ఐఎస్ఐ హనీ ట్రాప్ లో సల్వీందర్ సింగ్.!

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి కేసులో గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సల్వీందర్ సింగ్ పై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎన్ఐఏ దర్యాప్తులో సల్వీందర్ సింగ్ ఐఎస్ఐ హనీ ట్రాప్ లో పడినట్టు తెలుస్తోంది. అంతేకాదు సల్వీందర్ సింగ్ గతంలో లేడి కానిస్టేబుళ్లను కూడా లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్ఐఏ అధికారుల విచారణలో ఇంకా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాను తరుచుగా పంజ్ పీర్ దర్గాకు వెలుతుంటానని సల్వీందర్ సింగ్ అధికారులకు చెప్పాడు. అలా దర్గాకు వెళుతున్న సమయంలో ఉగ్రవాదులు తమను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దర్గా అధిపతి సోమ్ మాత్రం తాను ఎప్పుడూ సల్వీందర్ సింగ్ ను చూడలేదని, డిసెంబర్ 31వ తేదిన మొదటి సారి చూశానని చెప్పారు. అంతకు ముందు ఎన్నడూ ఆయన ఈ దర్గా దగ్గరకు రాలేదని, ప్రార్థనలు చెయ్యలేదని అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సిల్విందర్ సింగ్ పై అనుమానాలు మరింత పెరిగాయి.

రైల్వే జీఎంపై జేసీ ఫైర్.. టీడీపీ ఎంపీల బాయ్ కట్..

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాకు టీడీపీ ఎంపీలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విజయవాడలోని రైల్వే కల్యాణ మండపంలో రవీంద్ర గుప్తా.. టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుప్తా  రైల్వేకు సంబంధించి పలు సూచనలు చేయాలంటూ కోరారు. అయితే ఈ సమావేశానికి హాజరైన జేసీ దివాకర్ రెడ్డి ఒక్కసారిగా రవీంద్ర గుప్తాపై ఫైర్ అయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లకు నిధులు కేటాయించలేనప్పుడు, కొత్త రైళ్లను కేటాయించనప్పుడు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేనప్పుడు ఈ సమావేశాలెందుకని ప్రశ్నించారు.  దీంతో జేసీ, రైల్వే జీఎం రవీంద్ర గుప్తాతో వాగ్వాదానికి దిగారు. ఎంపీలు అక్కడి నుండి వాకౌట్ చేశారు. మరోవైపు ఈ విషయంపై ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ రైల్వే అధికారుల సమావేశాన్ని టీడీపీ అధికారులు బహిష్కరించలేదని అన్నారు. పైరవీలు చేస్తే తప్ప రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు రావని.. వరదలు, తుఫాన్లు వస్తే కొట్టుకుపోయే విశాఖలో రైల్వే జోన్ ఎందుకు.. రాజధాని, గుంటూరు ప్రాంతాల్లో రైల్వే జోనులు ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడంలేదని వ్యాఖ్యానించారు.

రెండో రోజు విచారణలో మల్లాది.. పొంతన లేని సమాధానాలు..

కల్తీ మద్య కేసులో మల్లాది విష్ణు రెండో రోజు విచారణకు హాజరయ్యారు. కల్తీ మద్యం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన నేపథ్యంలో ఎప్పుడైనా పోలీసులు విష్ణుని అరెస్ట్ చేయోచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న విచారణలో పాల్గొన్న మల్లాది తనకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.  డీఐజీ మహే్‌షచంద్ర లడ్హా దాదాపు 25 నుండి 30 ప్రశ్నల వరకూ మల్లాదిని అడుగగా దేనికి సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని సిట్ తెలిసింది. అంతేకాదు ఈకేసుకి సంబంధించి అదుపులోకి తీసుకున్న నిందితులు విచారణలో బయటపెట్టిన అంశాలకు, విష్ణు చెబుతున్న దానికి పొంతన లేకుండా ఉన్నట్లు తెలిసింది. దీంతో సిట్ అధికారులు గురువారం కూడా విచారిస్తున్నారు. మద్యంలో తెల్లటి ద్రావకం లాంటి పదార్ధం ఎలా కలిసిందని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రశ్నకు గాను ఎవరో కావాలనే ఆ ద్రావకాన్ని కలిపి ఉంటారని విష్ణు చెప్పినట్లుగా తెలిసింది.

