కాళ్లు వాచాయి.. రంగు మారాయి.. కానీ, గాయాలు లేవు.. రఘురామ మెడికల్ రిపోర్ట్

ఎంపీ రఘురామ రాజు రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారింది కానీ, బయటికి గాయాలు కనిపించడం లేదని డాక్టర్లు తమ మెడికల్ రిపోర్టులో తెలిపారు. ఎంపీ రఘురామ రాజుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను హైకోర్టు న్యాయవాదులకు చదివి వినిపించింది. రఘురామ కాళ్లు వాచి ఉన్నాయని, రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారిందని, కానీ బయటికి గాయాలు కనిపించడం లేదని అందులో ఉంది. అవి కొట్టిన దెబ్బ‌ల‌ని చెప్ప‌లేమ‌ని వైద్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.   రఘురామకు గుండె నొప్పి ఉందని ఫిర్యాదు చేశారని, నాలుగున్నర నెలల క్రితం గుండెకు శస్త్రచికిత్స జరిగిందని, వెంటనే కార్డియాలజిస్ట్‌కు పంపామని రిపోర్టులో రాశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, గుండె నిలకడగానే ఉందని వైద్యులు తమ రిపోర్టులో తెలిపారు. నెఫ్రాలజిస్ట్ దగ్గరకు కూడా పంపామని, నార్మల్‌గానే ఉందని వైద్యులు నివేదిక‌లో పొందుప‌రిచారు.  ఎంపీ రఘురామ కృష్ణంరాజు  శరీరంపై ఎటువంటి గాయాలు లేవని హైకోర్టు కు సమర్పించిన నివేదికలో  వైద్య నిపుణులు కమిటీ స్పష్టం చేసింది. రఘు రామ కృష్ణం రాజు ని రమేష్ ఆసుపత్రికి తరలించాలనే హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్ ఆసుపత్రిలో పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ర‌ఘురామ‌ను ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు తీసుకెళితే.. టీడీపీ పార్టీ ఆఫీసుకు పంపిన‌ట్టేన‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ వాద‌న‌ను హైకోర్టు విభేదించింది.  హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 12లోగా మెడిక‌ల్ రిపోర్ట్ ఎందుకు కోర్టుకు నివేదించ‌లేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. ఎంపీ ర‌ఘు రామకృష్ణ రాజును త‌క్ష‌ణ‌మే ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు పంపించాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎంపీ ర‌ఘురామ కేసులో వైద్య బృందం నివేదిక జిల్లా కోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు చేరింది. జీజీహెచ్‌తో పాటు ర‌మేశ్ ఆసుప‌త్రిలోనూ ప‌రీక్ష‌లు చేయాల‌న్న కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వాదించారు.  క‌స్ట‌డీలో ఉండ‌గా సీఐడీ అధికారి పిటిష‌న‌ర్‌ను క‌లిశార‌ని, ఇలా క‌ల‌వ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టు సీఐడీ కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేశారు? రఘురామను ఎందుకు జైలుకు తరలించారు? అని ప్ర‌శ్నించారు.   గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలను యధాతధంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు, cid కోర్టు ఆదేశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అదనపు అడ్వకేట్ జనరల్  వాదించడాన్ని తప్పుపట్టారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు త‌ర‌ఫు న్యాయవాది ఆదినారాయణ.. తన క్లయింట్ ప్రాణాలకు హాని తలపెట్టే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు పంపించాలని కోర్టును కోరారు. అలాంటిది ఏదైనా జరిగితే తనను షూట్ చేయవచ్చునని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు. ఇప్ప‌టికే రిమాండ్ విధిస్తూ జ‌డ్జి ఉత్త‌ర్వులు జారీ చేశార‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది వాదించారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు ఎంపీని వెంట‌నే జైలు నుంచి ర‌మేశ్ ఆసుప‌త్రికి పంపాల‌ని ఆదేశించారు. 

ర‌ఘురామ‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించండి.. హైకోర్టు ఆదేశాలు..

ఎంపీ ర‌ఘు రామకృష్ణ రాజును త‌క్ష‌ణ‌మే ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు పంపించాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎంపీ ర‌ఘురామ కేసులో వైద్య బృందం నివేదిక జిల్లా కోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు చేరింది. జీజీహెచ్‌తో పాటు ర‌మేశ్ ఆసుప‌త్రిలోనూ ప‌రీక్ష‌లు చేయాల‌న్న కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వాదించారు.  క‌స్ట‌డీలో ఉండ‌గా సీఐడీ అధికారి పిటిష‌న‌ర్‌ను క‌లిశార‌ని, ఇలా క‌ల‌వ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టు సీఐడీ కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేశారు? రఘురామను ఎందుకు జైలుకు తరలించారు? అని ప్ర‌శ్నించారు.   గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలను యధాతధంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు, cid కోర్టు ఆదేశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అదనపు అడ్వకేట్ జనరల్  వాదించడాన్ని తప్పుపట్టారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు త‌ర‌ఫు న్యాయవాది ఆదినారాయణ.. తన క్లయింట్ ప్రాణాలకు హాని తలపెట్టే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు పంపించాలని కోర్టును కోరారు. అలాంటిది ఏదైనా జరిగితే తనను షూట్ చేయవచ్చునని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు. ఇప్ప‌టికే రిమాండ్ విధిస్తూ జ‌డ్జి ఉత్త‌ర్వులు జారీ చేశార‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది వాదించారు.  ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు ఎంపీని వెంట‌నే జైలు నుంచి ర‌మేశ్ ఆసుప‌త్రికి పంపాల‌ని ఆదేశించారు. 

కొవాగ్జిన్‌.. కొత్త వేరియంట్‌ల‌పైనా ఎఫెక్ట్‌..

కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా కొత్త రకాలపై పనిచేస్తోందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. భారత్‌లో విజృంభిస్తున్న బి.1.617తో పాటు బ్రిటన్‌లో రకం బి.1.1.7 వైరస్‌నూ కొవాగ్జిన్‌ టీకా తటస్థీకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన పత్రాన్ని భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.   వ్యాక్సిన్‌ వేరియంట్‌ D614Gతో పోలిస్తే బి.1.617 రకాన్ని తటస్థీకరించడంతో కొవాగ్జిన్‌ చెప్పుకోదగిన రీతిలో తగ్గిస్తున్నప్పటికీ.. అంచనా వేసిన దానికంటే ఎక్కువ రక్షణ కల్పిస్తుందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఇక వ్యాక్సిన్‌ వేరియంట్‌, బ్రిటన్‌ రకం బి.1.1.7 వైరస్‌లను తటస్థీకరించడంలో కొవాగ్జిన్‌ ఒకే విధంగా పనిచేస్తుందని తెలిపింది. ఐసీఎంఆర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో జరిపిన అధ్యయనంలో ఈ ఫలితాలు కనిపించాయని భారత్‌ బయోటెక్ తెలిపింది. కొవాగ్జిన్‌ టీకాను భారత్‌లో ఇప్పటివరకు 18 రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.   భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాగా ఇప్పటివరకు 18 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించారు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ భారత్‌లోనే తయారవుతుండగా తాజాగా అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ జులై నుంచి భారత్‌లో ఉత్పత్తి కానుంది. ఇక కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాలపై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు పనిచేస్తున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. 

