విలువలతో పెరిగా.. ఇలాంటి అవమానం మరెవరికీ  జరగకూడదు.. 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై తెలుగు దేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వరి ఓ ప్రకటన విడుదల చేశారు.    ‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మానాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను’’ అని భువనేశ్వరి తన ప్రకటనలో పేర్కొన్నారు.  

క‌స‌బ్ ఫోన్ ప‌గ‌ల‌గొట్టిన ప‌ర‌మ్‌బీర్‌!.. వీడు మామూలోడు కాదు..

ముంబై కాల్పుల ఉగ్ర‌వాది మ‌హ్మ‌ద్ అజ్మ‌ల్ క‌స‌బ్. పాకిస్తాన్‌కు చెందిన వాడు మ‌నిషి కాదు.. న‌ర‌హంత‌కుడు. అనేక మందిని కాల్చిచంపిన ఉన్మాది. ఆనాడు క‌స‌బ్ వాడిన‌ సెల్‌ఫోన్.. ఆ కేసులో ఎంతో కీల‌కం. ఆ సమ‌యంలో క‌స‌బ్‌కు పాకిస్తాన్ నుంచి ఫోన్‌లో ఆదేశాలు వ‌చ్చాయ‌ని అంటారు. అందుకే, క‌స‌బ్ సెల్‌ఫోన్‌ను ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపించి డేటా మొత్తం బ‌య‌ట‌కు తీసుంటే.. ప్ర‌పంచం ముందు పాపిస్తాన్‌ను దోషిగా నిల‌బెట్టే ఛాన్స్ ఉండేది. కానీ, అంత‌టి కీల‌క‌మైన క‌స‌బ్ సెల్‌ఫోన్‌ను అప్ప‌టి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డీఐజీగా ఉన్న పరమ్‌బీర్ సింగ్ ధ్వంసం చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అవిప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.   26/11 ఉగ్రదాడి దోషి మహ్మద్ అజ్మల్ కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ధ్వంసం చేశారని రిటైర్డ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంషేర్ ఖాన్ పఠాన్.. ఈ ఏడాది జులై నెలలో ప్ర‌స్తుత‌ ముంబై పోలీసు కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. పఠాన్ నాలుగు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ, గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన అవినీతి కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సింగ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరవడంతో తాజాగా తెర మీదకు వచ్చింది. ఈ ఏడాది మార్చిలో అవినీతి ఆరోపణలపై పరమ్‌బీర్ సింగ్‌ను ముంబై పోలీసు చీఫ్ పదవి నుంచి తొలగించ‌గా.. తాజాగా ఆయ‌న‌పై క‌స‌బ్ సెల్‌ఫోన్ ధ్వంసం ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.  కసబ్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఆ ఫోన్‌ను కానిస్టేబుల్‌కు అప్పగించామని డీబీ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌ఆర్‌ మాలీ తనకు తెలియజేసినట్లు పఠాన్‌ ఫిర్యాదులో తెలిపాడు. అప్పటి డీఐజీ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్)గా ఉన్న పరమ్‌బీర్ సింగ్‌.. కానిస్టేబుల్ నుంచి మొబైల్ ఫోన్ తీసుకున్నారని మాజీ పోలీసు అధికారి పఠాన్ ఆరోపించారు. ‘‘26/11 ముంబై ఉగ్రదాడి కేసు దర్యాప్తు అధికారి రమేష్ మహాలేకు సింగ్ ఫోన్‌ను అందజేయాల్సి ఉందని, అయితే అతను ముఖ్యమైన సాక్ష్యాన్ని ధ్వంసం చేశాడు’’ అని పఠాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

రాజ్యాంగ దినోత్సవానికి కేసీఆర్ డుమ్మా.. గవర్నర్ తో విభేదాలే కారణమా? 

నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం. పారాయి పాలన అంతమై.. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ నవంబరు 26కు 72 ఏళ్లు పూర్తవుతోంది. దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం పుట్టిన నవంబర్‌ 26ని గుర్తు పెట్టుకోవాలని 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్‌.ఎమ్‌. సింఘ్వికి ఆలోచన వచ్చింది. అదే రోజును న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. అయితే, భారత ప్రభుత్వం 2015లో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి, ఆ సంవత్సరం నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్‌ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ దినోత్సవం రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. రాజ్ భవన్ లో గవర్నర్ల అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 72వ రాజ్యాంగ దినోత్సత వేడుకను  ప్రభుత్వం నిర్వహించింది. రాజ్ భవన్ లో గవర్నర్ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌, హైకోర్టు చీఫ్ జస్టిస్ పాల్గొన్నారు. కాని సీఎం  కేసీఆర్‌ మాత్రం డుమ్మా కొట్టారు. అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ దినోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్ భవన్ లో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నట్లు సీఎంవో నుంచి రాజ్ భవన్ వర్గాలకు ముందు సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాట్లు కూడా చేశారు. కాని చివరి నిమిషంలో కేసీఆర్ రావడం లేదని రాజ్ భవన్ కు సీఎంవో సమాచారం ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి లేకుండానే గవర్నర్, చీఫ్ జస్టిస్ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి కేసీఆర్ రాకపోవడంపై రాజ్ భవన్ తో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదే సమయంలో రాజ్యాంగ దినోత్సవానికి సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదన్న దానిపై రకరకలా చర్చలు సాగుతున్నాయి. కొంత కాలంగా గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో నరసింహన్ గవర్నర్ కు ఉన్నప్పుడు తరుచూ రాజ్ భవన్ వెళ్లేవారు కేసీఆర్. వారం వారం వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. పండుగలు, ముఖ్యమైన రోజులు ఏమొచ్చినా రాజ్ భవన్ వెళ్లి నరసింహన్ కు కేసీఆర్ విషెస్ చెప్పేవారు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ను ఆహ్వానించేవారు. అయితే తమిళి సై గవర్నర్ గా వచ్చిన కొన్ని రోజులకే సీన్ మారిపోయింది. రాజ్ భవన్ వైపే వెళ్లడం లేదు కేసీఆర్. పండుగల సమయంలోనూ ఆమెకు విషెస్ చెప్పడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదు. అంతేందుకు మహాత్మ గాంధీ జయంతి రోజున ప్రతి ఏటా బాపుఘాట్ లో గవర్నర్ తో కలిసి సీఎం నివాళి అర్పిస్తారు. కాని ఈసారి గాంధీ జయంతి రోజున బాపుఘాట్ వెళ్లలేదు కేసీఆర్. గవర్నర్ తో విభేదాల కారణంగానే ఆయన గాంధీకి నివాళి అర్పించేందుకు వెళ్లలేదనే ప్రచారం జరిగింది.  మరోవైపు గవర్నర్ తమిళి సై కూడా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పలు సార్లు ప్రకటనలు చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసింది. యూనివర్శిటీ వీసీల నియామకంలోనూ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించి.. కేసీఆర్ సర్కార్ వార్నింగ్ సిగ్నల్ పంపించిందనే చర్చ ఉంది. పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసినా.. గవర్నర్ తమిళి సై ఆమోదించ లేదు. రెండు నెలల పాటు ఆ పైల్ ను పెండింగులో పెట్టారు. అయినా గవర్నర్ ను వెళ్లి కలవలేదు కేసీఆర్. చివరకు పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపించారు. గవర్నర్ ను కలవడం ఇష్టం లేకే ఎమ్మెల్సీ విషయంలో కేసీఆర్ ను ఆమెతో సమావేశం కాలేదని అంటారు. తాజాగా రాజ్యాంగ దినోత్సవానికి హాజరుకాకపోవడంతో.. గవర్నర్ తో కలిసి వేదిక పంచుకోవడం కేసీఆర్ కు ఇష్టం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఇదీ మంచి సంప్రదాయం కాదని, వ్యవస్థలను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. 

ఫ‌స్ట్ టెస్ట్‌లోనే సెంచ‌రీ.. శ్రేయస్ అయ్యర్ అదుర్స్‌...

