హోంశాఖకు రూ.84570 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ లో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ కేటాయింపులు చేశారు. ఇందు కోసం రాష్ట్ర హోంశాకలకు 8570 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందనీ, జగన్ సర్కార్ తీరు కారణంగా పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతిందనీ పేర్కొన్న పయ్యావుల కేశవ్, దాని పర్యవశానంగా రాష్ట్రంలో సామాన్యులు ప్రశాంతంగా, భద్రంగా బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.   పోలీస్ దళం ఆధునీకరణ,  6,100 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ ఫోర్స్ మెంట్ (ఈగల్)' ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, పెట్రోలింగ్ సహా పటిష్ట నిఘా  కోసం పోలీస్ వాహనాల కొనుగోలు, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు 'నవోదయం 2.0' కార్యక్రమం,  ఆల్కహాల్ డీ-అడిక్షన్ సహా వ్యసనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిధులను కేటాయించారు. 

పథకాలకు నిధుల కొరత లేకుండా పయ్యావుల కేటాయింపులు

వివిధ శాఖలకు, పధకాలకు పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేశారు. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల కోసం 506 కోట్ల రూపాయలు కేటాయించిన ఆయన, ఆర్టీజీఎస్ కు 101 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే చేనేత, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం 450 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే వివిధ పధకాల కోసం పయ్యవుల కేశవ్ తన పద్దులో చేసిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.  ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు... రూ.27,518 కోట్లు అన్నదాత సుఖీభవ..  రూ.6,300 కోట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రాయితీలు..  రూ.300 కోట్లు ఆదరణ పథకం.. రూ.1000 కోట్లు మనబడి పథకం..  రూ.3,486 కోట్లు తల్లికి వందనం..  రూ.9,407 కోట్లు అమరావతి నిర్మాణం..  రూ.6 వేల కోట్లు దీపం 2.0 పథకం..  రూ.2,601 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులు..  రూ.4,220 కోట్లు బాల సంజీవని పథకం..  రూ.1,163 కోట్లు  ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులు.. రూ.3,377 కోట్లు పురపాలక శాఖ.. రూ.13,862 కోట్లు స్వచ్ఛ ఆంధ్ర.. రూ.820 కోట్లు ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌.. రూ.400 కోట్లు

రాజంపేట  జైలులో పోసాని... మార్చి 13 వరకు రిమాండ్ 

సినీ నటుడు,రచయిత పోసాని కృష్ణ మురళికి రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  పోలీసులు ఆయనను రాజంపేట స‌బ్ జైలుకు త‌ర‌లించారు. ఆయ‌నను క‌స్ట‌డీకి కోరుతూ శుక్రవారం  పోలీసులు పిటిష‌న్ దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంది.  పోసానిపై ఇప్ప‌టికే రాష్ట్ర‌వ్యాప్తంగా 14 కేసులు న‌మోదయ్యాయి.  పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధ‌వారం నాడు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.  అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ సమక్షంలో  పోలీసులు  దాదాపు  9 గంట‌ల పాటు విచారించారు. అనంతరం  రాత్రి జ‌డ్జి ముందు హాజ‌రుప‌రిచారు. రాత్రి 9.30 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు సుదీర్ఘంగా వాద‌న‌లు కొనసాగాయి. అనంత‌రం ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు  జడ్జి తీర్పు చెప్పారు . దీంతో పోసాని  వచ్చే నెల   అంటే మార్చి 13 వరకు రిమాండ్ లో ఉంటారు. చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు.. కులాల పేరుతో దూషించినట్లు పోసానిపై జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసు విషయంలో పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.  హైద్రాబాద్ రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి   అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణ మురళిపై  గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసానిపై  బిఎన్ఎస్ సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్  ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని నోటికిచ్చానట్లు  విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు మంత్రి నారా లోకేష్‌ను అసభ్యకరంగా దూషించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోసానిపై కేసులు నమోదయ్యాయి. దీంతో పోసాని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. తాజాగా కోర్టు ఆయనకు మార్చి 13 వరకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

పయ్యావుల పద్దు.. కేటాయింపులు ఇలా..

పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ లో సంక్షేమానికీ, అభివృద్ధికీ సమ ప్రాధాన్యత ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి వయాబులిటీ గ్యాప్ ఫండ్ 2 వేల కోట్లు కేటాయించారు. వివిధ ప్రాజెక్టులలో నిధుల కొరతను అధిగమించడమే లక్ష్యంగా ఈ నిధి ఉపయోగపడుతుంది పాఠశాల విద్య.. రూ.31,806 కోట్లు. బిసి వెల్ఫేర్‌.. రూ. 23,260 కోట్లు. సాంఘిక సంక్షేమం.. రూ. 10,909 కోట్లు. ఈబీసీల అభివృద్ధికి.. రూ. 10,619 కోట్లు. రవాణా శాఖ... రూ. 8,785 కోట్లు. వైద్యారోగ్య శాఖ.. రూ. 19,260 కోట్లు. పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్.. 18,848కోట్లు. జలవనరుల అభివృద్ది శాఖ.. రూ. 18,020 కోట్లు. మున్సిపల్ , అర్బన్ డెవలెప్మెంట్..  రూ. 13,862 కోట్లు. విద్యుత్ శాఖ.. రూ. 13,600 కోట్లు. వ్యవసాయానికి.. రూ. 11,636 కోట్లు.

జగన్ విధ్వంసాన్ని హిరోషిమాపై అణుబాంబు దాడితో పోల్చిన పయ్యావుల

ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఆయన తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతుకు ముందు ఏపీ కేబినెట్ భేటీ  బడ్జెట్ కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.  అప్పలు చేయడం తప్ప, అప్పులు తీర్చడం అన్నదే తెలియని జగన్ ప్రభుత్వం తీరు కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా తయారైందన్న పయ్యావుల కేశవ్.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. ఒక వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే, మరో పక్క రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం నిరాటంకంగా కొనసాగేలా అన్ని చర్యలూ తీసుకుందని పయ్యావుల చెప్పారు.  గత వైసీపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసిందన్న పయ్యావుల, వైసీపీ ప్రభుత్వ అరాచకం హిరోషిమాపై అణుదాడి కన్నా దారుణంగా అభివర్ణించారు. జగన్ అరాచక, విధ్వంస పాలనను వ్యతిరేకించిన ప్రజలు గత ఎన్నికలలో రాష్ట్ర భవిష్యత్, తమ పిల్లల భవిష్యత్  బాగుండాలంటే చంద్రబాబు నాయకత్వమే శరణ్యమని భావించి 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టారని పయ్యావుల అన్నారు.  

పయ్యావుల పద్దుకు కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం జరిగిన ఈ భేటీలో కేబినెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.  2025-26 ఆర్థిక సంవత్సరానికి కు  రూ. 3.24 ల‌క్ష‌ల కోట్ల అంచ‌నాల‌తో  బడ్జెట్ రూపొందింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు.   అంతకు ముందు పయ్యావుల కేశవ్    అమరావతిలో ని   టిటిడి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.  2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని వేడుకున్నారు.

గోరంట్ల మాధవ్ కు పోలీసుల నోటీసు.. ఇక అరెస్టేనా?