భార‌తిని సీఎం చేయాలి.. ఏపీలో డిక్టేట‌ర్ షిప్..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు రాష్ట్రంలో ప్రతి ఊరు తిరిగి ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి.. కనీసం ఆ ప్రాంతాల ఎమ్మెల్యేల దగ్గర నుంచి అయినా సమాచారం తీసుకోవాలి.. ప్ర‌తిపక్షంలో ఉన్నవారిని మాట్లాడనివ్వరు.. కలవడానికి సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు.. ఇదొక వింత ప్రభుత్వం.. వింతైన ముఖ్యమంత్రి.. సీఎం ప‌ద‌వికి జ‌గ‌న్ రాజీనామా చేసి ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తికి బాధ్య‌త‌లు అప్ప‌గించాలి.. అప్పుడైనా రాష్ట్రాంలో కొంత మార్పు వ‌స్తుందేమో చూద్దాం.. క‌నీసం ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల ఆర్త‌నాదాల‌ను జ‌గ‌న్ అర్థం చేసుకోవాలి.. అంటూ బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చేసిన దాడి వాస్తవమేనని నివేదిక వస్తే.. దాని అర్థం వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా నోరు విప్పితే బొక్కలో వేసి, నాలుగు ఉతికి పంపిస్తామని చెప్పడానికి చేసిన ప్రక్రియని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. సొంతపార్టీలో ఉన్నవాళ్లకే ఇలా చేస్తే, ఇక ప్రతిపక్ష నేతల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో కక్ష్య సాధింపులు పెరుగిపోయాయని మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబుపై నంద్యాలలో ఆయన చేసిన వ్యాఖ్యాలు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం కాదా? అని ప్రశ్నించారు. దానికంటే రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఎక్కువా? అని నిలదీశారు. ఒక డిక్టేటర్ షిప్‌గా రాష్ట్రంలో పాలన జరుగుతోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయించడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఏం మాట్లాడారో తెలియదా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు.   

రాత్రికి నా భర్తను చంపాలని చూస్తున్నారు..

హత్యలు చేసేవారు రోడ్లపై తిరుగుతున్నారు.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వాళ్లని జైల్లో పెడతారా? ఏపీలో అసలేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదంటూ ఎంపీ ర‌ఘురామ స‌తీమ‌ణి ర‌మాదేవి తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసులు తన భర్తను బాగా కొట్టారని చెప్పారు. కోర్టు నిబంధనలు పట్టించుకోరా? అని ఆమె ప్రశ్నించారు. రమేశ్ ఆస్పత్రికి తరలించాలని కోరితే..  పట్టించుకోలేద‌ని వాపోయారు. ఈ రోజు రాత్రి తన భర్తను చంపాలని చూస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోపణలు చేశారు ర‌మాదేవి.  ఇప్ప‌టికే, న‌ర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  ర‌ఘురామ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సరైన వైద్యం అందించాలని కోర్టు సూచించింది. మొద‌ట జీజీహెచ్‌, ఆ త‌ర్వాత ర‌మేశ్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌కు చికిత్స అందించాల‌ని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రఘురామను జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై జిల్లా కోర్టుకు మెడికల్‌ బోర్డు నివేదిక ఇవ్వనుంది.   

జైలుకు ర‌ఘురామ‌.. కోర్టు ఆదేశాలు బేఖాతరు?

న‌ర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  ర‌ఘురామ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సరైన వైద్యం అందించాలని కోర్టు సూచించింది. మొద‌ట జీజీహెచ్‌, ఆ త‌ర్వాత ర‌మేశ్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌కు చికిత్స అందించాల‌ని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రఘురామను జైలుకు తరలించారు పోలీసులు.   మరోవైపు రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై జిల్లా కోర్టుకు మెడికల్‌ బోర్డు నివేదిక ఇవ్వనుంది. జీజీహెచ్‌లో ఎంపీకి వైద్య పరీక్షలు పూర్తిచేసిన మెడికల్‌ బోర్డు.. కోర్టుకు సమర్పించే నివేదికను సిద్ధం చేసింది. కోర్టు ఆదేశాలతో రఘురామ గాయాలపై గత రాత్రి నుంచి పరీక్షలు కొనసాగాయి. అనంతరం నివేదికను తయారు చేసేందుకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి నేతృత్వంలో మెడికల్‌ బోర్డు ఏర్పాటైంది. బోర్డు సభ్యులుగా జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ నరసింహం, ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, జనరల్‌ సర్జన్‌ సుబ్బారావు ఉన్నారు. ఉదయం 10.30 గంటలకే జిల్లా కోర్టుకు.. మధ్యాహ్నం 12 గంటల్లోపు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు మెడికల్‌ బోర్డు నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. పరీక్షలు ముగియకపోవపడంతో జాప్యం జరిగింది. పరీక్షల జాప్యంపై రఘురామ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.  

పోలీసులతో ఎంపీ రేవంత్ రెడ్డి వార్ 

లాక్ డౌన్ సమయంలో ఏపీ రేవంత్ రెడ్డి రోడ్డుపైకి రావడం రచ్చగా మారింది. గాంధీ ఆసుపత్రి దగ్గర రోగుల బంధువులకు భోజనాలు పెట్టడానికి వెళుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌లో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి లేద‌ని చెప్పారు. అయితే తాను పేదలకు సహాయం చేసేందుకు వెళుతున్నాన‌ని పోలీసుల‌కు రేవంత్ రెడ్డి తెలిపారు. అయిన‌ప్ప‌టికీ, లాక్‌డౌన్ స‌మ‌యంలో తిరిగేందుకు అనుమ‌తి లేదంటూ పోలీసులు వాదించారు. తాను సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటే త‌న బండిని రోడ్డు మీదే ఆపేయ‌డ‌మేంట‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు.తనను అడ్డుకున్న పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. పోలీసు ఉన్న‌తాధికారుల‌తో రేవంత్ రెడ్డి ఫోన్ లా మాట్లాడారు. ఓ ఎంపీగా నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి వెళుతుంటే ఇలా అడ్డుకోవడం ఏంటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ‘‘నేను లోకల్ ఎంపీని.. నన్ను ఆపమని చెప్పిందెవడు? మీకు ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పండి. ఆ కాగితాలు చూపండి. మెలకువలోనే ఉండి మాట్లాడుతున్నారా? ఈ ప్రభుత్వానికి బుర్ర ఉండే మాట్లాడుతుందా... నేను ఇక్కడి ఎంపీని. మీ ఆంక్షలు గాంధీ ఆసుపత్రి దగ్గర పెట్టుకోండి. బేగం పేటలో కాదు. నేను గాంధీ, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నాను. నన్ను ఆపమని చెప్పిందెవరు? నేను సామాన్య పౌరుడిని కాదు. స్థానిక ఎంపీని. మీరెందుకు వచ్చారు రోడ్డు మీదకి? మీలాగే నేను కూడా రోడ్డు మీదకు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారు’’ అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.  గాంధీ ఆసుపత్రి దగ్గర రోగుల బంధువులకు నిత్యం వెయ్యి మందికి అన్నదానం చేసే కార్యక్రమాన్ని శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో రోజు ఈ కార్యక్రమాన్ని గాంధీతో పాటు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా చేపట్టాలని ఎంపీ భావించారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ రేవంత్‌ను బేగంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ వాహనాన్ని చుట్టుముట్టి ముందుకు కదలనీయలేదు. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. 