105 ర‌న్స్‌ (171 బంతుల్లో 13X4, 2X6). ఇదేమీ వ‌న్డే ప‌ర్‌ఫార్మెన్స్ కాదు. వ‌న్డేలా ఆడిన టెస్ట్ మ్యాచ్ స్కోర్‌. టీ20 స్పెష‌లిస్ట్ బ్యాట్స్‌మెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో సాధించిన స్కోరు. టెస్ట్ మ్యాచ్‌ అరంగేట్రంతోనే సెంచ‌రీ చేసి వండ‌ర్ చేశాడు శ్రేయ‌స్‌. తనదైన బ్యాటింగ్‌ స్టైల్‎తో ఇర‌గ‌దీశాడు అయ్యర్‌. 157 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ కంప్లీట్ చేశాడు.  తొలి రోజు జడేజా (50)తో కలిసి శ్రేయస్‌ (75) ఐదో వికెట్‌కు సెంచ‌రీ భాగస్వామ్యం నెలకొల్పాడు. టీంఇండియా 258/4 స్కోర్‌తో మంచి స్థితిలో నిలిచింది. రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించగా ఆదిలోనే జడ్డూ ఔటయ్యాడు. ఫోర్లతో విరుచుకుపడిన శ్రేయస్‌ టెస్టుల్లో తొలి మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. 91.1 ఓవర్‎లో సౌథీ బౌలింగ్‎లో రెండు రన్స్ తీసి తొలి టెస్టు సెంచ‌రీ సాధించాడు.  అనంతరం సౌథీ బౌలింగ్‌లో విల్‌యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం టెస్టులోనే శతకం సాధించిన 16వ బ్యాట్స్‌మన్‌గా, న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌.  

అసలు కంటే వడ్డీ గ్రేట్.. జగనన్న సర్కార్ కొత్త  రికార్డు.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. ఇంతవరకు అప్పులు పుట్టించడంలో, అప్పులు చేయడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు వడ్డీలు చెల్లింపులోనూ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సంవత్సరం (2021) జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రాష్ట్రం కేవలం వడ్డీలకే రూ.5375 కోట్లు చెల్లించింది. ఇదే మూడు నెలలో కాలంలో చెల్లించిన అసలు రూ.4964 కోట్లు. అంటే అసలు కంటే  ఎక్కువ మొత్తంలో వడ్డీలు చెల్లించి పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఇదేదో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేవుని పాలన  గిట్టనివాళ్ళు, ఆయనగారి కీర్తిని జీర్ణించుకోలేని రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణ కాదు. స్వయంగా శ్రీ సర్కార్ వారే శాసన సభలో తమ ఘన కీర్తిని చాటుకున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో అధికారికంగానే ఈ విషయం ప్రకటించింది.ఇలా అసలు చెల్లింపుల కంటే వడ్డీల చెల్లింపులు ఎక్కవ ఉన్నాయంటే, అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్న స్థితికి నిదర్శనమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.   ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.22,740 కోట్ల వడ్డీలు చెల్లిస్తామని బడ్జెట్‌ పద్దులో తెలిపారు. కానీ, నిజానికి చెల్లించవలసిన వడ్డీల మొత్తం రూ.24 వేల కోట్ల వరకు ఉంటుందని ఆర్ధిక శాఖ అధికార వర్గాల సమాచారం. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో వడ్డీల కోసం దాదాపు రూ.5,500 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో చెల్లించిన మొత్తం  రూ.10,875 కోట్లకు చేరింది. మిగిలిన 6 నెలల్లో ఇంకా రూ.13,000 కోట్ల పైచిలుకు వడ్డీల కింద చెల్లించవలసి ఉంటుంది అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.   దేశంలో ఈ విషయంలో ఏపీ కంటే అద్వాన్నంగా ఉన్న రాష్ట్రాలు ఒకటో రెండో ఉంటే ఉండవచ్చును. కానీ, ఆ రాష్ట్రాల అద్వాన్నస్థితికి, భౌగోళిక పరిస్థితులు, అదిక జనాభా వంటి ప్రత్యేక పరిస్థితులు కారణం కావచ్చును,కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో  శని అన్నట్లు ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడం చేతకాక, అనుత్పాదక వ్యయాన్ని   పెంచుకుంతున్న రాష్ట్రం మాత్రం ఏపీ ఒక్కటే కావచ్చును.   ఏపీతో సమానంగా జనాభా విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలతో పోల్చితే అప్పుల్లోనే కాకుండా వడ్డీలు కట్టడంలో కూడా ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం. అప్పులు, వడ్డీలు కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.40,000 కోట్ల నుంచి రూ.45,000 కోట్ల వరకు ప్రభుత్వం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు చెల్లించవలసి ఉంటుంది. అప్పుల తాలూకు అసలు కింద రూ.15,500 కోట్లు, వడ్డీలు రూ.24,000 కోట్లు చెల్లించవలసి ఉంటుందని, అంటే అసలు చెల్లింపు కంటే వడ్డీ చేల్లిపు సుమారు రూ.10000 కోట్లు ఎక్కువ ఉంటుంది.  జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రభుత్వానికి కేంద్ర పన్నుల్లో వాటా, పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, గ్రాంట్లు కలిపి రూ.34,142 కోట్ల ఆదాయం వచ్చింది.ఇది చాలక ఇదే మూడు నెలల కాలంలో రూ.18,958 కోట్లు అప్పు తెచ్చారు. ఆదాయం,అప్పులు కలిపితే మూడు  నెలల్లో ప్రభుత్వ ఖజానాలో చేరిన సొమ్ములు  రూ.53,101 కోట్లు. ఈ మూడు నెలల్లో సర్కార్  చేసిన ఖర్చు  రూ.53,155 కోట్లు..ఇందులో పెట్టుబడి వ్యయం కేవలం రూ.2105 కోట్లు, అంటే ఈ మూడు నెలల కాలంలో పెట్టిన ఖర్చులో మిగిలిన మొత్తం పందారాల పథకాలు ఇతర అనుత్పాదక వ్యయం ఖాతాలో చేరిపోయింది. ఇవ్వన్నీ సత్యప్రమాణకంగా సర్కార్ వారు, శాసన సభకు చెప్పిన సత్యాలే.. ఎవరో చేసిన ఆరోపణలు కానే, కాదు. అంటే, సర్కార్ ఇచ్చిన వివరాల ప్రకారం చూసినా, ఏపీ బుడగ ముగిగిపోవదం ఖాయంగా కనిపిస్తోందని రతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెళ్లికి అమ్మాయిలు దొరకడంలే! చైనాలో ముదిరిపోతున్న అబ్బాయిలు..

