటల్లో  ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. సర్వత్రా ఎగ్జిట్ పోల్స్ పట్ల ఉత్కంఠ, ఉత్సుకత నెలకొంది. తెలిసిపోయిన ఫలితమే అయినా టీవీల్లో చూసి సరిపోల్చుకోవడంలో ఓ కిక్ ఉంటుంది. ఆ కిక్ కోసమే ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలే కాదు, ఈ సారి సామాన్య జనం కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే హాట్ సీట్లలో ఒకటిగా చెప్పుకుంటున్న పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి తీసుకుంటే.. ఇక్కడ ఎగ్జిట్ పోల్ పై పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. తుది ఫలితంపై కూడా ఏమంత టెన్షన్ లేదు. ఉన్న టెన్షన్ అంతా ఇక్కడ పవన్ కల్యాణ్ కు వచ్చే మెజారిటీ ఎంత అన్నదే.  2019 ఎన్నికలలో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండింటిలోనూ పరాజయం పాలయ్యారు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. అదే సమయంలో ఆయనను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న జగన్ పిఠాపురంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలోనే కాపు సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో జగన్ పవన్ ను ఓడించడానికి వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలూ అంతిమంగా పవన్ విజయానికి బాటలు వేశాయని చెప్పాలి. పవన్ ను ఓడించడమే లక్ష్యంగా జగన్ మిథున్ రెడ్డికి నియోజకవర్గ ప్రచార బాధ్యతలు అప్పగించారు. పవన్ ను తిట్టడమే లక్ష్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకుని మరీ ఆ పని అప్పగించారు. ఇక కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. అంతే కాదు.. ఎన్నికల ప్రచారం ముగింపు రోజున తన చివరి బహిరంగ సభ కూడా జగన్ పిఠాపురంలోనే నిర్వహించారు. అంతే కాదు వంగీ గీతను పిఠాపురం నుంచి గెలిపిస్తే ఆమెను ఉప ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే జగన్ వ్యూహాలూ ఎత్తుగడలూ అన్నీ పిఠాపురంలో పవన్ కు అనుకూలంగా మారాయని చెప్పవచ్చు. జగన్ ఒక విధంగా పవన్ పై దండయాత్ర చేస్తున్నారని జనం భావించారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలనివ్వను అంటూ ప్రకటించి, అందుకు అనుగుణంగా అడుగులు వేసి, త్యాగాలకు కూడా సిద్ధపడిన పవన్ పల్ల ప్రజాభిమానం వెల్లువెత్తింది. అదే విధంగా పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్  ఎస్వీఎస్ఎన్ వర్మ ఫ్యాక్టర్ తెలుగుదేశం ఓటు సజావుగా సాఫీగా జనసేనకు ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేసింది. ఈ అన్ని అంశాలూ కలిసి పిఠాపురంలో జనసేనాని గెలుపును సునాయాసం చేశాయి. ఇక్కడ ఇప్పుడు వైసీపీ క్యాడర్ కూడా పవన్ కల్యాణ్ కు ఎంత మెజారిటీ అన్న అంశంపైనే మాట్లాడుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

RESPONSIBLE LEADER CBN

బాధ్యతాయుత ప్రజానాయకుడు చంద్రబాబు!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరంతరం ప్రజల మధ్య ఉంటారు. ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం తపిస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఈ విషయంలో  ఆయన తీరు ఇసుమంతైనా మారదు. విజయవాడలో డయోరియా మరణాలు రోజు రోజుకూ పెరుగుతూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ, అధికార పార్టీ నేతలు కానీ కనీసం అక్కడి పరిస్థితులపై సమీక్షించలేదు. బాధితులను పరామర్శించలేదు. అసలు విజయవాడ నడిబొడ్డులో డయేరియా విజృంభించి అమాయకుల ఉసురు తీస్తోందన్న విషయం తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన విదేశీ పర్యటన ముగించుకుని అమరావతిలో అడుగుపెట్టీపెట్టగానే బెజవాడ డయేరియా బాధితులపై స్పందించారు. వారిని తక్షణమే ఆదుకోవాలని అధికారులను కోరారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.  ఇంతెందుకు పోలింగ్ పూర్తయిన తరువాత ఆయన ప్రతిక్షణం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేశారు. అధికారులకు, ఎన్నికల సంఘానికీ లేఖలు రాశారు.  ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌  కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు.    

ycp leaders threatening officers

రంకెలు.. పెడబొబ్బలు.. ఎవర్ని బెదిరిద్దామని?