తెలంగాణకు 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు

కొవిడ్ రోగులకు ప్రస్తుతం ఆక్సిజన్ అందించడమే పెద్ద సమస్యగా మారింది. ఆక్సిజన్ సకాలంలో అందక దేశంలో చాలా మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ కోసం ప్రభుత్వాలు శ్రమిస్తున్న సమయంలో తెలంగాణకు కొంత ఊరత లభించింది. చైనా నుంచి కార్గో విమానంలో తెలంగాణ‌ రాష్ట్రానికి 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు అందాయి.  చైనా నుంచి ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు దిగుమ‌తి చేసిన గ్రీన్ కో సంస్థ ప్ర‌తినిధులు.. వాటిని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అందించారు. దీంతో గ్రీన్ కో సంస్థ‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. కరోనా కట్టడి, చికిత్స విషయంలో తెలంగాణ‌లో నిధుల కొర‌త లేదని కేటీఆర్ తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల క‌రోనా రోగుల‌కు కూడా తెలంగాణ‌లో చికిత్స అందుతోంద‌ని ఆయ‌న చెప్పారు. ఔష‌ధాలు, ఆక్సిజ‌న్, ఇత‌ర వైద్య ప‌రికరాలు అందించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరామ‌ని తెలిపారు. కేంద్ర స‌ర్కారు సానుకూలంగా స్పందించిందని కేటీఆర్ వివ‌రించారు.

మోడీ ఇమేజ్ డ్యామేజ్ చేసిన కొవిడ్ 

కొవిడ్ 19 సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. విమర్శలు ఎదుర్కుంటోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ఇమేజ్ జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగానూ మసక బారింది.రాజకీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో, బీజేపీ/ఎన్డీఎ కూటమి పోగొట్టుకున్నది ఏదీ లేక పోయినా, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో జరిగిన గ్రామీణ స్థానిక ఎన్నికల్లో, కరోనా దెబ్బ పడింది. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పరిధిలో సైతం బీజీపీ ఓటమి చవి చూసింది.  దేశంలో కరోనా సృష్టించిన భయంకర వాతావరణం ఎన్నికల ఫలితాలతో పాటుగా సాధారణ ప్రజల్లో సైతం కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచింది.ఒకప్పుడు బీజేపీనీ, మోడీని నెత్తిన పెట్టుకున్న అభిమానులు సైతం,మోడీ రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్’తో గొంతు కలుపుతున్నారు. చివరకు అనుపంఖేర్ వంటి మోడీ హార్డ్ కోర్ సపోర్టర్ కూడా, ఎక్కడో ఏది తప్పు జరిగింది, ఆ తప్పును తక్షణం సరిదిద్దుకోవాలి అని అన్నారు. నిజానికి ఒక్క అనుపం ఖేర్ మాత్రమే కాదు, బీజేపే కార్యకర్తలు,అభిమానులను కూడా సెకండ్ వేవ్ కట్టడి విషయంలో మోడీ,మోడీల వ్యవహరించలేదని అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు.  ఇటు బీజేపీ, అటు సంఘ్ పరివార్, డ్యామేజి కంట్రోల్, నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. శనివారం  క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దేశంలో పరిస్థితిని సమీక్షించారు. ఇంతకూ ముందు కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో, అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే శనివారం శనివారం నిర్వహించిన సమావేశంలో ప్రధాన మంత్రి గతానికి కొంత భిన్నంగా మాట్లాడారు. సమస్యల పట్ల కొంత భిన్నంగా స్పందించారు.  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ తొలిసారిగా, దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్తితులతో పాటుగా , కొవిడ్ రాజకీయలు, స్వయం సేవకుల కర్తవ్యం సహా అనేక సంబందిత విషయాల గురించి సమగ్రంగా చర్చించారు.సంఘ్ పరివార్ సంస్థలు ఏర్పాటు చేసిన, ‘కొవిడ్ రెస్పాన్స్ టీమ్’ అధ్వర్యంలో  ‘పాజిటివ్ అన్ లిమిటెడ్’  పేరిట ప్రారంభమైన ఉపన్యాస పరం పరలో మోహన్ భగవత్’ తొలి ఉపన్యాసం చేశారు.  ప్రస్తుత సంక్షోభానికి, ప్రభుత్వాలు,పాలకులు,ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు అందరికి అందరం, బాధ్యులమే అన్నారు. కరోనా తొలి వేవ్ సర్దుకున్న తర్వాత, అందరికి అందరం, కరోనాను నిర్లక్ష్యం చేశామని, ఫలితంగానే ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని,అన్నారు. అయితే అదే సమయంలో భగవత్, ఉపన్యాస నిర్వాహకులు, కోరిన విధంగా  ‘పాజిటివిటీ’ గురించి   మాట్లాడడం కష్టమని, అనేక కుటుంబాలు ఆప్తులను, కుటుంబ పోషకులను  కోల్పోయి దిక్కు తోచని స్థితిలో, తీవ్ర విషాదంలో ఉన్నప్పుడు సానుకూల ఉపన్యాసం చేయడం కష్టమని  అన్నారు. వాస్తవ పరిస్థితి నుంచి తప్పించుకోలేమని,అన్నారు.  ప్రతి విషయాన్ని వ్యతిరేక, నిరాకరణ ధోరణితో చూడడం కూడా తగదని అన్నారు. అసలు ఎమీ జరగలేదనీ అనలేము. పరిస్థితి భయంకరంగా, విషాద భరితంగా వుంది. ప్రజల హృదయాలలో నిరాశ, నిస్పృహ అలుముకున్నాయి. వాస్తవ పరిస్థితిని అంగీకరిస్తూనే మనం మన మనసులలో,ఆలోచనలో నిరాకరణ (నెగటివ్) ధోరణికి చోటివ్వరాదని అన్నారు. మనం మన శరీరాలను కరోనా నెగిటివ్’గా ఉంచుకోవాలి, మనసులో  మాత్రం కరోనాపై విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని, సానుకూల దృక్పధాన్ని నిలుపోకోవాలని సూచించారు. అలాగే దేశం అంతా ఒక టీమ్’గా పనిచేయాలని , సెకండ్ వేవ్ విషయంలో చేసిన తప్పును వస్తుందని అంటున్న థర్డ్ వేవ్ విషయంలో చేయరాదని హెచ్చరించారు. అయితే, మనం థర్డ్ వేవ్ గురించి భయపడవలసిన అవసరం లేదని,కొవిడ్ 19 పై సాగించే పోరాటంలో స్థిరత్వం ఉండాలని  అన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ, మోహన్ భగవత్’ ఉపన్యాసాని పుబ్లిసిటీ స్టంట్ గా కొట్టివేసింది. రోజువారీ ప్రాతిపదికిన ప్రధానమంత్రి నరేంద్ర మోడిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రాహుల్ గాంధీ అయితే, బీజేపీ, సంఘ్ పరివార్. వారికి పరజల కష్టాలు,బాధలు అర్థం కావని అన్నారు.  కొవిడ్ సెకండ్ వేవ్ విషయంలో ప్రతిపక్షాల నుంచే కాకుండా, స్వపక్షం నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొంత ఉరట, ఉపసమనం కలిపించెందుకు ఆర్ఎస్ఎస్ రంగప్రవేశం చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మరి ఆరేడు నెలలలో 2022 సంవత్సరం ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచికుని సంఘ్ పరివార్  నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిందని అనుకోవచ్చును.