జనాభాలో టాప్ కంట్రీ అయిన చైనాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.చైనాలో ఏడాదికేడాదికి పెళ్లిళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ‘చైనా ఇయర్ బుక్ 2021’ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో గతేడాది పెళ్లిళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెబుతున్నారు. చైనాలో పెళ్లి మాట ఎత్తితేనే యువకులు భయపడిపోతున్నారు. జీవన వ్యయం పెరిగిపోతుండడం, తగినంతమంది అమ్మాయిలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. దశాబ్దాలుగా చైనా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కూడా అక్కడి యువతకు శాపంగా పరిణమించాయి. ఇప్పుడు తేరుకుని నష్టనివారణ చర్యలు ప్రారంభించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. యువత క్రమంగా కనుమరుగవుతుండగా, వృద్ధుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అధిక జనాభాను అరికట్టేందుకు దశాబ్దాలుగా చైనా చేపట్టిన చర్యలు ఆ దేశాన్ని వృద్ధ దేశంగా మార్చాయి. దీంతో కళ్లు తెరిచిన ప్రభుత్వం 2016లో ఏకైక సంతానం నిబంధనలకు స్వస్తి చెప్పి ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల కూడా ఆశించిన ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది ముగ్గురు పిల్లలకు అనుమతి ఇచ్చింది.అయినా ఏ మాత్రం మార్పు కనపిించడం లేదు. పెళ్లి చేసుకునేందుకే యువత జంకుతున్న వేళ.. ఎంతమంది పిల్లలకు అనుమతిస్తే ఏం లాభమని పెదవి విరుస్తున్నారు.  చైనాలో  స్త్రీలకంటే పురుషల సంఖ్య ఏకంగా 3.49 కోట్లు ఎక్కువ. 20 ఏళ్లలోపు వయసు వారి పురుషుల సంఖ్య అయితే మహిళల కంటే 17.5 కోట్లు ఎక్కువని తేలింది. దీంతో యువకులకు అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. అంతేకాదు, 43 శాతం మంది అమ్మాయిలు కూడా పెళ్లికి విముఖత చూపుతున్నట్టు ఇటీవల సర్వేలో వెల్లడైంది.దీంతో యువకులు పెళ్లి చేసుకోకుండా ముదురు బెండకాయల్లా ముగిలిపోతున్నారు. పెళ్లిపై యువత ఇంతగా నైరాశ్యం పెంచుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, పిల్లల్ల చదువుల ఖర్చు భారంగా మారడం, ఉద్యోగం, వ్యాపారాల్లో విపరీతమైన ఒత్తిడి, అమ్మాయిలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం వంటివి పెళ్లిపై అనాసక్తికి కారణమవుతున్నాయి.

ఆంధ్రా ధాన్యం లారీలపై ఆంక్షలు.. తెలంగాణ బార్డర్ లో మళ్లీ రచ్చ..

తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి  నుంచి వెళ్లే వరి ధాన్యం లారీలను తెలంగాణ సరిహద్దు  టోల్‌గేట్ దగ్గర.. తెలంగాణ  పోలీసులు అడ్డుకుంటున్నారు. తెలంగాణ సర్కార్ ఆదేశాలతోనే స్థానిక పోలీసులు... ఆంధ్రా లారీలను ఆపేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ అనధికారిక ఆదేశాలతో ఆంధ్ర వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ఆదేశాలతో ఆంధ్ర రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యాపారులు భయపడుతున్నారు.  ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రైతులకు దాన్యం నిలువ కష్టంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్ర ప్రభుత్వం చర్చించి పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 

కేసీఆర్ కు డబుల్ షాక్.. గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ హీట్ 

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని తలనొప్పులు వస్తున్నాయి. శాసనమండలి ఎన్నికల సెగ అధికార పార్టీకి భారీగానే తగులుతోంది. అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఇద్దరు ముఖ్య నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీఆర్ఎస్ పార్టీకి  కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ రాజీనామా చేశారు. స్థానిక సంస్థల కోటా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రవీందర్ సింగ్.. రెండు రోజులుగా పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ బయటికి వచ్చారు రవీందర్ సింగ్. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటైన పదాలతో ఆయన  లేఖ రాశారు. తనకు అనేక సార్లు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి సీఎం కేసీఆర్ మాట తప్పారని రాజీనామా లేఖలో గుర్తు చేశారు రవీందర్ సింగ్. ఉద్యమకారులను పక్కన పెట్టి.. పార్టీ చేరిందే తడవుగా పదవులిచ్చి ఉద్యమకారులను అవమానించారని అన్నారు. ఉద్యమకారుల పరిస్థితి చూసి కన్నీళ్లు వచ్చినా.. తెలంగాణ అభివృద్ధి పేరిట అన్ని భరిస్తూ వచ్చామన్నారు రవీందర్ సింగ్. ఉద్యమ ద్రోహులకు అందలమెక్కిస్తూ.. ఉద్యమకారులకు అవమానాలు చేస్తుంటే బాదేస్తోందని అన్నారు. కరీంనగర్ జిల్లాలో కొందరి చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయినా పట్టించుకోవడం లేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమకారులకు స్థానం, గౌరవం లేదని గుర్తించి పార్టీకి రాజీనామా చేస్తున్నానని తన లేఖలో స్పష్టం చేశారు రవీందర్ సింగ్.  ఇక ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి షాక్ తగిలింది. సీనియర్ నేత గట్టు రామచందర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్‌‌కు పంపారు. మీరు ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు గట్టు రామచంద్రరావు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తారని గట్టు రామచంద్రరావు ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో క్రియాశీలకంగా గట్టు పనిచేశారు. తరువాత వైసీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. పార్టీ వాయిస్ ను మీడియా ముందు బలంగా వినిపించారు. 

కరకట్టలు తవ్వేశారు.. జగన్ సర్కార్ కు నోటీసులు.. గలాబీకి షాక్.. మళ్లీ గండం.. టాప్ న్యూస్@7PM

