phone tapping

ఎట్టకేలకు విజయవాడ కోర్టుకు కాల్ డేటా

  అనేక వాదనలు ముగిసిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కాల్ డేటాను విజయవాడ కోర్టుకు అందించింది. సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటా వివరాలను సీల్డ్ కవర్ లో పెట్టి విజయవాడ కోర్టుకు అందజేశారు. అయితే సీల్డ్ కవర్ లో ఏమున్నాయో తెలిపేలా నోట్ ఫైల్ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదులు ప్రొవైడర్లను కోరగా.. సర్వీసు ప్రొవైడర్ల తరపు న్యాయవాదులు దానిని తిరస్కరించి సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా సీల్డ్ కవర్ లోనే ఇస్తామని స్పష్టం చేశారు. కాగా కాల్ డేటా వివరాలను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన మేరకు ప్రత్యేక మెసెంజర్ ద్వారా కాల్ డేటా వివరాలను హైదరాబాద్ లోని హైకోర్టు రిజిస్ట్రార్ కు ఇవ్వాల్సి ఉంది.

T congress leaders speaker

తలసాని రాజీడ్రామా పై స్పందించిన స్పీకర్

  తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీడ్రామాకు తెరపడినట్టు తెలుస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మంత్రిగా కొనసాగుతున్న విషయంపై రాజకీయ వర్గాలు మండిపడ్డాయి. ఒక పార్టీలో పదవి పొంది రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి మారి మంత్రిగా కొనసాగడం చట్ట విరుద్ధమని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. అయితే కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి సమాచార హక్కు చట్టం కింద అసెంబ్లీ సచివాలయానికి దరఖాస్తు చేయగా వాళ్లు రాజీనామా లేఖ రాలేదని చెప్పడంతో నిజం బయట పడింది. దీంతో ఒక్కసారిగా నేతలందరూ తలసానిపై విరుచుకుపడ్డారు. ఇన్నీ రోజులు రాజీనామా చేశానని తలసాని డ్రామాలాడారని తిట్టిపోశారు. అయితే తలసాని మాత్రం 2014 డిసెంబర్ 16న తాను రాజీనామా చేశానని.. రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పి మరీ ఎన్నో ప్రగల్భాలు పలికారు.   మరోవైపు తలసాని రాజీనామా చేస్తే స్పీకర్ ఇంతవరకూ ఎందుకు ఆమోదించలేదని పలు రాజకీయ నేతలు ప్రశ్నించారు. అంటే దీనిలో స్పీకర్ కు కూడా సంబంధం ఉందా అని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు తలసాని రాజీనామా పై స్పీకర్ మధుసూధనాచారి స్పందించినట్టు తెలుస్తోంది. తలసాని రాజీనామాపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలు మధుసూధనాచారిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన తలసాని రాజీనామాపై అనుకూలంగా స్పందినట్టు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.

ISIS Terrorists

ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో నలుగురు భారతీయులు?

  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు లిబియాలో పనిచేస్తున్న నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసినట్లు తాజా సమాచారం. వారిలో ఒకరు తెలంగాణా రాష్ట్రానికి చెందిన గోపీకృష్ణ అని సమాచారం. మిగిలిన ముగ్గురూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చెర నుండి చాలా అరుదుగా ఎవరో ప్రాణాలతో బయటపడగలరు. కనుక ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు చెలరేగిపోతున్న లిబియా తదితర ప్రాంతాలలో పనిచేస్తున్న భారతీయులలో నర్సులు, కార్మికులు ముఖ్యంగా నిరుపేద కూలీలు ఎక్కువగా పనిచేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కినవారిని ఏదోవిధంగా విడిపించుకొనే ప్రయత్నాలు చేయవచ్చును. కానీ మళ్ళీ వాళ్ళు వేరేవాళ్ళని కిడ్నాప్ చేయరనే నమ్మకం ఏమీ లేదు. కనుక ఇప్పటికయినా కేంద్రప్రభుత్వం మేల్కొని వారందరినీ వెనక్కి రప్పించకపోతే మున్ముందు ఇంకా అనేకమంది అమాయకులయిన భారతీయులు ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది.