గోరంట్ల మాధవ్.. ఈ పేరు వినగానే ఎవరన్నది పెద్దగా తెలిసే అవకాశం లేదు. కానీ న్యూడ్ వీడియో ఎంపీ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది. ఔను హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో బూతుకే రోత పుట్టేంత ఛండాలం.  అంత అసహ్యం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా గోరంట్ల మాధవ్ పై వైసీపీ అధినేత ఎటువంటి చర్యా తీసుకోలేదు. పైపెచ్చు ఆయనో ఘన కార్యం చేశారన్నట్లు పార్టీ ఓటమి తరువాత ఆయనకు పార్టీ పదవి కూడా ఇచ్చారు. గత ఎన్నికల ముందు కూడా గోరంట్ల మాధవ్ ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. వైసీపీ వైనాట్ 175 అంటూ  పార్టీ అధినేత జగన్ మాటలను తన నోట కూడా వినిపిస్తూ.. లోకేష్ పాదయాత్ర కాదు, చంద్రబాబు కాశీ యాత్ర చేసినా జగన్ జైత్రయాత్ర ఆపడం ఎవరి తరం కాదంటూ రెచ్చి పోయారు.  అంతేనా తెలుగుదేశంతో జట్టు కట్టినందుకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలపై కూడా నోరు పారేసుకున్నారు. అయితే ఇంత చేసినా వైసీపీ అధినేత జగన్ గోరంట్లకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు.  ఇక తన న్యూడ్ వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత కూడా గోరంట్ల మాధవ్  జిమ్ చేస్తుండగా ప్రత్యర్థులు మార్ఫింగ్ చేశారనీ, వీరిపై పోలీసు కేసు పెడతాననీ ప్రకటనలు గుప్పించారు. అయితే ఆ దిశగా ఆయన ఒక్కటంటే ఒక్క అడుగు కూడా వేయలేదు. పోలీసు కేసు పెట్ట లేదు.  కాగా   గోరంట్ల  న్యూడ్ వీడియో ఒరిజనల్ అంటూ అమెరికాలోని ఓ ల్యాబ్స్   సర్టిఫై కూడా చేయడంతో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో అందరికీ అర్ధమైపోయింది. గత ఎన్నికలలో గోరంట్లకు పోటీ చేసే అవకాశాన్ని జగన్ ఇవ్వకపోవడానికి కూడా న్యూడ్ వీడియోయే కారణం. ఎన్నికలయ్యే వరకూ సైలెంట్ గా ఉంటే.. ఎన్నికలలో విజయం సాధించేది మన పార్టీయే అప్పుడు చూసుకుందాం.. అని గోరంట్లను పార్టీ పెద్దలు బుజ్జగించినట్లు కూడా పార్టీ వర్గాలలో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సరే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. జగన్ సర్కార్ గద్దె దిగింది. అయినా పార్టీ మాత్రం గోంరట్లను వెనకేసుకునే వస్తోంది. ఆయనకు జగన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి పదవిని ఇచ్చారు. అశ్లీల చర్యలు,  అసభ్య పదజాలం గోరంట్లకు భూషణాలు అనుకున్నారేమో, లేదా తమ పార్టీ వాయిస్ అదే అని భావించారో ఏమో జగన్ ఆయనకు పార్టీ అధికార ప్రతినిథి బాధ్యతలను అప్పగించారు. అలాంటి గోరంట్ల మాధవ్ కు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.  మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి ఫద్మ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదుచేసి  మార్చి 5న విచారణకు రావాల్సిందిగా నోటీసు జారీ చేశారు.   పోక్సో కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. గతంలో పోలీసు ఆఫీసర్ గా పని చేసిన గోరంట్ల మాధవ్  ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది.  బాధితురాలి గోప్యతకు భంగం కిలిగించడం, అనుచిత వ్యాఖ్యల కేసులో గోరంట్ల అరెస్టు కావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.    

3.24 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 28) అసెంబ్లీలో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో కూటమి  ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ప్రవేశ పెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది.  దాదాపు 3.24 లక్షల కోట్లతో ఆంద్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్  అసెంబ్లీ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి,  సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో పెద్ద నపీట వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా నిధుల కేటాయింపు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.  అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇక వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశ పెడితే, మంత్రి నారాయణ మండలిలో ప్రవేశ పెడతారు. కాగా బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అద్యక్షతన జరిగే కేబినెట్ సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలుపుతుంది. 

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3న ఫలితాలు

తెలుగు రాష్ట్రాలలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానాలకూ, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికీ, అలాగే తెలంగాణలో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానానికీ, కరీంనగర్, నల్లొండ్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకూ గురువారం (ఫిబ్రవరి 28) పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గ్రాడ్యుడేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఓ మోస్తరుగా జరిగింది. అదే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలలో మాత్రం భారీగా జరిగింది. బుధవారం (ఫిబ్రవరి 27) శివరాత్రి కావడంతో జాగారం ప్రభావం కారణంగా ఉదయం పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ తరువాత క్రమంగా పుంజుకుంది.ఇక మార్చి 3న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.   కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మల్సీ స్థానానికి 69.57 శాతం పోలింగ్ జరగగా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 69.50 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో 92.40 శాతం పోలింగ్ నమోదైంది.  ఇక తెలంగాణలో కరీంగన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో పోలింగ్ శాతం 63.4శాతం నమోదు కాగా కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ శాతం 83.24శాతంగా నమోదైంది. నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో పోలింగ్ శాతం 93.55 శాతంగా నమోదైంది. మొత్తంగా స్వల్ప సంఘటనలు వినా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 

గీతం యూనివర్శిటీలో కెరీర్ ఫెయిర్ లోగో ఆవిష్కరణ

నాస్కామ్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లోకెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. యువతీ, యువకులకు సుమారు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ కెరీర్ ఫెయిర్‌లో ఐటీ, ఐటీఈఎస్ 49 కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నాయి.  ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆవిష్కరించారు.  2024, 2025లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు  అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాస్కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఉప్మిత్ సింగ్ పాల్గొన్నారు.