నెల్లూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. గంగపట్నం గ్రామాన్ని సందర్శించారు. ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి వాటర్ మ్యానేజ్మెంట్ తెలియదని మండిపడ్డారు. పక్కజిల్లాల్లో 60 మంది చనిపోయారని, పెద్ద హుదూద్ తుఫాన్‌లో 20 మంది మాత్రమే చనిపోయారని గుర్తు చేశారు. ఇది కేవలం మానవ తప్పిదమేనని, ఇసుక దోపిడీకి పాల్పడి జేబులు నింపుకోవడానికి కరకట్టలు తొవ్వేశారని విమర్శించారు. ---- ఎయిడెడ్ ఆస్తులపై కన్నేసి తెచ్చిన జీఓలు రద్దు చేసే వరకూ పోరాడుతామని టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పేద విద్యార్థుల పాలిట వరమన్నారు. ప్రభుత్వాలు విద్య కోసం ఎంత ఖర్చు చేసినా తక్కువేనన్నారు. శాసనసభ, మండలి, బయట కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నామని ఆయన పేర్కన్నారు -------- రాష్ట్రంలోని మూడు పార్టీలు కూడబలుక్కుని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు మానవ తప్పిదం అనడం దారుణమన్నారు. వరదల వల్ల ప్రాణనష్టం కలుగకుండా కాపాడగలిగామన్నారు. రెండు ఘటనల్లో మినహా ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదన్నారు.  -------- ఏపీ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణలోని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఒత్తిడి కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక కోరుతూ తెలుగు రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులిచ్చింది.ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. 6 వారాల్లో సమాధానమివ్వాలని ఏపీకి మరోసారి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులిచ్చింది. నివేదిక ఇవ్వకపోతే చట్టబద్ధంగా తీసుకునే చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించింది. ------- ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు.  ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. రైతులకు మద్దతు ధర రావాలని ఐకేపీ సెంటర్లను మొదట ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని శ్రీధర్ బాబు చెప్పారు. ----- ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని, సాగు, తాగు అవసరాల్లేకుండా విద్యుత్‌ ఉత్పత్తి చేశారని కేఆర్‌ఎంబీ పేర్కొంది. సముద్రంలోకి వృధాగా 55.966 టీఎంసీల కృష్ణా జలాలు పోతున్నాయని, శ్రీశైలం జలాశయం నిల్వ 94.910 టీఎంసీలకు పడిపోయిందని కేఆర్‌ఎంబీ తెలిపింది. సాగర్‌, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ లేఖలో ఆదేశించింది. ------- తమిళనాడులో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.తూత్తుకుడి, తేన్ కాశి, తిరునల్వేలి, చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర సర్కారు ఆ నాలుగు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాల ధాటికి తూత్తుకుడి ఎయిర్ పోర్టులో రన్ పైకి భారీగా నీరు చేరింది. దాంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలను దారి మళ్లించారు. ------ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈ నెల 26 నుంచి వర్షాలు మొదలవుతాయని, 27న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి  భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. గుంటూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.దీంతో ఇటీవల వర్షాలకు అల్లాడిపోయిన జనాలు.. ఇప్పడు ఏమవుతుందోనని భయపడుతున్నారు. ---- సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో నొప్పితో ఆయన పూణెలోని రూబీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ల పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని రూబీహాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవ్‌ధూత్ తెలిపారు. అన్నాహజారేకు ప్రస్తుతం 84 సంవత్సరాలు.  ----- నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడు. 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27 సాయంత్రం హైదరాబాదు శిల్పకళా వేదికలో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఒకే వేదికపై బాలయ్య, బన్నీ కనువిందు చేయనుండడం పట్ల అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఢిల్లీలో  ఏమి జరిగింది.. కేసీఆర్ మౌనం దేనికి  సంకేతం? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు . వచ్చారు. వెళ్ళే టప్పుడు ఏమి పట్టుకు వెళ్ళారో ఏమో కానీ, వచ్చేటప్పుడు మాత్రం వట్టి చేతులతో వచ్చారు. కేంద్రం పై ‘వరి వార్’  (యుద్ధం) ప్రకటించి మంది మార్బలంతో  ప్రత్యేక ఫ్లైట్ ఎక్కి, హస్తినకు వెళ్లి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఎదుకనో ఢిల్లీలో ఉన్న మూడు రోజులు మౌనంగానే ఉన్నారు. హైదరబాద్ వచ్చిన తర్వాత కూడా సైలెంట్’ గానే ఉన్నారు. ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రేమే కాదు ఆయన వెంట ఢిల్లీ వెళ్లి వచ్చిన, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర యుద్ద వీరులు ఎవరూ కూడా మీడియాకు ఢిల్లీ కబుర్లు చెప్పలేదు. ఢిల్లీ వెళ్ళని మంత్రి యర్రబెల్లి దయాకర రావు ఒక్కరే ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రపై స్పందించారు. మహా నేత ముఖ్యమంత్రి మూడు రోజులు ఢిల్లీలో ఉన్నా, ప్రధానమంత్రి ఆయనకు, ‘అపార్ట్ మెంట్’ ఇవ్వలేదని కాసింత దుఖించారు. భాషా పాండిత్యంతో కాసింత నవ్వించారు.  ముఖ్యమంత్రి అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు.. వరి విషయంలో తాడో పేడో తెల్చుకోవదానికేనా? అదే నిజం అయితే, సంబందిత శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముదస్తు అప్పాయింట్మెంట్ లేక పోయినా, సమయం చూసుకుని, కొంచెం ఆలస్యంగానే అయినా ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? మంత్రులను పంపి తాను ఎందుకు వెళ్ళలేదు. ప్రధాని తప్ప ఇతర మంత్రులు ఎవ్వరూ తమ స్థాయికి సరిపోరని భావించి మంత్రితో భేటికి డుమ్మా కొట్టారా? లేక, వారసుడొచ్చాడు, ఇకపై తాను నిమిత్తమాత్రుడినని, అంతా ఆ తారక రాముడే చూసుకుంటారని, నలుగురికి చెప్పేందుకు, తెరచాటున ఉండి పోయారా? మంత్రి ముందు అవమానం ఎదురవుతుందని ముఖం చాటు చేశారా ?  ఏమో, ఎలా చూసినా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఎందుకో కొత్త వాసనలు కొడుతోందని అంటున్నారు విశ్లేషకులు.అలాగే, నేక అనుమానాలకు కూడా ఆస్కారం కల్పిస్తోందని  పార్టీ నాయకులు కూడా గుసగుసలు పోతున్నారు.   అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీర్’కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదా, లేక ముఖ్యమంత్రి ప్రధాని అప్పాయింట్మెంట్ కోరనే లేదా? అనేదికూడా స్పష్టంగా ఎవరూ చెప్పలేక పోతున్నారు. అదెలా గున్నా, ప్రధానమంత్రి ఇవ్వలేదనే అనుకున్నా, ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న,వస్తుందని తాజా రాజకీయ పరిణామాలను దగ్గరగా చూస్తున్నరాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు. అంతేకాదు, రాజకీయ విబేధాల కారణంగానే ప్రధానమంత్రి అప్పాయింట్మెంట్ ఇవ్వకపోవడం నిజం అయితే, కేసీఆర్ ప్రకటించిన యుద్దానికి కేంద్రం, బీజేపీ కూడా సిద్ధంగా ఉన్నాయని సై ‘అన్నట్లే  అనుకోవచ్చని, అందుకే, ముఖ్యమంత్రి  మౌనం ఆశ్రయింఛి ఉండవచ్చని అంటున్నారు.  రాష్ట్ర బీజేపే నాయకుల మాటల్లో కూడా ఇక ముందు కేసీఆర్’కు ప్రదానితో అప్పాయింట్మెంట్ విషయంలో మాత్రమే కాదు, ఇతరత్రా కూడా అవమానాలు ఎదురు కావచ్చని అంటున్నారు.ఇందుకు ప్రధానంగా, అనవసరంగా వివాదాన్ని సృష్టించడంతో పాటుగా,   స్థాయిని మరిచి  చేసిన  వ్యాఖ్యల కారణంగానే ప్రధాని అప్పాయింట్మెంట్’లో ప్రియారిటీ తప్పి ఉంటుందని అంటున్నారు. అందుకే, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అప్పాయింట్మెంట్ ఇచ్చి, కేసీఆర్’ ను తిరుగు టపాలో వెనక్కి పంపారని అంటున్నారు.  నిజానికి, వరి వివాదం, అంత జటిలం అయిందీ కాదు, ఒక్క తెలంగాణకు మాత్రేమే ఉన్న సమస్య కాదు. రాజకీయం చేయకుండా అధికారులు, మంత్రుల స్థాయిలో  చర్చల ద్వారా పరిష్కరించుకునే దృక్పధంతో ముందుకు వెళితే వరి సమస్య పరిష్కారం కాని భయంకర సమస్య కాదు. కానీ, హుజూరాబాద్ ఓటమి , దళిత బంధు చిక్కులు, వానా కాలం వరి కొనుగోలుకు చేతులు ఆడకపోవడం వంటి స్వయంకృత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వరి వివాదాన్ని, రాజకీయ  యుద్దనాదం చేయడంతోనే సమస్య జటిలం అయిందని, అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి మౌనం, యుద్ధం ముందు ప్రశాంతత అయి నా కావచ్చిని కూడ అంటున్నారు.  హుజూర్బాద్ ఓటమి తర్వాత కూడా ముఖ్యమంత్రి నాలుగైదు రోజులు మౌనంగానే, ఆ తర్వాతనే తెరపైకి వచ్చారు అని గుర్తుచేస్తున్నారు.

66మంది మెడికోస్‌కి కొవిడ్‌.. టీకా వేసుకున్నా వైర‌స్.. థ‌ర్డ్ వేవ్ స్టార్టెడ్‌?

