Ukrainian plane crash kills 176 people in Iran

ఇరాన్ లో కుప్పకూలిన విమానం..176 మంది దుర్మరణం

ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్ లో కుప్పకూలింది. విమానంలో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ ఖామెనెయీ విమానాశ్రయం నుండి ఉక్రెయిన్ రాజధాని కీవ్ కి వెళుతుంది. ఇరాన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవ్వగానే ప్రమాదానికి గురైనట్లుగా సమాచారం. సాంకేతిక సమస్యల కారణాల వల్లే ప్రమాదం జరిగిందనట్లుగా తెలిపింది ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్. విమానం కుప్పకూలిన వెంటనే ఘటనాస్థలానికి సహాయ సిబ్బందిని పంపించింది ఇరాన్ ప్రభుత్వం. అప్పటికే విమానం మంటల్లో ఉందని.. తాము సిబ్బందిని పంపించి కొంతమందినైనా కాపాడగలమని అనుకున్నా కుదరలేదని ఇరాన్ అత్యవసర సేవల అధికారి పిర్హొస్సేన్ కౌలీవాండ్ మీడియాతో తెలిపారు.  ప్రమాద సమయంలో విమానంలో ఉన్నవారు సజీవంగా ఉండే అవకాశమే లేదని ఇరాన్‌కు చెందిన రెడ్ క్రిసెంట్ ప్రకటించింది. ఇక ఇప్పటికే జరుగుతున్న  ఇరాన్-అమెరికా ఘర్షణతో ఈ ఘటనకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Student Vaishnavi donated 1acr Land to Amaravati Parirakshana Samithi

రాజధాని పరిరక్షణ సమితికి ఎకరం పొలం రాసిచ్చిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్!!

రాజధాని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలకు కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన వైష్ణవి ఎకరం భూమి విరాళంగా ఇచ్చింది. తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిలో ఎకరం భూమి పత్రాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అందించింది. గతంలో రాజధాని నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం అందించిన వైష్ణవిని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అమరావతి అంబాసిడర్ గా ప్రకటించారు. తరువాత కాలంలో సుమారు నాలుగు లక్షల వ్యయంతో తాను చదువుకునే పాఠశాల అభివృద్ధి చేయటమే కాకుండా 400 మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆమె కృషి చేసింది. ప్రస్తుతం రాజధాని అమరావతి తరలింపు పై ప్రజల్లో గందరగోళం, మూడు రాజధానుల ప్రకటన ద్వారా అయోమయం నెలకొన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ భవన్ కు వచ్చి.. అమరావతి పరిరక్షణ కోసం ముదినేపల్లిలో ఈ నెల 12 న దుర్గా మహాచండీయాగం నిర్వహిస్తున్నామని దానికి హాజరు కావాలని చంద్రబాబును ఆహ్వానించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైష్ణవి లానే అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఐదు కోట్ల ఆంధ్రుల పై ఉందని ఆయన పేర్కొన్నారు.

Iran launches missile attacks on US facilities in Iraq

నువ్వా-నేనా ?.. దాడి ప్రతిదాడులతో యుద్ధ వాతావరణంలో అమెరికా-ఇరాన్

రెండు దేశాలు ఎక్కడ తగ్గటం లేదు.. నేనంటే నేను అంటూ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ మిలిటరీ కమాండర్ సులేమాణి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది ఇరాన్ ప్రభుత్వం. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై గురిపెట్టి.. అమెరికా స్థావరాలైన అల్లాసత్, ఇర్బిల్ ఎయిర్ బేస్ లపై ఇరాన్ రాకెట్ దాడులు చేసింది. అమెరికా స్థావరంపై కనీసం 12 కు పైగా రాకెట్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో అమెరికా సైనికులకు జరిగిన నష్టం పై ఇంకా స్పష్టత రాలేదు. ఎయిర్ బేస్ లపై దాడిని పెంటగాన్ ధ్రువీకరించింది. ఈ దాడిలో జరిగిన నష్టం పై అమెరికా అంచనా వేస్తోంది. ఇరాక్ లో ఇరాన్ రాకెట్ దాడులను అధ్యక్షుడు ట్రంప్ నిశితంగా గమనిస్తున్నారని అన్నారు అమెరికా రక్షణ శాఖ అధికారి. తాము కూడా సరైన సమయంలో బదులిస్తామని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్ కు సమర్పించామని ఆయన దానిపై తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్ హౌజ్ వెల్లడించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

AP CM seeks bankers help to implement welfare schemes

సీఎం వరాల జల్లులు.. ఏప్రిల్ లోపు 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు!!

209 వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వివిధ పథకాల కింద నగదును బదిలీ చేయగలుగుతున్నామని సీఎం అన్నారు. రైతులకు ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే వారికి , మత్స్యకారులకు.. చేనేతలకు.. అగ్రి గోల్డ్ బాధితులకు సుమారు 15 వేల కోట్లకు పైనే నగదు బదిలీ ద్వారా ఇచ్చినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి చిరు వ్యాపారులు , తోపుడు బండ్ల వారికి 10 వేల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన వినియోగంలో రాష్ట్రం 12 వ ర్యాంక్ లో ఉందని గుర్తు చేశారు. మహిళలు , రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వారికి రుణాలు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని కోరారు.  కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడం లేదని ఎస్ఎల్బీసీ లెక్కలు చెబుతున్నాయని వారి కోసం ఒక చట్టాన్ని తీసుకువచ్చినట్లు సమావేశాల్లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్యాంకర్లు ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరింత ఎక్కువగా రుణాలు అందించేలా ముందడుగు వేయాలని జగన్ స్పష్టం చేశారు. ఏప్రిల్ నాటికి దాదాపు 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమావేశాల్లో వెల్లడించారు. వైఎస్ఆర్ నవోదయం క్రింద ఖాతాల పునః వ్యవస్థీకరణపై దృష్టి సారించాలని కోరారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మఒడి కింద ఈ నెలలో రూ.6,500 కోట్లు ఇవ్వబోతున్నట్లు సీఎం అన్నారు. నాడు- నేడు కింద 45 వేల స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలను బాగుచేస్తున్నామని దీనికి దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు పావలా వడ్డీ కింద పెట్టిన బకాయిలు రూ.648.62 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారని ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నట్టు జగన్ తెలిపారు.