తెలుగువాళ్లుక ఆ హక్కు ఉంది.. వెంకయ్య

తమిళనాడులో తెలుగు నిర్భంధ చట్టం ద్వారా అక్కడ ఉన్న తెలుగు విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు కూడా తెలుగు విద్యార్దులు తెలుగులోనే పరీక్షలు రాసే విధంగా చూడాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశించినా సర్కార్ మాత్రం అదే పట్టించుకోనట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఢిల్లీలో ఈరోజు ఆంధ్రా అసోసియేషన్ 2016 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వెంకయ్య మాట్లాడుతూ.. తమిళనాడులో తెలుగు నేర్చుకోకుండా చేయడం దురదృష్టకరమని అన్నారు. సొంత బాష నేర్చుకోవడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని.. ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్న తెలుగు విద్యార్ధులకు తెలుగు నేర్చుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. అయితే తమిళనాడులో తెలుగుపై ఆంక్షలు విధించడం శోచనీయమన్నారు.

జమ్మూ కాశ్మీర్ సీఎం మృతి..

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయిూద్ (79) మృతి చెందారు. చాలా కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ముఫ్తీ మహమ్మద్ సయిూద్ ఈరోజు కన్నుమూశారు. అయితే ఇప్పుడు ముఫ్తీ మహమ్మద్ సయిూద్ మృతితో తరువాత సీఎం పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే ఆయన కూతురు మహబూబా మఫ్తీని తదుపరి ముఖ్యమంత్రిని చెయ్యడానికి పీడీపీ నాయకులు సిద్దం అవుతున్నారు. అంతేకాదు మహబూబా మఫ్తీని ముఖ్యమంత్రిని చెయ్యడానికి బీజేపీ కూడా మద్దతు తెలిపింది. అయితే గతంలోనే ముఫ్తీ మహమ్మద్ సయిూద్ అనారోగ్యం కారణంగా బాధ్యతలు సరిగా నిర్వర్తించడానికి సమయం లేకపోవడంతో మహబూబా మఫ్తీనే ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించారు. కానీ అది అప్పుడు జరగలేదు. ఇప్పుడు ముఫ్తీ మహమ్మద్ సయిూద్ మరణించడంతో మహబూబా ముఫ్తీనే తమ నాయకురాలు అని అంటున్నారు. ఇక ఆయన అంత్య క్రియలు అయిన తరువాత పీడీపీ, బీజేపీ నాయకులు సమావేశం అయ్యి తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీనేతలు అంటున్నారు.

దమ్ముంటే నన్ను గెంటేయండి.. శత్రుఘ్న సిన్హా

డీడీసీఏ వ్యవహారంలో అరుణ్ జైట్లీ పై బిహార్ బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ జైట్లీ పై విమర్శు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తనపై కూడా పరువునష్టం దావా వేయాలని కూడా సవాల్ విసిరారు. ఇందుకు గాను కీర్తి ఆజాద్‌ బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరోనేతకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది ఎవరో కాదు బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్నసిన్హా. అరుణ్ జైట్లీ పై ఆరోపణలు చేసిన కీర్తి ఆజాద్‌ ను కీర్తి ఆజాద్‌ను హీరో అని పొగుడుతూ శత్రుఘ్నసిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీ కీర్తి ఆజాద్‌ తరహాలో శత్రుఘ్నపై కూడా బీజేపీ చర్యలు తీసుకునే అవకాశముందని వార్తులు వస్తున్న నేపథ్యంలో వాటికి స్పందించిన శత్రుఘ్న దమ్ముంటే బీజేపీ తనను పార్టీ నుంచి బహిష్కరించాలని.. పార్టీ నుంచి తనను తొలగించినా తన పంథా మారదని.. నేను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పని చేయలేదు. అయినా నన్ను వారు పార్టీని గెంటేయాలనుకుంటే గెంటేయ్యవచ్చు అని సవాల్ విసిరారు. అంతేకాదు ఈసందర్భంగా ఆయన న్యూటన్ మూడో సిద్ధాంతాన్ని కూడా గుర్తు చేశారు. నన్ను పార్టీ నుండి గెంటేస్తే చర్యకు తగిన ప్రతి చర్య కూడా ఉంటుందని అన్నారు. మరి శత్రుఘ్నవ్యాఖ్యలకు బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