ఓటమి అంచున నిలబడి వైసీపీ నేతలు కొందరు బెదరింపులకు దిగుతున్నారు. హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత కాలం తమ వద్ద కుక్కిన పెనుల్లా పడి ఉన్న అధికారులే తమపై కేసులు నమోదు చేస్తుంటే.. ఏమిటీ ధిక్కారం అంటూ పెచ్చులకు పోతున్నారు. రేపు మీ సంగతేమిటో చూస్తాం అంటూ రంకెలు వేస్తున్నారు. ఇంత అన్యాయమా అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. ఔను పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ రేపు అనేది లేదనుకుంటున్నారా? మీలో ఒక్కర్నీ వదలం తస్మాత్ జాగ్రత్త అంటూ నిన్నమొన్నటి వరకూ తమ అడుగులకు మడుగులొత్తిన అధికారులపై బెదరింపులకు పాల్పడుతున్నారు.  నిజమే.. నిన్నటి దాకా నేరుగా ఎవరి మౌఖికాదేశాలపై అయితే పోలీసులు పని చేశారో.. ఆయనపై ఇప్పుడు అదే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఔను మామూలుగా అయితే సజ్జలపై క్రిమినల్ కేసు అదీ తాడేపల్లి పోలీసు స్టేషన్ లో నమోదు అయ్యిందంటే.. అర్ధం ఏమిటి?  వైసీపీ హవా ఎత్తిపోయిందనే కాదా? ఎన్నికల ఫలితాలు వెలువడగానే జగన్ మాజీ అయిపోబోతున్నారనే కాదా? అయినా ఆ విషయం పేర్ని నాని లాంటి వారికి ఎందుకు అర్ధం కావడం లేదు? ఒక వేళ అర్ధమైనా చివరి క్షణం వరకూ తమ దబాయింపు సెక్షన్ చెల్లుబాటు అయ్యేలా చేసుకోవాలని భావిస్తున్నారా? తాడేపల్లి పోలీసు స్టేషన్ లో  సజ్జలపై  క్రిమినల్ కేసు, అలాగే వైసీపీకి అందునా ఆ పార్టీ అధినేత జగన్ కు కంచుకోట లాంటి కడపలో కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు, నేతలకు నగర బహిష్కరణ..దీంతోనే ఇప్పటి దాకా ఏమో ఫలితం ఎలా ఉంటుందో అని ఊగిసలాడుతున్న వారికి కూడా వైసీపీ భవిష్యత్ ఏమిటో అర్ధమైపోయింది. దీంతో రేపు కౌంటింగ్ లో గలాటా చేసే వాళ్లే  ఏజెంట్లుగా కూర్చోవాలి అన్న హుంకరింపుల నుంచి అసలు కౌంటింగ్ సెంటర్ లో కూర్చోడానికి ఏజెంట్ దొరికితే చాలన్న పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒక వేళ ఏజెంట్లు దొరికినా వారు ఎటూ ఓటమే కదా ఇంతోటి దాని కోసం వాదనలు, గొడవలు ఎందుకు అని ప్రేక్షకపాత్రకే పరిమితమౌతారన్న అనుమానం వైసీపీ నేతలను వేధిస్తోంది. అందుకే అధికారులపై హెచ్చరికలు, బెదరింపులకు పాల్పడటం ద్వారా రాబోయేది మన ప్రభుత్వమే అన్న భరోసా అంతో ఇంతో పార్టీ కేడర్ లో నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చు.  ఇక అధికారులు, పోలీసుల తీరు ఒక్క సారిగా ఇలా మారిపోవడానికి వారికి గ్రౌండ్ రియాలిటీ స్పష్టంగా 70ఎంఎం స్క్రీన్ మీద కనిపించడమే అంటున్నారు. ఫలితం ఎలా రాబోతోందో స్పష్టంగా తెలిసిపోయిన నేపథ్యంలో చివరి రోజులలోనైనా నిజాయితీగా నిక్కచ్చిగా పని చేస్తే రాబోయే ప్రభుత్వ గుడ్ లుక్స్ లో పడతామన్న ఆశతోనే అధికారులు వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ రోజుల హింసాకాండకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ, ఏ మాత్రం ఉపేక్షించమన్న స్పష్టమైన హెచ్చరికలు పోలీసుల నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే విజయంపై నమ్మకాన్ని వదిలేసుకున్న వైసీపీ నేతలు  ఆ ఫ్రస్ట్రేషన్ లో అధికారులను బెదరించి మరింత అభాసుపాలౌతున్నారు.  