Finland PM calls for 4day 6hour working week

ఎంత సుఖమో.. వారానికి నాలుగు రోజులే పని.. మూడు రోజులు సెలవులు

హెక్టిక్ షెడ్యూల్ స్ట్రెస్ ఫుల్ లైఫ్ తో వారం రోజులు గట్టిగా పని చేయగానే శరీరం మనసు డీలాపడిపోతుంది. వీక్లీ ఆఫ్ కోసం మనసు ఆశగా ఎదురు చూస్తోంది. సెలువు రోజు ఫుల్ గా తినేసి హాయిగా నిద్రపోతే తప్ప మళ్లీ వారానికి సరిపడే పని చేసేంత శక్తి రావటం లేదు. దీంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హాబీలు ఇష్టాయిష్టాలు లాంటివి ఏనాడో అటకెక్కేశాయి. మనమంతా మరమనిషిలా మారిపోతున్నాము. అయితే మల్టీనేషనల్ కంపెనీల్లో పని చేసే వాళ్లకు మాత్రం వారానికి రెండు రోజులు సెలవులు దొరుకుతున్నాయి. ఒకరోజు రెస్టు తీసుకున్న ఇంకో రోజు ఫ్యామిలీతో గడుపుతున్నారు. కానీ ఆ రెండు రోజులు కూడా అప్పుడప్పుడు సరిపోవటం లేదు. పెండింగ్ పనులు ఉంటే అవి చక్కబెట్టుకోవడానికే ఆ వీకెండ్స్ కూడా సరిపోతుంది. దీంతో వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్ ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. వారంలో నాలుగు రోజులు పనికి మూడు రోజులు పర్సనల్ లైఫ్ కి కేటాయించేలా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు సీరియస్ గా సాగుతున్నాయి. ఉద్యోగులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో గడిపే వాళ్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడి క్వాలిటీ ఔట్ పుట్ వస్తుందని శాస్త్రీయంగా నిర్ధారణ కావటంతో ఈ విషయం పై ఇప్పుడు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. పనిదినాలు తగ్గే కొద్దీ ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి సమన్యాయం ఏర్పడి 20 శాతం మెరుగైన ఉత్పత్తి వస్తుందని సర్వేలో తేలింది. అందుకే ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా కూడా వారానికి నాలుగు పనిదినాలపై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. గేట్ వే కాన్ఫరెన్స్ లో ఆయన ఓసారి మాట్లాడుతూ మా తాతయ్య పొలంలో రోజుకు 16 గంటలు పనిచేసేవారు, మనం ఇప్పుడు రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తున్నాము. వచ్చే 30 ఏళ్లల్లో ప్రజలు రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారు. అది కూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే అని ఆయన జోస్యం చెప్పారు.  సరే ఒక కంపెనీ యజమాని ఈ నియమాన్ని అమలు చేస్తే అది ఆ సంస్థలో పనిచేసే వాళ్లకే వర్తిస్తుంది. మరి ఇదే ఆలోచన ఓ దేశ ప్రధాని చేసి ఆచరణలోకి తీసుకు వస్తే ఎలా ఉంటుంది, ఫిన్ లాండ్ ప్రధాని సరిగ్గా ఇప్పుడు అదే చేస్తున్నారు. 34 ఏళ్లకే ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మ్యారిన్ రోజుకు ఆరు గంటల చొప్పున వారానికి నాలుగు రోజుల పనిదినాల పై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. వారానికి 24 గంటలు పని చేస్తే సరిపోతుందా, తద్వారా వచ్చే లాభ నష్టాలు ఏంటనే దానిపై మేధో మథనం చేస్తున్నారు. సమాజం లోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ విధానం అమలు లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక మన దగ్గిర అంటారా అంత సీన్ లేదు అండి మన దగ్గర అనార్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేసే వాళ్లే రూ.50 కోట్ల మందికి పైగా ఉన్నారు. వీళ్లంతా రోజుకు 12 గంటలకు పైగా మండేటి ఎండలో దుమ్మూదూళి మధ్య పనిచేస్తున్నారు. ప్రతి ఆదివారం సెలవు కాదు కదా కనీసం నెలకు ఓ రెండ్రోజులు సెలవులు దొరికితే అదే మహాభాగ్యం, కనీస వేతనం కింద నెలకు రూ.15000 చెల్లించాల్సిందే అని చట్టం చేసినా ఎక్కడ అమలవుతుంది. ఐదారు వేల జీతానికి కోట్ల మంది పనిచేస్తున్నారు. ఇక మన దేశానికి వస్తే నిన్న ప్రధాని మోదీ కూడా దేశ ఆర్థిక ప్రగతి రథచక్రాలను నడిపిస్తున్న పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. భారత ఎకనామీ ఐదు ట్రిలియన్ డాలర్ లకు చేర్చడంపై కసరత్తు చేశారు. మనము ఏదో ఒక రోజు పాశ్చాత్య దేశాల స్థాయికి చేరుకుంటాం అయితే అది ఎప్పుడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న, ఇప్పటికీ ఇప్పుడు మన ముందున్న టాస్క్ అల్లా జిడిపితో పాటు తలసరి ఆదాయం పెంచడం, సమాజం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటంతో పాటు పేద ధనిక మధ్య అంతరాలు ఎంత తక్కువగా ఉంటే ఆ సొసైటీ అంత హెల్దీగా ఉంటుంది.

tummala nageswara rao complaint to police over fake phone call

ఓటమి నేర్పుతున్న పాఠాలు.. తుమ్మల నాగేశ్వరరావు కష్టాలు!!