ఎండ‌ల్లో హాయ్ హాయ్‌.. వాన‌ల‌తో జాయ్ జాయ్‌..

మొన్న‌టి దాకా ఫుల్ ఎండ‌. హాట్ హాట్ స‌మ్మ‌ర్‌. రెండు రోజుల నుంచి కూల్ కూల్‌. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వ‌ర్షాలు. వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చల్ల‌బ‌డింది. చెదురుమొదురు వాన‌లు, చ‌ల్ల‌టి గాలుల‌తో జ‌న‌మంతా సేద తీరుతున్నారు. ఎండ‌ల్లో హాయ్ హాయ్ అంటూ.. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉంటూ.. వెద‌ర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  ఇలా ఎండ‌ల్లో వాన‌ల‌కు తౌక్తా తుఫానే కార‌ణం. ఎక్క‌డో గోవా తీరంలో పొంచి ఉండి.. మ‌రో రెండు రోజుల త‌ర్వాత గుజ‌రాత్ తీరాన్ని దాట‌నున్న తుఫాను వ‌ల్లే.. ఇలా మండే ఎండాకాలం.. స‌డెన్‌గా చ‌ల్ల‌టి వానాకాలంగా మారిపోయింది. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌.. ఇలా తెలంగాణ‌, ఏపీలో అనేక చోట్ల చిన్న‌పాటి వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది.  తెలంగాణలో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. యానాం, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.  అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం తౌక్తా తుపాన్‌గా మారింది. ఈ నెల‌ 18న గుజరాత్ ద‌గ్గ‌ర‌ తౌక్తా తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలపై తుపాన్ అధిక ప్రభావం చూపనుంది. ప్ర‌ధానంగా ఈ 5 రాష్ట్రాల‌పైనే తుఫాను తీవ్ర‌త క‌నిపిస్తున్నా.. తెలుగు రాష్ట్రాల‌పైనా ఎంతోకొంత ప్ర‌భావం చూప‌నుంది. ఈ తుఫాను కార‌ణంగా ఇప్ప‌టికే వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డి, వాన‌లు కురుస్తున్నాయి. అయితే, వాన‌లు పెరిగితే మాత్రం రైత‌న్న‌ల‌కు న‌ష్టం త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఇప్ప‌టికే గాలులు, వాన‌ల వ‌ల్ల మామిడి రైతులు న‌ష్ట‌పోతున్నారు. వ‌ర్షాలు ఇంకా ఎక్కువైతే.. వివిధ పంట‌ల‌కు, మార్కెట్లో అమ్మ‌కాల‌కు తీవ్ర న‌ష్టం త‌ప్ప‌క‌పోవ‌చ్చు. 

బ్లాక్ ఫంగ‌స్‌.. క‌రోనా కంటే డేంజ‌ర్‌.. తెలుగు స్టేట్స్‌ అల‌ర్ట్‌..

బ్లాక్ ఫంగ‌స్‌. ప‌ది రోజులుగా మారుమోగుతున్న పేరు. క‌రోనా కంటే ఇప్పుడిదే య‌మ డేంజ‌ర్‌గా క‌నిపిస్తోంది. క‌రోనా సోకినా.. ఎలాగోలా బ‌తికి బ‌య‌ట‌ప‌డొచ్చేమో కానీ.. బ్లాక్ ఫంగ‌స్ అటాక్ చేస్తే.. ఇక అంతే. క‌రోనా కంటే వేగంగా ప్రాణాలు తీస్తోంది. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే.. వెంట‌నే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయ‌క‌పోతే.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే రోగిని క‌బ‌లించి వేస్తోంది.   బ్లాక్ ఫంగ‌స్ ఎవ‌రికి, ఎలా, ఎందుకు సోకుతుంది? క‌రోనా వ‌చ్చి త‌గ్గిపోయిన వారిపైనే బ్లాక్ ఫంగ‌స్ ప్ర‌భావం క‌నిపిస్తోంది. కొవిడ్‌ చికిత్స‌లో స్టెరాయిడ్స్ వాడిన వారు, రోగ‌ నిరోధక శక్తి తక్కువ‌గా ఉన్న వారు.. డ‌యాబెటిస్ పేషెంట్టు.. ICUలో ఎక్కువ కాలం ఉండే వారు.. బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డుతున్నారు. ఆక్సిజన్‌ అందించేప్పుడు స్టెరైల్‌ నీటికి బదులు తేమ అందించే పరికరం ద్వారా అందించడం బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. హ్యుమిడిఫయర్లేలో స్టెరైల్‌ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నవారు సాధారణ నీటినే వాడుతుండ‌టం బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తికి కార‌ణం.  బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలు ఏంటి? కళ్లు ఎర్ర‌బార‌టం, ముక్కు చుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటే.. నాలికపై నల్లటి మచ్చలు ఏర్ప‌డితే.. అది బ్లాక్ ఫంగ‌స్ కావొచ్చు. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. ఇది పాత ఇన్ఫెక్షనే అయినప్పటికీ.. ప్రస్తుత కొవిడ్ కాలంలో మ‌ళ్లీ కొత్త‌గా విజృంభిస్తోంది. అంటువ్యాధి కాకపోయినా.. ఇది వచ్చిన వారికి 24 గంటల్లో ట్రీట్‌మెంట్ అందించకపోతే.. ప‌రిస్థితి చేజారిపోతోంది.  ఇండియాలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500లపైనే ఈ కేసులు ఉన్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తం అవుతున్నాయి. మొద‌ట్లో ఉత్త‌రాది రాష్ట్రాల్లోనే బ్లాక్ ఫంగ‌స్ కేసులు క‌నిపించ‌గా.. తాజాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ దీని ఆన‌వాళ్లు మొద‌ల‌వ‌డంతో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి.  ఏపీని బ్లాక్ పంగస్ భయపెడుతోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా ప‌లువురు మరణించండం కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు.. కొవిడ్‌ చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆ త‌ర్వాత‌ వారిలో బ్లాక్ ఫంగస్‌ లక్షణాలు క‌నిపించ‌డంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. ఆ యువకుడు, వృద్ధుడు మృతి చెందిన‌ట్టు సమాచారం.  శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ ప్రైవేట్‌ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బ్లాక్ ఫంగ‌స్‌ బారిన పడిన‌ట్టు తెలుస్తోంది.  నరసన్నపేట మండలం దాసరివానిపేట గ్రామానికి రామకృష్ణకు ఏప్రిల్ 3న కొవిడ్ నిర్దారణ అయ్యింది. ఆ వెంటనే ఆయనకు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో వారం రోజులు చికిత్స చేస్తే కోలుకున్నారు. గత నెల 14న డిశ్చార్జ్‌ అయ్యారు. తరువాత కొద్ది రోజులకు బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. అటు.. బ్లాక్ ఫంగ‌స్‌పై తెలంగాణ స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మైంది. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ కేంద్రం ఏర్పాటు చేసింది. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగస్ కేసుల నోడల్ కేంద్రంగా అధికారులు ప్రకటించారు. బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డుతున్న వారిలో ఈఎన్‌టీ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయని తెలిపింది. బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స అందించనున్నట్టు తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న బ్లాక్ ఫంగస్ బాధితులకు కోఠిలోని ఈఎన్‌టీలో చికిత్స అందిస్తామని చెప్పింది.  బ్లాక్ ఫంగ‌స్ క‌రోనా కంటే వేగంగా, మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మార‌డంతో.. ఏమాత్రం అనుమానం ఉన్నా, బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించినా.. వెంట‌నే హాస్పిట‌ల్‌లో చేర‌డం అత్య‌వ‌స‌రం అని వైద్యులు సూచిస్తున్నారు. 