చివరి నిమిషం వరకూ అభ్యర్ధులను ప్రకటించకూడదు.. టీఆర్ఎస్

జీహెచ్ఎంసీ అభ్యర్ధుల ఎంపికలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహాత్మంగా వ్యవహరిస్తుంది. చివరి నిమిషం వరకూ అభ్యర్ధులను ప్రకటించకూడదని నిర్ణయం.. అభ్యర్ధికన్నా గుర్తుతోనే ప్రజల్లోకి వెళ్లాలనే యోచిస్తుంది. నామినేషన్ విత్ డ్రా రోజున బీ ఫార్మ్ ఇవ్వనుంది. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ 15 మందికి టికెట్లు ఇవ్వాలని చూస్తుంది. ప్రతి వెయ్యి మందికి ఓ కో అర్డ్ నేటర్ ఏర్పాటు చేసుకోవాలని.. ప్రతి డివిజన్ ఇంఛార్జ్ 40 మంది కార్యకర్తలను సమీకరించుకోవాలి సూచించారు. అంతేకాదు 150 డివిజన్ల ఇంఛార్జ్ లతో కేసీఆర్ ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబధించి వివిధ సంఘాలతో టీఆర్ఎస్ చర్చలు జరుపుతుంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం ఇష్టం లేదు.. కేటీఆర్

గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య పచ్చ గడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితే కాలం మారుతున్న కొద్ది ఇద్దరు సీఎంలు కూడా మారుతూ.. ప్రస్తుతం ఎలాంటి వాదనలు లేకుండా ఉంటున్నారు. అయితే చంద్రబాబు సంగతేమో కాని.. కేసీఆర్ మాత్రం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎందుకంటే అసలే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అందుకే గ్రేటర్ ఎన్నికల బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకున్న కేటీఆర్ కూడా ఎక్కడ విమర్సించకుండా మాట్లాడుతున్నారు. అంతేకాదు చంద్రబాబు, కేసీఆర్ కలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ లో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడానికి సుముఖంగానే ఉన్నారని.. కానీ అది కొందరికి నచ్చట్లేదని అన్నారు. అంతేకాదు..తమకు ఎవరి పట్లా ధ్వేషం లేదని.. ఉద్యమ సమయంలో సీమాంధ్రులపై పరుషంగా మాట్లాడామని.. కానీ ఈ 18 నెలల్లో తమ పరిపాలన ఏంటో సీమాంధ్రులు కూడా చూశారని.. అందుకే తామేం చేశామో చూసి ఆత్మవిమర్శ చేసుకుని ఓటేయాలని ఆయన కోరారు. తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. మరి అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని కేటీఆర్ అంటున్నారు.. అది ఎన్నికలంత వరకేనా.. లేక ఎప్పుడూనా అనేది చూడాలి..

తెలంగాణలో ఏపీ తరహా కాల్ మనీ దందా..

గత కొద్దిరోజుల క్రితమే ఆంధ్రరాష్ట్రంలోని విజయవాడలో కాల్ మని దందా చేసిన అరాచకాలు వెలుగుచూశాయి. వడ్డీకి మనీ ఇచ్చి వాళ్లు తిరిగి చెల్లించని నేపథ్యంలో వాళ్లు ఆస్తులను అక్రమంగా లాక్కుంటూ దందా నడిపేవారు. సుమారు 250 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహాలో దందా చేస్తున్న వారి వైనం బయటపడింది. హైదరాబాద్ లోని పాతబస్తీలో కాల్ మనీ తరహా వడ్డీ వ్యాపారం చేస్తున్న ఫైనాన్స్ సంస్థలపై దాడి చేసి 86 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో 26మందిపై కేసులు నమోదు చేసి మరో 36మందిని విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే మరో వంద మంది బాధితులు డిసిపి కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.

కవితకు రేవంత్ రెడ్డి కౌంటర్.. మీకు భోళా శంకరుడే..

తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూతురు కవిత.. కేసీఆర్ ను ఉద్దేశించి తన తండ్రి భోళా శంకరుడు అని వ్యాఖ్యానించింది.. ఇందుకు గాను రేవంత్ రెడ్డి కవితకు కౌంటర్ ఇస్తూ కవితమ్మా! కెసిఆర్ మీ కుటుంబానికే భోళా శంకరుడే అని ఎద్దేవా చేశారు. అంతేకాదు కేసీఆర్ చేసిన యాగంపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. తన పదవిని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ఆయుత చండీయాగం చేశారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం కెసిఆర్ చెప్పే మాటలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని.. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోసం ప్రాణాలు ఇచ్చేందుకు తెలంగాణలో వేలాది మంది ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మోడీకి తీవ్రవాదులతో లింక్‌లు ఉన్నాయి.. అలీ

పంజాబ్ పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసినందుకు గాను పలువురు ప్రధాని మోడీ విమర్శలు చేస్తునే ఉన్నారు. ఇప్పటికే శివసేన, కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించగా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఇద్రిస్ అలీ ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి తీవ్రవాదులతో లింక్‌లు ఉన్నాయని అందుకే పఠాన్‌కోట్ పై తీవ్రవాద దాడి జరిగిందనుకుంటున్నానని, ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన తర్వాత ఈ దాడి ఎందుకు జరిగిందని, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని అతను అన్నాడు. అయితే అలీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతల సంగతేమో కానీ ఆ పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. అలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. తను వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని కోరారు. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయోద్దని హెచ్చరించింది. మొత్తానికి అలీకి తమ పార్టీ నేతల నుండి వ్యతిరేకత రావడం గమనార్హం.