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగిన తుమ్మల నాగేశ్వర్ రావు ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోయారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వద్ద నెంబర్ 2 గా ప్రాచుర్యం పొందారు. ఓ దశలో రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక వ్యక్తిగా నిలిచారు. జలగం వెంగళరావు కుటుంబాన్ని రాజకీయంగా ఎదిరించడంతో బాగా గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పార్టీ మారారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి ఓడిపోయినా.. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో నేరుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందిన కొందరు మంత్రులలో తుమ్మల కూడా ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఆయన ఏ రోజూ పోలీసులను ఆశ్రయించలేదు. కొందరు పోలీసు అధికారులే ఆయన కను సైగల్లో నడిచేవారని ఉదంతాలు ఉన్నాయి. అలాంటి కాకలు తీరిన రాజకీయ నేత మొట్టమొదటి సారి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోందని.. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన కనుసైగలతోనే దశాబ్దాల తరబడి రాజకీయాలను శాసించిన తుమ్మల నాగేశ్వర్ రావు పోలీసుల తీరుపై ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల మాజీ సర్పంచ్ బండి జగదీశ్ పై కేసు నమోదుకు సంబంధించి తుమ్మల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. తుమ్మల వాయిస్ తో వైరల్ అవుతోన్న ఆడియో ఖమ్మంలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ లేని విధంగా తుమ్మల పోలీసులను ఆశ్రయించడం చర్చకు దారి తీసింది. తుమ్మల తన రాజకీయ జీవితంలో తొలిసారి పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఆడియో గురించి పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. తన సంతకంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతం ఇదే మొదటిది.  వాస్తవానికి గత ఎన్నికల్లో పాలేరు నుంచి అనూహ్యంగా ఓటమి చెందిన తుమ్మల తాజా రాజకీయాల్లో యాక్టివ్ గా కూడా లేరు. గండుగలపల్లిలో వ్యవసాయం చేసుకుంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు, కానీ ఆయన గొంతును పోలిన స్వరంతో ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది, యూట్యూబ్ లోనూ వైరల్ గా మారింది. అమరావతి రాజధాని తరలింపునకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను తుమ్మలకు ఆపాదిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ విషయంపైనే తుమ్మల ఖమ్మం పోలీసులను ఆశ్రయించారు. ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాకపోయినా తన వాయిస్ గా చిత్రీకరించి వాట్సప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తులపై.. వారి వెనక ఉండి నడిపిస్తున్న శక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తుమ్మల కోరుతున్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ పార్టీ నేతలు కానీ స్పందించడం లేదు. అందుకు అధికార పార్టీలో.. ప్రజల్లో.. విపక్షాల్లో.. కూడా తుమ్మలను టిఆర్ఎస్ పార్టీ పక్కన పెడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తన గొంతు కాదు బాబోయ్ అంటున్న మద్దతుగా నిలిచినచేవారే కనిపించటం లేదు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచి ఖండించే నాయకుడే లేకపోవటంతో తుమ్మల బాగా ఫీలవుతున్నారు.

bus accident in chittoor

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!!

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.అమరావతి ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టగా ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు,మరికొందరు గాయపడ్డారు. కాశిపెంట్ల దగ్గర పూతలపట్టు రహదారి పై ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద క్షతగాత్రులను తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు.రెండు బస్సుల్లోనూ వాళ్ళందరికీ కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరు చనిపోగా మరో 30 మందికి తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.ఆసుపత్రి మొత్తం కూడా బాధితులతో నిండిపోయి క్యాజువాల్టీ అంత కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న బస్సు ప్రమాద బాధితులతో కొంతమందికి చేతులు విరిగితే మరికొంత మందికి కాళ్లు విరిగాయి. గాయాల పాలైన వారందరు కూడా నొప్పులు తట్టుకోలేక రోదిస్తున్నారు.దెబ్బలు తిన్న వాళ్లలో ఎక్కువ మంది మహిళలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అయ్యప్ప స్వామి భక్తులతో వెళ్తున్న బస్సును మరొవైపు నుంచి వస్తున్న అమరావతి బస్సు రెండు ఎదురెదురుగా మంచు కారణంగా రోడ్లు సరిగా కనిపించక ఢీ కొన్నట్టుగా సమాచారం. రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులందరికీ కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి.అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపధ్యంలో ఎవరికి వాళ్లును కాపాడూకోవడమే కష్టతరంగా మారింది.చివరికి  రెండు బస్సులు పూర్తిగా ధ్వంసం కాగా  బస్సులోంచి గాయాల పాలైన వారిని బయటికి తీయడం కూడా చాలా కష్టంగా మారింది.బస్సు ముందుభాగాలు పూర్తిగా నుజ్జునుజ్జైపోవటంతో లోపల చిక్కుకున్న బాధితులను బయటకు తెచ్చే ప్రయత్నంలో గ్యాస్ కట్టర్ల సాయంతో కట్ చేసి స్థానికులందరూ అప్రమత్తమై 108 వాహనాన్ని పిలిచి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.మొత్తం మీద ప్రమాదంలో అందరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచామృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

internal clashes between trs leaders in mahabubabad

మహబూబాబాద్ పెద్దాయన స్కెచ్.. సత్యవతి రాథోడ్ పతనానికి ప్లాన్ చేస్తున్న పెద్ద మనిషి అతనేనా?