వాళ్లంతా వైద్య విద్యార్థులు. కొవిడ్ గురించి, జాగ్ర‌త్త‌ల గురించి వాళ్ల‌కు బాగా తెలుసు. ఇప్ప‌టికే రెండు డోసుల టీకా కూడా వేసుకున్నారు. కాక‌పోతే క‌రోనాను కాస్త లైట్ తీసుకున్నారు. ఇటీవ‌ల కాలేజ్‌లో ఓ ఈవెంట్ జ‌రిగితే.. అంతా హాజ‌ర‌య్యారు. మ‌స్త్ మ‌స్త్ ఎంజాయ్ చేశారు. క‌ట్ చేస్తే.. 300మంది మెడికల్ స్టూడెంట్స్‌లో 66 మందికి కొవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. అంద‌రినీ హాస్ట‌ల్‌లో ఉంచి.. గేట్ల‌కు తాళాలు వేసి.. క్వారంటైన్ చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. ఒకేసారి ఇంత‌మందికి క‌రోనా సోక‌డం.. థ‌ర్డ్ వేవ్ ఆరంభమైందా అనే అనుమానం రేకెత్తిస్తోంది. వెంట‌నే వైద్య అధికారులు అల‌ర్ట్ అయ్యారు. కర్ణాటక, ధార్వాడ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో ఏకంగా 66 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకడం క‌ల‌క‌లం రేపుతోంది. ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో మొత్తం 400 మంది విద్యార్థుల్లో 300 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66 మంది పాజిటీవ్‌గా తేలింది. సమాచారం తెలుసుకొన్న అధికారులు వెంటనే ముందు జాగ్రత్త చర్యగా కాలేజీలోని రెండు హాస్టళ్లను మూసివేశారు. ఎవరినీ బయటకు వెళ్లనీయడంలేదు. ‘‘మిగిలిన 100 మందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాము. ఎవరినీ అడుగు బయటపెట్టనీయడం లేదు. కళాశాలలో ఇటీవల ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు అందరినీ పరీక్షించాము. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో ఉన్నాము’’ అని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.   క‌ర్నాట‌క‌లోనే కాదు.. ఒడిశాలోని విమ్సార్‌లోని మెడిక‌ల్ కాలేజీలోనూ ఇలానే క‌రోనా క‌ల‌క‌లం రేగింది. 54మందికి కొవిడ్ సోకింది. వైరస్ బారినపడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజుల పాటు క్లాసులు సస్పెండ్ చేశారు. ఈ రెండు ఘటనలు ఇటీవల ఆయా కాలేజీల్లో నిర్వ‌హించిన‌ ఈవెంట్ వ‌ల్లే జ‌ర‌గ‌డం ఆస‌క్తిక‌రం. అందుకే, క‌రోనా లేద‌ని బిందాస్‌గా ఉండ‌కుండా.. కొవిడ్ ప్ర‌మాదం ఇంకా పూర్తిగా తొల‌గిపోలేద‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. గ్రూప్ యాక్టివిటీస్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.   

మొగుల‌య్య‌కి ఫ్రీ బ‌స్ పాస్‌.. శ‌భాష్‌ స‌జ్జనార్...

మొగుల‌య్య తెలుసుగా. కిన్నెర వాయిద్య కారుడు. మంచి పాటగాడు. భీమ్లా నాయ‌క్ సాంగ్ పాడిన క‌ళాకారుడు. ఇన్నేళ్లూ ఆయ‌నంత ఫేమ‌స్ కాదు.. పవ‌న్ క‌ల్యాణ్ సినిమాకు పాట పాడ‌టంతో ఓవ‌ర్ నైట్ ఆయ‌న పాపులారిటీ అమాంతం పెరిగింది. ఇప్పుడు మొగుల‌య్యా ఎక్క‌డికి వెళ్లినా గుర్తిస్తున్నారు. గౌర‌విస్తున్నారు. ప్ర‌జ‌లంతా ఆయ‌న‌కు జేజేలు ప‌లుకుతున్నారు. కిన్నెర వాయిద్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.  తాజాగా, మొగుల‌య్య ఆర్టీసీపై ఓ పాట పాడారు. ఆర్టీసీ సేవ‌ల‌ను ప్ర‌శంసిస్తూ.. స‌మాజంతో బ‌స్సు పెన‌వేసుకున్న బంధాన్ని వ‌ర్ణిస్తూ.. అద్భుతంగా పాడారు. ఆర్టీసీ బ‌స్సుపై మొగుల‌య్య పాడిని పాట సైతం బాగా వైర‌ల్ అయింది. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. అందుకే, ఆర్టీసీ సేవ‌ల‌ను కొనియాడుతూ.. త‌న పాట‌తో సంస్థ‌కు మ‌రింత గౌర‌వం తీసుకొచ్చిన మొగుల‌య్య‌ను ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ స‌న్మానించారు. టీఎస్ఆర్టీసీ త‌ర‌ఫున ఉచిత బ‌స్ పాస్ సౌక‌ర్యం క‌ల్పించారు. ఆ విధంగా మొగుల‌య్యను గౌర‌వించారు స‌జ్జ‌నార్‌. ఐపీఎస్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అనేక సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన స‌జ్జ‌నార్‌.. ఆర్టీసీలోనూ అలానే దూసుకుపోతున్నారు. ఎండీగా వ‌చ్చీరాగానే.. ద‌స‌రా సీజ‌న్‌లో ప్ర‌త్యేక బ‌స్సుల‌తో ధ‌ర‌ల బాదుడును తీసివేశారు. మామూలు టికెట్ రేట్స్ తోనే స్పెష‌ల్ బ‌స్సులు న‌డిపించి ప్ర‌యాణీకుల ఆద‌ర‌ణ చూర‌గొన్నారు. బ‌స్సు స‌ర్వీసుల‌ను వేళ‌కు వ‌చ్చేలా చూడ‌టం.. ఆక్యుపెన్సీ పెంచ‌డం.. ఆక‌స్మిక త‌నిఖీలు చేయ‌డం చేస్తూ ఆర్టీసీని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక ఇటీవ‌ల పెళ్లి వేడుక‌కు ఆర్టీసీ బ‌స్ బుక్ చేసుకున్న దంప‌తుల‌కు స్వ‌యంగా బ‌హుమ‌తి అంద‌జేసి.. ఆ జంట‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తాజాగా, కిన్నెర వాయిద్యకారుడు మొగుల‌య్య‌కి ఉచిత బ‌స్ పాస్ సౌక‌ర్యం క‌ల్పించి.. ఆర్టీసీ ప్ర‌భుత్వానిది మాత్ర‌మే కాదు.. మ‌నంద‌రిదీ అనిపించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే సంస్థ సిబ్బంది శ‌భాష్ స‌జ్జ‌నార్ అంటూ కితాబిస్తున్నారు.    

పోలీస్ స్టేషన్ చేరిన పిల్లల పెన్సిల్ పంచాయితీ.. వీడియో వైరల్..

వాళ్లంతా ప్రైమరీ స్కూల్ విద్యార్థులు. పక్కపక్కనే స్కూళ్లలో చదువుకుంటున్నారు. విరామ సమయంలో కలిసి ఆడుకుంటారు. అయితే వాళ్ల మధ్య ఓ పంచాయితీ వచ్చింది.అది పెన్సిల్ కోసం. తన పెన్సిల్ దొంగ తనం చేశాడంటూ ఏ విద్యార్థి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తాను హోంవ‌ర్క్ చేసుకుంటుంటే మ‌రో బాలుడు త‌న పెన్సిల్ ఎత్తుకెళ్లాడ‌ని ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లాలోని పెద క‌డుబూరు ప‌రిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  వివరాల్లోకి వెళితే హ‌న్మంత్ అనే విద్యార్థి పెన్సిల్‌ను మ‌రో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హ‌న్మంత్ స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి పెన్సిల్ దొంగ‌త‌నంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ప్ర‌తి రోజు పెన్సిల్స్ దొంగ‌త‌నం చేస్తున్నాడు. పైస‌లు కూడా తీసుకుపోతున్నాడు. రోజు ఇదే ప‌ని అని హ‌న్మంత్ పోలీసుల‌కు చెప్పాడు. ఈ ఒక్క‌సారి కేసు పెట్టండి అని కోరాడు. సార్ పెన్సిల్ తిరిగి ఇచ్చాను అని మ‌రో అబ్బాయి సంజాయిషీ ఇచ్చుకున్నా.. హ‌న్మంత్ మాత్రం విన‌లేదు. ఇదొక్క‌సారి కేసు పెట్టండి సార్ అని పోలీసుల‌ను అడిగాడు హ‌న్మంత్. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి స్టేష‌న్ నుంచి పంపించేశారు. హ‌న్మంత్ తీరుతో పోలీసులు స‌ర‌దాగా న‌వ్వుకున్నారు. ఇద్ద‌రూ బాగా చదువుకోవాల‌ని పోలీసులు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