జయలలిత డిమాండ్.. నోట మాట రాని మోడీ..

తమిళనాడు సీఎం జయలలిత రాజకీయంగా ప్లాన్ వేయడంలో దిట్ట. ప్లాన్ చేయాలంటే ఆమె తరువాతే ఎవరైనా. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పట్టేలా నిర్ణయం తీసుకున్నారు జయలలిత. మొన్నీ మధ్యనే తమిళనాడులో జరిగే జల్లికట్టు క్రీడపై అనుమతి ఇవ్వాలని కేంద్రాన్నికోరారు. దీనికి కేంద్రం కూడా ఏం చేయాలో తెలియక అనుమతినిచ్చింది. ఇప్పుడు అది అయిపోయిందంటే.. భారీ వర్షాల వల్ల తమిళనాడు చాలా నష్టపోయిందని.. దీనికి గాను రూ.25912 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్టోబర్-డిసెంబర్ మధ్య నాలుగు దశల్లో కురిసిన భారీ వర్షాల వల్ల తమ రాష్ట్రంలో 470 మంది మృతి చెందారని తెలిపారు. లక్ష పశువులు మృతి చెందగా.. 382768 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వివరించారు. అంతేకాదు భారీ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన 245మంది కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున సాయమందించినట్టు జయలలిత తెలిపారు. రానున్న రోజుల్లో మిగతా కుటుంబాలకు సాయమందిస్తామన్నారు. మరోవైపు జయలలిత చేసిన డిమాండ్ కు బీజేపీ నేతలు ఆమెపై గుర్రుమంటున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టి ప్రజలను ఆదుకుంటున్న పేరుతో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని జయలలిత చూస్తుందని అంటున్నారు. మరోవైపు జయలలిత డిమాండ్ కు మోడీ కి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారంట. ఈ నేపథ్యంలో జయలలిత ప్లాన్ వర్కవుట్ అవుద్దో లేదో చూడాలి. కానీ మోడీకి జయలలిత మద్దతు ఖచ్చితంగా కావాల్సిందే.. మరి జయలలిత డిమాండ్ కు మోడీ ఏమంటారో..?

మహిళా జర్నలిస్టును చంపిన ఐసిస్... గూఢాచార్యం చేస్తుందని

ఉగ్రవాదుల ఆకృత్యాలకు అంతులేకుండా పోతుంది. రాక్షసత్వంతో ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. కొద్ది రోజుల క్రిందట పారిస్ లో దాడులు జరిపి ప్రజలను భయాందోళనకు గురిచేసిన సిరియా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయారు. ఓ మహిళా జర్నలిస్టును చంపేశారు. రక్కా ప్రాంతంలోని పౌర జర్నలిస్టుగా పని చేస్తున్న రుఖియా హసన్ అనే మహిళ గూఢచార్యం చేస్తున్నదని ఆరోపిస్తూ  అతి దారుణంగా ఉరి తీసి చంపేశారు. ఈ విషయాన్ని సిరియాలోని సీనియర్ జర్నలిస్టు సంస్థ ‘సిరియా డైరెక్ట్' తెలిపింది. ఇప్పటివరకూ ఉగ్రవాదులు ఐదుగురు విలేకరులను చంపారని ఈ పత్రికలో పేర్కొంది. అంతేకాదు ఇంకా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రఖియా హసన్ నిసాన్ ఇబ్రహీం అనే పేరుతో ఉగ్రవాదులు చేసే అరాచకాలను ఫేస్ బుక్ ద్వారా అందరికి తెలిపేదంట. తాను చివరి సారిగా.. నన్ను ఉగ్రవాదులు చంపేస్తానని బెదిరిస్తున్నారు..  వాళ్లు నన్ను చంపేస్తారని.. ఇలా జీవించడం కంటే చనిపోవడం మేలు అని సిరియా మానవహక్కుల సంస్థ (ఆర్బీఎస్ఎస్) వ్యవస్థాపకుడు అబు అహమ్మద్ కు చివరికి సారిగా ట్వీట్టర్ లో వెల్లడించిందట.