heroes stood againest jagan

జగన్ కు తలవొంచని ధీరులు ఏబీ, ఆర్ఆర్ఆర్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో అలుపెరుగని పోరాటం ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు రాజకీయ నాయకుడు అయితే మరొకరు ఐపీఎస్ అధికారి. ఇద్దరినీ కూడా కేవలం వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని జగన్ వేధింపులకు గురి చేశారు. వారి స్థాయి, హోదాకు ఇసుమంతైనా విలువ ఇవ్వకుండా నానా రకాలుగా వేధించారు. అయితే ఇద్దరూ కూడా ఎక్కడా తలవొంచలేదు. వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎటువంటి అండా లేకుండా ఒంటరిగానే అలుపెరుగని పోరాటం సాగించారు. వారిద్దరిలో ఒకరు  శుక్రవారం(మే31) సగౌరవంగా రిటైరైన డీజీపీ స్ధాయి పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. మరొకరు ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు! ఇరువురూ కూడా జగన్ బాధితులే. ఇరువురూ కూడా ఒంటరిగానే న్యాయపోరాటం, రాజకీయ పోరాటం సాగించారు. ఇరువురూ కూడా అంతిమంగా విజయం సాధించారు. నైతికంగా కూడా ఉన్నతంగా నిలిచారు. అదే స్థాయిలో అశేష ప్రజాభిమానానికీ పాత్రులయ్యారు.  ముందుగా ఏబీ వెంకటేశ్వరరావు విషయం తీసుకుంటే.. 2019లో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన రోజు నుంచి మొత్తం అధికార వ్యవస్థకు, అధికార యంత్రాంగానికి ఆయన టార్గెట్ గా మారారు. పెగాసన్ పరికరాల కొనుగోలులో అవినీతి వంకతో ఆయనను సస్పెండ్ చేశారు. సుప్రీం కోర్టు సస్పెన్షన్ చెల్లదని విస్పష్ట తీర్పు ఇచ్చినా సస్పెన్షన్ ఎత్తివేసినట్లే ఎత్తివేసి మళ్లీ అదే కేసులో ఆయనను సస్పెండ్ చేశారు. క్యాట్ ఉత్తర్వ్యులనూ ఖాతరు చేయకుండా ఆయనను సస్పెన్షన్ లోనే ఉండగానే పదవీ విరమణ చేసే పరిస్థితి తీసుకురావడానికి శతథా ప్రయత్నించారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటానికి తలవంచక తప్పలేదు. ఆయనకు పోస్టింగ్ ఇచ్చితీరాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. దీంతో ఆయన సగౌరవంగా రిటర్ అయ్యారు. ఏబీ విషయంలో ప్రభుత్వ తీరు ఎంత దుర్మార్గంగా ఉందో ప్రపంచం మొత్తానికి అర్ధమైంది. సామాన్య ప్రజలు కూడా ఆయన ధైర్యానికి, నిజాయితీకి సెల్యూట్ చేస్తున్నారు.  ఇక రఘురామకృష్ణం రాజు విషయానికి వస్తే.. అధికార పార్టీ ఎంపీగా ఆయన ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడమే నేరమైంది. ఠాఠ్ నేను చేసింది తప్పంటావా? అన్న ఆగ్రహంతో జగన్ ఆయనపై కక్ష కట్టారు.  అక్రమ కేసులు బనాయించి కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అయినా ఆయన ఎక్కడా తొణకలేదు, బెణకలేదు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం రచ్చబండ పేరిట జగన్ సర్కార్ నిర్వాకాలను ఉతికి ఆరేశారు. ఈ క్రమంలో ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ఆయన పోరాట స్ఫూర్తికి జనం మద్దతు లభించింది. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకీ, ఎంపీ పదవికీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు జనం ఆయన విజయం తథ్యం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆయన అసెంబ్లీ స్పీకర్ అవుతారన్న ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. రఘురామకృష్ణం రాజును జగన్ అధ్యక్షా అని సంభోదిస్తూ చూడాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అలా జగన్ టార్గెట్ చేసి వేధించి వేపుకు తిన్న ఇరువురూ కూడా జనాభిమానాన్ని సంపాదించుకున్నారు. జగన్ అధికారాన్ని లెక్క చేయకుండా ఎదిరించి  నైతికంగా ఉన్నతంగా నిలబడ్డారు. ప్రజాభిమానానికి పాత్రులయ్యారు.  