పరిహారం ప్రకటించినా ప్రతాపమే.. కేసీఆర్ కు రైతు నేత షాక్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా రైతుల గురించే మాట్లాడుతున్నారు. రైతుల కోసం ఏమైనా చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణలో పండిన వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలంటూ ఏకంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమాన్ని ప్రశంసించారు. ఏడాదికి పైగా  సాగుతున్న రైతు ఉద్యమంలో చనిపోయినవాళ్లకు సంతాపం తెలిపారు. తెలంగాణ సర్కార్ తరపున మూడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరులైన రైతు కుటంబాలకు కేంద్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారం ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రైతుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు చనిపోయిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటించడంతో.. రైతుల నుంచి తమకు మద్దతు లభిస్తుందని గులాబీ లీడర్లు భావించారు. రైతు ఉద్యమ నేతలు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను అభినందిస్తారని ఊహించారు. ప్రస్తుతం తెలంగాణలో రైతులు వరి ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి సమయంలో జాతీయ రైతు సంఘం నేతలు కేసీఆర్ ను కలిస్తే తమకు ప్లస్ అవుతుందని టీఆర్ఎస్ నేతలు ఆశ పడ్డారు. కాని వాళ్ల ఆశలన్ని అడియాశలయ్యాయి. ఏడాదిగా రైతు ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న భారత్ కిసాన్ యూనియన్ కీలక నేత రాకేష్ తికాయత్.. గులాబీ లీడర్లు ఆశించినట్లే హైదరాబాద్ వచ్చారు. కాని కేసీఆర్ ను కలవలేదు. కలవకపోవడమే కాదు.. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు.  ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద విపక్ష పార్టీలు నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొన్న తికాయత్.. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్ఎస్‌ను ఢిల్లీకి పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తికాయత్ డిమాండ్ చేశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటల‌కు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ వచ్చిన రైతు సంఘం నేత రాకేష్ తికాయత్.. కేసీఆర్ ను టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కిషాన్ సంఘ్ నేత కేసీఆర్ ను కలిసి అభినందిస్తారని భావిస్తే.. ఇలా అటాక్ చేయడమేంటనే చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది. ఏదో అనుకుంటే ఏదో అయిందని, రైతు కుటుంబాలకు పరిహారం ప్రకటించినా... కిషాన్ సంఘ్ నేతలు పట్టించుకోకపోవడం ఏంటని గులాబీ లీడర్లు మథనపడుతున్నారు. రాకేష్ తికాయత్ కామెంట్లపై ప్రగతి భవన్ లో హాట్ హాట్ చర్చ సాగుతుందని తెలుస్తోంది. 

ఇక‌పై 'డ్రగ్స్' నేరం కాదు.. కేంద్రం కొత్త బిల్లు? మత్తు మజా..!

ఇటీవ‌ల గుజ‌రాత్ ముంద్రా పోర్టులో వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్‌ను ప‌ట్టుకున్నారు. డొంక లాగితే ఆ డ్ర‌గ్స్ లింకులు విజ‌య‌వాడ‌లో వెలుగుచూశాయి. వైసీపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లో డ్ర‌గ్స్‌, గంజాయి దందా జ‌రుగుతోంద‌ని పెద్ద ఎత్తున‌ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక, టాలీవుడ్ ప్ర‌ముఖులు అనేకులు డ్ర‌గ్స్ కేసులో చిక్కుకోవ‌డం.. బాలీవుడ్ స్టార్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌, శాండ‌ల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ ర‌చ్చ‌.. లేటెస్ట్‌గా ఆర్య‌న్‌ఖాన్ కేసు.. ఇలా దేశ‌వ్యాప్తంగా డ్ర‌గ్స్ ఎపిసోడ్స్‌ ఎంత సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయో తెలిసిందే. ఇక లాభం లేద‌నుకున్నారో.. డ్ర‌గ్స్‌ను అరిక‌ట్ట‌డం త‌మ వ‌ల్ల సాధ్యం కాద‌ని డిసైడ్ అయ్యారో ఏమో కానీ, కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనుంద‌ని తెలుస్తోంది.  మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం నేరం కాదని తెలిపే బిల్లును కేంద్రం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహా ఇతర మంత్రిత్వ శాఖలు ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయానికి ఇచ్చిన సలహా మేరకు ఈ బిల్లును రూపొందించినట్టు స‌మాచారం. అయితే, డ్ర‌గ్స్ క‌లిగి ఉండ‌టంలో కొన్ని కండీష‌న్స్ విధించ‌నున్నారని.. వ్యక్తిగత వినియోగం కోసం పరిమిత స్థాయిలో మాత్ర‌మే మాద‌క ద్ర‌వ్యాల‌కు అనుమ‌తించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.  దేశంలో మాదక ద్రవ్యాల కేసులపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వినియోగం కోసం కొద్ది మొత్తంలో మాదక ద్రవ్యాలను కలిగియుండటం నేరం కాదని తెలిపే చట్టాన్ని రూపొందించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మాదక ద్రవ్యాలు, ఉన్మత్త పదార్థాల (ఎన్‌డీపీఎస్) చట్టాన్ని సమీక్షించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూకు తెలిపింది. మాదక ద్రవ్యాలను ఉపయోగించే వారిని, వాటిపై ఆధారపడే వారిని బాధితులుగా పరిగణించాలని, వారిని జైళ్లకు బదులుగా డీ-ఎడిక్షన్ సెంటర్లకు పంపించాలని సూచించింది.  దేశంలో మాదక ద్రవ్యాలను కలిగియుండటం, అమ్మడం, దిగుమతి చేసుకోవడం, వాటితో వ్యాపారం చేయడం నేరమని ఎన్‌డీపీఎస్ చట్టం చెప్తోంది. ఈ చట్టం దేశంలోని పౌరులతో పాటు భారత దేశానికి వెలుపల ఉన్న భారతీయులకు కూడా వర్తిస్తుంది. భారత దేశంలో రిజిస్టర్ అయిన నౌకలు, విమానాల్లో ఉన్నవారు కూడా చ‌ట్టం కింద‌కు వ‌స్తారు. జప్తు చేసిన మాదక ద్రవ్యం పరిమాణాన్ని బట్టి నేరస్థునికి శిక్ష ఉంటుంది. అయితే.. ఈ చ‌ట్టానికి మార్పులు చేయాల‌ని కేంద్రం భావిస్తోంది. కొద్ది ప‌రిమాణంలో, అదికూడా వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు డ్ర‌గ్స్ క‌లిగి ఉండ‌టం నేరం కాద‌ని.. డ్ర‌గ్స్ వాడే వారిని బాధితులుగా చూసేలా చ‌ట్టానికి మార్పులు చేసేందుకు కేంద్రం స‌మాయ‌త్తం అవుతోంద‌ని స‌మాచారం.   

కొత్త పొత్తులతో ఎస్పీ మహా కూటమి! యూపీ సీన్ మారుతోందా?

