AP Government Release Funds For Disha Scheme implementation

దిశా పథకం అమలుకు 47.93 కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు పాలనా అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

  దిశా చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్ని పేర్కోన్న ప్రభుత్వం. దిశా పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్న హోంశాఖ. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి, పర్యవేక్షణకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ. మహిళలపై లైంగిక  వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం ఈ కమిటీ ఏర్పాటు. ఏడుగురు  అధికారులు, సిబ్బందితో కూడిన ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పంచాయితీరాజ్ - గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.

facts behind KIA shifting plant from AP

కియా... ఏపీ నుంచి ఎందుకు వెళ్లాలనుకుంటోంది? తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ డిటైల్స్...

  ఆంధ్రప్రదేశ్ లో కియా ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కియా ఎక్కడికీ తరలిపోవడం లేదంటూ ఏపీ మంత్రులు, ఎంపీలు, వైసీపీ ముఖ్యనేతలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నా... రాయిటర్స్ మరోసారి తమ కథనానికి కట్టుబడి ఉన్నామంటూ తేల్చిచెప్పడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది. నిజంగానే కియా ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతే అది జగన్ ప్రభుత్వానికి కోలుకోలేని ఎదురుదెబ్బే అవుతుంది. ఎందుకంటే, ఏ అంతర్జాతీయ కంపెనీ కూడా ఏపీకి రావడానికి ఇష్టపడదు. ఇంటర్నేషనల్ సంస్థలే కాదు... కనీసం దేశీయ పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రా వైపు చూడటానికే భయపడతారు. అయితే, నిప్పులేనిదే పొగ రాదన్నట్లుగా జగన్ ప్రభుత్వానికి... కియా యాజమాన్యానికి మధ్య ఘర్షణ వాతావరణమైతే కచ్చితంగా కనిపిస్తోంది. పలు విషయాల్లో కియాపై జగన్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం అందుతోంది. అయితే తమ ఒత్తిడికి కియా దిగొస్తుందని జగన్ ప్రభుత్వం భావించగా... అందుకు పూర్తి రివర్స్ లో మొత్తం ప్లాంట్ నే తరలించేందుకు తమిళనాడుతో సంప్రదింపులు జరిపి కియా షాకిచ్చినట్లు తెలుస్తోంది. కియా ఇచ్చిన షాక్ తో కంగుతిన్న జగన్ ప్రభుత్వం... హుటిహుటిన నష్టనివారణ చర్యలు చేపట్టింది. కియా ఎక్కడికీ తరలిపోవడం లేదని, టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ చంద్రబాబుపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి కియా వెళ్లిపోవాలని అనుకోవడానికి ప్రభుత్వ ఒత్తిడితోపాటు వైసీపీ నేతల గొంతెమ్మ కోర్కెలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల్లో 75శాతం స్థానికులే ఉద్యోగాలు ఇవ్వాలంటూ చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కారు... ఇప్పుడు ఉద్యోగుల్లో ఐదువేల మందిని తీసేసి... స్థానికులను పెట్టుకోవాలని కియాపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఐదు వేలమందిలో ఆంధ్రావాళ్లున్నా... వాళ్లను కూడా తీసేసి తమ అనుచరులకు ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు కియాపై ప్రెజర్ పెడుతున్నారట. అలాగే, ఇఫ్పుడున్న 160కోట్ల విలువైన స్క్రాప్ కాంట్రాక్టర్లను తొలగించి తన తమ్ముడికి ఇవ్వాలని ఒక ఎంపీ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 120కోట్ల ఆలిండియా కార్గో కాంట్రాక్టరును తొలగించి తమకివ్వాలని ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ప్రెజర్ పెడుతున్నట్లు సమాచారం. అలాగే, కియాలో 5కోట్ల విలువైన పారిశుద్ధ్య పనుల కాంట్రాక్టను తమ అనుచరుడికి ఇవ్వాలని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక, త్వరలో కట్టబోయే కొత్త ఫ్యాక్టరీని తమ పొలాల దగ్గరే కట్టాలని ఒక వైసీపీ ఎమ్మెల్యే కియా మేనేజ్ మెంట్ పై ప్రెజర్ పెడుతున్నట్లు టాక్... వీటన్నింటినీ మించి... మార్కెట్ ధర కంటే మూడు నాలుగు లక్షల తక్కువ ధరకు మూడు వందల కార్లు ఇవ్వాలని, వాటిని మేము అమ్ముకుంటామని ఒక వైసీపీ ఎమ్మెల్యే... అలాగే, జగన్ సన్నిహితుడు... ఒక ఉన్నతాధికారి కలిసి కియాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆయా మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారుల నుంచి వస్తున్నట్లు ఒత్తిళ్లను కియా యాజమాన్యం.... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అలాగే, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లినా... పట్టించుకోలేదని, అందుకే ప్లాంట్ ను తరలించాలనే ఆలోచనకు వచ్చిందని అంటున్నారు. ఇక్కడ ఉండే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి వస్తుందని, కానీ... ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కంపెనీగా, విలువలు పాటించే సంస్థగా అది తమకిష్టం లేదని కియా యాజమాన్యం అంటోందట. డిమాండ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, అవసరమైతే ఏపీ నుంచి ప్లాంట్ ను తరలించేద్దామనే నిర్ణయానికి కియా యాజమాన్యం వచ్చేసిందని అంటున్నారు.

YS Jagan on choosing Vizag for capital

వైజాగ్ నే... జగన్ ఎందుకు ఎంచుకున్నారు? జగన్ మాటల్లోనే...

    విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. పరిపాలనా రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానే. ఎక్కడ్నుంచి పరిపాలన జరుగుతుందో అదే ఆ రాష్ట్ర రాజధాని అవుతుంది. అంటే, పేరుకు మూడు రాజధానులు అంటున్నా... ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రం విశాఖే అవుతుంది. అయితే, విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వివరించారు. తన మనసులోని మాటను బయటపెట్టారు. కుటుంబం కోసం ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో... ప్రభుత్వ పెద్దగా తాను అలాగే ఆలోచించి విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశానన్నారు. ఏ రాజధానిలోనైనా కనీస మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని... అయితే, లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తేనే గానీ... అమరావతిలో మౌలిక సౌకర్యాలు కల్పించడం సాధ్యంకాదన్నారు. అదే, ఆ లక్ష కోట్లలో 10శాతం ఖర్చుచేస్తే చాలు... వైజాగ్‌ను హైదరాబాద్, బెంగళూర్, చెన్నై సరసన నిలబెట్టొచ్చంటూ తనకున్న విజన్ ను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ ఇప్పటికే నెంబర్‌వన్ సిటీ అని, అలాగే విశాఖలో సకల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కనీస మౌలిక వసతులైన రోడ్స్, వాటర్, పవర్, డ్రైన్స్, రైల్వే... ఇలా ఎవ్రీథింగ్ ఉన్నాయన్నారు. ఇప్పుడున్న మౌలిక వసతులకు అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఐదేళ్లలో లేదా పదేళ్లలో కచ్చితంగా హైదరాబాద్, బెంగళూర్, చెన్నై సరసన వైజాగ్ నిలబడుతుందని, మన పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటూ వైజాగ్ పై తనకున్న అంచనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, లక్ష కోట్లు ఖర్చు చేసినా అమరావతిలో కనీస మౌలిక వసతులు కల్పించలేమని జగన్మోహన్ రెడ్డి కుండబద్దలుకొట్టారు. విశాఖ కాకుండా... మరెక్కడ రాజధానిని ఏర్పాటు చేసినా అభివృద్ధి చేయలేమన్నారు. అదే, లక్ష కోట్లలో కేవలం పదిశాతం ఖర్చు చేస్తేచాలు విశాఖను... పదే పదేళ్లలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై సరసన నిలబెట్టవచ్చని చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టింది కడప జిల్లా పులివెందులలోనే అయినా... పెరిగింది, చదువుకుంది మాత్రం హైదరాబాద్‌లోనే.... దాదాపు జగన్ బాల్యమంతా భాగ్యనగరంలో నడిచింది... డిగ్రీ వరకు చదువు కూడా హైదరాబాద్‌లో సాగింది.... దాంతో, హైదరాబాద్‌లో పరిస్థితులు, అభివృద్ధి జరిగిన తీరు... ఇలా, అన్నింటిపై పూర్తి అవగాహన జగన్ కు ఉంది. ముఖ్యంగా పాతిక ముప్పై ఏళ్లలో హైదరాబాద్ ఏవిధంగా ట్రాన్స్ ఫామ్ అయ్యిందో ...స్వయంగా చూసిన వ్యక్తి జగన్. అంతేకాదు, ఐటీ రంగంలో హైదరాబాద్ ఎదిగిన విధానం తెలిసిన వ్యక్తి... అలాగే, మౌలిక సదుపాయాల కల్పన ఎలా జరిగిందో... పారిశ్రామికంగా ఏవిధంగా డెవలప్ అయ్యిందో.... ఉద్యోగాల కల్పనకు కల్పతరువుగా ఎలా మారిందో... అవగాహన ఉన్న జగన్మోహన్ రెడ్డి.... ఆ స్థాయిలో వైజాగ్‌ను అభివృద్ధి చేయడానికి పకడ్బందీ ప్రణాళితో ముందుకెళ్తున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. వైజాగ్‌‌ను ఏవిధంగా డెవలప్ చేస్తే... ఐదు లేదా పదేళ్లలో హైదరాబాద్‌ను అందుకుంటుందో... ఆవిధమైన వ్యూహాలతోనే ముందుకు వెళ్తున్నట్లుగా జగన్ మాటలను బట్టి స్పష్టంగా అర్ధమవుతోంది.   ఇక, రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగించిన జగన్మోహన్‌‌రెడ్డికి.... ఆ నగరం గురించి కూడా బాగా తెలుసు. బెంగళూరు ఎలా అభివృద్ధి చెందిందో... బెంగళూరుకు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో జగన్‌కు పూర్తి అవగాహన ఉంది... ముఖ్యంగా బెంగళూరు అభివృద్ధిలో ఐటీ రంగానిదే ప్రధాన పాత్ర.... దేశంలోనే అత్యధిక ఐటీ కంపెనీలు బెంగళూరులోనే ఉన్నాయి... అంతేకాదు, ప్రపంచ ప్ర‎ఖ్యాతగాంచిన ఐటీ కంపెలన్నీ బెంగళూరులోనే కొలువుదీరాయి.... ఏ విదేశీ కంపెనీ ఇండియా వచ్చినా వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ బెంగళూరే అవుతుంది.... అందుకే, బెంగళూరును ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచింది....అంతేకాదు, యువత ఉద్యోగాల కోసమే మొదట చూసే నగరం బెంగళూరే... అయితే, వైజాగ్‌ను బెంగళూరు స్థాయికి తీసుకొస్తామన్న జగన్మోహన్ రెడ్డి... ఐటీని ఆ స్థాయిలో ప్రోత్సహించే అవకాశం కనిపిస్తోంది.... అలాగే, మోస్ట్ లవబుల్ సిటీగా బెంగళూరుకు పేరుంది.... ముఖ్యంగా బెంగళూరు ప్లాన్డ్ సిటీ అంటారు.... ఎందుకంటే, బెస్ట్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ బెంగళూరు సొంతం.... అన్నింటికీ మించి బెంగళూరులో బ్యూటీఫుల్ వెదర్ ఉంటుంది... అందుకే, బెంగళూరును లండన్‌ సిటీతో పోల్చుతారు.... అంతేకాదు, చెన్నై, ముంబై మాదిరిగా బీచ్‌లు లేకపోయినా... ప్రతి వీధి చివరన కచ్చితంగా ఒక పార్కు తప్పనిసరిగా ఉంటుంది... వీటన్నింటినీ మించి పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థ బెంగళూరు సిటీ సొంతం... ఇవన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి.... కనీసం ఐదేళ్లు.... మాగ్జిమం పదేళ్లలో బెంగళూరు స్థాయికి వైజాగ్‌ను తీసుకొస్తామంటూ అందుకే చెప్పినట్లు కనిపిస్తోంది.   హైదరాబాద్, బెంగళూరులాగానే ఆంధ్రప్రదేశ్‌‌‌కు సమీపంలో ఉండే మెట్రో సిటీ చెన్నై.... అందుకే, జగన్మోహన్ రెడ్డి.... తన స్పీచ్‌లో చెన్నైను కూడా ప్రస్తావించారు... వైజాగ్ మాదిరిగా సీ కోస్ట్ ఉండే చెన్నై నగరం... దేశంలోనే టాప్ మోస్ట్‌ ఫైవ్ సిటీస్‌లో ఒకటిగా ఎదిగింది.... ముఖ్యంగా పారిశ్రామికరంగంలో చెన్నై ముందు కనిపిస్తుంది... దేశ విదేశీ కంపెనీలెన్నో చెన్నైలో కొలువుదీరాయి.... అయితే, చెన్నై నగరం గురించి క్షుణ్ణంగా తెలిసిన జగన్మోహన్ రెడ్డి.... విశాఖను ఆ స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పుకొచ్చారు... కేవలం ఐదారేళ్లలోనే చెన్నై స్థాయికి విశాఖను తీసుకురావొచ్చని చెప్పుకొచ్చారు.   