ఏపీలో ఉన్నామా.. పాకిస్థాన్ లోనా? కరోనా కల్లోలంలో అరాచకాలా? 

నర్సాపురం  ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఎంపీని అరెస్టు చేసిన తీరుపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తాజాగా  బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో  పరిస్థితులను చూస్తుంటే భారత్ లోని ఏపీలో ఉన్నామా? లేదా ఏ పాకిస్థాన్ లోనో లేదంటే ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. కరోనా కల్లోల సమయంలో ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. గతంలో వాట్సాప్ మెసేజ్ పెట్టారన్న కారణంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్నేహితుడిని కర్నూలుకు తీసుకెళ్లారని, అక్కడ కరోనా అంటించి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత అదే కరోనాతో ఆయన చనిపోయారని విష్ణు కుమార్ రాజు గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలు భయాందోళనల మధ్య బతకకూడదనుకుంటే శని, ఆదివారాల్లోనూ కోర్టులను తెరిచి ఉంచాలని విష్ణు కుమార్ రాజు అన్నారు. దీనిపై సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. శని, ఆదివారాల్లో కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని ఆలోచించే.. కరెక్ట్ గా శుక్రవారం సాయంత్రమే ప్రభుత్వం అరెస్టులు చేస్తూ కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత ఆత్యయిక పరిస్థితి ఉందని.. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారని  విష్ణు కుమార్ రాజు విమర్శించారు. వాస్తవాలు బయటకు రాకుండా మీడియాపైనా సర్కార్ బెదిరింపులకు దిగుతోందన్నారు.  రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన తరువాత ఐదుగురు వ్యక్తులు ముసుగులు వేసుకుని కాళ్లపై లాఠీలతో కొట్టారని ఆరోపించారు. .ఓ ఎంపీని కొట్టడం, భౌతిక దాడులు చేయడమంటే మొత్తం పార్లమెంట్ పై దాడి చేయడమేనని విష్ణు కుమార్ రాజు  అన్నారు. ఓ ఎంపీకే ఇలా జరిగితే మరి సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై రిపోర్ట్ ఇస్తున్నది ఏపీ వైద్యులేనని, కాబట్టి రిపోర్ట్ ను వారు ఎంత వరకు కరెక్ట్ గా ఇస్తారన్న దానిపై అనుమానాలున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని ఎయిమ్స్ లేదా రిమ్స్ ఆసుపత్రుల్లోని డాక్టర్లతో రఘురామకు పరీక్షలు చేయించాలని, వారితో రిపోర్ట్ ఇప్పిస్తే కరెక్ట్ గా ఉంటుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు,  ప్రభుత్వం చేసే అరాచకాలపైన మాట్లాడితే దేశ ద్రోహమవుతుందా? అని విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎన్నెన్ని మాటలన్నారో అందరికీ తెలుసని గుర్తు చేశారు. నడిరోడ్డుపై చంద్రబాబును కాల్చి చంపినా తప్పులేదని ఒకప్పుడు నంద్యాలలో జగన్ కామెంట్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు ఈ సెక్షన్లన్నీ ఏమైపోయాయని మండిపడ్డారు. మరి అప్పుడు సీబీసీఐడీ సుమోటోగా ఎందుకు స్పందించలేదని బీజేపీ నేత ప్రశ్నించారు.

క‌రోనా విధుల్లో 8 నెలల గర్భిణి.. మగువా నీకు వందనం..

ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో బ‌య‌ట‌కి రావాలంటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. మామూలు వ్య‌క్తులే గ‌డ‌ప దాటాలంటే హ‌డలిపోతున్నారు. అలాంటిది 8 నెల‌ల గ‌ర్బిణి.. ఎలాంటి బెరుకూ లేకుండా విధుల‌కు హాజ‌ర‌వుతున్నారు. అందులోనూ.. నిత్యం జ‌నాల‌తో ప్ర‌త్య‌క్ష‌ సంబంధం ఉండే వైద్య విధుల్లో పాల్గొంటున్నారు. అందులోనూ, క‌రోనా టెస్టులు, వ్యాక్సినేష‌న్ డ్యూటీ చేస్తూ.. ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.  ఆమె పేరు అన్న‌పూర్ణ‌. విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, రావాడ రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎ.ఎన్.ఎమ్ గా సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ ఉద‌యమే ఆస్పత్రికి వచ్చి తన విధుల్లో భాగంగా తమ పరిధిలో గల గ్రామాల్లో ఇంటి ఇంటికి వెళ్లి జ్వరాలు, గర్భిణీల వివరాలు సేకరించి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేస్తున్నారు. తరువాత ఆస్పత్రికి వచ్చి అధికారులు త‌నకి అప్ప‌గించిన ప‌ని చేస్తున్నారు.  పీహెచ్‌సీకి వ‌స్తున్న క‌రోనా రోగుల‌కు కూడా ఈమె సేవ‌లందిస్తుంది. ఆమె గ‌ర్భిణి కావ‌టంతో క‌రోనా విధులకు వెళ్లొద్ద‌ని కుటుంబ స‌భ్యులు, వైద్యులు చెప్పినా ప్రజలకు సేవచేయాలనే తపనతో ఆమె విధుల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కాకపోతే ఇంకెప్పుడు ప్రజలకు సేవ చేస్తామని ఆమె అంటున్నారు. త‌గిన‌ జాగ్ర‌త్తలు తీసుకొంటూ సాధార‌ణ రోగుల‌తో పాటు క‌రోనా రోగుల‌కు కూడా సేవ‌లందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.  8 నెలల గర్భిణి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది బెడ్ రెస్ట్ కే పరిమితం అవుతారు. ఈ సమయంలో విశ్రాంతి చాలా అవసరం. అయినా.. అన్న‌పూర్ణ అవేమీ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆమె ఉన్న పరిస్థితిలో సెలవులు తీసుకోవచ్చు. అయినా కరోనా కష్ట సమయంలో సేవ చేసేందుకే ఆమె నిర్ణయించుకున్నారు. మరి కొన్నిరోజుల్లో అమ్మ కాబోతున్నా.. త‌న వృత్తిలో క‌రోనా ప్ర‌మాదం పొంచి ఉన్నా.. ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అధైర్యాన్ని దరిచేరనీయకుండా త‌న క‌ర్తవ్యాన్ని నిర్వ‌ర్తిస్తోంది. క‌రోనాలాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో కూడా సేవ‌లందిస్తూ, విధులకు హాజరవుతూ అటు అధికారులు, ప్రజలు నుండి ప్ర‌శంస‌లు అందుకుంటోంది ఆ కాబోయే అమ్మ..