వైసీపీ వితండ వాదం.. పైత్యం పీక్స్ కెళ్లినట్లేనా?

అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ రాజకీయం పేర చేస్తున్న రచ్చ ఇంతా అంతా కాదు. ఓటమికి కుంటి సాకులు వెతకడం దగ్గర నుంచీ.. జనం ఛీ కొట్టి నిరాకరించిన ప్రతిపక్ష హోదా కోసం పేచీ పెట్టడం దాకా ఆ పార్టీ రోడ్డెక్కి తన పరువుతానే తీసుకుంటోంది.   2019 ఎన్నికలలో ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ జనాలను వేడుకుని, కోడి కత్తి దాడి, బాబాయ్ పై గొడ్డలి పోటు అంటూ సానుభూతి డ్రామాలతో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఐదేళ్ల పాటు నమ్మి ఓటేసిన జనాలకు నరకం చూపించారు. పాలన అంటే దోచుకోవడం, దాచుకోవడం, వ్యతిరేకులపై కక్షసాధింపులు అన్నట్లుగానే జగన్ ఐదేళ్ల పాలన సాగింది. పర్యవశానం.. జనం ఏ ఓటుతో అయితే గద్దెనక్కించారో, అదే ఓటుతో గద్దె దింపేశారు.  అయితే  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు  అన్ని హద్దులూ దాటేశారు. సోషల్ మీడియాలో  అసభ్య పదజాలంతో ప్రత్యర్థి పార్టీల నేతలను దూషించారు. వారి కుటుంబంలోని స్త్రీలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా ఇష్టారీతిగా అనుచిత పోస్టులు పెట్టారు. అలాంటి  వారిలో  వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, రోజా , పోసాని కృష్ణ మురళి వంటి వారు ముందు వరుసలో ఉన్నారు. వీళ్లలో ఎవరైనా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారంటే జనం ఇళ్లల్లో టీవీలు బంద్ చేసేసుకునే వారు. అలా ఉండేది వీరి భాషా సౌందర్యం.  జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కుతోడు వైసీపీ నేత‌ల అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల‌ను జీర్ణించుకోలేక‌పోయిన‌ ఏపీ ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ప్ర‌తిప‌క్ష హోదాకూడా వైసీపీకి ఇవ్వ‌లేదు. సరే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ హయాంలో  అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన , ప్రత్యర్థులపై ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న నేతల పైనా, హద్దులన్నీ దాటి అరాచత్వంలో చెలరేగిన వారిపైనా ఇప్పడు వరుసగా కేసులు నమోదౌ తున్నాయి. ఈ క్ర‌మంలోనే  జోగి ర‌మేశ్‌, నందిగం సురేశ్‌, పేర్ని నానిల‌పై కేసులు నమోద‌య్యాయి. జోగి ర‌మేశ్‌, నందిగం సురేశ్ లు జైలుకెళ్లి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్పుడు వంశీ జైల్లో ఉన్నారు. అయితే,   జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జైలుకు వెళ్లి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ జైలు కెళ్లి వంశీని పరామర్శించి వచ్చారు.  వంశీ త‌ప్పు చేసిన‌ట్లు ఆధారాల‌తోస‌హా పోలీసులు నిరూపిస్తున్నారు. కిడ్నాప్, బెదరింపుల కేసులో అరెస్టైన వ్యక్తిని జైలుకెళ్లి మరీ పరామర్శించి రావడాన్ని జగన్ నిస్సుగ్గుగా సమర్ధించుకున్నారు.   వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో వంశీ, కొడాలి నాని, రోజాలు చంద్ర‌బాబు, ప‌వ‌న్, లోకేశ్ పైనా, వారి కుటుంబాల‌పై చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తోనే అధికారాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని,  ఇప్పుడు వంశీ లాంటి నేత‌ను ప‌రామ‌ర్శించడంపార్టీ పరువును మరింత మంటగలిపిందనడంలో సందేహం లేదు.  