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు విపక్ష పార్టీలు శక్తియుక్తులన్నీ ధారపోసి,కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇంతవరకు వచ్చిన సర్వేలు అన్నీ బీజేపీకి కొంత అనుకూలంగా ఉన్నా, అధికార పార్టీ యూపీ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడంలేదు. గత ఎన్నికల్లో సాధించైనా 300 ప్లస్ స్థానాలతో మళ్ళీ విజయం సాధించి, 2024 ఎన్నికల నాటికి విపక్షాల నైతిక్ స్థైర్యాన్ని మరింతగా దెబ్బ తీసేందుకు వ్యుహాత్మకంగా పవులు కదుపుతోంది. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాద్ సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్’ లు  ఒక్కొక ప్రాంతం బాధ్యతలు తీసుకున్నారు.మరో వంక ప్రధాని నరేంద్ర మోడీ, వారంలో కనీసం ఒక సారైనా యూపీలో కాలు పెడుతున్నారు. శంఖుస్థాపనలు, ప్ర్రారంభోత్సవాలలో పాల్గొని ఎన్నికల ప్రసంగాలతో, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో పాటుగా, తాజాగా కొవిడ్ ఫ్రీ రేషన్ మరో ఆరు నెలలు పొడిగించింది. ఇంకా అనేక  చర్యలు తీసుకుంటోంది.  ఇదిలా ఉంటే,ఇంతాకాలం ఒంటరిగా పోటీ చేస్తామని, ఒంటరిగానే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తపరిచిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఇప్పుడు  పొత్తుల కోసం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే వివిధ పార్టీలతో ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై సంప్రదింపులు జరుపుతోంది. గతంలో 2017లో విఫలమైన మహా ఘటబంధన్’ వైపుగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఉత్తర్ప్రదేశ్ ఇన్ఛార్జ్ సంజయ్ సింగ్తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ లఖ్నవూలో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం ఎస్పీతో పొత్తుపై సంప్రదింపులు జరుగుతున్నాయని సంజయ్ సింగ్ వెల్లడించారు. “ఉత్తర్ ప్రదేశ్ అవినీతి రహితంగా మార్చడానికి, శాంతి భద్రతలను కాలరాసిన ప్రభుత్వాన్ని తొలగించడానికి చేపట్టాల్సిన ఉమ్మడి ఎజెండాపై వ్యూహాత్మక చర్చ జరిగింది. ఎస్పీతో పొత్తుకు సంబంధించి ఇప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. నేడు జరిగిన భేటీలో ఓ అర్థవంతమైన చర్చ జరిగింది. త్వరలోనే దీని గురించి ప్రకటిస్తాం”అని, సంజయ్ సింగ్, చెప్పారు.  మరోవంక అప్నా దళ్(కె) పార్టీ అధ్యక్షురాలు కృష్ణ పటేల్తోనూ అఖిలేశ్ యాదవ్సమావేశమయ్యారు. తాము ఎస్పీతో కలిసి పోటీ చేయనున్నట్లు ఈ సమావేశం అనంతరం కృష్ణ పటేల్ ప్రకటించారు. సీట్ల పంపకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. భావ సారుప్యత ఉన్న ఇతర పార్టీలను తమతో కలుపుకునేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు.రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు జయంత్ చౌదరీతోనూ సమావేశమైన అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు.  అదలా ఉంటే వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్’లో పోటీకి సిద్దమవుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ-ఆప్‌, పంజాబ్, గోవా తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌పై గట్టిగా దృష్తి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే ఎస్పీతో పొత్తుకు సముఖతతో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్, బీస్పీలతో పాటుగా ఎం ఐ ఎం కూడా యూపీ ఎన్నికలలో  ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఎంఐఎం ఏకంగా వంద స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మరోవంక  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసేందుకు ఆ పార్టీ  ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా గట్టిగా శ్రమిస్తున్నారు. అయినా,  కురువృద్ధ పార్టీకి కాలం అంతగా కలిసోస్తున్నట్టు లేదు. ప్రియంకా వాద్రా సొంత సోదరిగా భావించే రాయి బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే, ఆమెతో పాటుగా బీఎస్పీ ఎమ్మెల్యే వందనా సింగ్ కూడా కమలం గూటికి చేరారు. మరో వంక గత వారం పదిరోజులుగా ఎస్పీ, బీస్పీ,కాంగ్రెస్ తదితర పార్టీల కీలక నేతల   బీజేపీలో చేరేందుకు బారులు తీరుతున్నారు. కొద్ది రోజుల క్రితం  ఎస్పీ, బీఎస్పీకి చెందిన ముగ్గురేసి ఎమ్మెల్సీలు బీజేపీలో చేరారు.ఈ నేపధ్యంలోనే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న బాబాయ్ శివపాల్ యాదవ్ తో  సయోధ్య కుదుర్చుకోవడంతో పాటుగా ఇంకొన్ని చిన్నా చితక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్, బీఎస్పీ వంటి పెద్ద పార్టీలతో మాత్రం పొత్తు ఉండదని అంటున్నారు.  అయితే, బీజేపీని  ఓడించడమే లక్ష్యంగా పావులు కడుపుతున్న అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలతో కలిసి మరోమారు మహా కూటమి ఏర్పాటు చేసినా  ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు అంటున్నారు.

టీడీపీ టార్గెట్ ఎన్టీఆర్‌.. జూనియ‌ర్ చాప్ట‌ర్ క్లోజ్‌?

ఏపీ అసెంబ్లీ ఘ‌ట‌న‌పై ఎన్టీఆర్ తీరు.. సింహాద్రి, ఆది.. సినిమాల త‌ర‌హాలో ఉంటుంది అనుకుంటే చాగంటి ప్ర‌వ‌చ‌నాల్లా చెప్పారంటూ టీడీపీ సీనియ‌ర్‌ నేత‌లు వ‌ర్ల రామ‌య్య‌, బుద్దా వెంక‌న్న‌లు మండిప‌డ్డారు. నిజ‌మే.. బాల‌కృష్ణ‌లా.. భ‌ర‌తం ప‌డ‌తాం.. ఖ‌బ‌డ్దార్‌.. ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకోం.. లాంటి స్పైసీ ప‌దాలు బుడ్డోడి నోటి నుంచి ఒక్క‌టి కూడా రాలేదు. చాగంటిలానే సూక్తులు చెప్పి.. మ‌మ అనిపించారు. మామూలుగా వేరే ఏదైనా విష‌యం అయితే.. ఇంత‌లా కాంట్ర‌వ‌ర్సీ అయ్యేది కాదేమో. ఎన్టీఆర్ మేన‌త్త‌ భువ‌నేశ్వ‌రి బాధితురాలు కావ‌డం.. బాధించిన వాళ్లు ఎన్టీఆర్ స‌న్నిహితులు కొడాలి నాని, వల్ల‌భ‌నేని వంశీలు అవ‌డం వ‌ల్లే.. ఇంత ర‌చ్చ‌.. పొలిటిక‌ల్ ర‌గ‌డ‌. జూనియర్ ఎన్టీయార్ అంటే కొడాలి నానికి, వల్లభనేని వంశీకి చాలా భయం. ఎన్టీయార్ వార్నింగ్ ఇస్తే వాళ్లిద్దరూ తోకలు ముడుచుకుని పోతారు. ఎన్టీయార్ స్పందించిన తీరు చూసి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధపడ్డారు.. అంటూ టీడీపీ ప్ర‌ముఖులు ఎన్టీఆర్‌ను నేరుగా టార్గెట్ చేశారు. అది కూడా రెండు రోజుల త‌ర్వాత టీడీపీ సీనియ‌ర్లు ఇలా బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తం ఎపిసోడ్‌లో జూనియ‌ర్ రియాక్ష‌న్ తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.  అఖండ‌పై జ‌గ‌న్‌రెడ్డి అస్త్రం!.. బాల‌య్య టార్గెట్‌గానే బిల్లు? న్టీఆర్‌పై టీడీపీ వ‌ర్గాలు గుర్రుగా ఉన్నాయి. మొత్తం వీడియో మెసేజ్‌లో ఒక్క‌సారైనా.. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించ‌క‌పోవ‌డం దారుణ‌మంటున్నారు. ఏదో స్పందించాలి కాబ‌ట్టి.. స్పందించార‌ని పెద‌వి విరుస్తున్నారు. అటు, వైసీపీ శ్రేణులు సైతం జూనియ‌ర్‌ను సోష‌ల్ మీడియాలో ఆటాడుకుంటున్నారు. ఎన్టీఆర్...నువ్వు ఎంత స్పందించినా ఆ కుటుంబ స‌భ్యుడిగా వాళ్లు ఎప్ప‌టికీ నిన్ను భావించ‌రంటూ సెటైర్లు వేశారు. ట్రోల్స్ కూడా బాగానే వైర‌ల్ అయ్యాయి. ఇలా.. ఒక్క వీడియోతోనే బాగా బ‌ద్నామ్ అయ్యారు జూనియ‌ర్‌.  కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలకు.. ఎన్టీఆర్ ఎంత చెబితే అంత‌. అయినా, వారిని గ‌ట్టిగా హెచ్చ‌రించ‌కుండా.. వారితో క్ష‌మాప‌ణ‌లు చెప్పించ‌కుండా.. ఇలా క‌ర్ర విర‌గ‌కుండా, పాము చావ‌కుండా.. ఎన్టీఆర్ వీడియోతో ర‌క్తి క‌ట్టించార‌ని అంతా విమ‌ర్శిస్తున్నారు. అందుకే, వ‌ర్ల రామ‌య్య ఓ అడుగు ముందుకేసి.. మీ నాన్న సీత‌య్య బ‌తికుంటేనా? అంటూ ఎన్టీఆర్ ప‌రువంతా తీసిపారేశారు. అటు, కొడాలి నాని మాత్రం ఎన్టీఆర్‌తో త‌మ‌కెలాంటి సంబంధాలు లేవ‌ని.. ఒక‌ప్పుడు తామంతా ఒక‌టే కానీ, ఇప్పుడు కాద‌న్న‌ట్టు వివ‌ర‌ణ ఇవ్వ‌డం వెనుక జూనియ‌ర్ ఆదేశాలు ఉన్నాయ‌ని అనుమానిస్తున్నారు. కాస్త లేటైనా.. లేటెస్ట్‌గా వ‌ర్ల రామ‌య్య‌, బుద్దా వెంక‌న్న‌లు జూనియ‌ర్‌ను టార్గెట్ చేయ‌డం.. వ్యూహాత్మ‌క‌మే అంటున్నారు. ఎన్టీఆర్ గోడ మీది పిల్లి లాంటి వాడ‌నే విష‌యం బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డ‌మే వీరి ఉద్దేశ్యమ‌ని భావిస్తున్నారు. జూనియ‌ర్‌ను న‌మ్ముకుంటే ఉప‌యోగం లేద‌ని.. పార్టీ కోసం ఆయ‌న చేసిందీ.. చేస్తున్నాదీ.. చేయ‌బోయేదీ.. ఏమీ లేదు.. ఏమీ ఉంద‌డు అని నంద‌మూరి అభిమానుల‌కు తెలిసొచ్చేలా చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవాల‌నే తాప‌త్ర‌యంతోనే ఎన్టీఆర్ ఆ మేర‌కైనా స్పందించార‌ని.. లేదంటే ఆ వీడియో కూడా వ‌దిలే వారు కాద‌ని అంటున్నారు. ఇలా ఎన్టీఆర్‌కు టీడీపీపై గానీ, నంద‌మూరి కుటుంబం మీద కానీ.. అస‌లేమాత్రం ప్రేమాభిమానాలు లేవ‌ని తాజా ఎపిసోడ్‌తో తేలిపోయింద‌ని టీడీపీ నేత‌లు, ప్ర‌జ‌లు క్లారిటీకి వ‌చ్చేస్తున్నారు. అందుకే, జూనియ‌ర్‌ను న‌మ్ముకొని ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు. ఎన్టీఆర్ దండ‌గ‌..అంటున్నారు.  జ‌గ‌న్‌పై చిరంజీవి తిరుగుబాటు!.. టికెట్ ధ‌ర‌ల‌పై తెగింపు!

