వణికిన ఈశాన్యం.. ఆరుగురు మృతి
ఈశాన్య భారతదేశం భూకంపంతో వణికిపోయింది. బంగ్లాదేశ్, ఇంపాల్, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ లో ఉదయం 4.30 గంటలకు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పెద్ద పెద్ద భవనాలు, మల్టీ కాంప్లెక్స్ లు కూలిపోయాయి. ఈ ఘటనకు ఆరుగురు మృతి చెందగా 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు సహాయక చర్యలకు గాను ఎన్టీఆర్ ఎఫ్ బృందాలుఇంపాల్ బయలుదేరాయి.
ఇదిలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ భూకంపం గురించి ఆరా తీశారు. అసోం ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇంపాల్ లోని భూకంప పరిస్థితి పై సమీక్షిస్తున్నారు.