సూపర్ స్టార్ మనవరాలు హాట్ ఫోటోస్.. షారుక్ కొడుకు ఆర్యన్ కూడా..!

  ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అంతా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు ‘నవ్య నవేలి నంద' మీదనే నడుస్తోంది. ఇంతకీ తను ఏదన్నా సినిమాలో నటిస్తుందా అంటే తప్పులో కాలేసినట్టే.. అదేంలేదు.. తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల గురించి. ఇంతకీ ఆ ఫోటోస్ లో ఏముందనేగా మీ సందేహం.. అసలు సంగతేంటంటే.. నవ్య నవేలి నంద లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో చదువుకుంటోంది. అయితే ఆమె ఇటీవలే 18వ ఏట అడుగు పెట్టింది. ఈ సందర్బంగా ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ మధ్య పార్టీ చేసుకుందట. ఈ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలతో పాటు తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది. ఈ ఫోటోల్లో షారుక్ తనయుడు ఆర్యన్ కూడా ఉండటం గమనార్హం. గతంలో నవ్య, ఆర్యన్ మీద పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.        

నెలన్నర తరువాత సమంత ట్వీట్..

  టాలీవుడ్ లో అతి తక్కువ టైంలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకొని.. గొల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరంటే సమంత అని ఎవరికైనా గుర్తేచ్చేస్తుంది. ఇక ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆమెకు కూడా అభిమానులంటే అభిమానం ఎక్కువే. ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ ఏదో ఒకటి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసే సమంత దాదాపు నెలన్నరగా తన ట్వీట్టర్ కు పని చెప్పలేదు. దీంతో అభిమానులు కూడా కాస్త నిరాశపడిపోయారు. అయితే ఇప్పుడు సమంత మళ్లీ ట్విట్టర్లోకి వచ్చి  ‘ఐయామ్ బ్యాక్’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు ‘మీతో పాటు ఉన్నప్పుడు నాకు ఒక సైన్యంతో నిలబడినట్లుగా ఉంటుంది’ అని అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్టర్లో పేర్కొన్నారు. మొత్తానికి సమంత అభిమానులను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టినట్టు కనిపిస్తుంది.

మోడీతో కేసీఆర్ ఏకాంత సేవ.. కవితకి కేంద్రమంత్రి..!

  తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉంది. ఈ విజయాలకు తోడు.. ప్రతిపక్ష పార్టీల నుండి అనేక మంది నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.. చేరడానికి సిద్దంగా ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి కొన్ని సంవత్సరాల వరకూ రాజకీయంగా ఎలాంటి ఢోకా లేదనిపిస్తుంది. ఇక వరుస విజయాలతో కేసీఆర్ ఫ్యామిలీనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు.   ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్.. మంత్రి పదవిలో కేటీఆర్.. ఎంపీ పదవిలో కవిత..మేనల్లుడు హరీశ్ రావు కూడా మంత్రి పదవిలో ఉండటంతో కుటుంబమే రాష్ట్రాన్ని ఏలుతుందని ప్రతిపక్షనేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు దీనికి తోడు ఎంపీ కవితకు ఎన్డీయే సర్కారులో కేంద్రమంత్రి పదవి దక్కబోతుందా...? అనే సందహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే వారు దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపారు. అయితే వీరిద్దరూ తెరాస ఎన్డీయేలో భాగస్వామ్యం కావాలనే దానిపై చర్చ జరిపి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అదే జరిగితే... తెరాసకు కనీసం 3 పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.   ఇదిలా ఉండగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం జులైలో ముగుస్తుందని తెలిసిన విషయమే. అయితే మోడీ మాత్రం వెంకయ్యను ఎట్టి పరిస్థితిలో వదలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. మరోవైపు వెంకయ్య నాయుడిని  పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయనను తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  ఈయన తో పాటు మరో కేంద్రం నుంచి మరో ఇద్దరు మంత్రులకు కూడా గవర్నర్లుగా పంపే అవకాశం ఉంటుందనే చర్చ నడుస్తోంది. మరి వీటన్నింటికి సమాధానం దొరకాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి మృతి

అమెరికాలోని అలబామాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. వివరాల ప్రకారం ట్రాయ్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న వీరు శనివారం రాత్రి ఓ కారులో ప్రయాణిస్తుండగా.. మరో కారు ఎదురుగా వచ్చి ఢీ కొట్టడంతో హైదరాబాద్‌, నాచారంకు చెందిన మాథ్యూస్‌ అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన నలుగురికి గాయాలయ్యాయి. నలుగురిలో భరత, వంశీ ఇద్దరూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినవారు. వీరిద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. నిఖిల్‌, యశ్వంత అనే మరో ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మరోవైపు అలమాబాలోని బాధితులకు సహాయం చేసేందుకు అట్లాంటా కాన్సుల్‌ జనరల్‌ డీ.వీ.సింగ్‌ అక్కడికి చేరుకుంటున్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ వెల్లడించారు.

భూమా రావడాన్ని వ్యతిరేకిస్తున్నాం..

  భూమా నాగిరెడ్డి టీడీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నామని శిల్పా సోదరులు అన్నారు. భూమా చేరితే మా కార్యకర్తలు ఇబ్బంది పడతారని..కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని.. అందుకే భూమా నాగిరెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అంతేకాదు భూమాతో విబేధాలు ఉన్న మాట వాస్తవమే.. దీనిపై గతంలో కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడాం.. అప్పుడు మేం వ్యతిరేకించాం.. ఇప్పుడు మరోసారి మాట్లాడటానికి రమ్మన్నారు.. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని అశిస్తున్నాం అని తెలిపారు. మరోవైపు వైసీపీలోకి మేము వెళ్తున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోంది.. మేం టీడీపీని వీడే ప్రసక్తే లేదు అని అన్నారు.

నాగబాబు కూతురు నిహారిపై మెంటల్ హరాస్మెంట్ కేసు..!

  నాగబాబు కూతురు నిహారిపై మెంటల్ హరాస్మెంట్ కేసు వేస్తారంట. నిహారిక అంతలా ఎవరిని హెరస్ చేసింది.. ఎవరు నిహారికపై కేసు పెడతానన్నారు అనే కదా సందేహం.. అసలు సంగతేంటంటే నిహారిక.. ఢీ జూనియర్స్ ప్రోగ్రామ్ ద్వారా ముందు బుల్లి తెరకు పరిచయమై మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె హీరోయిన్ గా కూడా ఎంట్రీ అవ్వబోతుంది. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు నిహారిక ప్రధాన పాత్రలో ‘ముద్ద పప్పు ఆవకాయ్' అనే వెబ్ సీరీస్ యూట్యూబులో ప్రసారం అవుతున్న నేపథ్యంలో దానికి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన నిహారిక..  ‘ముద్ద పప్పు ఆవకాయ్' లో మాత్రం తన నటనతో అందరిని కట్టిపడేస్తుంది. ఇప్పటికీ నాలుగు ఎపిసోడ్స్ రాగా.. ఎపిసోడ్ ఎపిసోడ్ కి తరువాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని రేపుతున్నాయి. దీనిలో భాగంగానే కొందరు వ్యూవర్స్ చేస్తున్న కామెంట్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. నెక్ట్స్ ఎపిసోడ్ రిలీజ్ చేయడం లేటయితే మెంటల్ హరాస్మెంట్ కేసు వేస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నిహారిక ముద్ద పప్పు ఆవకాయ్ మంచి పేరునే సొంత చేసుకుంది.

పీఏసి పదవికి భూమా రాజీనామా.. కారెక్కి నేరుగా చంద్రబాబు దగ్గరికి..!

  భూమా నాగిరెడ్డి వైసీపీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భూమా వైసీపీ లో ఉంటారా.. లేక టీడీపీలో ఉంటారా అన్న డైలమాలో ఉండగా.. దీనికి మరింత వేడి పుట్టించేలా.. భూమా నాగిరెడ్డి తన పీఏసి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఇంకా ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసి బయటకు వస్తున్న ఆయన్న పార్టీ మారుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానికి ఆయన మీ సస్పెన్సుకు తెర దించుతాను. గంటల్లోనో, రోజుల్లోనో మీడియా ముందు చెప్పాల్సింది చెప్పేస్తాను అని చెప్పారు.  అంతేకాదు అక్కడ నుండి ఆయన నేరగా కారులో చంద్రబాబు దగ్గరకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈరోజో రేపే ఆయన టీడీపీ ఎంట్రీ గురించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

జాట్లు రక్షకులే కానీ.. సెహ్వాగ్.. యువరాజ్

  తమకు రిజర్వేషన్లు కల్పించాలని హర్యానాలో జాట్లు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వీరు విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ స్పందించారు. 'జాట్లు రక్షకులేగానీ, విధ్వంసకారులు' కాదని.. రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటూ రిజర్వేషన్ల అంశంపై తమ డిమాండ్లను వ్యక్తపరచాలని విజ్ఞప్తి చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. క్రీడలు, ఆర్మీ, తమకు ఇష్టమున్న రంగాల్లో మన సత్తాచాటి దేశం గర్వపడేలా చేయాలని హింసాత్మక పనులు చేయవద్దంటూ  సెహ్వాగ్ కోరాడు. కాగా  మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్వతహాగా జాట్ వర్గానికి చెందిన వాడు.

ఫ్రీడమ్ 251పై రూ 31 లాభం.. నేనేం తప్పు చేశాను..

ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ పై ఇప్పటికే పలు విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్ స్పందిస్తూ .. నన్నెందుకు ఇలా చుట్టుముడుతున్నారు..? నేనేం తప్పు చేశాను..? నేను కానీ.. నా కంపెనీ కానీ ఎప్పుడైనా టాక్స్ ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా..? నాపైన పోలీసు కేసులు ఎమైనా ఉన్నాయా..? అంటు పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాదు.. నా వ్యాపార ప్రణాళికలు నాదగ్గర ఉన్నాయి.. ఇప్పటివరకూ మొత్తం 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయి.. మొదటి విడతలో 25 లక్షల స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తామని తరువాత మరో 25 లక్షల స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఇంకా ఒక్కో హ్యాండ్ సెట్ పై తనకు 31 రూపాయలు కూడా లాభం వస్తుందని ఆయన వివరించారు. మరి ఇదంతా ఎంత వరకూ నిజమో ఆ ఫోన్లు బయటకు వస్తే కాని తెలియదు.

బంగ్లాదేశ్‌లో పూజారి హత్య

  బంగ్లాదేశ్‌లో ఉన్న అల్ప సంఖ్యాలకులను భయభ్రాంతులను చేసేందుకు దాడులు కొనసాగుతున్నాయి. గత అయిదు నెలలో ఇలా మూడు సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా జోగేశ్వర్‌ అనే పూజారిని నిన్న కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపేశారు. బంగ్లాదేశ్‌లోని  పంచఘర్‌ అనే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గౌరీ అమ్మవారి గుడిలో పూజారిగా ఉన్న జోగేశ్వర్‌ ఉదయం వేళ పూజలకు సిద్ధపడుతుండగా ఈ దారుణం సంభవించింది. ఈ సమయంలో ఒక్కసారిగా గుడిలోకి చొచ్చుకువచ్చిన ఆగంతకులు గుడి మీద బాంబులు వేసి పూజారిని పొడిచి చంపేశారు. జోగేశ్వర్‌ అరుపులు విని ఆయనను కాపాడేందుకు వచ్చిన మరో భక్తుని కూడా తీవ్రంగా గాయపరిచారు.

భూమా చేరికపై డైలమా.. శిల్పా సోదరులకు ఫోన్..

వైసీపీలో కీలకమైన నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆయన కూతురు భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరుతున్నట్టు వార్తుల వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి చేరికపై హైడ్రామానే నడుస్తోంది. అయితే మరోపక్క భూమా చేరికపై టీడీపీ నుండి శిల్పా సోదరులు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తక్షణం విజయవాడ రావాలని ఈరోజు శిల్పా సోదరులకు సీఎం కార్యాలయం నుండి ఫోన్ వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా చంద్రబాబు భూమా చేరికపై శిల్పా సోదరులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీకి శుభవార్త అంటున్న కేజ్రీవాల్..

హర్యానాలో రిజర్వేషన్లు కోరుతూ జాట్లు నిరసలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసనల వల్ల ఢిల్లీ ప్రజలకు నీటి కొరత ఏర్పడింది. అదెలా అంటే.. ఆందోళనలో భాగంగా హర్యానా నుండి ఢిల్లీకి వచ్చే కాలువను జాట్లు అడ్డుకోవడంతో ఢిల్లీకి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ ఢిల్లీ ప్రజలు వాడుకునేందుకు చుక్క నీరు లేక బాధపడుతున్నారు. తక్షణం కేంద్రం చర్యలు తీసుకోవాలి అంటూ ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ చేసిన గంటకే మరో ట్వీట్ చేశారు. ఢిల్లీకి శుభవార్త.. మునాక్ కాలువ గేట్లు తెరుచుకున్నారు. ఇంక ఢిల్లీకి నీరు ఎంత సేపట్లో చేరుతుందో.. ఎప్పుడు నీటి సరఫరా మొదలవుతుందో తరువాత వెల్లడిస్తా అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

జెఎన్ యూ హైటెన్షన్.. కొట్టి చంపేస్తారనే పారిపోయాం..

జెఎన్ యూ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్జల్ గురు ఉరిశిక్షను నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో దేశ వ్యతిరేక నినాదాలు చేసినందుకు గాను ఆరుగురు విద్యార్ధులపై రాజద్రోహం క్రింద కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరుగురిలో విద్యార్ధి సంఘ నేత అయిన కన్హయ్య కుమార్ ను పోలిసులు అదుపులోకి తీసుకోగానే మిగిలిన వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వీరిపై లుక్‌అవుట్‌ నోటీసులను సైతం జారీ చేయడం జరిగింది. అయితే పారిపోయిన ఐదుగురు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, రామ నాగ, అశుతోశ్ కుమార్, అనంత్ ప్రకాశ్ లు నిన్న సడెన్ గా విశ్వవిద్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఈ సందర్బంగా వారు ఎందుకు పారిపోయారో అని చెప్పారు. ఈ కేసులో జరుగుతున్న దర్యాప్తుకు సహకరించేందుకే వచ్చామని.. ఈ కేసులో భాగంగా బయటకు వచ్చిన వీడియో అసలది కాదు.. అది నఖిలీదని తెలిపారు. అంతేకాదు ఆ వీడియోను చూసిన తరువాత విద్యార్దులు తమను ఎక్కడ కొట్టి చంపేస్తారో అని భయపడే పారిపోయామని చెప్పుకొచ్చారు

కూల్ కెప్టెన్ ధోనికే కోపం తెప్పించిన ప్రశ్న.. ఏంటది..?

ఎంత టెన్షన్ ఉన్నా కాని గ్రౌండ్లో తన కూల్ వ్యూహాలతో.. కూల్ కెప్టన్ పేరు పొందిన క్రికెటర్ ఎవరంటే వెంటనే ధోని గుర్తొస్తాడు. అలాంటి ధోనికి ఒక్కసారిగా కోపమొచ్చిందట. ఇంతకీ ధోనికి అంతలా కోపం తెప్పించింది ఏవరనుకుంటున్నారా.. అది వ్యక్తి కాదు ధోనికి ఎదురైన ప్రశ్న.. అసలు సంగతేంటంటే.. ధోని రిటైర్మెంట్ పై ఎప్పుడూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం.. ధోని టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన అసలు టోటల్ క్రికెట్ కే వీడ్కోలు పలకనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే.. ఆయన ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ పయనమవుతున్న సందర్బంగా జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి ధోని రిటైర్మెంట్ గురించి ప్రస్తావించాడు. అంతే ధోని ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఎప్పుడూ ఆ ప్రశ్నలు తప్ప వేరే ప్రశ్నలుండవా అంటూ అతనిపై అంతెత్తున ఎగిరిపడ్డాడు. అంతేకాదు అసలు ఇప్పుడప్పుడే రిటైర్ కాబోయేది లేదని ఘాటుగానే సమాధానం చెప్పాడంట. మొత్తానికి ఎప్పుడూ కూల్ గా ఉండే ధోనికి కూడా కోపం తెప్పించారు.

పవన్ వస్తారా..? చిన్నారి ప్రాణం నిలబెడతారా..?

ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే నడుస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చిన న్యూస్ గురించే హాట్ టాపిక్ రన్ అవుతోంది. అది ఏంటంటే..పశ్చిమగోదావరి, భీమవరం పెదపేటకు చెందిన రత్నరాజు, రమాదేవిల కుమార్తె  కనకచంద్రదీపిక. ఈ పాపకు బ్లడ్ క్యాన్సర్. అయితే ఈచిన్నారి పవన్ కళ్యాణ్ అంకుల్ నా దగ్గరకి వస్తే చాలు నా జ్వరం పోతుంది అని కోరింది. దీంతో రిక్వెస్ట్ పవన్ చేరుతుందా.. పవన్ కళ్యాణ్ ఆ చిన్నారిని చూడటానికి వస్తారా.. ఆ పాప ప్రాణం నిలబెడతారా..?అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు విషయం ఏంటంటే నా జ్వరం పోతుంది అని చెప్పిన పాపకు.. తనకు క్యాన్సర్ అనే విషయం తెలీదు. తెలిసినా అది ఏంటో అర్ధం చేసుకునే వయసు కూడా కాదు.  ఇక ఈ కాన్సర్ వ్యాధి ట్రీట్ మెంట్ కు సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మెడికల్‌ హైపవర్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.గోవిందరాజ్‌కుమార్‌ లు స్పందించి వైద్యం నిమిత్తం కొన్ని పరీక్షలను బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చేయించేలా చర్యలు తీసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో.. పాప చికిత్స నిమిత్తం ఎమన్నా డొనేషన్ ప్రకటిస్తారో లేదో..చూడాలి.