piduguralla police force

వైసీపీ గుండెల్లో ‘పిడుగు’లు!

ఎప్పుడు ఏ విధ్వంసం సృష్టిద్దామా అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తూ వుంటారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా వాళ్ళ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కౌంటింగ్ సందర్భంగా ‘రెచ్చిపోండి’ అని పిలుపు కూడా ఇచ్చాడాయె. దాంతో వైసీపీ మూకలు కౌంటింగ్ రోజున విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేసుకుంటున్నాయి. ఆరిపోయే దీపాలకే ఇంత యాక్షన్ వుంటే, అధికారుల రియాక్షన్ కూడా అదే రేంజ్‌లో వుంటుంది మరి. కౌంటింగ్ రో్జున గానీ, ఆ తర్వాత గానీ వైసీపీ కార్యకర్తలు కిక్కురుమన్నా నల్లుల్ని నలిపేసినట్టు నలిపేయడానికి పోలీసు బలగాలు సిద్ధంగా వున్నాయి. పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ళలో వందలాది మంది పోలీసు బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ మాక్ డ్రిల్ చూసిన పిడుగురాళ్ల వాసులు హమ్మయ్య అనుకున్నారు. గొడవలకు రెడీ అవుతున్న వైసీపీ పిశాచాల గుండెల్లో మాత్రం పిడుగులు పడ్డాయి. పల్నాడులో మాత్రమే కాదు.. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలన్నిట్లోనూ పోలీసు బలగాలు మోహరించాయి. అందుకే వైసీపీ రౌడీ, గూండా బిడ్డల్లారా.. పోలింగ్ రోజున ఓవర్ యాక్షన్ చేయకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు పడి వుండండి.. బయటకొచ్చి ఏదైనా అతి చేశారో... పోలీసులని చూశారుగా.. తుక్కుతుక్కు అయిపోతారు జాగ్రత్త!

ycp leaders in fear

షెల్టర్ కావలెను: వైసీపీ నాయకుల వెతుకులాట!

ఈసారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విక్టరీ కన్ఫమ్ అయిపోయింది. రిజల్ట్స్ రావాల్సిన అవసరం లేదు.. ఎగ్జిట్ పోల్స్ చెప్పాల్సిన పనిలేదు.. పోలింగ్ రోజున ఓటర్ల వేవ్ గమనించినా, ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు గమనించినా టీడీపీ గ్రాండ్ విక్టరీ ఖాయం అనేది అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు తమకు తామే ఊహించుకున్న భయాలతో వణికిపోతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు, దారుణాలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేశారు. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహదేవ అన్నట్టు.. తాము చేసిన దాడులు తమ మీద కూడా రిపీట్ అవుతాయన్న భయంతో వైసీపీ క్యాడర్ వణికి చస్తోంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే జూన్ నాలుగో తేదీన తమ ఇళ్ళలో, తమ ఊళ్ళో లేకుండా వేరే ఎక్కడైనా తలదాచుకునే ప్రయత్నాల్లో వున్నారు. వైసీపీ నాయకులైతే ఏ హైదరాబాద్‌లో వెళ్ళి గెస్ట్ హౌసుల్లో రెస్ట్ తీసుకుంటారు. కానీ, నాయకులు చెప్పినట్టు చేసి విధ్వంసం సృష్టించిన కార్యకర్తల పరిస్థితి ఏంటి? అందుకే వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక వేరే ఊళ్ళలో వున్న తమ బంధువుల ఇళ్ళలో తల దాచుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. అయితే ఇలాంటి వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం వల్ల తమ కొంపమీదకి ఏమొస్తుందో అని సదరు బంధువుల భయపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే పెద్దలు ఏనాడో అన్నారు.. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అని!

