ఏపీ డిప్యూటీ సీఎంకు అసమ్మతి సెగ??|
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, జిల్లా నుంచి జిల్లాకు, నియోజక్ వర్గం నుంచి నియోజాక వర్గానికి విస్తరిస్తున్నాయి. ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తమ మాటే, శిలాశాసనం అన్నట్లుగా వ్యవహరించిన వారు, అలాగే, యథా సీఎం తథా మంత్రి, యథా మంత్రి తథా ఎమ్మెల్యే అన్నట్లుగా, పై నుంచి కింది వరకు ఎవరికి వారు, తమ తమ పరిధిలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించారు. అయితే, ఇప్పడు సీన్ రివర్స్ అయ్యింది. తాడేపల్లి ప్యాలెస్ మొదలు పంచాయతీ స్థాయి వరకు ఎక్కడి క్కడ అసమ్మతి బుసలు కొడుతోంది. కాగా, తాజగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కి సొంత పార్టీలో అసమ్మతి మొదలైంది. పెనుమూరు మండలానికి చెందిన ఆయన వ్యతిరేక వర్గం సమావేశమై నారాయణ స్వామిపై ఘాటుగా విమర్శలు చేశారు. నారాయణస్వామి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఎవరిని అడిగి మండల పార్టీ కన్వీనర్లను మార్చేశారని సొంత పార్టీ వారే నిలదీస్తున్నారు.
‘గడప, గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను ఆహ్వానించడం లేదనీ, పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టారని.. టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణస్వామి నియమించిన కన్వీనర్లను అంగీకరించేది లేదని గట్టిగా ధిక్కార స్వరం విమర్శించారు. నారాయణస్వామి అధికారులు, పోలీసుల్ని అడ్డుగా పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని సొంత పార్టీ శ్రేణులే చెబుతున్నాయి, ఇదిలా ఉంచితే తనపై అసమ్మతీయులు చేిస తీరుపై నారాయణ స్వామి ఆగ్రహం వ్య్తం చేశారు,. అసమ్మతి వర్గం తీరుపై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ పార్టీ అభివృద్ధికి పనిచేయనివారు టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారని.. సొంత పార్టీకి నష్టం చేసేవాళ్లను వదిలేసే ప్రసక్తేలేదన్నారు. పెనుమూరు మండలంలో కొందరు సొంత పార్టీ నాయకులే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వాటిని సహించేదిలేదని హెచ్చరించారు.
కొందరు భూ ఆక్రమణదారులకు నోటీసులు అందాయని.. తప్పు చేయకుంటే ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలి కానీ తన మీద నిందలు మోపడం ఎంతవరకు సమంజసమని నారాయణ స్వామి అసమ్మతి నేతలపై ఎదురు ది చేస్తున్నారు.అసమ్మతి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడినవారికి కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
మరోవైపు నారాయణ స్వామికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఊహించని పరిణామం ఎదురైంది. సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు కార్వేటినగరం పంచాయతీలో పర్యటిస్తున్న సందర్బంగా యువకుల నుంచి డిప్యూటీ సీఎంను యువకులు నిలదీశారు. డీఎస్సీ నిర్వహణ, నిరుద్యగోగ యువతకు ఉద్యోగావకాశాలు. జాబ్ క్యాలెండరక తదితర అంశాలపై జనం డిప్యూటీ సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలను కూడా వారీ సందర్భంగా ప్రస్తావించారు.
నిజానికి ఇది ఒక్క ఉప ముఖ్యమంత్రి సమస్య కాదు ... మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికీ వారు అసమ్మతి సెగల తాకిడికి ఉక్కపోతకు గురవుతున్నారు. అంతే కాదు,మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేర్కొనే ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఎదురవుతున్న అవమానాలను భరించలేక పోతున్నారు. అందుకే ఆయన గడప గడకు మన ప్రభుత్వం సమీక్షకు కూడా హాజరు కాలేదని, అలాగే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రికెట్ ఇవ్వక పోతే రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవసాయం చేసుకుంటానని అన్నారు . అనే ఆయన ఎంతగా హర్ట్’ అయ్యారో వేరే చెప్పవలసిన అవసరం లేదు. వైసీపీ ఇలాంటి ఎమ్మెల్యేలు ఒకరో ఇద్దరో కాదు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులూ పట్టుకుని ప్రయోజనం ఏముందని అంటున్నారు,