టీఆర్ఎస్ పార్టీలో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న వారిలో ఒకరు సత్యవతి రాథోడ్. గులాబీ పార్టీలో చేరినప్పటి నుంచి కేసీఆర్ సూచనలను పాటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యం లోనే పార్టీలో పలువురు ముఖ్యనేతల అంచనాలను తారుమారు చేస్తూ తొలుత ఎమ్మెల్సీ పీఠం దక్కించుకున్నారు. అనంతరం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. అయినప్పటికీ సత్యవతి రాథోడ్ ను ఉమ్మడి వరంగల్ జిల్లాని టీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు. కేవలం మహబూబాబాద్ జిల్లాకే ఆమె పరిమితం అయినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. వినయ్ భాస్కర్ కి చీఫ్ విప్ పదవి వచ్చినప్పుడు బాగా హడావుడి చేశారు. పల్ల రాజేశ్వర్ రెడ్డిని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా చేసినప్పుడు కూడా ఉమ్మడి జిల్లాలో భారీ సన్మాన సభ ఏర్పాటు చేశారు. కానీ మంత్రి సత్యవతి రాథోడ్ ని మాత్రం పట్టించుకొనేవారే కన్పించడం లేదు. ఈ జిల్లా నేతలు కాకపోయినా ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు వరంగల్ కు వచ్చినప్పుడు వారికి కూడా ఘనమైన రీతిలో గౌరవ మర్యాదలు జరిగాయి. నిన్న మొన్నటి వరకు ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పల్ల రాజేశ్వర్ రెడ్డికి జరిగిన సన్మాన సభ తర్వాత సత్యవతి రాథోడ్ అంశం అందరి దృష్టిలోకి వచ్చింది. గిరిజన సామాజిక వర్గం నుంచి ఎదిగిన సత్యవతి రాథోడ్ ను ఉమ్మడి వరంగల్ నేతలు చిన్నచూపు చూడడానికి ఆధిపత్యపోరే కారణం కావచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బతుకమ్మ వేడుకలను అధికారికంగా వరంగల్ లో ప్రారంభించిన సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మొదటి సారి సత్యవతి రాథోడ్ వరంగల్ కు వచ్చారు. మంత్రులు దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు. మొదటిసారి వరంగల్ కు వచ్చినప్పుడు ఒక వైపు పండుగ సందడి మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతున్నాయి. అందువల్లే ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయలేదేమోనని అందరూ భావించారు. అత్యాచారం ఆపై హత్యకు గురైన ఓ మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి జిల్లాకు వచ్చారు. అప్పుడు కూడా ఆమె రాకపోకల సందడే లేదు. వరంగల్ జిల్లాలో గవర్నర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎంవో ఆదేశాలతో మరొకసారి వరంగల్ జిల్లాకు సత్యవతి రాథోడ్ విచ్చేశారు. అప్పుడు కూడా ప్రత్యేకంగా హడావిడి కనిపించలేదు. ఇటీవలే వరంగల్ నగరంలో జరిగిన అతి రుద్ర యాగంలో పాల్గొనేందుకు వచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్. పూజాకార్యక్రమాలు ముగిశాక ములుగుకు వెళ్లారు మేడారం జాతర పనుల సమీక్ష సమావేశం నిర్వహించి నేరుగా వరంగల్ కు వచ్చినప్పుడు కూడా మంత్రిని ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం. మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహబూబాబాద్ జిల్లాలో సత్యవతి రాథోడ్ తొలి పర్యటన చేశారు. నాటి పర్యటనలో కేవలం శంకర్ నాయక్ మహబూబాబాద్ ఎంపీ కవిత మినహా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనలేదు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లే దారిలో పలు నియోజకవర్గాలోని ప్రజాప్రతినిధులు కూడా ఆమెను కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు. ఇలా ఎందుకు జరుగుతోందని అందరిలో ప్రశ్న మెదులుతుంది. సత్యవతి రాథోడ్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య గ్యాప్ ఏర్పడిందన్న అభిప్రాయం గులాబి వర్గాల్లో ఏర్పడింది. మొన్నటి ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా బాధ్యతలు చూసిన ఓ పెద్దమనిషి పాత్ర ఇందులో ఉందనే అనుమానాలు సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి వెళితే ఎలా స్పందిస్తారో చూడాలి.

ycp mlas facing problems with ys jagan decision

ప్లాన్ అదిరింది.. రాజధాని విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలనే బలి చేసిన జగన్!!

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాలను నిలిపివేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్ లకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ చర్యపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో రైతులకు కౌలు మాత్రం చెల్లించారు. కానీ అక్కడి నుండే అస్సలు స్కెచ్ మొదలైంది. కృష్ణా నదికి వరదలు రాగానే రాజధాని మునిగిపోతోందని ప్రచారాలు చేశారు. 2009 లో 11,75,000 క్యూసెక్కుల వరద ముంచెత్తిన మునగని రాజధాని ప్రాంతం 2019 లో 8,00,000 క్యూసెక్కుల వరదకి ఎలా మునిగిపోతుందని  గట్టిగా ప్రశ్నించారు రైతులు. కరకట్ట దాటి చుక్క నీరు కూడా బయటి పొంగలేదు.  చంద్రబాబు అద్దె ఇంటిలో కూడా నీళ్లు ప్రవేశించలేదు. ఇలా వైసీపీ పెద్దల ప్లాన్ విఫలమవ్వడంతో.. ప్లాన్ బి ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.  రాజధాని అమరావతిలో అవినీతి జరిగినట్టు అధికార పక్ష మంత్రులు గొడవ చేశారు. అమరావతి భూములు నిర్మాణాలకు పనికి రావని కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల్లో లక్షలాది మంది ప్రజలు బ్రహ్మాండమైన ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్నారు.కానీ ఇలా అమరావతిపై రభస సృష్టిస్తూనే ఉన్నారు. ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాల్లో  తనంతట తానుగా అమరావతిపై స్వల్ప కాలిక చర్చను లేవదీసింది వైసీపీ. ఇన్ సైడర్ ట్రేడింగ్ పనులను మరోసారి పునరుద్ఘాటించారు వైసీపీ పార్టీ నేతలు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కావాలని అంత బడ్జెట్ తమ వద్ద లేదని మరోరకంగా మొదలు పెట్టారు. దీంతో పాటు ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్య మంత్రి జగన్ రాజధానిని మూడు భాగాలు చేయవచ్చని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఆనాడు సిఎం జగన్ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది. ఆయన కోరుకున్న విధంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. రాజధాని గ్రామంలో ఒక్క రోజు కూడా పర్యటించని జీఎన్ రావు కమిటీ అమరావతిని మార్చాలంటూ నివేదిక ఎలా ఇచ్చిందని రైతులు నిలదీసారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు రాజధాని సమగ్రాభివృద్ధి కోసం నివేదిక ఇవ్వాలని జిఎన్ రావ్ కమిటీ నియమిస్తూ ఇచ్చిన జీవోలు ప్రభుత్వం పేర్కొనగా ఆ కమిటీ అభివృద్ధి అవసరాన్ని మర్చిపోయి ఏకంగా రాజధానిని విడదీయాలని తేల్చేసింది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా దాదాపు ఇదే తరహా నివేదికను ఇచ్చింది. రాష్ట్రంలో ఒక్క రోజు కూడా పర్యటించని బిసిజి కమిటీ కేవలం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తో పాటు అధికారులు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఈ నివేదిక ఇచ్చిందని కొందరు చెబుతున్నారు.  ఈ మొత్తం వ్యవహారాన్ని మొదటి నుండి నిశితంగా గమనిస్తూ వచ్చిన రైతులకి వైసీపీ పన్నుతున్న పన్నాగం అర్థమైపోయింది. దీనికి తుది ఘట్టంగా హైపవర్ కమిటీ నియమించడం సిఫార్సులను ఆమోదించటం.. క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం.. అదేరోజు ( జనవరి 18వ తేదీన ) అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద వ్యవహారాన్ని ఇటు ప్రతిపక్షాలకు గాని చివరకు వైసీపీలోని ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా అధికార పక్ష వ్యూహకర్తలు అమలు చేయడం విడ్డూరంగా మారింది. రాజధాని పరిధిలో ఉన్న గుంటూరు ,కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. రాజధాని మార్పు నిర్ణయం తరువాత ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలను అధినేతకు చెప్పలేక తమను నిలదీస్తున్న ప్రజానీకానికి సరైన సమాధానం చెప్పలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయి సన్నిహిత అనుచరుల వద్ద తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత తమను పిలిచి మాట్లాడడంలో లాభమేంటని గుర్రుగా ఉన్నారు. పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని వైసీపీ ప్రజాప్రతినిధులు నమ్ముతున్నారు. ఈ అంశాన్ని ప్రజలు మనసులో పెట్టుకుంటే మాత్రం తమకు భవిష్యత్తు ఉండదని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా మూడు రాజధానుల ఆటలో ప్రజలనే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా జగన్ పావులుగా మార్చడం విడ్డూరమనే చెప్పుకోవాలి.

Four Nirbhaya Rapists to Be Hanged on January 22 at 7am

నిర్భయ దోషులకు జనవరి 22న ఉరిశిక్ష

దేశమంతటా ఎదురు చూసే తీర్పుకు తెర పడింది. బాధిత కుటుంబ పోరాటం ఫలించింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. ఈ నెల 22 న నిర్భయ దోషులకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు నిర్భయ దోషులకు ఉరిశిక్షకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 22 వ తేదీన ఉదయం ఏడు గంటలకు ఉరి తీయాలని పాటియాలా కోర్ట్ ఆదేశించింది. ఈ తీర్పు కోసం నిర్భయ తల్లిదండ్రులు.. బాధితురాలి తరపున ఉన్నవారందరూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 2012 డిసెంబర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానికంగా జరిగిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో.. సుప్రీంకోర్టులో.. వరుసగా వాదనల తర్వాత వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకరు కోర్టు శిక్ష అనుభవిస్తూ తీహార్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా నలుగురు కూడా దోషులుగా నిర్ధారిస్తూ వారికి ఉరిశిక్షను ఖాయం చేసింది. ఉరిశిక్ష అమలుకు సంబంధించి మరింత ఆలస్యం చేస్తున్నారని నిర్భయ తల్లిదండ్రులు మొదట పాటియాల కోర్టులో తమ పిటీషన్ వేయడం జరిగింది. అందులో జరిగిన రివ్యూ పిటిషన్లలో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని.. అలాగే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును.. పునఃసమీక్షించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు కూడా రివ్యూ పిటిషన్ ని కొట్టిపారేసింది.

ap govt to release funds for amma vadi

అమ్మఒడి పథకం అమలు కొరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులకు గండి!!

అమ్మఒడి పథకంలో అడుగడునా అడ్డంకులు పడుతూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి డబ్బులు లేకపోవడంతో పక్క చూపులు చూస్తోంది. నిధుల సమీకరణకు దారిలేక ఇతర సంక్షేమ శాఖలకు కేటాయించిన నిధులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. అలా వచ్చిన డబ్బులనే అమ్మఒడి పథకం కోసం ఖర్చుపెట్టాలని నిర్ణయించింది. నిధుల మళ్లింపునకు సంభదించి ఒక జీవోను కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై ఆయా సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి. అమ్మఒడి పథకంతో ప్రభుత్వం పై రూ.6455 కోట్ల రూపాయల భారం పడనుంది. అయితే ఇందు కోసం ఇతర సంక్షేమ శాఖలకు కేటాయించిన నిధులను ఖర్చు పెట్టడం వివాదస్పదమవుతోంది. ఇప్పటికే సంక్షేమ శాఖ నుండి రూ.3,432 కోట్లు, కాపు కార్పొరేషన్ నుండి రూ.568 కోట్లను వెనక్కి పంపాలని ప్రభుత్వం కోరింది. అలాగే సాంఘీక సంక్షేమ శాఖ రూ.1271 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖ రూ.442 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖను రూ.395 కోట్లను పంపాల్సిందిగా ఆదేశించింది.  ప్రభుత్వం కోరిన నిధులు ఆయా శాఖలకు కేటాయించిన నిధుల్లో 90 శాతంతో సమానమని శాఖా అధికారులు అంటున్నారు. దాదాపుగా అన్ని శాఖల గల్లా పెట్టెలు ఖాళీ చేసి.. కేవలం 10 శాతం నిధులు మాత్రమే వారి వద్ద మిగిలే అవకాశాలు ఉన్నాయి. అలా చేయడంతో ఆయా శాఖలు చేపట్టే కార్యక్రమాలు అమలు చేయటం అసాధ్యం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు, కుల సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. తమ దగ్గర ఉన్న నిధులన్ని అమ్మఒడి పథకానికి కేటాయిస్తే తమ సంక్షేమం సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇదే విషయమై ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి లోకేష్. జగన్ ప్రభుత్వం మరో యూటర్న్ నిర్ణయాన్ని తీసుకుందని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులను తీసుకుని అందుకు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  

