సింగర్ హరిణి ఇంట్లో విషాదం.. సుజనా ఫౌండేషన్ సీఈవో మృతి కేసులో ట్విస్ట్
posted on Nov 25, 2021 @ 11:54AM
సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానస్పద మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. బెంగళూరులోని రైల్వే ట్రాక్పై ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ లభ్యమైంది. ఓ వ్యాపారి తనను మోసం చేశారంటూ సూసైడ్ నోట్లో ఉంది. కాగా కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏకే రావు పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఏకే రావు వారం రోజులుగా కనిపించకుండా పోయారు. సుజనా ఫౌండేషన్ సీఈవోగా పనిచేస్తున్న ఏకే రావు కుటుంబం శ్రీనగర్ కాలనీలో నివాసముంటుంది. ఏకే రావు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లారో స్పష్టత లేదు. ఈనెల 22న బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఆయన కనిపించడంలేదంటూ కేసు నమోదైంది. బెంగళూర్ పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. అయితే ఆయన మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్పై గుర్తించారు.
తన తండ్రికి ఖచ్చితంగా హత్యేనని సింగర్ హరిణి అనుమానిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది. ఏకే రావు మృతదేహం రైల్వే ట్రాక్పై దొరికిన తర్వాత అప్పటి వరకూ ఆచూకీ లేని కుటుంబసభ్యులు బెంగళూరులోని మార్చురీ వద్దకు వెళ్లారు. తమ ఫిర్యాదు కూడా పోలీసులకు ఇచ్చారు.
ఏకే రావు కుటుంబసభ్యుల మధ్య మధ్య ఏమైనా కుటుంబ గొడవలు ఉన్నాయా అనే దిశగా బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏకే రావు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అన్నది పోస్ట్ మార్టంలో తేలే అవకాశం ఉంది. ఏకే రావు కుమార్తె సింగర్ హరిణి మాత్రం ఖచ్చితంగా హత్యేనని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్కు ఏకే రావు చాల కాలంగా సీఈవోగా పని చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన ఏదైనా వివాదాలు ఉన్నాయా అనే దిశగానూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.