ము‌ఖ్యమంత్రి జగన్ చెబుతున్నట్లుగా, ఆంధ్రప్రదేశ్‌లో నెంబర్‌వన్ సిటీగా ఉన్న విశాఖ నగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా అభివృద్ధి చేస్తే అతి తక్కువ కాలంలోనే దేశంలోనే టాప్ ఫైవ్ మెట్రో సిటీస్‌లో ఒక్కటిగా అవతరించే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి... ఎందుకంటే, సహజ వనరులతో దేశంలో ఏ నగరానికీ లేని ఎన్నో పాజిటివ్ పాయింట్స్‌ విశాఖలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఒకటి కాదు... రెండు కాదు... వందలకొలది ప్రత్యేకతలు విశాఖ సొంతం.... ముఖ్యంగా విశాఖకు మెయిన్ అస్సెట్... సీ కోస్ట్.... సముద్ర తీరం వెంబడి ‎మహానగరంగా రూపాంతరం చెందిన వైజాగ్‌లో సహజసిద్ధ అందాలెన్నో కనిపిస్తాయి.... అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కంటే ముందుగా గ్రేటర్ సిటీ హోదా పొందిన తొలి నగరం విశాఖ.... అలాగే, దేశంలోనే అతిపెద్ద నాలుగో ఓడరేవు కలిగిన నగరం వైజాగ్‌.... అంతేకాదు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం విశాఖలోనే ఉంది....భారత నౌకాదళ తూర్పు ప్రధాన స్థావరం విశాఖలో ఉంది.... ఇక, సుందరమైన సముద్ర తీరం... ఆహ్లాదకరమైన వాతావరణం... అద్భుతమైన కొండ లోయలు... మన్యం సౌందర్యం.... ఇలా చెప్పుకుంటూ పోతే.... ఇలా ఎన్నో ప్రత్యేకతలు వైజాగ్‌కి ఉన్నాయి....   ఆంధ్రా విశ్వ విద్యాలయం, నేషనల్‌ లా యూనివర్శిటీ, గీతం విశ్వ విద్యాలయం, ఇండియన్ మారిటైం వర్శిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ లాంటి విద్యాసంస్థలన్నీ విశాఖలో కొలువుదీరాయి. అలాగే కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, నేషనల్‌ సైంటిఫిక్ టెక్నాలజీ లేబోరేటరీ, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాంటి ఎన్నో పరిశోధనా సంస్థలు వైజాగ్ లో ఉన్నాయి. ఇక, వైద్యరంగంలోనూ విశాఖ మెరుగైన స్థితిలోనే ఉంది. మోస్ట్ అడ్వాన్స్‌డ్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కింగ్ జార్జ్ గవర్నమెంట్ హాస్పిటల్‌ మొదలుకొని విక్టోరియా హాస్పిటల్‌, విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌, టాటా కేన్సర్ ఇనిస్టిట్యూట్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, కేర్, అపోలో లాంటి ఎన్నో టాప్ హాస్పిటల్స్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గీతం మెడికల్ కాలేజ్, గాయత్రి విద్యా పరిషత్‌ మెడికల్ కాలేజ్, ఎన్నారై మెడికల్ కాలేజ్... ఇలా ఎన్నో మల్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ విశాఖలో కొలువుదీరాయి.    ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా కూడా విశాఖ అభివృద్ధి చెందింది. విశాఖలో ఎన్నో భారీ పరిశ్రమలు, ఆర్ధిక మండళ్లు (సెజ్ లు) కొలువుదీరాయి. విశాఖపట్నం ప్రత్యేక ఆర్ధిక మండలి(దువ్వాడ), ఏపీఐఐసీ బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్ధిక మండలి(అచ్చుతాపురం), ఐటీ సెజ్‌‌లు (రుషికొండ హిల్‌-1, రుషికొండ హిల్‌-3, గంభీరం), జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీ, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ రాంకీ ఫార్మా సిటీ, అన్ రాక్ అల్యూమినియం(మాకవరపాలెం), దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, హెటెరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ (నక్కపల్లి), జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ (ఎస్.కోట), దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఫిన్ టెక్ వ్యాలీ, మెడిటెక్ జోన్ లాంటివి ఇఫ్పటికే నెలకొల్పబడ్డాయి.   ఇక, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా భారీగానే ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (చమురు శుద్ధి కర్మాగారం), రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం ఉక్కు కర్మాగారం), హిందుస్థాన్ జింక్ స్మెల్టర్, భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ (హెవీ వెస్సెల్స్ ప్లాంట్), హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, నావెల్ డాక్ యార్డ్, కంటైనర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, డ్రెడ్గింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, హిందుస్థాన్ పాలిమర్స్, ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రభుత్వరంగ సంస్థలు విశాఖలో ఉన్నాయి.   క్రీడారంగంలోనూ మంచి స్థానంలో విశాఖ కనిపిస్తుంది. వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, పోర్ట్ ఇండోర్ స్టేడియం, పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఉక్కు స్టేడియంతోపాటు ఇంకా అనేక స్టేడియాలు విశాఖలో ఉన్నాయి. అయితే, పైన చెప్పినవన్నీ కొన్ని మాత్రమే... పర్యాటకం, పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేసులు, ఇలా చెప్పుకుంటూ పోతే... ఏ విభాగంలోనూ విశాఖ దేనికీ తీసుపోదు. అందుకే, వైజాగ్ ను జగన్మోహన్ రెడ్డి పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నారని ఆయన మాటలను బట్టి అర్ధమవుతోంది. ఏమీ లేని చోట లక్షకోట్లు ఖర్చు పెట్టి..  ఒక కృత్రిమ నగరాన్ని నిర్మించడం కన్నా.. అన్ని వసతులు ఉన్న నగరానికి కాస్త ఊతమిచ్చి అందమైన రాజధానిగా రూపు దిద్దుకోవచ్చని పెట్టుబడులకు విశాఖ అనుకూలమైన నగరమనీ జగన్ అంటున్నారు. హైదరాబాద్ లా విశాఖ కూడా మినీ ఇండియాను తలపిస్తుంది. అక్కడా పరిశ్రమల విస్తరణ కారణంగా పొరుగు రాష్ట్రాల వారూ వలస వచ్చారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం రాజధానికోసం పునాదుల నుంచి నిర్మించి అప్పుల పాలవడం కన్నా... అందులో పదిశాతం ఖర్చుచేసి అందుబాటులో ఉన్న వాటితో అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చని జగన్ అంటున్నారు.  