ap cm ys jagan to meet telangana cm kcr

జనవరి 13వ తేదీన కేసీఆర్ ను కలవనున్న ఏపీ సీఎం జగన్

జనవరి 13వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఏపీ రాజధాని పై చర్చ జరుగుతున్న కీలక సమయంలో కేసీఆర్ , జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది.14,15,16 మూడు రోజులు సంక్రాంతి సెలవు రోజులు కావడంతో ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది. ఈ ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు 7 నెలల కాలంలో మూడో సారి సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు తాజాగా రాజధాని తరలింపుకు సంబంధించిన వివాదం,ఎన్నో ఉద్యమాలు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు ఉధృతం ఎగిసిపడుతున్న తరుణంలో ఈ సమావేశం జరగటం పై చర్చలు మొదలయ్యాయి.ముఖ్యంగా విభజన వివాదాలతో పాటు గోదావరి నీటిని కృష్ణాకి అక్కడి నుంచి పెన్నాకు అనుసంధానం పీఠం మీద ఒక బృహత్ పథకాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు గత రెండు సమావేశాలల్లో కూడా చర్చించినట్లు సమాచారం.  రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో సమావేశం అవ్వడమే కాకుండా కంబైన్డ్ మీటింగ్ నిర్వహించుకొని ఇరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశాల సందర్భంగా నీటిని ఏ విధంగా తీసుకురావాలనే అంశంపై ఒక రూట్ మ్యాప్ ను రూపొందించగా తరువాత కొద్ది రోజుల పాటు సమావేశాలు ఆగిపోయాయి. కేంద్రంలో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. రాజధాని తరలింపు పై టీఆర్ఎస్ వైపు నుంచి ఎటువంటి స్పందన అధికారికంగా లేక పోయినప్పటికీ హైదరాబాద్ లో ఉంటే రాజధాని జిల్లాలలోని ఆంధ్రా ప్రజలు రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి సమావేశం జరుగుతుంది..సమావేశం జరుగుతున్న తరుణం లోనే విద్యుత్ ఉద్యోగుల వివాదం తెర పైకి వచ్చింది. తెలంగాణ నుంచి రిలీవైన దాదాపు 900 మంది ఉద్యోగుల్ని ఆంధ్రప్రదేశ్ లో పదవీ బాధ్యత లు స్వీకరించకుండా నిన్న ఏపీ ట్రాన్స్ కో అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు ఈ ఉద్యోగుల్ని చేర్చుకోవడం సాధ్యం కాదని వెల్లడిస్తున్నారు ఏపీ ట్రాన్స్ కో. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ వల్ల ఏం జరగనుందో వేచి చూడాలి.

farmers protest against ycp mla ramakrishna reddy

నిరసన సెగలు.. ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి కారుని ధ్వంసం చేసిన రైతులు

ప్రభుత్వ ఛీవ్ విప్ పిన్నెల్లికి రాజధాని సెగ తగిలింది. చినకాకాని గ్రామం దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నారు రైతులు. ఆయన కారు పై రాళ్లు రువ్వి కారు అద్దాలు ధ్వంసం చేశారు ఆందోళనాకారులు. పిన్నెల్లి కారు ఎదురుగా కూర్చుని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. చినకాకాని దగ్గర పరిస్థితి ఉధృక్తంగా మారుతోంది. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ముందు వెళ్ళే కారును నిలిపి వేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.అందులోనే ఎమ్మెల్యే కారు కూడా నిలిచిపోయింది. తక్కువ వాహనాలు ఉండటంతో ఒక్క సారిగా అక్కడ ఉన్న రైతులంతా కూడా ఆ కారు వద్దకు వచ్చారు.మొదట ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గన్ మెన్ తో అక్కడ ఉన్న రైతులు వాగ్వాదానికి దిగారు.గన్ మెన్ రైతులకు సమాధానం చెప్తున్న సమయంలో ఒక్కసారిగా దాడి జరిగింది. పెద్ద ఎత్తున రాళ్లురువ్వి కర్రలు తీసుకుని అద్దాలు పగలగొట్టారు.మొదటగా కారు వెనుక గ్లాసుల పగలగొట్టిన ఆందోళనకారులు ఆ తరువాత ఎమ్మెల్యే ముందు సీట్లోనే ఉండటాన్ని గమనించి ముందువైపు రాళ్లు విసరి కొట్టడంతో దాదాపుగా ముందుగ్లాసు పగిలిపోయింది. ఎమ్మెల్యే కారును పంపిచే ప్రయత్నమైతే చేశారు డీఎస్పీ సీతారామయ్య.  దాదాపు 4 గంటలకు పైగా రైతులు ఆందోళన చేశారు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హైవేను ఇప్పటి వరకు సర్ధుబాటు చేయలేకపోయారు పోలీసులు.మొత్తం మీద ఆ ప్రాంతం నుంచి వాహనాలను ముందుకు కదిలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే అంటున్నారు అధికారులు.

kalvakuntla kavitha special focus on nizamabad municipal polls

కవిత కొండంత అండ.. నిజామాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్న కవిత

2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా పోటి పడి ఓటమి చవి చూసిన కవిత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో నిజామాబాద్ రాజకీయాల్లో ఆమె మళ్లీ యాక్టివ్ అవ్వనున్నారా అనే అంశంపై టీఆర్ఎస్ పార్టీలో.. రాజకీయ వర్గాల్లో.. చర్చ జరుగుతోంది. గత ఏడాది మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించిన ఆమె మళ్లీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి కవిత అంశమే టీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ జిల్లాలో ఏడు మునిసిపాల్టీలు, ఒక కార్పొరేషన్ లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నిజామాబాద్ కార్పొరేషన్ గెలవడం అధికార టీఆర్ఎస్ పార్టీకి కత్తిమీద సాములా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  ఒక వైపు నిజామాబాద్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ కి బిజెపి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులున్నాయని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ సీటును కోల్పోయినట్లే కార్పొరేషన్ ను కూడా కోల్పోతే భవిష్యత్తులో తమ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్న ఆందోళన గులాబి దళంలో వ్యక్తమవుతోంది. ఆ జిల్లాలో సీనియర్ నేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంతరెడ్డి ఉన్నప్పటికీ మాజీ ఎంపీ కవితను రంగంలోకి దిగితేనే బాగుంటుందనే వాదనను ఆ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు గట్టిగా వినిపిస్తున్నారని సమాచారం. నిజానికి గత ఏడాదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల వరకు నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ కార్యకలపాలను కవిత అన్ని తానే నడిపారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రావడంతో మళ్లీ ఆమె క్రియాశీలకంగా వ్యవహరించాలని నేతలంతా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మున్సిపోల్స్ లో కవిత యాక్టివ్ రోల్ పోషిస్తే క్యాడర్లలో కూడా నూతన ఉత్సాహం ఉంటుందని.. తమకు అండగా కవిత నిలిస్తే కొండంత ధైర్యం వస్తుందని ఆ జిల్లా నేతలు ఆశిస్తున్నారు. అయితే వారితో కల్వకుంట్ల కవిత నిత్యం మాట్లాడుతూనే ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను ఆమె తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం కవితకు ఏ పదవి లేకపోవటం కూడా ఆమెకు ఇబ్బందిగా మారిందని.. అందువల్ల ఆమె ఆ జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వెనకాడుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరి నేతలు కార్యకర్తల అభీష్టం మేరకు మున్సిపల్ ఎన్నికల్లో కవిత ప్రచారం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