ఇప్పుడు తాజాగా అదే అనుచిత భాషా ప్రయోగం కారణంగా పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. పోసాని పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా నాకు జ్ణానోదయం అయ్యింది. ఇంక మళ్లీ రాజకీయాల జోలికి రాను అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే చేసిన తప్పులు దండంతో సరిపెట్టేయడానికి చట్టాలు ఒప్పుకోవుకదా? అందుకే పోలీసులు అరెస్టు చేశారు. సరే పార్టీలో ఉన్నా లేకపోయినా పోసానిని పరామర్శించి, ఆ సందర్భాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి వాడుకుంటారు సందేహం లేదు. ఇలా  వైసీపీ ఓటమి తరువాత జగన్ జనంలోకి వస్తున్న ప్రతి సందర్భమూ ఓక రాంగ్ ఇండికేషన్ నే ఇస్తోంది. ప్రత్యర్థులపై బూతు పురాణంతో విరుచుకుపడిన నేతలు, ఇష్టారీతిగా కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారికే వైసీపీలో రెడ్ కార్పెట్ వేస్తారనీ, పెద్ద పీట లభిస్తుందని చాటుతున్నారు.    జగన్ 2.0 అంటూ ఇటీవల తెగ చెబుతున్న జగన్ ఈసారి అధికారంలోకి వస్తే మూడు దశాబ్ధాలు తమదే అధికారం అని చెప్పుకుంటూ.. మళ్లీ అధికారంలోకి వస్తే జనం కోసం కాదు.. కార్యకర్తల కోసం నిలబడతానని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఎవరి కోసం నిలబడతారో ఆయన జైలు యాత్రలు తేటతెల్లం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వంశీ లాంటి నేత‌ల కోసం జైలు యాత్రలు చేయడం పట్ల వైసీపీ శ్రేణుల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  ఇది చాలదన్నట్లు ఇప్పుడు గత ఎన్నికలలో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం, వైసీపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని పోల్చి చూపుతూ ఆ పార్టీ మేధావులు? వితండ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. 2024 ఎన్నికలలో కేవలం 6 శాతం ఓట్లు వచ్చిన జనసేన పార్టీ అధినేతకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు.. 40 శాతం ఓట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఇందులో ఇసుమంతైనా లాజిక్ లేదు.  లాజిక్ సంగతి తరువాత చెప్పుకుందాం. ముందుగా భారత దేశంలో ఓట్ల శాతాన్ని బట్టి కాకుండా పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్యను బట్టే ప్రతిపక్ష హోదాను నిర్ణయిస్తారు. ఇది కొత్తగా  వైసీపీ విషయంలో అమలు చేస్తున్న విధానం ఎంత మాత్రం కాదు. గతంలో అంటే వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 స్థానాలను ప్రస్తావిస్తూ ఓ నలుగురిని మా వైపు లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని పలు మార్లు శాసనసభ వేదికగానే జగన్ మాట్లాడారు. ఇప్పుడు తన కన్వీనియెన్స్ కోసం ఆ విషయం మరిచిపోయి 11 స్థానాలున్న తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గగ్గోలు పెడుతున్నారు. హోదా ఇచ్చే వరకూ సభకు వచ్చేది లేదని భీష్మిస్తున్నారు.  ఇక ఇప్పుడు జనసేన ఓట్ల శాతంతో తమ ఓట్ల శాతాన్ని పోలుస్తూ వైసీపీ చేస్తున్న వితండ వాదం విషయానికి వస్తే.. 2024 ఎన్నికలలో వైసీపీ మొత్తం 175 స్థానాలలోనూ పోటీ చేసింది. దగ్గరదగ్గర 40 శాతం ఓట్లు సాధించుకుంది. 11 స్థానాలలో విజయం సాధించింది. కానీ జనసేన కేవలం 21 స్థానాలలోనే పోటీ చేసింది. 21 స్థానాలనూ గెలుచుకుంది. అంటే వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. మరలాంటప్పుడు జనసేనకు 6 శాతం ఓట్లే వచ్చాయి.. మాకు 40 శాతం ఓట్లు అంటూ వైసీపీ చెప్పుకోవడంలో అసలు అర్ధం లేదు. నిజంగా జనసేన, వైసీపీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పోల్చాలనుకుంటే.. జనసేన విజయం సాధించిన 21 స్థానాలలోనూ జనసేనకు వచ్చిన ఓట్ల శాతం పోల్చాలంటే ఆ రెండు పార్టీలూ పోటీ పడిన 21 స్థానాలలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో చూడాల్సి ఉంటుంది. అలా చూస్తే వైసీపీ వాదనలోని డొల్ల తనం ఇట్టే బయటపడిపోతుంది. జనసేన గెలిచిన 21 స్థానాలలో ఆ పార్టీకి  50 నుంచి 60 శాతం ఓట్లు వచ్చాయి. దానిని విస్మరించి జనసేనకు కేవలం 6 శాతం ఓట్ల స్టేక్ మాత్రమే ఉందని మాట్లాడటం అంటే వైసీపీ తనను తాను  పలుచన చేసుకోవడమే అవుతుంది. 