visakhapatnam coronavirus Alert

వైజాగ్‌లో కరోనా హైఅలర్ట్... కేజీహెచ్‌కు కేంద్ర వైద్య బృందం...

  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాకపోయినా జనాన్ని మాత్రం భయపెడుతోంది. అయితే, కరోరా వైరస్ పై రెండు తెలుగు రాష్ట్రాలూ కరోనాపై ముందుజాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తత పాటిస్తున్నాయి. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోరా వైరస్ గుర్తింపు పరికరాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రయాణికుడిని పరీక్షిస్తున్నారు. అయితే, ఇఫ్పటివరకు పలువురిని అనుమానితులుగా భావించి పరీక్షలు చేసినా ఒక్కరికీ కూడా పాజిటివ్ రాకపోవడంతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఊపిరిపీల్చుకుంటోంది.  మరోవైపు, ఏపీలో కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించే విశాఖలో కరోనాపై అలర్ట్ ప్రకటించారు. అలాగే, అతిపెద్ద పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం... పైగా ఉత్తర భారత్ నుంచి రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేజీహెచ్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడమే కాకుండా ఐసోలేషన్ కోసం మూడు పడకలను సిద్ధంగా ఉంచారు.  అయితే, ఇప్పటివరకు కరోనా కేసులేమీ నమోదు కాలేదని విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అయితే, కరోనా అత్యంత ప్రమాదకారి కావడంతో అన్ని ముందుజాగ్రత్తలు చేపట్టామన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి కర్ఛీఫ్ లేదా ఫేస్ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ఇక, విశాఖ కేజీహెచ్ లో కరోనా వైరస్ ముందస్తు ఏర్పాట్లను కేంద్ర వైద్యోరాగ్యశాఖ ఉన్నతస్థాయి బృందం పరిశీలించనుంది. కేజీహెచ్ అండ్ ఐడీ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఏపీ వైద్యారోగ్యశాఖ చేపట్టిన సన్నద్ధత చర్యలను పరిశీలించనున్నారు. కరోనా ప్రత్యేక వార్డును పరిశీలించడంతోపాటు ఇంకా ఏమైనా ముందస్తు చర్యలు అవసరమైతే కేంద్ర వైద్య బృందం సూచించనుంది.

CAT may give shock to ap govt over ABV suspension

క్యాట్‌లో జగన్‌కు ఝలక్ తప్పదా? ఐపీఎస్‌లు ఏమంటున్నారు?

కమ్మ అధికారులు, ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా కమ్మ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన జగన్మోహన్ రెడ్డి... ఇఫ్పుడు అధికారంలోకి వచ్చాక తన కసి తీర్చుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్రావును సస్పెండ్ చేయడం వెనుక... అతనిపై జగన్మోహన్ రెడ్డికున్న తీవ్రమైన కోపమే కారణమంటున్నారు. సెక్యూరిటీ ఎక్విప్ మెంట్ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని, అలాగే కాండక్టు రూల్స్ ధిక్కరించారంటూ రూల్ 3(1) కింద ఏబీ వెంకటేశ్వర్రావును జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే, ప్రభుత్వ వాదన.... క్యాట్ లో నిలబడదనే మాట వినిపిస్తోంది. జగన్ సర్కారు మోపిన అభియోగాలు కోర్టులో నిలబడవంటున్నారు.  ఎందుకంటే, చంద్రబాబు హయాంలో సుమారు 22కోట్ల రూపాయలతో కేంద్రం అనుమతితో కొనుగోలు చేసిన సెక్యూరిటీ ఎక్విప్ మెంట్ కోసం ఏర్పాటు చేసిన రెండు కమిటీల్లో ఏబీ వెంకటేశ్వర్రావు సభ్యుడిగా లేకపోవడం అతనికి కలిసొస్తుందని అంటున్నారు. పైగా అప్పటి బాబు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టు అప్పగించింది. అందువల్ల ఏబీవీపై సస్పెన్షన్ చెల్లదని అంటున్నారు. అసలు ఎక్విప్ మెంట్ కొనుగోళ్ల కమిటీల్లో సభ్యుడిగా లేడు.... పైగా అవి గ్లోబల్ టెండర్లు... అలాంటప్పుడు ఏబీ వెంకటేశ్వర్రావును ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఏబీ వెంకటేశ్వర్రావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వైసీపీ సర్కారు, ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేసి కసి తీర్చుకున్నారని అంటున్నారు. ఎనిమిది నెలలుగా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టడమే కాకుండా జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేయడం దారుణమంటున్నారు. ఒకవేళ నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే పోస్టింగ్ లో ఉండగానే చర్యలు తీసుకోవాల్సిందని అంటున్నారు. కావాలనే కక్షపూరితంగా ఏబీవీని సస్పెండ్ చేశారని తోటి ఐపీఎస్ లు వ్యాఖ్యానిస్తున్నారు. తన వేతనం ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వర్రావు ప్రభుత్వానికి రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నారని, దీన్ని బట్టే ఎంతలా ఏబీవీని వేధించారో అర్ధమవుతోందంని అంటున్నారు.

AP Chief Secretary Neelam Sahney is applied for Long leave

మూడ్నెళ్లలో మూడో సీఎస్..! వామ్మో జగన్ అంటోన్న ఐఏఎస్ లు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు కూడా కాలేదు... కానీ, అప్పుడే, ప్రెజర్ తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నీలం సహానీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నవంబర్ 17న బాధ్యతలు స్వీకరించిన నీలం సహానీ... జగన్ ప్రభుత్వ తీరుతో అడ్జస్ట్ కాలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. అందుకే, ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకుని, ఆ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నట్టు చెబుతున్నారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అయిన నీలం సహానీకి 2020 జూన్ 30వరకు పదవీ కాలముంది. నీల సహానీ, ఏపీ సీఎస్ గా రాకముందు సెంట్రల్ సర్వీసుల్లో ఉంటూ... కేంద్ర సామాజిక న్యాయశాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. అయితే, అప్పటివరకు ఏపీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని అనూహ్యంగా అవమానకరరీతిలో సాగనంపిన జగన్ ప్రభుత్వం.... నీలం సహానీని కేంద్ర సర్వీసుల నుంచి ప్రత్యేకంగా పిలిపించిమరీ సీఎస్ గా అవకాశమిచ్చింది. అయితే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో నీలం సహానీ అడ్జస్ట్ కాలేకపోతున్నారని, ముఖ్యంగా జగన్ ప్రభుత్వం తీరు, తీసుకుంటోన్న నిర్ణయాలతో నీలం సహానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. మూడు రాజధానుల కేసుల్లో కార్యాలయాలను తరలించొద్దని హైకోర్టు ఆదేశించినా, న్యాయస్థానం ఉత్తర్వులను లెక్కచేయకుండా ప్రభుత్వం జీవోలు జారీ చేయడం లాంటివి... సీఎస్ నీలం సహానీని చిక్కుల్లోకి నెట్టేశాయని చెబుతున్నారు. ఒకవైపు కోర్టుల ఆదేశాలు పాటించాల్సిన పరిస్థితి.... మరోవైపు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన ఒత్తిడి... ఇలా, న్యాయస్థానాలు... ప్రభుత్వం మధ్య నలిగిపోతున్న నీలం సహానీ.... ప్రెజర్ తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అప్పుడు ఎల్వీ సుబ్రమణ్యం అయినా... ఇప్పుడు నీలం సహానీ అయినా...  జగన్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. పేరుకే ప్రభుత్వ యంత్రాంగానికి చీఫ్ సెక్రటరీ పెద్దయినా... మొత్తం సీఎంవో చెప్పినట్లే నడుస్తోందని అంటున్నారు. ముఖ్యంగా సీఎంవోలోని ఒక అధికారి ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోందంటున్నారు. అతని కారణంగానే, ఎల్వీ సుబ్రమణ్యాన్ని సాగనంపగా... ఇప్పుడు నీలం సహానీది దాదాపు అదే పరిస్థితి అంటున్నారు. జూనియరైన ఆ అధికారి చెప్పినట్లే మొత్తం నడుస్తోందని, అందుకే... దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Kejriwal will win Delhi elections 2020