phone tapping

ఏపీకి ఇవ్వండి.. అలాగే మాకు ఇవ్వండి

    ఓటుకు నోటు కేసు వ్యవహారంలో బయటపడిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో మరో కీలకమైన మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కాల్ డేటా ఇవ్వాలని సుప్రీంకోర్టు సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించగా సర్వీసు ప్రొవైడర్లు మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కాల్‌డేటా అంశంలో తదుపరి అన్ని రకాల చర్యలను నిలిపివేస్తూ(స్టే ఆల్‌ ఫరదర్‌ ప్రొసీడింగ్స్‌) మధ్యంతర స్టే జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి తక్షణమే కాల్ డేటా ఇవ్వాలని ఆదేశించిన మేరకు సర్వీసు ప్రొవైడర్లు వెంటనే కాల్ డేటాను సీల్డ్‌కవర్‌లో ఉంచి ఇవ్వాలని.. అలాగే ఈ సీల్డు కవర్లను మెసెంజర్‌ ద్వారా తమకు కూడా ఇవ్వాలని సూచించింది.

Ap t Govt employees adjustment

టీ సర్కార్ ఒంటెద్దుపోకడ ఆపాలి

  ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల బదిలీపై వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం స్ధానికత ఆధారంగా ఆంధ్రా మూలాలున్న ఉద్యోగులను బదిలీ చేస్తానంటుంటే.. మరో వైపు ఏపీ ప్రభుత్వం మాత్రం దీనికి అంగీకరించట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. నిబంధనల ప్రకారమే జన్మస్థలం ఆధారంగా స్థానికతను నిర్ధారించి, ఏపీ మూలాలున్న విద్యుత్‌ ఉద్యోగులను గుర్తించి అక్కడికి బదిలీ చేశామని తెలిపింది కేంద్రానికి స్పష్టం చేసింది. ఉద్యోగుల బదిలీ విషయంపై కమలనాథన్‌ కమిటీ ఏర్పాటు చేశామని ఏపీ ప్రభుత్వం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కార్పొరేషన్లకు కమలనాథన్‌ కమిటీ నిబంధనలు వర్తించవని చెపుతుంది.   మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీ స్ధానికత ఆధారంగా ఆరుగురు జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్లను ఏపీ విద్యుదుత్పత్తి సంస్థకు తాజాగా బదిలీ చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసిన పనికి ఏపీ ప్రభుత్వం మండి పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని.. ఉద్యోగుల బదిలీలపై కోర్టులో కేసులున్నప్పటికీ ఇలా వ్యవహరిచండం సబబుకాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. కమల్ ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్ర హోంశాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకువెళ్లనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దుపోకడ మానితే చాలా బాగుంటుందని అంటున్నారు.   ఇదిలా ఉండగా విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై ఈ నెల 24న హోంకార్యదర్శి ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసి అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో హోం కార్యదర్శి నేతృత్వంలో ఇరు రాష్ర్టాల సీఎస్‌లు, ఇంధన శాఖల కార్యదర్శులు, ఇరు రాష్ర్టాల విద్యుత్‌ సంస్థల సీఎండిలతో సమావేశం జరగనుంది. అయితే రాష్ట్రవిభజన జరిగిన తరువాత తొలగించిన ఉద్యోగులందరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా తమకు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే చాలా విషయాల్లో మొట్టికాయలు తిన్న తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కూడా మొట్టికాయలు తింటే కాని వూరుకునేలాలేదు.