ఏపీలో పాజిటివిటీ రేటు ఆందోళనకరం..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు కొత్త కేసులు,మరణాలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా పెరిగిపోతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. కరోనా కేసులు తీవ్రస్థాయిలో ఉన్న ఏపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని కొవిడ్ పరిస్థితులపై మంత్రి..  వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో వారం వృద్ధిరేటు అత్యధికంగా 30 శాతం ఉందని పేర్కొన్నారు. విశాఖపట్టణం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు.కొవిడ్‌ను కట్టడి చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. కట్టడికి కఠినంగా వ్యవహరించాలి. బెడ్లు, ఆక్సిజన్‌, ఐసీయూ, ఔషధాలు అందుబాటులో ఉంచాలి. ప్రాణనష్టం నియంత్రణే లక్ష్యంగా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి’ అని ఏపీ సర్కారుకు ఆయన సూచించారు.  కేంద్రం పంపిస్తున్న వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో కరోనా పరిస్థితులపై సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఇద్దరు, ముగ్గురు సభ్యులతో అధికారుల బృందాన్ని నియమించుకోవాలని సూచించారు.  జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్ సుజీత్ కె.సింగ్ మాట్లాడుతూ.. సమీప గ్రామాల నుంచి కొవిడ్ రోగులను పట్టణాలకు తరలించే అవకాశం ఉండడంతో పట్టణాల్లోని ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలని సూచించారు. ఇప్పటి వరకు 18 కోట్ల డోసుల టీకాలను ప్రజలకు అందించామని, జులై చివరి నాటికి మరో 33.6 కోట్ల డోసులు అందిస్తామన్నారు.స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతి ఇచ్చామని, ఆగస్టు-డిసెంబరు మధ్య మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. జైడస్ క్యాడిలా, సీరం ఇనిస్టిట్యూట్ నోవావ్యాక్స్, భారత్ బయోటెక్ నుంచి నాసల్ వ్యాక్సిన్, జెనోవా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అన్నీ కలిపి దాదాపు 216 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 

ఎంపీ రఘరామ రాజును కొట్టిందెవరు? సీఐడీ ఆఫీసులో ఏం జరిగింది? 

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. సీఐడీ ఆఫీసుతో తనను కొట్టారంటూ రఘురామ ఆరోపించడం కలకలం రేపుతోంది. ఆయన కాళ్లకు గాయాలు ఉండటంతో ఆరో మున్సిఫ్‌ మెజిస్ట్రేట్ కోర్టు వైద్య విచారణకు ఆదేశించింది. గుంటూరు జీజీహెచ్ తో పాటు రమేష్ హాస్పిటల్స్ వైద్యులు ఆయనను పరీక్షించారు.  రఘురామ రాజు కాళ్లకు ఉన్న గాయాలపై వైద్యులు ఇచ్చే నివేదిక కీలకంగా మారింది. అయితే రఘురామ రాజు చెప్పినట్లు ఆయనపై దాడి జరిగితే.. ఆయన్ను కొట్టిందెవరు? అంత పెద్ద గాయాలు ఎలా అయ్యాయన్నది తీవ్ర దుమారం రేపుతోంది. తనకు జరిగిన గాయాలపై రఘురామ రాజు  ఫిర్యాదులో చెప్పిన దాని ప్రకారం.. సీఐడీ కస్టడీలో ఉన్నతనను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తన కాళ్లను తాళ్లతో కట్టేసి... అరికాళ్లపై కర్రలు, ఫైబర్‌ లాఠీలతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయాలతో కమిలిపోయి ఉన్న పాదాలను జడ్జికి చూపించారు.  రఘురామ రాజును సీఐడీ పోలీసులుగుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానమైన ఆరో మున్సిఫ్‌ మెజిస్ర్టేటు కోర్టులో హాజరుపరిచారు. రఘురామ రాజు నడవడానికి ఇబ్బంది పడుతూ... కష్టం మీద కోర్టులోకి ప్రవేశించారు. తనను అరెస్టు చేసినప్పటి నుంచి కోర్టు ముందు హాజరుపరిచే వరకు చోటుచేసుకున్న పరిణామాలన్నింటిపైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని కోరారు. అందుకు మేజిస్ర్టేటు అరుణకుమారి అంగీకరించటంతో నాలుగు పేజీల ఫిర్యాదును అందించారు. శుక్రవారం రాత్రి 11 గంటలు దాటిన తరువాత సీఐడీ కార్యాలయంలో తాను నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా... హఠాత్తుగా ఐదుగురు వ్యక్తులు తాను ఉన్న గదిలోకి వచ్చారని. వాళ్లంతా ముఖాలకు కర్చీ్‌ఫలు కట్టుకున్నారని వివరించారు. అయితే వచ్చీ రాగానే తన రెండు కాళ్లను తాడుతో కట్టారని. ఒకవ్యక్తి కర్రతో కొట్టాడని. మరొక వ్యక్తి... ఫైబర్‌ లాఠీ తో తన రెండు అరికాళ్లపై కొట్టాడని పేర్కొన్నారు.. అంతలా కొట్టినా వారి కసి తీరలేదని.. తనను గదిలో అటూ ఇటూ నడవమన్నారని. తాను నడిచాను అన్నారు. ఆ తర్వాత మళ్లీ అరికాళ్లపై నాలుగైదుసార్లు గట్టిగా కొట్టారని పేర్కొన్నారు. తరువాత మళ్లీ నడవమన్నారని. ఈసారి తాను నడవలేకపోయానని దీంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు అంటూ కోర్టుకు తెలిపారు రఘురామ రాజు. అరెస్టు తర్వాత తన పట్ల అమానుషంగా వ్యవహరించారంటూ కొందరు అధికారుల పేర్లను కూడా ప్రస్తావించారు.  తన అరికాళ్లకు తగిలిన గాయాలు, కమిలిన దెబ్బలను మేజిస్ట్రేట్ కు చూపారు రఘురామ రాజు. కోర్టులో న్యాయవాదులందరినీ బయటకు పంపి... ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్న అంశాలను మేజిస్ట్రేట్‌ రికార్డు చేసుకున్నారు. ఆ తర్వాత విచారణ సందర్భంగా... ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తామని మేజిస్ట్రేట్‌ చెప్పగా.. ఎంపీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించింది. విచారణ పేరుతో కొట్టారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వాసుపత్రికి పంపితే అక్కడ న్యాయం జరగకపోగా, ఆయన ప్రాణానికే హాని ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఎంపీని గుంటూరులోని రమేష్‌ హాస్పటల్‌కు తరలించాల్సిందిగా అభ్యర్థించారు. దీనిపై మేజిస్ట్రేట్‌ స్పందిస్తూ... నిందితుడి పాదాలు కమిలిపోయి ఉన్నాయి. వైద్య పరీక్షలు కచ్చితంగా అవసరం. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, రమేష్‌ ఆస్పత్రి వైద్యులు... కేంద్రం కల్పించిన వై-కేటగిరీ భద్రత సమక్షంలోనే ఆయనను పరీక్షించాలి సూచించింది. అవి తాజా గాయాలని తేలితే అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. 

