బాబా రామ్‌దేవ్‌కు 600 ఎకరాలు!

  యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు 600 ఎకరాల భూమిని అందించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికీ, రామ్‌దేవ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ భూమిలో పతంజలి సంస్థ అరుదైన ఔషధులను పెంచనున్నట్లు సమాచారం. ఇందుకోసం స్థానికంగా ఉండే గిరిజనులను కూడా భాగస్వాములను చేయనున్నారట. నారింజ తోటలను పెంచడం, అటవీ భూములలో ఇప్పటికే సహజసిద్ధంగా లభిస్తున్న తేనె వంటి ఉత్పత్తులను సేకరించడం, కొత్తగా మరిన్ని ఔషధి మొక్కలను పెంచడం... ఇవీ ఈ 600 ఎకరాలలో రామ్‌దేవ్‌ బాబా తలపెట్టిన కార్యక్రమం!   ఈ ప్రణాళిక కోసం దాదాపు 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దీని వల్ల కనీసం 10,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని పతంజలి చెబుతోంది. కానీ విపక్షాలు మాత్రం ప్రభుత్వం ఇలా వందలాది ఎకరాలను స్వామీజీవారికి చవక ధరకు ధారాదత్తం చేయడం ఏంటంటూ మండిపడుతున్నాయి. ఇటు మహారాష్ట్రలోనూ, అటు కేంద్రలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి... రామ్‌దేవ్‌గారికి భూములను కట్టబెడుతున్నారంటూ ఆరోపిస్తున్నాయి.

హీరోయిన్ ని రేపు చేసిన డైరెక్టర్.. ఎక్కడ..?

సినిమాలో ఛాన్స్ లు ఇస్తానని చెప్పి ఓ డైరెక్టర్ పాకిస్తాన్‌కు చెందిన టాప్ మోడ‌ల్ ను రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం పాకిస్తాన్‌కు చెందిన టాప్ మోడ‌ల్ సినిమా అవకాశాల కోసం ఇండియాకు వచ్చి ముంబైలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె శ్యామ్ చరణ్ అనే భోజ్‌పురి ద‌ర్శ‌కుని క‌లిసి అవకాశం కోసం అతని వెంటపడింది. అయితే ఇదే అదను చూసుకొని అతను ఆమెపై కన్నేసి సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆమె దగ్గర ఉన్న దాదాపు 35 లక్షలను దోచుకోవడంతో పాటు ఆమెను అత్యాచారం కూడా చేశాడు. ఇక అప్పటికి కాని తాను మోసపోయానని గ్రహించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటపడింది. శ్యామ్ చరణ్ తనను మోసం చేశాడని.. డబ్బులు చెల్లించమని అడిగితే బెదిరిస్తున్నారని.. త‌న ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు శ్యామ్‌ను అరెస్టు చేశారు.

జగన్ కు దెబ్బ మీద దెబ్బ.. మరో ఎమ్మెల్యే జంప్

  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డకి మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ నుండి పలువురు నేతలు టీడీపీ లోకి చేరి ఆయనకు షాకిచ్చారు. అసలే దెబ్బ తగిలి ఉన్న జగన్ కు మరో దెబ్బ తగులుతోంది. బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు వైసీపీకి గుడ్ బై చెప్పి.. సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. మరికొంత మంది వైసీపీ నేతలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఉల్లిని కోస్తే కాదు... అమ్మితే కన్నీళ్లు!

  ఉల్లిగడ్డలు ఈసారి రైతులకు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లకు చేరుస్తున్న ఉల్లిగడ్డలని ఒక దశలో కిలో 1.5కి కూడా రైతులు అమ్ముకోవల్సిన పరిస్థితి వస్తోంది. తెలంగాణను ముంచెత్తిన కరువు ఇందుకు ఒక కారణం కాగా, మహారాష్ట్ర నుంచి వెల్లువగా వస్తున్న ఉల్లి దిగుమతులు మరో కారణంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది ఉల్లికి విపరీతంగా ధరలు లభించడంతో ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి మరీ తెలంగాణ రైతులతో ఉల్లిని సాగు చేయించింది.   కానీ కరువు కారణంగా సాగుకు తగిన నీరు లభించలేదు. దాంతో ఉల్లిగడ్డ పరిమాణం చాలా చిన్నదిగా ఉండిపోయింది. మరోవైపు మహారాష్ట్రలో కూడా ఉల్లిగడ్డలను విపరీతంగా పండించడంతో, అక్కడి మార్కెట్‌లో ఉల్లి ధరలు క్వింటాలుకి 500కి తక్కువగా జారిపోయాయి. వాటన్నింటినీ ఇప్పడు హైదరాబాదుకి తరలించడం మొదలుపెట్టారు మహారాష్ట్ర రైతులు. ఫలితం! నాణ్యత బాగున్న మహారాష్ట్ర ఉల్లి క్వింటాలుకి 1000-1400 పలుకుతుండగా, ఇక్కడ పండించిన ఉల్లిన మాత్రం నాణ్యత బాగోలేదంటూ క్వింటాకు 150-700 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే ఉల్లిరైతుకి తగిన గిట్టుబాటు ధరని చెల్లించాలని రైతులు కోరుకుంటున్నారు. అప్పటిదాకా ఉల్లిరైతుకి కన్నీరు తప్పేట్లు లేదు!