ap cm chandrababu

చంద్రబాబు దృష్టి దానిపైనేనా

  ఏపీ రాజధాని నిర్మాణం ఇది ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడికి చాలా ముఖ్యమైన ఘట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రజలందరి ఆశ రాజధానిపైనే ఉంది. మరి అలాంటి రాజధానిని నిర్మించి.. ప్రజలలో తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొవాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పనో అర్ధమైన విషయమే. అంటే ఇప్పటికిప్పుడు ఏపీ రాజధాని నిర్మాణం అంటే అది అసాధ్యమైనదే కానీ.. దీనిని దశల వారీగా దానిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే 2018 వరకూ మొదటి దశ పూర్తి చేయాలని.. రెండోదశను 2035 వరకూ పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇందుకు తగ్గట్టుగానే సింగపూర్ బృందం ప్లానింగ్ చేసింది.   మరోవైపు ఈ ఏపీ రాజధాని అమరావతి మొదటి దశ 2018 వరకూ పూర్తి చేయాలి అనుకోవడంలో కూడా ఒక కారణం ఉందని అనుకుంటున్నారు రాజకీయ వర్గాలు. 2019 లో జరగబోయే ఎన్నికలను దష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈనిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఏపీ మంత్రులతో భేటీ కూడా ఏర్పాటుచేసి ఎలాగైనా 2018 లోపు ఏపీ రాజధానిలో కొంత వరకైనా నిర్మాణం జరగాలని సూచించారట. ఈ మొదటి దశలో కనీసం 45, 50 అంతస్తులు కలిగిన రెండు ఆకాశ హర్మ్యాలు.. మంత్రులకు గాను.. వారి విధులు నిర్వహించడానికి కావల్సిన కార్యలయాలకుగాను.. ప్రభుత్వ కార్యలయాలకు సంబంధించి భవంతులను నిర్మించాలని భావిస్తున్నారట. ఇప్పటికే నెలరోజుల్లో తాత్కాలిక రాజధాని నిర్మించి.. హైదరాబాద్ లో ఉన్న కొన్నిశాఖలను విజయవాడకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి చంద్రబాబు ఏపీ రాజధాని నిర్మాణానికి గట్టి పట్టుదలతోనే ఉన్నట్టు తెలుస్తోంది. నిజంగానే ఆయన అనుకున్నట్టు 2018 వరకూ తను అనుకున్నట్టు రాజధానిని నిర్మించినట్టుయితే రాబోయే ఎన్నికల్లో తనే మళ్లీ అధికారంలోకి రావచ్చు అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

parakala prabhakar

పరకాలతో పాట్లు

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ పై ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గుర్రుగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అసలు అన్ని విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని.. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే చంద్రబాబుకు పరకాల వల్ల ఇబ్బందులు వచ్చాయనడంలో సందేహం లేదు. సీఎం సలహాదురుడిగా ఉన్న పరకాలను ఈమధ్యజరిగిన సభత్య నమోదు కార్యక్రమంలో సభ్యుడిగా ఉండమంటేనే ఉంటలేదు... అలాంటిది అతనికి సీఎం ఎంతో గొప్పగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపించే గోదావరి మహాపుష్కరాలకు ఛైర్మన్ గా నియమించారు. అయితే పరకాల మాత్రం ఈ విషయంలో కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వలో ఉన్న అన్ని శాఖలు, మంత్రులు, అధికారులు వీళ్లను మర్చిపోయినట్టున్నారు పరకాల. అందుకే ఎవరితో ఎటువంటి సంప్రదింపులు లేకుండా తన ఇష్టంవచ్చినట్టు నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.   అంతేకాక ఎవరిని సంప్రదించకుండా అన్నీ గాలికొదిలేసి ఈ కార్యక్రమానికి అవ్వాల్సిన ఖర్చుగురించి రూపాయికి నాలుగు రూపాయిలు వేసి చూపించారట. పాపం చంద్రబాబు జపాన్ నుండి తిరిగివచ్చి ఆ లిస్ట్ చూసి జుట్టుపీక్కుని ఆఖరికి అన్నిటినుండి 70% వరకూ కట్ చేసి అన్ని ఖర్చులు తగ్గించారట. అక్కడితో ఆగారా.. అన్ని న్యూస్ కెమేరాల మాదిరిగానే నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ కెమేరా కూడా షూటింగ్ చేసుకుందని.. అందుకోసమే కొంచం ఆలస్యమైందని నోరుజారారు. మరోవైపు ఎవరి అనుమతులు లేకుండా తనకు ఇష్టమైన ఛానల్ కు పెద్ద మొత్తంలో డబ్బులు కట్టపెట్టారనే వార్తలు కూడా కట్టపెట్టారనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో అటు చంద్రబాబుని.. పార్టీని ఇబ్బందులకు గురిచేశారు. అయితే ఇప్పుడు అందరికి అర్ధమవ్వని విషయం ఏంటంటే ఇన్ని జరిగినా పరకాల రాజీనామా చేస్తారని అనుకున్నారు కానీ తాను మాత్రం రాజీనామా చేయలేదు సరికదా అప్పటినుండి మొహం మాడ్చుకుని కూర్చున్నారు. కానీ అదే పరకాల తనకు తానుగా రాజీనామా చేస్తే పరిస్ధితి వేరేలా ఉండేదని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు చంద్రబాబు ఇంత జరిగినా పరకాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇవన్నీ చాలదన్నట్టు పరకాల వ్యతిరేక వర్గం ఇప్పటికే పరకాలది ఐరన్ లెగ్ అని ప్రచారం చేస్తున్నారు. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