ప్రచారంలో చాలా స్లోగా కాంగ్రెస్ పార్టీ..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడానికి పార్టీలు చాలా రకాలుగా కష్టపడుతున్నాయి. ఏం చేస్తే ప్రజలు తమ వైపు మొగ్గుతారా అని ఎవరికి తగిన వ్యూహాలు వారు రచించుకుంటున్నారు. అయితే అందరి సంగతేమే కాని ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కాస్త వెనకబడే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుటికే అధికారపార్టీ.. టీడీపీ-బీజేపీ పార్టీలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేపట్టి దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి గాంధీభవన్ లో సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి హైటెక్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ నేతలు సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికార టీఆర్ ఎస్ నిజస్వరూపాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నామని ప్రకటించారు. మరి అందరూ ఎప్పుడో మేల్కొని సోషల్ మీడియాను ఉపయోగించుకుంటుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు మేల్కొని సోషల్ మీడియాను ఉపయోగించుకుంటుంది. మరి ఇంత స్లోగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఏం దూకుడు చూపిస్తుందో చూడాలి.

మోడీకి నవాజ్ షరీఫ్ ఫోన్.. ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటాం..!

  పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరం పై జరిగిన దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడికీ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా షరీఫ్ పఠాన్ కోట్ పై దాడి చేసిన ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మోడీకి హామీకి ఇచ్చారంట. ఈ విషయాన్ని ప్రధాని కార్యలయం తెలిపింది. మోడీ కూడా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని షరీఫ్ కు చెప్పారంట. అంతేకాదు దానికి సంబంధించి కొంత సమాచారాన్ని కూడా అందించారట. అయితే పఠాన్ కోట్ విమాన స్థావరంపై దాడి చేసిన ఘటనలో ఐఎస్ఐ, జైషే మహ్మద్ సంస్థల ప్రమేయం ఉందన్న కారణంతో.. ఆసంస్థల నేత అయిన మౌలానా మసూద్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు విద్యార్ధుల సమస్యలను పట్టించుకోండి.. కేటీఆర్

అమెరికా వెళ్లే తెలుగు విద్యార్ధులకు ఇమ్మిగ్రేషన్ అధికారులు ద్వారా కష్టాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. విచారణ పేరిట చాలా మంది విద్యార్దులను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇప్పటికే వెనక్కి పంపించేశారు. అయితే ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి కేటీఆర్ ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమెరికా కాన్సులేట్ జనరల్ మైఖేల్ ముల్లిన్సను కలిశారు.  ఈ సందర్భంగా కేటీఆర్ అమెరికా వెళ్లి చదవాలనకునే తెలుగు విద్యార్ధులకు ఎదురవుతున్న సమస్యలను పట్టించుకోవాలని మైఖేల్ ముల్లిన్సను కోరారు. చదువుకోసం హైదరాబాద్ నుండే ఎక్కువ మంది విద్యార్ధులు అమెరికా వెళుతున్నారని.. ఎంతో సమయం.. డబ్బు వెచ్చించి వెళుతున్న వారిని తిప్పి పంపడం సమంజసం కాదని తెలిపారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు కూడా లేఖ రాస్తామని.. ఇక్కడ వరకైతే ప్రభుత్వ పరంగా మేం చర్యలు తీసుకుంటా.. కాన్సులేట్ పరంగా మీరు చర్యలు తీసుకోండి అని సూచించారట. అంతేకాదు విద్యార్ధులకు నకిలా డాక్యుమెంట్లు ఇవ్వడం వల్లే నష్టపోతున్నారని ముల్లిన్సన్ కు చెప్పడం జరిగిందట. దీనికి ముల్లిన్సన్ సమస్య పరిష్కారానికి మేం కూడా ప్రయత్నిస్తున్నాం.. విద్యార్ధుల నకిలీ డాక్యుమెంట్లు వల్లే సమస్యలు వస్తున్నాయని.. తొందరలోనే సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారంట.

కంటతడి పెట్టిన బరాక్ ఒబామా..

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారు. దేశంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని.. అనవసరంగా అమాయక పిల్లలు బలవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడేళ్ల క్రితం కనెక్టికట్ లో 20మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలను ముష్కరులు తుపాకీ గుళ్లకు బలి చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విషయం గుర్తు చేస్తూనే ఒబామా కన్నీరు పెట్టుకున్నారు. తుపాకుల వినియోగాన్ని, తుపాకీ హింసను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని.. చట్టాల్లో మార్పులు అవసరమని వ్యాఖ్యానించారు. గన్ లైసెన్స్ నియంత్రణ చట్టాలను లాబీ అడ్డుకుంటుంది.. తుపాకుల అమ్మకాల కట్టడికీ కాంగ్రెసు వ్యతిరేకతను పట్టించుకోకుండా కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.