ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన కేంద్రం
posted on Jun 11, 2015 @ 3:18PM
ఓటుకు నోటు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయంపై సీఎం చంద్రబాబు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే . సీఎం, మంత్రులు సహా మొత్తం 120 మంది ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చంద్రబాబు మోడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు సమాచారం. అయితే ఏ శాఖ విచారణ చేపట్టాలి అనే విషయంపై త్వరలో స్పష్టత ఇవ్వనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ లేదా టెలీ కమ్యూనికేషన్లశాఖ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కాగా ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రధానికి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ చేసింది.