Anushka sharma

పాపం అనుష్కశర్మ

  బ్యూటీ విత్ బ్రెయిన్ అంటుటారు.. కానీ బ్యూటీ వితవుట్ బ్రెయిన్ అనేలా చేసింది బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ. ఆమె చేసిన మిస్టేక్ ఎంటో తెలిస్తే మీరు కూడా బ్యూటీ వితవుట్ బ్రెయిన్ అని ఒప్పుకుంటారు. ఇంతకీ సంగతేంటంటే భారతదేశం గర్వించదగ్గ మనిషి, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురైంది. ఆయన మరణానికి రాజకీయ నాయకుల దగ్గరనుండి అటు బాలీవుడ్ సెలబ్రిటీలు.. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. అయితే అందరూ ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు కదా మనం కూడా ఒక ట్వీటేద్దాం అనుకుందేమే అనుష్కశర్మ.. అంతే కలాం జీకి ట్వీట్టర్ ద్వారా సంతాపాన్ని తెలిపింది. అయితే అక్కడే అనుష్కశర్మ తప్పులో కాలేసింది. ఈ ముద్దుగుమ్మ ఏపీజే అబ్దుల్ కలాం అని రాయకుండా ఏబీజే కలాం ఆజాద్ అని రాసి ట్వీట్ చేసింది. అయితే తప్పుతెలుసుకొని రెండో సారి మరో ట్వీట్ చేసింది. ఈసారైనా భామ కరెక్ట్ చేసిందంటే అదీ లేదు మళ్లీ అందులో కూడా ‘ఏపీజే కలాం ఆజాద్’ అని తప్పుగా రాసి ఆఖరికి మూడోసారి కరెక్ట్ గా రాయగలిగింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లకు చిరెత్తుకొచ్చి విమర్శలు విసిరారు. పాపం అనుష్కశర్మ బ్యూటీ మీద పెట్టే శ్రద్ద కొంచం జనరల్ నాలెడ్జి మీద పెడితే బావుండు.

phone tapping

ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే హక్కు తెలంగాణకు ఉంది..

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాల్ డేటా ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ కోర్టు తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ప్రతులు ఇవ్వాలనడం న్యాయసమ్మతం కాదని.. ఈ విషయంలో విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే హక్కు తెలంగాణకు ఉందని.. టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు టీసర్కారు అంగీకరించింది. అయితే ఓటుకు నోటు కేసు వ్యవహారం బయటకు వచ్చిన తరువాతే ఫోన్ ట్యాపింగే చేశామని రాంజెఠ్మలానీ తెలిపారు. కాగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు దీనిపై తీర్పు వెలువరించనుంది.

abdul kalam

ముగిసిన కలాం అంత్యక్రియలు

  మాజీ రాష్ట్రపతి, ప్రముఖ భారత క్షిపణ శాస్త్రవేత్త, భారత మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీ నుండి రామేశ్వరానికి నిన్ననే తరలించారు. ఈరోజు రామేశ్వరం రైల్వేస్టేషన్‌ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మస్లిం మత పెద్దలు ఆయన పార్థివదేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి మత సంప్రదాయాల ప్రకారం పార్ధివదేహాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, మంత్రులు, కేంద్రమంత్రులు పారికర్‌, వెంకయ్యనాయుడు, సీఎంలు చంద్రబాబు, ఉమెన్‌చాంది, సిద్దరామయ్య, తమిళనాడు మంత్రి పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆజాద్‌, టీడీపీ ఎంపీ సీఎంరమేష్‌, శాస్త్రవేత్తలు, కోలీవుడ్‌ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. అంతేకాదు కలాం అంత్యక్రియలకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయి అశ్రునయనాలోత కన్నీటి వీడ్కోలు పలికారు.