commercial gas cyllender rates come down

భారీగా తగ్గిన గ్యాస్ సిలెండర్ ధర

గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈ తగ్గిన ధరలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గడంతో అందుకు అనుగుణంగా దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 72 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో 19 కేజీల గ్యాస్ సిలెండర్ ధర రూ. 1903లు , చెన్నైలో రూ.1840లు, కోల్ కతాలో రూ.1787లు, ముంబైలో రూ.1629లు, దేశ రాజధాని ఢిల్లలో రూ.1676లుకు కమర్షియల్ వంట గ్యాస్ సిలెండర్ లభిస్తున్నారు. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఎటువంటి వెసులుబాటూ కలగలేదు. చమురు సంస్థలు వంట గ్యాస్ సిలెండర్ ధరను తగ్గించలేదు. దీంతో వాటి ధర యథాతథంగా కొనసాగుతోంది.  

tdpin fray telangana local bodies elections

తెలంగాణ ‘స్థానిక’ ఎన్నికల బరిలో తెలుగుదేశం

ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయిన తరువాత తెలుగుదేశం ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. తెలంగాణలో పార్టీ కేడర్ గత పదేళ్లుగా చెక్కుచెదరకుండా నిలబడినప్పటికీ, అనివార్యంగా తెలుగుదేశం ఆ రాష్ట్రంలో ఎన్నికల పోటీకి దూరంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కానీ, ఇప్పుడు జరిగిన లోక్ సభ ఎన్నికలలో కానీ తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది.  ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కూడా లేరు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ణానేశ్వర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడి నియామకం జరగలేదు.  అయితే త్వరలో తెలంగాణ అధ్యక్షుడి నియామకం చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. తెలంగా ణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు, నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని చెప్పారు. స్థానిక ఎన్నికలలో యువత ప్రాధాన్యతలకు పెద్దపీట వేస్తామని చెప్పారు.  విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పార్టీ తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు.  అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పోటీ నుంచి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో ఆయన ఈ సందర్భంగా వారికి వివరించారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు, పరిణామాల కారణంగా కొంత కాలంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేకపోయినట్లు చెప్పిన చంద్రబాబు ఇక నుంచి తెలంగాణపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.  

mamata skip india alliance meet

ఇండియా కూటమి భేటీకి మమతా బెనర్జీ డుమ్మా

సాధారణ ఎన్నికలు ముగింపునకు వచ్చేశాయి. శనివారం ( జూన్ 1) తుది విడత పోలింగ్ జరుగుతోంది. అంచనాలన్నీ బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవన్నట్లుగానే  ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్, ఇండియా కూటమి గట్టిగా పుంజుకున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అటువంటి తరుణంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు  శనివారం (జూన్ 1)  పసాయంత్రం 3 గంటలకు సమావేశమౌతున్నాయి. ఈ సమావేశంలో సాధారణ ఎన్నికలు, ప్రచార సరళి, ఓటింగ్ జరిగిన తీరు, కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు, అదే విధంగా కౌంటింగ్ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇలా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా జూన్ 4న ఫలితాల వెల్లడి తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక ఎగ్జిట్ పోల్స్ పై కూడా ఇండియా కూటమి భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియా కూటమి ఎగ్జిట్ పోల్స్ పై మీడియాలో జరిగే చర్చలను  బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ కీలక నేతల సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా కూటమి నేతలంతా దాదాపుగా హాజరౌతున్నాయి. అయితే ఇంతటి కీలక సమావేశానికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ డుమ్మా కొడుతున్నారు. ఏడవ విడతలో పశ్చిమ బెంగాల్ లోని 9 లోక్ సభ నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తాను సమావేశానికి హాజరు కావడం లేదని ఆమె ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో కూటమి ఐక్యతపై మరోసారి అనుమాన మేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో మినహా మిగిలిన రాష్ట్రాల వరకూ తృణమూల్ ఇండియా కూటమి భాగస్వామ్యపక్షంగా ఉంటుందని మమతా బెనర్జీ ప్రకటించడం, ఆ తరువాత అవసరాన్ని బట్టి ఇండియా కూటమికి మద్దతు ప్రకటిస్తాననడంతో తొలి నుంచీ ఆమె కూటమి విషయంలో కొంత దూరాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కీలక బేటీకి పోలింగ్ కారణంగా చూపుతూ డుమ్మా కొట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

jagan came back

తిరిగొచ్చిన జగన్.. బూరెల్లాగా బుగ్గలు!

