కేజ్రీవాల్ రూల్ తో 4 లక్షల ఆదాయం..
posted on Jan 2, 2016 @ 4:49PM
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాలుష్యం నివారణకి సరి-బేసి విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఈ విధానం వల్ల అటు కాలుష్య నివారణతో పాటు.. ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చేలా కనిపిస్తుంది. అదెలాగంటే.. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై రూ. 2వేల రూపాయలు జరిమానా విధించమని కేజ్రీవాల్ తెలిపిన సంగతి విదితమే. నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా సరి-బేసి విధానాన్ని అమలు చేసిన తొలి రోజునే దాదాపు 200 పైన మంది ఈ నిబంధనను ఉల్లంఘించి పోలీసులకు బుక్కాయ్యారు. దీంతో వారి దగ్గర నుండి పోలీసులు 4 లక్షలకు పైగా జరిమానా వసూలు చేశారు. ఇదిలా ఉండగా ఈ నిబంధనల వల్ల ఆటో డ్రైవర్లు మీటర్లు కూడా వేయకుండా ప్రజల దగ్గర నుండి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు చాలా వచ్చాయి. దీంతో పోలీసు రవాణా శాఖ అధికారులు 76 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి జరిమానా వసూలు చేశారు.