High Power Committee to meet at CRDA office in Vijayawada

కమిటీలు నామమాత్రమే.. విశాఖలో మొదలైన అద్దె భవనాల వేట

ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు , బిసిజి కమిటీలు ఇచ్చిన నివేదికల అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తొలిసారిగా సమావేశంకానుంది. కమిటీ సభ్యులైన పది మంది మంత్రులు , ఆరుగురు ఉన్నతాధికారులు ఇవాళ విజయవాడ లోని ఏపీసీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో భేటీ కానున్నారు. సోమవారమే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కమిటీలోని పలువురు మంత్రుల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంతో నేటికి వాయిదా పడింది. గత కొన్నేళ్లుగా రాష్ర్టానికి పూర్తిస్థాయి రాజధానిగా ఉన్న అమరావతిని కానిస్ట్యూషనల్ క్యాపిటల్ గా మాత్రమే ఉంచాలని నిర్ణయించింది. సచివాలయం, సీఎం క్యాంపు ఆఫీస్ తదితరాలను విశాఖపట్నానికి.. హైకోర్టును కర్నూలుకు.. మార్చాల్సిందిగా జీఎన్ రావు , బీసీజీ కమిటీ తమ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి విదితమే. ఆ కమిటీలు నివేదికలను సమర్పించక ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కల రాజధాని ప్రతిపాదనను సాక్షాత్తు శాసనసభలోనే బహిర్గతం చేశారు. అప్పటి నుంచి రాజధాని రైతులు అమరావతి శ్రేయోభిలాషులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  కమిటీలను నియమించక మునుపే సీఎం మూడు ముక్కల రాజధానికి నిర్ణయం తీసుకున్నారని ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపించకుండా ఉండేందుకే ఈ కమిటీల పేరిట తంతు నడిపిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జీఎన్ రావు బీసీజీ కమిటీల నివేదికలపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి తగు సూచనలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు అంతకంతకూ ఉదృతమవుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు ముక్కల రాజధాని వద్దంటూ హై పవర్ కమిటీ ప్రభుత్వానికి సహేతుకమైన సూచనలు ఇవ్వనుందా లేక తూతూ మంత్రంగా రాజధాని వికేంద్రీకరణకే ఓటు వేస్తుందా అనే దానిపై ఈ సమావేశంతో స్పష్టత వచ్చే అవకాశముంది.  మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలను వీలైనంత త్వరగా విశాఖపట్నానికి తరలించేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు జనవరి 20వ తేదీ లోగా అద్దె భవనాలు చూసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ఆయా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం ఏర్పాటుకు విశాఖలోని మిలీనియం టవర్ ను ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసింది. కీలక శాఖలను ముందుగా తరలించి మిగిలిన శాఖలను విడతల వారీగా తరలించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే శాఖాధిపతుల కార్యాలయాల కోసం తీసుకునే భవనాలకు ఎంత అద్దె చెల్లించాలనేది నిర్ణయించలేదు. గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించినపుడు చదరపు అడుగుకు పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అద్దె నిర్ణయించారు. ఇరవై రూపాయలు దాటితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.

అయోమయంలో కమలనాథులు.. అభ్యర్థులను ఖరారు చెయ్యని బీజేపీ 

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ సన్నాహాలు మొదలుపెట్టాయి. అభ్యర్థులకు బి ఫామ్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ బీజేపీ మాత్రం అభ్యర్థులపై ఇప్పటి వరకు ఎటూ తేల్చలేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా అభ్యర్థుల ఎంపికపై పార్టీ నాయకత్వం మౌనంగా ఉండటం పై బీజేపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మజ్లిస్ తో ప్రధాన పోటీ అంటున్న కమలనాథులకు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. అన్ని మున్సిపాలిటీలు వార్ జోన్ లో పోటీ చేస్తామని కమలనాథులు పదేపదే ప్రకటిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీంతో కింది స్థాయి కార్యకర్తలు , ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి నాలుగు స్థానాలను గెలిచి అందరికీ షాకిచ్చింది. దీన్ని ఉపయోగించుకోవాలని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు భావించారు. అయితే అభ్యర్థుల ఖరారులో బిజెపి నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఈ నేతలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ మినహా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్ కింద బిజెపి ఏర్పాటు చేసింది. ఒక్కో క్లస్టర్ కు ఒక్కో నాయకుడిని ఇన్ చార్జిగా నియమించింది. అభ్యర్ధుల ఎంపిక, నామినేషన్, ప్రచారం ,ఎన్నిక నిర్వహణ సహా బాధ్యత అంతా క్లస్టర్ ఇన్ చార్జిదే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు క్లస్టర్ ఇన్ చార్జిలు అసలు పనిని మొదలు పెట్టలేదని తెలుస్తోంది. మరోవైపు క్లస్టర్ ఇన్ చార్జిలకు స్థానిక నాయకత్వం మధ్య సమన్వయం లేదనేది జిల్లాల నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్న సమాచారం. మరోవైపు మజ్లిస్ తోనే తమకు ప్రధాన పోటీ అని స్వయంగా కిషన్ రెడ్డి ప్రకటించారు, అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఇదే అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నే తమ ప్రధాన ప్రత్యర్థి అని కేటీఆర్ చెప్పారు. ఈ తరుణంలో ప్రత్యర్థి మజ్లీస్ అని కమలనాథులు చెప్పడం బీజేపీ కేడర్ ను అయోమయానికి గురి చేసింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెబుతూనే మజ్లిస్ ను తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదనేది బీజేపీ కార్యకర్తల అనుమానంగా ఉంది. మరోవైపు సీఏఏను ఈ ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలన్నది బిజెపి ఆలోచనగా ఉందని అందుకే కిషన్ రెడ్డి మజ్లిస్ ను తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో సీఏఏ అంశం తమకు ఉపయోగపడుతుందని బిజెపి నేతలు లెక్కలేసుకుంటున్నారు.