cm chandrababu

ఆ హక్కు మాకే ఉంది... చంద్రబాబు

  హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం తెలుగుదేశం పార్టీయే కారణమని.. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని..ఇతర పార్టీలు వేటికీ మాట్లాడే హక్కు లేదని అన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించింది తామేనని.. తమ వల్లే ఐటీ రంగంలో హైదరాబాద్ ముందుందని చెప్పారు. అంతేకాదు హైదరాబాదులో రాత్రిపూట రోడ్లు ఊడ్చే విధానాన్ని తానే ప్రవేశ పెట్టానని.. ప్రజలు లేచి రోడ్ల పైకి వచ్చేసరికి శుభ్రంగా ఉండేవని తెలిపారు. టీడీపీ హయాంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులు అన్నీ రూపుదిద్దుకున్నాయి అన్నారు.   అంతేకాదు గతంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉదయాన్నే లేపే అలవాటు ఎన్టీఆరే అలవాటు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. అయితే కేసీఆర్ చేసిన విమర్శలకు సమాధానం చెబుతూ తాను అన్నదాంట్లో తప్పేముందని, ఎన్టీఆర్ తెల్లవారుజామున మూడు గంటలకు లేచేవారని, ఆయనను కలుసుకోవడానికి మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉదయం ఐదు గంటలకే రావాల్సి వచ్చేదని.. అప్పట్లో కేసిఆర్ కూడా అదే సమయానికి వచ్చేవారని అది ఎన్టీఆర్‌తోనే మొదలైందని ఘాటుగా చెప్పారు. ఇప్పుడు ఆన తన దినచర్యను ఎప్పుడు మొదలు పెడుతున్నారో, ఆ పార్టీ వారికే తెలుసునని ఎద్దేవ చేశారు.

apj abdul kalam

కలాంకు అంత లేదు.. అబ్దుల్‌ ఖదీర్‌ ఖాన్‌

  సంచలన వ్యాఖ్యలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని నిన్ననే ఢిల్లీ నుండి రామేశ్వరానికి తరలించారు. అక్కడ ఆయన మృతదేహాన్నిసందర్శనార్ధం ఉంచి ఈ రోజు అంత్యక్రియలు చేయనున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తగానే కాకుండా ప్రజల రాష్ట్రపతిగా ఖ్యాతి గడించిన కలాంను కడసారి చూసేందుకు ఆయన నివాసం వద్ద ప్రజలు బారులు తీరారు. కాగా రాష్ట్రపతి అంత్య క్రియలలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి బయలుదేరారు.. మరికాసేపట్లో రామేశ్వరం చేరుకోనున్నారు.   ఇదిలా ఉండగా కలాం చనిపోయినందుకు ఒక్క భారతదేశంమే కాదు ప్రపంచమంతా ఆయనను.. ఆయన చేసిన సేవలను కొనియాడుతుంటే ఒక వ్యక్తి మాత్రం కలాం ‘ఓ సాధారణ శాస్త్రవేత్త’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను ఎవరంటే పాకిస్థాన్‌ అణుశాస్త్రవేత్త అబ్దుల్‌ ఖదీర్‌ ఖాన్‌. ఈయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అత్యున్నతస్థాయిలో ఉన్నా కలాం సాధారణ జీవితం గడిపారు కానీ ఆయన ఓ సాధారణ శాస్త్రవేత్త మాత్రమే’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షిపణి రంగంలో భారత్‌ విజయాలన్నీ రష్యా సహకారంతో సాధించినవే తప్ప అందులో కలాం ప్రతిభ ఏమీ లేదని కొట్టిపారేశారు.

yakub memon

యాకుబ్ చివరి కోరిక

  ఈరోజు ఉదయం ముంబై వరుస బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకుబ్ మమెన్ ను ఉరితీసిన సంగతి తెలిసిందే. అయితే ఉరితీసే ముందు దోషి చివరి కోరిక తీర్చడం ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు కూడా యాకుబ్ చివరి కోరికలను తీర్చినట్టు సమాచారం. యాకుబ్ చివరి కోరిక ఏంటో తెలుసా.. "నా కూతురిని ఒకసారి కలవాలి". ఇది యాకుబ్ చివరి కోరిక. దీంతో జైలు అధికారులు తన కోరిక నిమిత్తం అందుకు అంగీకరించి తన కూతురు కుటుంబసభ్యులతో మాట్లాడటానికి అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.   ఇదిలా ఉండగా ‘నాకు తెలుసు నేను మరణించబోతున్నాను. ఏదైనా అద్భుతం జరిగితే కానీ, నేను బతకలేను' అని బుధవారం ఉదయం యాకుబ్ అన్నట్టు ఓ హోంగార్డు తెలిపాడు. అంతేకాదు తన ఉరిశిక్ష ఖరారుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో యాకుబ్ బుధవారం చాలా ఆందోళనగా ఉన్నాడని, సుప్రీంకోర్టులో ఏం జరుగుతోందని పదే పదే తనను అడిగాడని ఆ హోంగార్డు తెలిపారు. బుధవారం ఉదయం పూట అల్పాహారం తీసుకున్న యాకుబ్ మెమన్.. మధ్యాహ్నం భోజనం మాత్రం చేయలేదని ఆ కానిస్టేబుల్ చెప్పారు.

yakub memon

యాకుబ్‌ ఉరితాడు అక్కడనుండి వచ్చిందే..

  1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకుబ్‌ మెమెన్‌ను ఈరోజు ఉదయం 7 గంటలకు ఉరి తీశారు. అయితే యాకుబ్‌ మెమెన్‌ ఉరితాడును బిహార్‌లోని బక్సర్‌ కేంద్ర కారాగారం నుండి తెప్పించారు. అంతేకాదు దేశంలో ఏ జైలులో ఉరిశిక్ష అమలు చేయాలన్నా ఉరితాడు ఇక్కడినుండి రావాల్సిందే. గతంలో పాక్‌ ఉగ్రవాది కసబ్‌ను 2012లో పుణెలోని యరవాడ జైల్లో.. పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్‌గురును 2013లో తీహార్‌ జైల్లో ఉరితీయడానికి వాడిన తాళ్లను బక్సర్‌ సెంట్రల్‌ జైలు నుంచే తెప్పించారు. కాగా అతడి మృతదేహానికి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో పోస్టు మార్టం నిర్వహించి అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేయడానికి నాగ్ పూర్ నుండి ముంబైకు తరలిస్తున్నారు. అయితే తొలుత యాకుబ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేయాలా లేక జైలులోనే ఖననం చేయాలా అని అధికారులు డైలమాలో పడ్డా ఆఖరికి తన కుటుంబసభ్యులకే అందజేయాలని నిర్ణయించుకున్నారు. కాగా ముంబైలోని ముస్లీం శవవాటికలో మెమెన్ అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో మెరైన్ లైన్ ముస్లీం శవవాటిక వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

యాకుబ్ మీమన్ కి ఉరి అమలు

  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాకుబ్ మీమన్ రెండవసారి పెట్టుకొన్న క్షమాబిక్ష పిటిషన్ని కూడా తిరస్కరించడంతో అతనిని ఈరోజు ఉదయం 7గంటలకి నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా నిన్న అర్ధరాత్రి తరువాత మళ్ళీ యాకుబ్ కేసును విచారణకు చేప్పట్టింది.   యాకుబ్ ఉరి శిక్షను నిలిపి వేయాలని కోరుతూ అతని తరపున లాయర్ ప్రశాంత్ భూషణ్, రాజు రామచంద్రన్‌ తదితరులు మళ్ళీ నిన్న అర్ధరాత్రి తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.యల్. దత్తు ఇంటి తలుపులు తట్టడంతో ఆయన మళ్ళీ ఈ కేసును నిన్న విచారించి తీర్పు చెప్పిన త్రిసభ్య ధర్మాసనాన్ని వారి అభ్యర్ధనను పరిశీలించి తీర్పు చెప్పమని కోరడంతో ఈరోజు తెల్లవారు జామున 3-4.30 గంటల వరకు దీనిపై సుప్రీం త్రిసభ్య బెంచి పునర్విచారణ చేప్పట్టింది.   యాకుబ్ ని ఉరి తీసే ముందు కనీసం ఏడు రోజుల ముందు ‘డెత్ వారెంట్’ అందించాలని కానీ ఆవిధంగా చేయనందున అతని హక్కుల ఉల్లంఘన జరిగిందని కనుక అతని ఉరి శిక్షను నిలిపివేయాలని అతని న్యాయవాదులు వాదించారు. కానీ అతనికి టాడా కోర్టు ఉరి శిక్ష విధించినప్పుడే డెత్ వారెంట్ జారీ చేసిందని కనుక మళ్ళీ కొత్తగా మరోమారు డెత్ వారెంట్ జారీ చేయవలసిన అవసరం లేదని భారత అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదించారు. ఏదో విధంగా యాకుబ్ ఉరి శిక్షను వాయిదా వేయించాలనే ఉద్దేశ్యంతోనే అతని న్యాయవాదులు ఈవిధంగా పదేపదే పిటిషన్లు వేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారని, వాటిని సుప్రీం ధర్మాసనం అనుమతించరాదని, యాకుబ్ కి ఉరి శిక్షని నిలిపివేయరాదని ఆయన వాదించారు. తెల్లవారు జామున సుమారు 4.30 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య బెంచి యాకుబ్ మీమన్ కేసు విషయంలో ఎక్కడా తప్పు జరుగలేదని అతనికి ఉరి శిక్ష వేయడం సమంజసమేనని తీర్పు చెప్పింది.   అప్పటికే యాకుబ్ మీమన్ ఉరి శిక్ష అమలుకు నాగపూర్ జైలు అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. పద్ధతి ప్రకారం చివరి సారిగా నిన్న రాత్రి అతని కుటుంబ సభ్యులతో అతనిని మాట్లాడనిచ్చారు. అతనికి ఇష్టమయిన కిచిడిని ఇచ్చారు. అతను దానిని కొద్దిగా మాత్రమే తిన్నాడు. అవతల సుప్రీం ధర్మాసనంలో అతని ఉరిశిక్షపై వాదోపవాదాలు జరుగుతుంటే మరోవైపు జైలు అధికారులు అతనిని ఉరి శిక్షకు సన్నధం చేస్తున్నారు. సుప్రీం ధర్మాసనం అతని ఉరి శిక్షను ఖరారు చేసినట్లు దృవీకరించుకొన్న తరువాతనే అతనిని డిజిపి, మేజిస్ట్రేట్ సమక్షంలో ఈరోజు ఉదయం 7గంటలకు ఉరి తీశారు. అనంతరం అతని శవానికి పోస్ట్ మార్టం నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అందజేస్తారు.   ఇదివరకు ఎన్నడూ లేనంతగా యాకుబ్ ఊరిపై దేశంలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అతనిని ఉరి తీసినందుకు ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉంది కనుక ఇంటలిజెన్స్ విభాగం దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మహారాష్ట్ర అంతటా ప్రధానంగా నాగపూర్, ముంబైలలో పోలీసులను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లుగానే భద్రతని మరింత కట్టుదిట్టం చేసింది.

యాకుబ్ మీమన్ కి ఉరి ఖరారు

  1993 ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళ కేసులో దోషిగా నిర్దారించబడిన యాకుబ్ మీమన్ పిటిషన్ని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి న్యాయవ్యవస్థ అన్ని అవకాశాలను కల్పించిందని కానీ అతను కేసులో దోషి అని పూర్తి సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడిన తరువాతనే అతనికి మరణ శిక్ష విధించడమయిందని అతనికి ఆ శిక్ష విధించడం సమంజసమేనని పేర్కొన్న ధర్మాసనం యాకుబ్ మీమన్ పెట్టుకొన్న పిటిషన్ని తిరస్కరించింది.   ఈరోజు రాష్ట్రపతికి పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్నిఆయన హోం శాఖ అభిప్రాయంకు పంపించారు. అంటే ఆయన దానిని తిరస్కరించినట్లే భావించవచ్చును. అదే విషయం తెలియజేస్తూ హోంశాఖ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర గవర్నర్ కూడా యాకుబ్ మీమన్ క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించారని ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలియజేసారు. ఇక యాకుబ్ మీమన్ కి ఉరి ఖాయం అయినట్లే. రేపు ఉదయం సరిగ్గా 7గంటలకు అతనిని నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరి తీస్తారు. అనంతరం తదనంతర లాంచనాలన్నీ పూర్తి చేసి అతని శరీరాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. రేపే అతని పుట్టిన రోజు, మరణించే రోజు కావడం విశేషం.