షర్మిల పార్టీ ఆఫీసుకు తాళం.. ప్రారంభించకుండానే క్లోజ్!

ఆంధ్రప్రదేశ్ లో జగనన్న తెచ్చేసిన ‘రాజన్న రాజ్యాన్ని’ తెలంగాణలోనూ తెచ్చేందుకు నడుం బిగించిన వైఎస్ షర్మిల రాజకీయ సంకల్పానికి బ్రేక్ పడింది. రాజన్న రాజ్యం లక్షంగా పార్టీ ఏర్పాటు సన్నహాలు చురుగ్గా సాగుతున్న సమయంలో రాష్ట్రంపై  కరోనా పంజా విసిరింది. అప్పటి నుంచి కరోనా కేసులు, కొవిడ్ మరణాలు భయంకరంగా పెరిగి పోతున్నాయి. దీంతో, రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ప్రజలే కాదు, రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా గడపదాటి బయటకు రావడానికి భయపడుతున్నారు.  ఇతర పార్టీల వ్యవహారం ఎలా ఉన్నా, ఇంకా పేరైనా పెట్టని షర్మిల పార్టీకి, పురిటిలోనే సంధి కొట్టినట్లు అయింది.  అంతవరకు జోరుగా సాగిన ఆత్మీయ సమావేశాలు, జగనన్న అడుగుజాడల్లో ఆమె చేపట్టిన దీక్షలకు బ్రేక్ పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే,అంతవరకు కళకళలాడిన షర్మిల రాజకీయ కార్యకలాపాల వేదిక, లోటస్ పాండ్’కు తాళం పడింది. మరో వంక కరోనా నిబంధనలు పాటించకుండా కనీసం మాస్క్ అయినా  లేకుండా ఆత్మీయ సమ్మేళనాలు, ఖమ్మం సంకల్పసభ, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ఉద్యోగ దీక్షలో పాల్గొన్న, అనేక మందికి కరోనా సోకింది. కొవిడ్ బారిన పడ్డారు. ఆమె  ముఖ్య అనుచరులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతే కాకుండా కరోనా నిబంధనలు పాటించకుండా, ప్రతిరోజూ చిన్న పెద్ద సభలు, సమావేశాలు నిర్వహించడం వల్ల అనేక మంది కరోనా బారిన పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో  షర్మిల, రాజకీయ కార్యకలాపాలకు బ్రేక్ ఇచ్చారు. లోటస్ పాండ్‌కు తాళం వేశారు.  ప్రస్తుతం షర్మిల సోషల్ మీడియా వేదికగా రాజకీయం సాగిస్తున్నారు. అడపా తడపా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. మరో వంక ఆమె ప్రారంభించిన ‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్సార్’ అనే కార్యక్రమం ప్రారంభానికి ముందే పడకేసిందనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. కరోనా సోకి ఇంటి పెద్ద దిక్కును పోల్పోయిన వారికి పెద్దాయన వైఎస్సార్’ పేరున సహాయం చేసేందుకు ఉద్దేశించిన పథకం ప్రారంభానికి ముందే పడకేసిందన్నవిమర్శలు వినవస్తున్నాయి. సహాయం కావలసిన వారు, సహాయం కోరేందుకు ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే, తిరిగి కాల్ వస్తుందనే రికార్డెడ్ వాయిస్ మినహా ఎలాంటి మానవ స్పందన లేదని పలువురు ఆరోపిస్తున్నారు.మొత్తానికి, షర్మిల రాజకీయ కలలపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది.

వాట్సాప్‌ స్టేటస్‌లో ఫొటో బాలిక ఆత్మహత్య..