నిరుద్యోగులకు శుభవార్త.. మడికొండలో ఐటీ పార్కుని ప్రారంభించనున్న కేటీఆర్

చారిత్రక ఓరుగల్లు మహానగరం ఐటీ రంగంలో చరిత్ర సృష్టించబోతోంది. హైదరాబాద్ తరవాత రాష్ట్రంలోనే రెండోవ అతిపెద్ద నగరంగా పేరున్న వరంగల్ సిటీ ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకోనుంది. సాంకేతిక రంగంలో జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలైన నిట్, కిట్స్ వంటి ఇంజనీరింగ్ విద్యాసంస్థలతో పాటు 100 కు పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న ఉద్యోగార్థులకు మంచి భవిష్యత్తు లభించనుంది. మడికొండలోని ఐటీ పార్క్ లో సైన్ టెక్ మహీంద్రా వంటి దిగ్గజ కంపెనీలు తమ క్యాంపస్ లను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేశాయి. ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఈ రెండు క్యాంపస్ లను ప్రారంభించనున్నట్లు ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో భాగంగా ఐటీ రంగ పురోగతికి ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యలో పరివర్తనపై ఏడవ అంతర్జాతీయ సదస్సు అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ క్యాంపస్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పరిశ్రమల అనుభవాన్నే విశ్వ విద్యాలయ బోధనతో అనుసంధానించడం ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టవుతుంది అన్నారు మంత్రి కేటీఆర్.  తెలంగాణా సిద్ధించాక తాము అధికారం చేపట్టే నాటికి ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలు క్షీణించాయని అయితే విద్యార్థుల్లో స్కిల్స్ డెవలప్ కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తమ ప్రభుత్వం తీసుకుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సంస్థను ఏర్పాటు చేశామని ప్రస్తుతం ఈ టాస్క్ గత ఐదేళ్లలో 680 కాలేజీలకు చేరుకుందన్నారు. నేడు వరంగల్ మడికొండలోని ఐటీ పార్క్ కూడా అందుకు వేదిక కానుందన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ విస్తరణకు మడికొండలోని ఐటీ పార్క్ ప్రారంభం కీలకం కానుంది. ఉత్తర, దక్షిణ భారతానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ కు సమీపంలో ఉండడం జాతీయ రహదారికి పక్కనే ఆనుకుని ఉండడంతో పాటు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వరంగల్ ను ఐటి హబ్ గా తీర్చిదిద్దడానికి దోహదపడతాయనే ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమను వరంగల్ నగర శివార్లలో దాదాపు 2000 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్నారు.

అమ్మఒడి పథకంలో సడలింపులు!!

2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సంసిద్ధమవుతుంది. ఈ నెల 9వ తేదీన అమ్మఒడి కార్యక్రమాన్ని చిత్తూరు వేదికగా ప్రారంభించనున్నారు సీఎం జగన్మోహనరెడ్డి. అమ్మఒడి ద్వారా పిల్లలను చదివిస్తున్న 43 లక్షల మంది తల్లులకు రూ.15000 రూపాయల చొప్పున అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో ఒకటి నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లుల్లో అర్హులైన వారందరికీ అమ్మ ఒడి పథకం వర్తించనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.6500 కోట్లు ఖర్చు చేయనుంది. క్యాంపు కార్యాలయంలో అమ్మఒడి పై సీఎం సమీక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పిల్లల్ని చదివించే తల్లులకు ఏడాదికి రూ.15000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే తొలి ఏడాది కావడంతో పథకం వర్తింపు విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. 75 శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుందన్న విషయంలో ఈసారికి మినహాయింపు ఇచ్చారు. అమ్మఒడి పథకంలో అనాధ పిల్లలకు సంబంధించి సగం డబ్బు వారికి ఆశ్రయమిచ్చే అనాథాశ్రమాలకు ఇవ్వాలని మిగిలిన సగం పిల్లల పేరిట ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మార్పు నాణ్యతా ప్రమాణాల పైనా సీఎం చర్చించారు. ఫిబ్రవరి 20 నుంచి పిల్లలకు కొత్త మెనూ ప్రకారం మరింత నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.

కనిపించని కొండా దంపతులు.. భూపాలపల్లిలో కలవరపడుతున్న కార్యకర్తలు!!

కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కొండా మురళి. ఒకప్పుడు కొండా మురళి పేరు చెబితే కాంగ్రెస్ క్యాడర్ కి కొండంత ధైర్యం వచ్చేది. ఎన్నికలు ఏవైనా కొండా మా అండ అంటూ జండాలు పట్టుకొని ధూంధాం చేసేవారు. ఎన్నికల్లో గెలుపు ఓటములకు అతీతులుగా హల్ చల్ చేసే వారు. కానీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆనాటి ఉత్సాహమే కనిపించడం లేదు. భూపాలపల్లి మునిసిపాలిటీ పోరులో అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలుకుబడి ఉన్న స్వతంత్రులు సైతం దూసుకుపోతూండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం డీలా పడిపోయింది. ఒక వైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరోవైపు బిజెపి నేత చందు పట్ల కీర్తి రెడ్డి ఇప్పటికే టౌన్ లో ప్రచారం మొదలుపెట్టారు. బస్తీల్లో జెండాలతో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నడిపించే నాయకుడు లేక నిరుత్సాహంలో మునిగిపోయింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించిన గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుకు భూపాలపల్లి నియోజక వర్గ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మునిసిపాలిటీలో టికెట్లు ఖరారు చేస్తుంటే ఇక్కడ మాత్రం కొండా మురళి పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అంటున్నారు. భూపాలపల్లి మునిసిపాలిటీ ఎన్నికల బాధ్యతలు కూడా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై పడింది. కొండ అందుబాటు లోకి రాకపోవడంతో శ్రీధర్ బాబు జోక్యం చేసుకోవలసి వస్తోంది. అయితే శ్రీధర్ బాబు ప్రభావం భూపాలపల్లిలో ఉండదని క్యాడర్ చెబుతోంది. కొండా మురళి కానీ, సురేఖ కానీ తమ తరపున ప్రచారం చేస్తే గెలిచే అవకాశాలుంటాయని కార్యకర్తలు చెబుతున్నారు. అయితే కొండా దంపతులు మాత్రం భూపాలపల్లి వైపు కన్నెత్తి చూడడం లేదు.