రేపే ఎపి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ 

ఏపీలో  వార్షిక బడ్జెట్ ను శుక్ర వారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. తొమ్మిది నెలల  కూటమి ప్రభుత్వం ఈ సారి పూర్తి స్థాయి లో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ పైన చంద్రబాబు పలు దఫాలు  సమీక్ష చేసారు. సంక్షేమం - అభివృద్ధి కి పెద్దపీట  ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక, సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ను 3.35 లక్షల కోట్ల అంచనాతో ప్రవేవపెట్టనున్నట్లు సమాచారం.  వ్యవసాయమంత్రి అచ్చెనాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. 

ఆ ఎనిమిది మందీ మరణించారు.. జేసీ అసోసియేట్స్ ఓనర్

ఎస్సెల్బీసీ  సోరంగంలో చిక్కుకున్న ఎనమండుగురు కార్మికుల వ్యవహారం విషాదాంతమైంది. వారెవరూ బతికి లేరని ఆ టన్నల్ కాంట్రాక్టర్ పనులు చేస్తున్న జేసీ అసోసియేట్స్ ఓటర్ ప్రకాష్ చెప్పారు. గురువారం (ఫిబ్రవరి 27) మీడియాతో మాట్లాడిన ఆయన  ఈ ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో 50 మందికి పైగా పని చేస్తున్నారు. వారిలో ఎనిమిది మంది వినా మిగిలిన అందరూ సురక్షితంగా బయటపడ్డారన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గత ఆరురోజులుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, వారు బతికి ఉండే అవకాశాలు లేవనీ చెప్పారు. టన్నల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గత ఆరు రోజులుగా చేసిన, చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గురువారం  రెస్క్యూ బృందాలు టన్నెల్ చివరి వరకు వెళ్లగలిగారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో వారెవరూ ప్రాణాలతో లేరని నిర్ధారణ అయ్యిందని కాంట్రాక్టర్ చెప్పాడు. వారంతా బురదలో కూరుకుపోయి మరణించి ఉంటారని అన్నారు. ఇక ఇప్పుడు వారి మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని  కాంట్రాక్టర్ అన్నారు.  ప్రమాదం జరిగిన తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయమే వ్యక్తం అవుతూ వస్తోంది. అయినా ఎక్కడో ఏదో చిన్న ఆశ. అదృష్టం కలిసి వచ్చి వారు ప్రాణాలతో ఉంటారన్నఅంతా భావించారు. రెండు రోజుల కిందటే రెస్క్యూటీమ్ వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు మృగ్యమని చెప్పేశారు. ఇప్పుడు అదే విషయాన్ని టన్నెల్ కాంట్రాక్టర్ ప్రకాష్ మీడియా ముఖంగా చెప్పారు.   సొరంగంలో చిక్కుకుపోయిన ఎనమండుగురు కార్మికులను రక్షించేందుకు గత ఆరు రోజులుగా ఆర్మీ,ఎస్టీఆర్ఎఫ్,ఎన్డీఆర్ఎఫ్ శతథా  ప్రయత్నించాయి.   ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగారు. బండరాళ్లు,బురద నీరు,శిథిలాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.    