అబ్దుల్ కలాం లాస్ట్ ట్వీట్

  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం షిల్లాంగ్ ఐఐఎం సమావేశంలో ప్రసంగిస్తూనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి యావత్ భారతదేశం దిగ్ర్భాంతికి గురైంది. ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచిన అబ్దుల్ కలాం మరణించడంతో దేశం ఒక్కసారిగా మూగబోయింది. కలాం మృతికి ఎంతోమంది సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలు తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం కేవలం భారత్‌కే కాకుండా యావత్ ప్రపంచానికే తీరని లోటన్నారు. అనేక మంది ట్వీట్లతో తమ సంతాపాన్ని తెలిపారు. కానీ అబ్దుల్ కలాం చేసిన చివరి ట్వీట్ ఎంటో తెలుసా..   అబ్దుల్ కలాం చివరి ట్వీట్.. 'నివాసయోగ్యమైన గ్రహం భూమి' అనే అంశంపై మాట్లాడేందుకు షిల్లాంగ్ ఐఐఎం వెళ్తున్నానని, శ్రీజన్ పాల్ సింగ్, శర్మ కూడా వస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.   కాగా కలాం మరణంతో ఆయన జన్నస్థలమైన రామేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రామేశ్వరంలోనే ఉంటున్న కలాం అన్నయ్య ముత్తుమీరా లెబ్బాయ్ మరైకర్ తమ్ముడి మరణ వార్త విని కన్నీరుమున్నీరు అయ్యారు. తన తమ్ముడ్ని చూపించాలని బోరున ఏడ్చారు.

ఫోన్ ట్యాపింగ్ ట్విస్ట్..

  ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పుటికే ఈవిషయంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాల్ డేటా ఇవ్వడానికి నిరాకరించి.. కాల్ డేటా ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేస్తానని హెచ్చరించిందని.. కాల్ డేటా ఇవ్వద్దన్నదని.. కేంద్రం కూడా సమాచారం ఇవ్వాల్సిన పని లేదని చెప్పిందని ఏవేవో కబుర్లు చెప్పింది. కాని విజయవాడ కోర్టు మాత్రం పాలన వేరు.. చట్టాలు వేరని కాల్ డేటా ఇవ్వాల్సిందేనని.. సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. అయితే సర్వీసు ప్రొవైడర్లు అక్కడితో ఆగారా అంటే లేదు విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాని అక్కడ కూడా వాళ్లకు చుక్కెదురై కాల్ డేటా ఇవ్వాల్సిందేనని సర్వీసు ప్రొవైడర్లును ఆదేశించింది. దీంతో సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటా ఇచ్చేందుకు గడువు కోరింది.   ఇక్కడి వరకు బానే ఉన్నా ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ఇవ్వడానికి తిరకాసుపెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ప్రతులు ఇవ్వాలనడం న్యాయసమ్మతం కాదని.. ఈ విషయంలో విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఆపరేటర్ల నుంచి కావాల్సిన సమాచారాన్ని పొందే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. దర్యాఫ్తు సంస్థలు వివరాలు కోరినప్పుడు అందజేయాలని, అలా అందజేసిన సమాచారాన్ని తమ వద్ద ఉంచుకోరాదన్నారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖ, టెలికాం మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఏపీ సిట్, బిఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, ఐడియా, రిలయన్స్ తదితరులను పేర్కొన్నారు. అయితే అసలు ఫోన్ ట్యాపింగ్ చేయనపుడు కాల్ డేటా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజంగా ఫోన్లు ట్యాపింగ్ చేయనపుడు కాల్ డేటా ఇవ్వడానికి ఎందుకు నాటకాలు ఆడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.