స్మార్ట్‌ఫోన్, తక్కువ  ధరకే ఆన్లైన్ లో  అందుబాటులోకి వచ్చాక సదువుతో సంబంధం లేదు, వయసు పరిమితి కూడా అవసరం లేకుండా సోషల్ మీడియాని కిరాణం వస్తువులు వినియోగించినట్లు వినియోగిస్తున్నారు.  మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగింది. అయినదానికి, కాని దానికీ సోషల్ మీడియాలో రెచ్చిపోయి పోస్ట్‌లు, వాట్సాప్‌లో స్టైల్ కొడుతూ స్టేటస్‌లు పెట్టడం కొందరికి అలవాటుగా మారింది. ఆనవాయితీగా మారింది. అలా ఓ అబ్బాయి  వాట్సాప్‌లో తనకు పరిచయమైన బాలిక ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. దాంతో ఆ అమ్మాయి  తీవ్ర మనస్తాపం చెందింది.. ఆ తర్వాత  ఆత్మహత్యకు పాల్పడింది.  అది  నల్గొండ జిల్లా. బొమ్మలరామారం మండలం. బోయిన్‌పల్లి గ్రామం. ఆ అమ్మాయి పేరు సాభావత్ శిల్ప. తన వయసు 14 సంవత్సరాలు. కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. మూడు చింతలపల్లి మండలం పోతారం గ్రామంలో ఉన్న కూరగాయల తోటలో కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు బోటిమీది తండాకు చెందిన తేజావత్ మధు అనే బాలుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో గత కొన్ని నెలలుగా ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇద్దరూ ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తీసుకున్నారు. గంటల కొద్దీ ఫోన్లు మాట్లాడుకునేవారు. వాట్సాప్‌లో చాటింగ్ చేసుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఇలా ఇద్దరికీ పరిచయం ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దని శిల్ప షరతు పెట్టింది. మధు కూడా అలాగేనని ఆమెకు చెప్పాడు. శిల్ప, మధు కలిసి అతని స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, ఫొటోలు దిగేవారు. ఆ ఫొటోలను ఒకరికొకరు వ్యక్తిగతంగా పంపుకుంటూ ఇద్దరూ తెలిసీతెలియని వయసులో మురిసిపోయారు. అయితే.. శిల్ప పరిచయమైన తర్వాత మధు వాట్సాప్‌ స్టేటస్‌లో రోజూ లవ్ పాటలు, కొటేషన్లను పోస్ట్ చేసేవాడు. శిల్ప కూడా మధు స్టేటస్‌లు చూసి సంతోషించేది. అయితే.. శిల్ప ఫొటోలను మాత్రం మధు ఎప్పుడూ స్టేటస్‌లో పోస్ట్ చేయలేదు. కానీ.. శుక్రవారం ఆపుకోలేని తాపత్రయంతో శిల్ప ఫొటోను మధు తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. గతంలో మధు ఫోన్‌లో శిల్ప కొన్ని ఫొటోలు దిగింది. ఆ ఫొటోల్లో ఒక ఫొటోను మధు వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు. తన ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా మధు పెట్టడంతో శిల్ప ఒక్కసారిగా షాకయింది. మధుతో తనకు ఉన్న పరిచయం గురించి అందరికీ తెలిసిపోయిందని ఆ బాలిక తీవ్ర మనస్తాపం చెందింది. మధుకు ఫోన్ చేసి ఎందుకిలా చేశావని, ఫొటోలు పోస్ట్ చేయొద్దని చెప్పా కదా అని అడిగింది. ‘ఏం కాదులే’ అంటూ మధు సముదాయించే ప్రయత్నం చేశాడు. ఫోన్‌ కాంటాక్ట్స్‌లో ఉన్న వాళ్లందరూ ఫొటోను చూస్తారని, ఆ అమ్మాయి ఎవరని అడుగుతారని మధుతో చెప్పిన శిల్ప క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకుంది. మధు తన ఫొటోను స్టేటస్‌లో పెట్టడాన్ని భరించలేకపోయిన శిల్ప తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పనిచేసే తోటలో దొరికిన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు చనిపోవడానికి మధు అనే అబ్బాయే కారణమని శిల్ప తల్లి జయమ్మ షామీర్‌పేట్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జగన్ ఏజెంట్ గా సీఐడీ సునీల్ కుమార్!  

ఆంధ్రప్రదేశ్ లో సీబీసీఐడీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్. సీఎం జగన్ ఏజెంట్ గా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.ఆల్ ఇండియా సర్వీసులనుంచి వచ్చే అధికారులు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిజాయితీతో వ్యవహరించాలని.. కాని దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ లో అలా జరగడంలేదని అన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ లుగా ఉన్నవారు తమకులభించే పదవులు, రిటైర్మెంట్ తర్వాత ఒనగూరే ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ, పాలకుల రాజకీయ కక్షసాధింపుల్లో భాగస్వాములవుతున్నారని విమర్శించారు. సీబీసీఐడీ అధికారి సునీల్ కుమార్ పై అతని భార్య పెట్టిన కేసులను ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకొని, అతన్ని ఆయుధంగా చేసి కక్షసాధింపులకు వాడుకుంటోందని శ్రావణ్ కుమార్ ఆరోపించారు.  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 60ఏళ్ల మహిళపై అత్యుత్సాహం చూపిన సీబీసీఐడీ, న్యాయస్థానాలను అవమానించేలా, న్యాయమూర్తులనుదూషిస్తూ మాట్లాడినవారిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెనాలి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలతో దూకుడుగా వ్యవహరించే సీబీసీఐడీ, రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలనుఎందుకు ఖాతరు చేయడంలేదని ఆయన నిలదీశారు. కులాల ప్రస్తావనచేసిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దలపై సీబీసీఐడీ ఎందుకుచర్యలు తీసుకోలేదని అన్నారు. దళితులకు శిరోముండనాలుచేసి, వారిని అవమానించిన వారిని సీబీసీఐడీ ఏంచేసిందని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. సునీల్ కుమార్ సీబీసీఐడీ అధికారిగా పనికిరాడని, ఆయన్ని తక్షణమే ఆ బాధ్యతలనుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కొమ్ముకాసే సునీల్ కుమార్ లాంటి అధికారులంతా ఒక్కసారి వారు  భవిష్యత్ తో ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచిస్తే మంచిదని  శ్రావణ్ కుమార్ సూచించారు.

ఎంపిపై థర్డ్ డిగ్రీనా! జగన్ కళ్లలో ఆనందం కోసం ఇంత దారుణమా! 

లోక్ సభ ఎంపి రఘురామకృష్ణంరాజును గాయాలయ్యేలా కొట్టడం పోలీసుల దమన కాండకు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులో అదుపులోకి తీసుకున్న ఎంపిని పోలీసులు ఏవిధంగా శారీరక హింసకు గురిచేస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ కళ్లలో ఆనందం కోసం అధికారులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారు.  అతను నేరస్తుడు కాదు  ప్రభుత్వ  అక్రమ కేసులొ  నిందితుడు మాత్రమేనని చెప్పారు.  కోవిద్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగుంపులుగా వెళ్లి అరెస్టు చేయడమే  పెద్ద నేరమని, ఇప్పుడు థర్డ్  డిగ్రీ అమలుచేయడం మరో తప్పని చంద్రబాబు మండిపడ్డారు.  పోలీసు కస్టడీలో ఉన్న సామాన్య పౌరుడిని కూడా కొట్టే హక్కు పోలీసులకు ఉండదని చట్టం చెబుతోందన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చట్టం నుంచి ఏమైనా మినహాయింపు ఉందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికి  హింసించడం కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు యావత్ పోలీస్ వ్యవస్థకే మాయనిమచ్చగా మారిందని ధ్వజమెత్తారు. ఈ చర్యలన్నీ   ఫ్యాక్షన్ వ్యవస్థను తలపిస్తున్నాయి తప్ప రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నట్లుగా లేదన్నారు చంద్రబాబు.  ఎంపి స్థాయిలో ఉన్న వ్యక్తిపైనే పోలీసులు ఈవిధంగా జులుం ప్రదర్శించారంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని చంద్రబాబు నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి జమానాలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరికొత్త చట్టాలను అమలుచేస్తున్నట్లు కన్పిస్తోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకంగా సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లోనే థర్డ్ డిగ్రీ అమలుచేయడంపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన సిబిసిఐడి  ఉన్నతాధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా థర్డ్ డిగ్రీ అమలుచేయడం అనాగరికమన్నారు చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేయడమే కాకుండా పోలీసుస్టేషన్లోనే హింసించాలని ఏ చట్టం చెబుతోందన్నారు. రఘురామ నడవలేని పరిస్థితులో ఉన్నారంటే ఏవిధంగా ఆయనను హింసించారో అర్థమవుతుందన్నారు. పోలీసు అధికారులు గూండాల్లా ప్రవర్తించడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడిని ఖండించాలని,  తక్షణమే ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు కోరారు.