పాలమూరు ఎత్తిపోతల పథకం ఆవిష్కరించిన కేసీఆర్
posted on Jun 11, 2015 @ 12:03PM
తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీనితోపాటు కరివెనలో పైలాన్ ను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిబొట్టు కోసం పాలమూరు తపిస్తోందని..నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. అంతేకాక పదిహేను రోజులకొకసారి ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా ముంపుకు గురవుతున్న తండావాసులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తరువాత కేసీఆర్ సాయంత్రం 6 గంటలకు భూత్పూర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.