ఢిల్లీలో కేజ్రీవాల్ విజయానికి కారణాలేంటి?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మహా యుద్ధాన్ని తలపించాయి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ సైన్యాన్ని మోహరించింది కమలదళం. 56 మంది కేంద్రమంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపీలను యుద్ధక్షేత్రంలో నిలిపింది. దీనికితోడు ఆరెస్సెస్, వీహెచ్‌పీ కరసేవకులు. ఇంకోవైపు ఏకంగా నరేంద్ర మోడీ ప్రచారాన్ని హోరెత్తించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షా సమర వ్యూహాన్ని రచించారు. అటు కేజ్రీవాల్‌ మాత్రం తనే ఒక సైన్యంగా కదిలారు. దాంతో, ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్ స్థాయిలో మోడీ వర్సెస్ కేజ్రీవాల్‌గా సాగాయి. ఇలా, మొత్తం కమలదళమంతా రంగంలోకి దిగినా... హిందుత్వ ఆయుధాన్ని ప్రయోగించినా... వీళ్లందరినీ సింగిల్ గా ఎదుర్కొని సూపర్ విక్టరీ కొట్టాడు కేజ్రీవాల్. కేవలం, తన ఐదేళ్ల పరిపాలననే ప్రజల ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లాడు. ముఖ్యంగా తాను అందించిన గుడ్‌ గవర్నెన్స్ నే ఎక్కువగా చెప్పుకున్నాడు. అదే, మరోసారి కేజ్రీవాల్ ను గెలిపించిందనేది స్పష్టంగా అర్ధమవుతోంది. ముఖ్యంగా తన ఐదేళ్ల పాలనలో చేపట్టిన వివిధ పథకాలనే ప్రచారంలో ప్రజల ముందు పెట్టారు కేజ్రీవాల్. పేదలకు ఆధునిక సౌకర్యాలతో వైద్య సేవలందించే మొహల్లా క్లినిక్స్‌‌.... అలాగే కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు... మహిళల భద్రత కోసం సీసీటీవీలు, వీధి దీపాలు... మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం... ఉచిత వైఫై.... అవీనీతి రహిత పాలన అందించానని చెప్పుకున్నారు. ఇలా తన పాలన గురించే చెప్పుకునే ఓట్లు అడిగారు కేజ్రీవాల్. ఇవే కేజ్రీవాల్ విజయానికి కారణమయ్యాయి. మరోవైపు, మోడీ పౌరసత్వ ఆయుధాన్ని వదిలితే... స్వచ్చమైన నీటి సరఫరా చూడండి అన్నారు కేజ్రీవాల్. అమిత్‌ షా షహీన్‌ బాగ్‌ టెర్రరిస్టు అంటే... నిరంతరం కారుచౌకగా ఇస్తున్న కరెంటు చూడండి అంటూ ఓటర్లకు విన్నవించారు కేజ్రీ. ఆఖరికి మోడీ రామబాణం, హనుమాన్‌ ఆయుధం సంధించినా... కేజ్రీవాల్ మాత్రం, తన హయాంలో సకల సదుపాయాలతో నెలకొల్పిన సర్కారీ బడులను చూడండంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ తన బ్రహ్మాస్త్రమైన హిందూత్వకు సంబంధించిన సకల ఆయుధాలనూ సంధిస్తే.... కేజ్రీవాల్‌ మాత్రం, కేవలం తన సుపరిపాలన గురించి మాత్రమే వివరించారు. చివరికి, కేజ్రీవాల్ వాదన వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గుచూపారు. ఆమ్ ఆద్మీని మరోసారి ఆదరించి బంపర్ మెజారిటీతో పట్టంకట్టారు.

kejriwal victory in delhi assembly elections 2020

ఢిల్లీలో కేజ్రీవాల్ సూపర్ విక్టరీ... మోడీ అండ్ టీమ్‌కి మళ్లీ నిరాశే...

ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. మరోసారి బంపర్ మెజారిటీతో కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని అధిష్టిస్తారన్న లెక్కలు లెక్కతప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ 50కి పైగా స్థానాల్లో ఘనవిజయం సాధించింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో పోలిస్తే దాదాపు 15 స్థానాలు కోల్పోయింది. ఇక, ఈసారి ఢిల్లీ పీఠం తమదేనంటూ ధీమాతో ముందుకెళ్లిన బీజేపీకి మరోసారి నిరాశే మిగిలింది. గత ఎన్నికలతో పోలిస్తే పుంజుకున్నప్పటికీ 20 స్థానాలను కూడా సాధించలేకపోయింది. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా మోహరించి ప్రచారం చేసినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దాంతో, బీజేపీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇక, మరోసారి ఘనవిజయం సాధించి రెండోసారి అధికారాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

t congress leader khuntia missing

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా కనిపించడం లేదు... కారణం ఏంటి..?

    తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా చాలా రోజులుగా కనిపించటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దాల్సిన ఆయన కొంతకాలంగా గాంధీ భవన్ లో కనిపించడం మానేశారు. ఢిల్లీకే పరిమితమయ్యారో లేదంటే తెలంగాణలో ఏముందిలే అనుకున్నారో ఏమో తెలియదు కానీ కుంతియా చాలా కాలంగా రాష్ట్రంలో కనిపించటం లేదు. గడిచిన ఆరు నెలల క్రితం వరకు వారంలో రెండు మూడు రోజులు ఇక్కడే ఉండేవారు. అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో సమావేశమయ్యేవారు. ఏఐసీసీ కార్యాచరణ ఇచ్చిందంటే ఆయన హోటల్లో ఉండి సమీక్షలు చేసేవారు. కానీ, కొంత కాలంగా కనిపించడం మానేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో బిజీగా కనిపించిన ఆయన ఇప్పుడు అస్సలు కనిపించకపోవడంతో కుంతియా ఎక్కడ అని కామెంట్ లు గాంధీ భవన్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పెర్ఫామెన్స్ చేయలేకపోయింది, పధ్ధెనిమిది మునిసిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ వాటిని కైవసం చేసుకోలేకపోయింది. ఫలితాలపై సమీక్ష నిర్వహించాల్సిన కుంతియా ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదు. రాష్ట్రంలో కీలకమైన నాయకులంతా తమ పరిధిలోని మునిసిపాలిటీలను గెలిపించుకోలేకపోయారు. కానీ, వీటిని విశ్లేషించేవారే లేకుండా పోయారు. సాధారణంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ఇలాంటి సమీక్షలు చేస్తుంటారు కానీ, కుంతియానే కనిపించకపోవటంతో సమీక్షలు కూడా అటకెక్కాయి. సమీక్షల సంగతి ఎలా ఉన్నా కుంతియా కనిపించకపోవటంతో అది కాస్త వేరే చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత దేశవ్యాప్తంగా నాయకత్వ మార్పు ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు ఏఐసీసీ లో కూడా మార్పులు, చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. కుంతియా కొంత కాలంగా రాకపోవడంతో ఆయనను కూడా మార్చుతారేమోననే టాక్ మొదలైంది. నాయకత్వ మార్పుపై ఎప్పటికప్పుడు అంతో ఇంతో స్పష్టత ఇచ్చే కుంతియానే ఇప్పుడు కనిపించకపోవడంతో పార్టీలో పరిణామాలపై చర్చలు తీవ్రమయ్యాయి.

ap govt hikes electricity charges

మొన్న మద్యం... నిన్న ఆర్టీసీ... ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు... జనంపై జగన్ సర్కారు వాతలు...

  ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వాత మోత మొదలైంది. ఓటు బ్యాంకే లక్ష్యంగా హద్దూపద్దూ ఎన్నికల్లో హామీలిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వాటిని అమలు చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు కోసం అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లోనే సుమారు 60వేల కోట్ల అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... ప్రజలపై పరోక్షంగా భారం మోపుతూనే ఉంది. దశల వారీ మద్యం నిషేధమంటూ లిక్కర్ ధరలను భారీగా పెంచేసి మద్యం ప్రియులపై పెనుభారం మోపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... ఆ తర్వాత ఆర్టీసీ ఛార్జీలపై మోత మోగించింది. ఇక, ఇప్పుడు విద్యుత్ ఛార్జీల వంతు వచ్చింది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులపై జగన్ ప్రభుత్వం భారం మోపింది. యూనిట్ కు 90 పైసలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే పెంచిన ఛార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అంటే, ఐదొందల యూనిట్లు పైబడినవారికి యూనిట్ ధర 9 రూపాయల 95 పైసలు వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపైనే భారం పడుతుందని ప్రభుత్వం చెబుతున్నా.... 500 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగించుకునే ప్రజలు లక్షల్లోనే ఉన్నారు. సుమారు కోటిన్నర మంది గృహ వినియోగదారుల్లో కోటీ 30లక్షల మందిపై పెనుభారం పడనుంది. అలాగే, పెంచిన ఛార్జీల కారణంగా ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపై 13వందల కోట్ల రూపాయల భారం పడనుంది. మరోవైపు, ప్రభుత్వ సబ్సిడీ భారీ పెరిగిపోయిందని, క్రమంగా సబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామని అధికారులు బాంబు పేల్చారు.

CM KCR meeting with collectors

దృష్టంతా పాలనపైనే పెట్టాలని కలెక్టర్ లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు...

  రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఇకపై దృష్టంతా పాలనపైనే పెట్టాలని కలెక్టర్ లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వబోతున్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించటమే లక్ష్యంగా పని చేయాలని సూచించనున్నారు. పల్లె ప్రగతిని సమీక్షించి పట్టణ ప్రగతి, వివిధ చట్టాల అమలుపై ఈరోజు ముఖ్యమంత్రి చర్చించనున్నారు. గత ఏడాది అక్టోబరు పదిన (అక్టోబర్ 10) జిల్లా కలెక్టర్ లతో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన మీటింగ్ కు ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. 20 కి పైగా జిల్లాలకు కలెక్టర్ లు మారగా కొత్తగా పన్నెండు మంది కలెక్టర్లయ్యారు. జాయింట్ కలెక్టర్ల స్థానంలో ఎడిషనల్ కలెక్టర్ల వ్యవస్థ వచ్చింది. ఒక్కో జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్ లు ఉండనున్నారు, దీంతో సీఎం చేయనున్న మార్గ నిర్దేశనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పల్లెప్రగతి లాగే త్వరలోనే పట్టణ ప్రగతి చేపడుతామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశముంది, తేదీలను కూడా ఖరారు చేసే అవకాశముంది. హరితహారం పైనా రివ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టాల అమలుపై కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడబోతున్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై కూడా కలెక్టర్ల అభిప్రాయం తీసుకోనున్నారు. ఎడిషనల్ కలెక్టర్ల బాధ్యతలపై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు. రాష్ట్రంలో దాదాపుగా అన్ని రకాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలని కలెక్టర్ లకు  కెసిఆర్ సూచించనున్నారు. అక్షరాస్యత శాతం పెంచేందుకు కేసీఆర్ గతంలో ప్రకటించిన ఈచ్ వన్ టీచ్ వన్ పథకం పైన సమావేశంలో చర్చ జరగనున్నట్టు సమాచారం. 

2020 Delhi legislative assembly election results

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదల..గెలుపెవరిది..?

  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ప్రారంభం కానుంది. మొత్తం డెబ్బై శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. హస్తిన ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. శనివారం ఢిల్లీలోని డెబ్బై అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది, ఈరోజు మొత్తం ఇరవై ఒక్క కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించేందుకు ఈ సీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేసింది, మొదట బ్యాలెట్ పేపర్ ఓట్లను లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల సంఘం అధికారులు, పోలింగ్ ఏజెంట్ లు మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోకి అనుమతిస్తారు. కౌంటింగ్ కు ఒక గంట ముందు అభ్యర్థి, పోలింగ్ ఏజెంట్ మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించటానికి అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో మొత్తం డెబ్బై స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 672 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. 58 జనరల్, 12 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు, సీఎం కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ప్రధానంగా అధికార ఆమాద్మీ పార్టీ, బీజేపీ మధ్య ద్విముఖ పోరు నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. 2015 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. బిజెపి మూడు సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.2015 లో 67శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 62శాతానికి తగ్గింది. అత్యల్పంగా ఢిల్లీ కంటోన్మెంట్ లో 45.4శాతం పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా బల్లిమారం నియోజకవర్గంలో 71.6 శాతం పోలింగ్ నమోదైంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నం లోగా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జెండా ఎగరేసింది ఎవరనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ విజేత ఎవరో అంచనా వేసినా అధికారిక ఫలితాలొచ్చే వరకూ ఆగాల్సిందే. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారని ఆప్ ధీమా వ్యక్తం చేస్తుంటే సంచలనాలు నమోదవుతాయని బీజేపీ ఆశలు పెట్టుకొంది.

electricity charges to rise in ap

ఏపీలో పెరగనున్న విద్యుత్ చార్జీలు..!!

  ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి, నెలలో 500 యూనిట్ లకు మించి విద్యుత్తును వినియోగించే వారికి యూనిట్ కు 90 పైసలు చొప్పున పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఈ ధర రూ 9.05 ఉండగా ఇప్పుడు రూ 9.95 గా ట్యారిఫ్ నిర్ణయించింది. ఈ భారం కార్పొరేట్ సంస్థలతో పాటు రాష్ట్రంలోని 1,00,035 గృహ వినియోగదారులపై కూడా పడనుంది. విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల నుంచి బయట పడేసేందుకు ఆంధ్రపదేశ్ లో కరెంటు చార్జీలు పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలకు 2020-21 సంవత్సరానికి గాను 14,349 కోట్ల ఆదాయం అవసరమవుతుందని అంచనా వేసినట్టు ఏపీఈఆర్ సీ చైర్మన్ సివి నాగార్జునరెడ్డి చెప్పారు. ఈ లోటును భర్తీ చేసేందుకే చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. పెంచిన విద్యుత్ చార్జీల కారణంగా ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్ సంస్థలపై పదమూడు వందలు కోట్ల భారం పడనుందని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వానికి 2893.48 కోట్ల ఆర్థిక భారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థల నికర లోటును 10,060.63 కోట్లుగా నిర్ధారించారు. రైతులు వినియోగించే విద్యుత్ కోసం 8358.58 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో 9,500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని అందుకే ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతి నిరాకరించినట్లు అధికారులు తెలిపారు. ఈసారి వ్యవసాయ విద్యుత్ కోసం పక్కా ప్రణాళిక రూపొందించామని రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వ సబ్సిడీ పెరిగిందని, క్రమంగా సబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. 

bjp bahiranga sabha in hyderabad

బిజెపి హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ అందుకే నిర్వహించనుందా..?

  పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు బిజెపి ప్లాన్ చేస్తోంది. మార్చి మొదటి వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు అమిత్ షా, పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలనుకుంటోంది. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా బీజేపీ సంఘ్ పరివార్ క్షేత్రాలు, కార్యక్రమాలు చేస్తున్నాయి. చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ సభలు కూడా జరుగుతున్నాయి, తెలంగాణలో కూడా కొన్ని చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించింది బీజేపీ. మేథావుల సమావేశాలను ఏర్పాటు చేసింది, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నగరాల్లో సభలు జరిగాయి. హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు చేసింది, ఇందిరాపార్కులో ఒక కార్యక్రమం తప్ప ఎక్కువగా హాల్ మీటింగ్ లకే పరిమితమైంది. మొక్కుబడి కార్యక్రమాలు కాకుండా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాధులు భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఎల్బీ స్టేడియంలో ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా టైమిస్తే మార్చి మూడవ(మార్చి 3) తేదీన ఈ సభ వుండే అవకాశముంది. ఈ సభకు బిజెపితో మళ్లీ దోస్తీ కట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు సమాచారం. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం, గ్రేటర్ మునిసిపల్ కౌన్సిల్ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయటంతో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని బీజేపీ భావిస్తోంది. ఈ సభను తనకు అనుగుణంగా మార్చుకోవాలని బిజెపి నేతలు అనుకుంటున్నారు.

Select Committee Issue in AP

ఏపీలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వివాదం మరల మొదలైందా..!!

ఏపీలో మళ్లీ సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వివాదం ప్రారంభమైంది, సెలెక్టు కమిటీలను ఏర్పాటు చేయలేమంటూ చైర్మన్ కు మండలి కార్యదర్శి స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని టిడిపి సీరియస్ గా తీసుకుంటోంది, చైర్మన్ ఆదేశాలను సెక్రటరీ ఎలా బేఖాతరు చేస్తారంటూ మండిపడుతోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలకు పోతుండడంతో సెలక్ట్ కమిటీల ఏర్పాటు అంశం మరింత జఠిలం కానుంది. వికేంద్రీకరణ బిల్లులు ఇంకా గాలిలోనే ఉన్నాయి, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలనే అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. వికేంద్రీకరణ బిల్లు సి ఆర్ డి ఏ చట్ట ఉపసంహరణ బిల్లులపై మండలిలో చర్చ జరిగి గందరగోళం మధ్య సెలెక్ట్ కమిటీకి పంపుతున్నారనే విషయాన్ని ప్రకటించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. అప్పట్నుంచీ రోజులు గడుస్తున్నా సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశం మాత్రం కొలిక్కి రావడం లేదు. సెలెక్టు కమిటీలను ఏర్పాటు చేయాలంటూ మండలి చైర్మన్, కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు ఫైల్ పంపారు. అలాగే తన వద్దకు వచ్చిన సభ్యుల పేర్లతో సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ బులెటెన్ జారీ చేయాలని సూచించారు.  అయితే ఇక్కడో ట్విస్ట్ ఇచ్చారు మండలి సెక్రెటరీ, సెక్షన్ 154 ప్రకారం సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేసే అధికారం లేదని, అలాగే తనకున్న నిబంధనలు, పరిమితులను కూడా ప్రస్తావిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ కు మండలి సెక్రటరీ నోట్ రాసినట్టు సమాచారం. మండలి కార్యదర్శి ఈ విధంగా వ్యవహరించడాన్ని ఇటు మండలి ఛైర్మన్ తో పాటు టిడిపి కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. మండలి చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను తిప్పి పంపే అధికారం సెక్రటరీకి ఎంత మాత్రం లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు టిడిపి నేతలు. ఇదే అంశంపై మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులతో భేటీ అయ్యారు టిడిపి ఎమ్మెల్సీలు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తూ కార్యదర్శిపై ఒత్తడి పెంచితే తాము కూడా సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఇష్యూను రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తీసుకువెళతామని హెచ్చరించారు. అయితే మధ్యే మార్గంగా సంప్రదింపులు జరుపుకునే సెలక్ట్ కమిటీల ఏర్పాటు విషయంలో ఓ అభిప్రాయానికి వస్తే బెటరనే భావనను మండలి కార్యదర్శి వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు చైర్మన్ ఆదేశాలను పాటించకుండా సెక్రటరీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇస్తామంటూ టిడిపి స్పష్టం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ కూడా అప్రమత్తమయింది. టిడిపి ఎమ్మెల్సీలు సెక్రటరీతో భేటీ అయ్యారనే సమాచారం తెలుసుకున్న వెంటనే వారి భేటీ అనంతరం మండలి సెక్రెటరీతో డిప్యుటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు భేటీ అయ్యారు. కౌన్సిల్ ఛైర్మన్ సెలక్ట్ కమిటీ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి బిల్లులను పంపే అంశమే ఉత్పన్నం కాదనేది వైసిపి వాదన. ఈ క్రమంలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.