 మోడీ వేస్ట్.. మమత గ్రేట్! బీజేపీ ఎంపీ సంచలనం..

ఆయన బీజేపీ ఎంపీ. కాని రాజకీయ అంశాల్లో తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తుంటారు. విపక్షాలను పొగుడుతుంటారు. కొన్నిసార్లు విపక్షాలను ఏకి పారేస్తారు. ఏ విషయంలోనైనా ఆయన రియాక్షన్ మిగితా వాళ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇప్పటిదాకా చెబుతున్న ఆ నేత ఎవరో కనుక్కున్నారా.. ఆయన ఎవరో కాదు.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి.  వివాదాస్పద, సంచలన ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలిచే సుబ్రమణ్యస్యామి తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీఅయి ఉండి ఈసారి ఆయన ఏకేంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే టార్గెట్ చేశారు. మోదీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇది, అది అని కాదని, అన్నింటిలోనూ మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని  తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సుబ్రమణ్యస్వామి. ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, విదేశీ వ్యవహారాలు, అంతర్గత భద్రత వంటి విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందన్న సుబ్రహ్మణ్యస్వామి.. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును ‘అపజయం’గా అభివర్ణించారు. పెగాసస్ డేటా భద్రతా ఉల్లంఘన విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.   టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసిన తర్వాతి రోజే  సుబ్రమణ్యస్వామి.. ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అంతేకాదు  మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించారు. ఆమెను జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు వంటి రాజకీయ దిగ్గజాలతో పోల్చారు. ఆమె చెప్పిందే చేస్తారని, చేసేదే చెబుతారంటూ పొగడ్తలు కురిపించారు. రాజకీయాల్లో ఇలాంటి గుణం చాలా అరుదని మమతను కీర్తించారు బీజేపీ ఎంపీ.  సుబ్రహ్మణ్యస్వామి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘మన అణ్వాయుధానికి చైనా భయపడకపోతే, వారి అణ్వాయుధానికి మనం ఎందుకు భయపడుతున్నాం?’’ అంటూ ఈ నెల 23న ట్వీట్ చేశారు. అంతకుముందు ధరల పెరుగుదలపై ఓ ట్విట్టర్ యూజర్‌ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రధానికి ఆర్థికశాస్త్రం తెలియదని అన్నారు. మోదీ ప్రభుత్వం పట్టనట్టుగా ఉందని, విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత విషయంలో భారతదేశ పరిస్థితి ఏమంత బాగోలేదన్నారు. చైనా మన భూభాగాన్ని దోచుకుంటున్నప్పుడు ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. భారతమాతను అణగదొక్కిన ఈ వ్యక్తులు చైనాను దురాక్రమణదారు అని పిలవడానికి ఇష్టపడడం లేదని సుబ్రమణ్య స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తో మాకేం సంబంధం.. కొడాలి నాని హాట్ కామెంట్స్ తాజాగా తమకు కొరకరాని కొయ్యగా మారిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గ్రేట్ అంటూ.. ప్రధాని నరేంద్రమోడీ వేస్ట్ అనే అర్ధం వచ్చేలా సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీలో కాక రేపుతున్నాయి. స్వామి తీరుపై కొందరు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. అయితే స్వామిపై యాక్షన్ తీసుకునే చర్యలు మాత్రం ఉండకపోవచ్చని, అలాంటి సాహసం బీజేపీ చేయకపోవచ్చనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  

నాలుగు బిర్యానీ పాకెట్లతో మీ ఫ్యామిలీ ఖతం.. వైసీపీ నేత అనుచరుల వార్నింగ్.. 

గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఓ వ్యాపారాని బెదిరించారు. మాజీ ఎంపీ అనుచురల అరాచకం తాజాగా వెలుగు చూసింది.  వ్యాపారంలో భాగస్వాముల మధ్య వివాదం తలెత్తడంతో.. నల్లపాడులోని విద్యుత్ బైక్ షోరూంపై మోదుగుల అనుచరులు దౌర్జన్యానికి దిగారు. సిబ్బందిని కొట్టి షోరూంకు తాళాలు వేశారు. బాధితుడు హరికిషన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు షోరూం తాళాలు తీయించారు.  అయితే ఎస్పీ బదిలీతో మరోసారి షోరూంకు తాళాలు వేశారు మోదుగుల అనుచరులు. తామేమీ చేయలేమని నల్లపాడు పోలీసులు చెబుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.25లక్షలు ఇవ్వాలని మోదుగుల అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. నాలుగు బిర్యానీ పొట్లాలు ఖర్చు చేస్తే మీ కుటుంబం ఉండదని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తనకు రక్షణ కల్పించాలని బాధితుడు హరికిషన్ వేడుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.