కొనసాగుతున్న  కాళేశ్వరం కమిషన్ విచారణ 

కాళేశ్వరం కమిషన్ విచారణ గురువారం నుంచి  తిరిగి ప్రారంభమైంది. గతంలో కమిషన్ ఎదుట హాజరైన వారిని కూడా  మళ్లీ విచారణ చేయాలని కమిషన్ నిర్ణయించింది.  కాగా కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా రివర్  మేనేజ్ మెంట్ బోర్డుసమావేశం కానున్నట్టు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలాల పంపిణీపై ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య  విభేధాలు తలెత్తే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి.  తెలంగాణకు 63 టిఎంసీ అవసరమని, ఆంధ్రప్రదేశ్ కు 55 టిఎంసీలు అవసరమని అభిప్రాయపడింది.  గత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 23 టీఎంసీలకు అంగీకరించినప్పటికీ కృష్ణా రివర్ బోర్డు  సమావేశానికి ఎపి హాజరు కాకపోవడంతో మరో మారు సమావేశమయ్యే అయ్యే అవకాశాలున్నాయి. 

వివాదంలో చిక్కుక్కున్న స్టార్ కపుల్స్  సావిటీ బురా, దీపక్ హుడా

అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కపుల్స్ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా బాక్సర్ అయిన సావిటీ బురా తన భర్త, మాజీ కబడ్డీ ప్లేయర్  దీపక్ హుడాపై కేసు నమోదు చేశారు. వరకట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.   దీపక్ హుడా మరో వైపు  తన భార్య సావిటీ బురా కుటుంబంపై బెదిరింపులు ఆర్థిక మోసం ఆరోపణలు చేస్తూ రోహ్తక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న ఈ క్రీడాకారులు పెళ్లి చేసుకుని జంటగా మారారు. కొన్ని రోజుల  క్రితం ఈ జంట మధ్య విభేధాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో  ఒకరిపై ఒకరు విపరీతంగా ట్రోలింగ్ చేసుకున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి కేసులు నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ మ‌హిళా బాక్సర్ సావీటీ బురా, ఆమె భ‌ర్త‌, భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ హుడా  మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హుడాపై సావీటీ గృహ హింస, వ‌ర‌క‌ట్న వేధింపుల‌ ఆరోపణలు చేయగా, ఆమె కుటుంబం త‌న‌ను ఆర్థికంగా మోసం చేసిందని  భర్త హుడా ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఈ స్టార్ క‌పుల్ ఒక‌రిపై ఒక‌రు హిసార్, రోహ్తక్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారు. మన దేశానికి చెందిన  ప్రముఖ క్రీడాకారులుగా పేరు తెచ్చుకున్న అంతర్జాతీయ మహిళా బాక్సర్ సావీటీ బురా, భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ హుడా మధ్య వివాదం క్రమంగా ఉగ్ర రూపం దాల్చింది.   సావీటీ బురా తన భర్త దీపక్ హుడాపై గృహహింస, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేస్తూ హర్యానాలోని హిసార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

అపురూపమైన కానుక.. నేతన్నల బహుమతికి మురిసిపోయిన లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు మంగళగిరికి చెందిన చేనేత కళాకారుడు. మంగళగిరి అంటేనే చేనేతకు ప్రసిద్ధి. ఇక్కడి చేనేత కళాకారులు ఎన్నో కొత్త కళాకృతులను ఆవిష్కరించారు.  ఆవిష్కరిస్తున్నారు.  తాజాగా మంగళగిరికి చెందిన జంజనం మల్లేశ్వరరావు అనే చేనేతకారుడు తన కుమారుడు కార్తికేయులుతో కలిసి తమ అభిమాన నాయకుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు.   స్వతహాగా తెలుగుదేశం అభిమానులైన వీరు లోకేష్ కుటుంబం మొత్తాన్ని చేనేత వస్త్రంపై చిత్రీక రించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి, వారి కుమారుడు నారా దేవాన్ష్ చిత్రాలను నేతవస్త్రంపై దించేశారు.  తాము నేసిన ఈ వస్త్రాన్ని జంజనం మల్లేశ్వరరావు, కార్తికేయులు బుధవారం (ఫిబ్రవరి 26)న లోకేష్ కు బహూకరించారు.   అద్భుత నైపుణ్యంతో వారు నేసిన ఆ వస్త్రాన్ని… దానిపై తన   కుటుంబ సభ్యులను అచ్చుగుద్దినట్లు నేసిన వారి నైపుణ్యాన్ని లోకేష్ ప్రశంసించారు.  వారికి కృతజ్ణతలు తెలిపారు. ఇప్పుడు ఆ వస్త్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.