ఒకరికి పోస్టింగ్... మరొకరిపై వేటు... జగన్ కసి తీర్చుకున్నారా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఏబీవీదే ప్రధాన పాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడం... లొంగకపోతే బెదిరింపులకు దిగడం... చివరికి, వాళ్లను తెలుగుదేశం పార్టీలో చేర్చడమే పనిగా ఏబీ వెంకటేశ్వర్రావు పని చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జగన్మోహన్ రెడ్డి మొదలుకొని విజయసాయిరెడ్డి, ఇతర ముఖ్యనేతలంతా ఈ ఆరోపణలు చేశారు. అయితే, ఏబీ వెంకటేశ్వర్రావుతోపాటు అప్పటి సీఎంవో ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రపైనా ఇలాంటి ఆరోపణలే చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఏబీ వెంకటేశ్వర్రావు, సతీష్ చంద్ర కీలక పాత్ర పోషించారనేది ఆనాడు వైసీపీ ప్రధాన ఆరోపణ. చివరికి వీళ్లిద్దరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దాంతో, ఆనాటి సీఎస్ పునేఠాతోపాటు ఏబీ వెంకటేశ్వర్రావుపై ఈసీ బదిలీ వేటేసింది. అయితే, తనపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వర్రావు పరువునష్టం దావా వేస్తానని ఆనాడు ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఏబీ వెంకటేశ్వర్రావు, సతీష్ చంద్ర కీలక పాత్ర పోషించారంటూ ప్రతిపక్షంలో ఉండగా ఆరోపణలు చేసిన వైసీపీ.... అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా వ్యవహరించింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర్రావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఎనిమిది నెలలుగా వెయిటింగ్ లో పెట్టిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేసింది. అయితే, అలాంటి ఆరోపణలనే వైసీపీ నుంచి ఎదుర్కొన్న సతీష్ చంద్రకు మాత్రం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. అంతేకాదు, త్వరలో సతీష్ చంద్ర.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదంటున్నారు.  అయితే, ఉత్తరాది వాసైన సతీష్ చంద్రకు పోస్టింగ్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.... కమ్మ సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర్రావుపై మాత్రం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఇది మంచి పద్ధతి కాదని అంటున్నారు. ఏబీ వెంకటేశ్వర్రావే కాదు... కమ్మ సామాజికవర్గానికి చెందిన సీఐలు, అడిషనల్ ఎస్పీలు, ఎస్పీలకు ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తీరు చూస్తుంటే కావాలనే కమ్మ వర్గాన్ని అణచాలని చూస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

వైస్ ఛాన్సలర్ సమక్షంలో నే దాడులు.. యూనివర్సిటీ లో జగన్ ఫొటోతో ఊరేగింపు!

విజయవాడ హెల్ప్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎన్‌యూ విద్యార్థులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తే దాడులకు పాల్పడుతారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీలను స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు. వైస్ ఛాన్సలర్ ప్రవర్తన దారుణంగా ఉందని, ఆయన సమక్షంలోనే విద్యార్థులపై దాడులు జరిగాయని ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ ఒక పార్టీకి ఎలా వత్తాసు పలుకుతారు అని ప్రశ్నించారు. సీఎం ఆలోచలను ప్రజలపై రుద్దే అధికారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ఎవరు ఇచ్చారని నిలదీశారు. వైస్ ఛాన్సలర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ లో జగన్ ఫొటోతో ఊరేగింపు నిర్వహించారు, యూనివర్సిటీని స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ సైకో ...ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియదు అని చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబుతో పాటు సిపిఐ నేత రామకృష్ణ కూడా విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్ ఛాన్సలర్ సమక్షంలో నే దాడులు జరిగాయని ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ అక్రమాల చిట్టా మావద్ద ఉంది, యూనివర్సిటీ లో జరిగిన ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాం అన్నారు.  

ఏబీ వెంకటేశ్వరరావుకు బెంగళూరులో వెయ్యి కోట్ల ప్రాపర్టీ!!

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుకు బెంగళూరులో వెయ్యి కోట్ల ప్రాపర్టీ ఉందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. బెంగళూరులో వ్యవసాయం చేస్తానని చెబుతున్న వెంకటేశ్వరరావుకు, అక్కడ వంద ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ భూముల మొత్తం విలువ వెయ్యికోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడి ఆస్తులు సంపాదించారని, వాటిని చూసుకునే తీరిక కూడా ఆయనకు లేదని అన్నారు. ఇలాంటి వ్యక్తి తనను సస్పెండ్ చేయడాన్ని అదృష్టంగా భావిస్తారే తప్ప పనిష్ మెంట్ గా భావించరని సెటైర్లు వేశారు. ఏబీ వెంకటేశ్వరరావు సంఘ విద్రోహశక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై, కేంద్రం సీరియస్ గా స్పందించి సమగ్ర విచారణ జరిపితే, ఆయనపై 124 A సెక్షన్ కింద కేసు నమోదు చేసి తీరుతుందని, దేశ ద్రోహిగా ఆయన ప్రజల ముందు నిలబడతారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. వెంకటేశ్వరరావుతో పాటు భాగస్వామి అయిన ఘట్టమనేని శ్రీనివాస్ పైనా సమగ్ర విచారణ జరపాలని కోరారు. చిత్తూరు జిల్లాలో డీఎస్పీ స్థాయి అధికారిగా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు శిష్యుడు రామ్ కుమార్ కు రెండు వందల కోట్లు ఆస్తులు ఉన్న విషయం ఈ మధ్యనే బయటపడిందని అన్నారు. వెంకటేశ్వరరావు ఈ దేశం వదిలి పారిపోయే ప్రమాదం ఉందని, ఆయనకు లుక్ ఔట్ నోటీసు జారీ చేయాలని కేంద్రానికి చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

రాజధాని కోసం ఆగిన మరో గుండె.. ఉద్యమించిన గొంతు మూగబోయింది!

ఏపీ రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందనే మనస్థాపంతో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు గ్రామానికి చెందిన కంచర్ల చంద్రం(43) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. రాజధాని కోసం 31 సెంట్ల భూమి ఇచ్చిన చంద్రం.. రాజధాని ఉద్యమంలో తొలి నుంచీ చురుగ్గా పాల్గొన్నారు. రాజధాని తరలిపోతోందని పదే పదే ఆలోచించి తల నరాలు చిట్లి చంద్రం చనిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని ప్రచారం మొదలైన నాటి నుండి రాజధానిలో రైతులు తీవ్ర మానసిక వేదనతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక నేడు రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న మరొక రైతు చంద్రం ప్రాణాలు కోల్పోయారు. రాజధాని కోసం పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోవడం సామాన్యులని సైతం కలచివేస్తోంది.