ముఖ్యమంత్రిగా చివరి గంటలను ఆస్వాదిస్తున్న జగన్మోహన్‌రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్‌కి తిరిగి వచ్చారు. దాంతో, జగనన్న తిరిగి వస్తాడా, రాడా అని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. జగనన్న తిరిగొచ్చాడు కాబట్టి ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం గన్నవరం విమానాశ్రయానికి వేల సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. భారీగా హడావిడి చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మొత్తమ్మీద జగన్ తిరిగొస్తాడా రాడా అని ఇంతకాలం జనంలో హల్‌చల్ చేసిన సస్పెన్స్.కి తెరపడింది. ఇదిలా వుంటే, విమానంలోంచి దిగిన జగన్‌ని చూసి వైసీసీ నాయకులు ఆశ్చర్యపోయారు. లండన్ వెళ్ళడానికి విమానం ఎక్కే సమయంలో కళ తప్పి, కాంతివిహీనం అయిపోయి వున్న ఆయన ముఖం ఇప్పుడు రంగు తేలింది. మిలమిలలాడుతోంది. ముఖ్యంగా బుగ్గలయితే బూరెల్లాగా పొంగాయి. యూరప్‌లో రెస్టు బాగా తీసుకున్నారో లేక ట్రీట్‌మెంట్ ఏమైనా చేయించుకున్నారోగానీ, జగన్‌ ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 

ప్రశాంతంగా ఏడో దశ పోలింగ్

దేశంలో  చివరి దైన ఏడో దశ పోలింగ్ శనివారం (జూన్1) ప్రశాంతంగా సాగుతోంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్ సభ స్థానాలతో పాటు, ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉత్తరప్రదేశ్ లో 13, పంజా బ్ లో 13, పశ్చిమ బెంగాల్ లో 9, బీహార్ లో 8, ఒడిశా లో 6, హిమాచల్ ప్రదేశ్ లో 4, ఝార్ఖండ్ లో 3, ఛండీ గఢ్ లో ఒక లోక్ సభ స్థానా నికి ఎన్నికలుజరగను న్నాయి  చివరి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తదితరులు ఉన్నారు.  ఏడో దశ పోలింగ్ లో 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  పోలింగ్ తీరును పర్యవే క్షించేందుకు 172 మంది ఎన్నికల పరిశీలకులను నియమించారు.  అలాగే 2,707 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2,799 స్టాటిక్ సర్విలెన్స్  బృందాలు,  1,080 నిఘా బృందాలు, 560 వీడియో మానిటరింగ్ టీమ్ లను ఏర్పాటు చేశారు. రహదారి తనిఖీల నిమిత్తం దాదాపు 1,100కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తుది విడత పోలింగ్ ముగిసిన తరువాత సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 4న జరుగుతుంది. 

మెడిటేషన్ కాదు.. మోడిటేషన్!

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కన్యాకుమారిలో అప్పుడెప్పుడో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే 45 గంటలపాటు ధ్యానానికి కూర్చోవడం ఎంత గొప్ప విషయమో మాటల్లో చెప్పలేం. 45 గంటలు ధ్యానం చేసే సమయంలో ఆయన ఎవరితోనూ మాట్లాడరట. కేవలం ద్రవ పదార్ధాలే తీసుకుంటారట. అద్భుతం. మోడీ గారు కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానంలో కూర్చున్న ఫొటోలు చూసి భారతీయుల హృదయాలు పులకరించిపోతున్నాయి. స్వామి వివేకానంద 2 పాయంట్ ఓ ని చూసినట్టు అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, స్వామి వివేకానందే ఈ దేశాన్ని మరోసారి ఉద్ధరించడం కోసం నరేంద్ర మోడీ రూపంలో అవతరించారా అనిపిస్తోంది. మనందరి అదృష్టం బాగుంది కాబట్టే నరేంద్ర మోడీ లాంటి యోగి పుంగవుడు మనకు ప్రధానమంత్రి అయ్యాడు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆయన ఇలా భారీ స్థాయిలో ధ్యానం చేయడం సహజమేనేమో. ఎందుకంటే, 2019లో ఎన్నికలు ముగియగానే హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఒక గుహలో అద్భుతంగా ధ్యానం చేశారు. ఆ సందర్భంలో ఆయన ఫొటోలు చూస్తుంటే, మహావతార్ బాబా అంటే మరెవరో కాదు.. నరేంద్ర మోడీనే అనిపించింది. పాపం మోడీ గారు ఏర్పాటు చేసుకోరుగానీ, ఆయన ధ్యానం చేస్తున్న సమయంలో ఎవరో అద్భుతంగా ఫొటోలు తీసి బయటి ప్రపంచానికి పంపిస్తూ వుంటారు. అంతా మన భారతీయుల అదృష్టం.  సాధారణంగా ధ్యానం అనేది ఎవరైనా గుట్టుగా చేసుకుంటారు. కానీ, మెడిటేషన్ అలా గుట్టుగా చేయకూడదని, ఆ ధ్యాన పరిమళాలు అంతటా వ్యాపించేలా చేయాలని నరేంద్ర మోడీ చాటారు. 2019లో హిమాలయాల్లో గానీ, ఇప్పుడు కన్యాకుమారిలోగానీ మోడీ గారు చేసిన ధ్యానం న్యూసు, ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయి. ఇలాంటి సందర్భాల్లో మోడీని చూస్తుంటే, ‘నమో నారాయణాయ’ మంత్రాన్ని గురువుగారు తన చెవిలో చెబితే, ఆ మంత్రం అందరికీ అందాలని గుడి గోపురం మీద ఎక్కి పెద్దగా ‘ఓం నమో నారాయణాయ’ అని అరిచిన రామానుజా చార్యులు గుర్తొస్తున్నారు. బహుశా.. రామానుజాచార్యుల వారి మరో అవతారం మోడీ గారేనేమో! హిమాలయాల్లో, కన్యాకుమారిలో మోడీ గారు ధ్యానం చేస్తుండగా తీసిన ఫొటోలు చూస్తుంటే, రెండు చేతులు జోడించి నమస్కరించాలని అనిపిస్తూ వుంటుంది. ముఖంలో ఆ ప్రశాంతత, తేజస్సు, వర్చస్సు... అబ్బబ్బ.. మోడీ గారికి మోడీ గారే సాటి. చాలామంది ఇంట్లో కూర్చుని ధ్యానం చేయడానికే వీల్లేక డిస్ట్రబ్ అయిపోతున్నాం అంటారు.. మోడీ గార్ని చూడండి.. ఓపెన్ ప్లేసులో, జనాలు, కెమెరాల సమక్షంలో ఎంత బాగా ధ్యానం చేస్తున్నారో. ప్రపంచంలో వున్న ధ్యానులందరూ మోడీ గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఒక్కమాట చెప్పి, ముగిద్దాం.. అసలు ‘మెడిటేషన్’ అనే మాటని క్యాన్సిల్ చేసేసి ‘మోడిటేషన్’ అని మారిస్తే మంచిది.

ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆయన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పోలీస్ ఆఫీసర్ కెరీర్ అంటేనే ఒడిదుడుకులు వుంటాయి. 35 సంవత్సరాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నానో, ఈ ఐదేళ్ళ కాలంలో కూడా అలాంటి వాటినే ఎదుర్కొన్నాను. ఈ ఐదేళ్ళ కాలంలోని ఏర్పడిన ఒడిదుడుకులను నేను ప్రత్యేకంగా చూడటం లేదు. అవన్నీ జీవితంలో ఒక భాగం. అన్యాయాన్ని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం. సత్యం, నీతి వైపు వుంటే, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడితే  ఎప్పటికైనా విజయం సాధిస్తాం. ఐదేళ్ళపాటు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాననే దానికంటే, అంతిమ విజయం సాధించడం ముఖ్యం. ఈ అధ్యాయం మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పమంటే ‘వండర్‌ఫుల్’ అని చెప్తాను’’ అన్నారాయన.