కేసీఆర్ చండీయాగంలో పాల్గొన్న చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తు్న్న ఆయుత మహా చండీయాగం ఐదోరోజు కొనసాగుతోంది. ఈ యాగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. విజయవాడ నుంచి చంద్రబాబు కనకదుర్గమ్మ అమ్మవారి చీర, కుంకుమ, ప్రసాదం తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు తదితరులు చంద్రబాబుతో కలసి చండీయాగానికి వచ్చారు. యాగశాల వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బాల్క సుమన్ తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలికారు.