కేసీఆర్ భాష మార్చుకోవాలి.. సోమిరెడ్డి

తెదేపా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం కేసీఆర్, జగన్ ల వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్, జగన్ కుమ్మక్కయి ఎన్నికుట్రలు చేసినా చంద్రబాబుని కాని, టీడీపీని కానీ ఏం చేయలేరని విమర్శించారు. కేసీఆర్ ఒక అవినీతిపరుడు, ఆయన ఇంకో అవినీతి పరుడితో చేతులు కలిపాడు అని ఎద్దేవ చేశారు. హైదరాబాద్ తన సొంతం అయినట్టు సీమాంధ్రులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని.. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని సూచించారు. కాగా.. పాలమూరు ప్రాజెక్టుకు మేమేమి వ్యతిరేకం కాదని కానీ ప్రాజెక్టు నిర్మించాలంటే కృష్ణాబోర్డు అనుమతి తీసుకోవాలని సూచించారు.

Teluguone gnews banner