ఉత్తర ప్రదేశ్ సీఎంగా స్మృతీ ఇరానీ..!

  టీవీ నటిగా బుల్లితెర మీద మంచి పేరు సంపాదించుకొని.. అనేక సంచనాలు సృష్టించిని స్మృతీ ఇరానీ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అనంతరం నటనకు స్వస్తి చెప్పి రాజకీయ ప్రవేశం చేసి ఎంపీగా పోటీ చేసింది. అయితే ఎంపీగా గెలవకున్నా కానీ ఆమె కేంద్రమంత్రి అయ్యారు. అది కూడా మోడీ కేబినెట్‌లో కీల‌క‌మైన మాన‌వ‌వ‌న‌రుల శాఖ‌కు.. అందులోనూ.. మొదటి ప్రయత్నంలోనే. అయితే గతంలో ఆమె ఆమోధీ నుండి పోటీ చేసి రాహుల్ గాంధీకి చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు మరో అవకాశం రానున్నట్టు తెలుస్తోంది. కొద్ది నెల‌ల్లో ఉత్తర ప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల్లో యూపీ సీఎంగా స్మృతీ ఇరానీని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోందట. ఇప్పటికే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా గెలిచి తమ జెండా ఎగరేయాలని చూస్తున్నారు. అందుకే అక్కడి ప్రజలకు సుప‌రిచితురాలైన‌, అన‌ర్గ‌ళంగా మాట్లాడే స్మృతిని యూపీ బీజేపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌నుంది. మరి అన్ని అనుకున్నట్లే జరిగితే… యూపీలో బీజేపీ గెలిస్తే స్మృతిని దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందనటంలో సందేహం లేదు. ఏం జరుగుతుందో చూడాలి..

రోహిత్ ఆత్మహత్య పై దద్దరిల్లిన రాజ్యసభ..

  పార్లమెంట్ ఉభయ సభలు మొదలయ్యాయి. రాజ్యసభ స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఉద్రిక్తత నెలకొంది. హెచ్ సీయూ, జెఎన్ యూ ఘటనలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష విపక్ష నేతల మధ్య వివాదాలు తెలెత్తాయి. ముఖ్యంగా రోహిత్ ఆత్మహత్యపై ఇరు వర్గాల మద్య ఆందోళనలు తలెత్తుతున్నాయి. దీనిలో భాగంగానే బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ముర్దాబాద్ అంటూ  చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.     ఇదిలా ఉండగా దళిత విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని మాయవతి ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని.. వర్సిటీలలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేసే కుట్ర జరుగుతుందన్నారు. గత కొన్నేళ్ల నుంచి వర్సిటీలలో దళిత విద్యార్థులపై వివక్ష కొనసాగుతుందని మండిపడ్డారు. సెంట్రల్ వర్సిటీలలో దళిత విద్యార్థులపై వేధింపులు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు.     మరోవైపు రోహిత్ ఆత్మహత్యపై ప్రతిపక్షాల తీరుపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్నారని.. రోహిత్ ఆత్మహత్యతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని.. రోహిత్ ఆత్మహత్యపై నిష్పక్షపాత విచారణ జరగాలని ఆమె అన్నారు.

సంజయ్ దత్ జైలు కూలీ 450 రూపాయలు..

  క్రమాయుధాల కేసులో బాలీవుడ్ నటుడు జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్ల  జైలుశిక్ష అనుభవించిన సంజయ్ దత్ రేపు ఉదయం 9గంటలకు విడుదల కానున్నారు. ఈ సందర్భంగా రేపు జైలు వద్ద సంజయ్ భార్య మాన్యత, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలకనున్నారు. అంతేకాదు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో రానున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆసక్తికర విషయం ఏంటంటే సంజయ్ దత్ విడుదలరోజు ఆయన ఇంటికి తీసుకెళ్లే 450 రూపాయల జీతంపైన. సంజయ్ దత్ ఏంటి జీతం ఏంటీ అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే..ఐదేళ్ల జైలు జీవితంలో సంజయ్ దత్ మొత్తం 548 రోజులు జైల్లో గడిపాడు. దీంతో పాటు అతడు పెరోల్ పైన బయట ఉన్న 256 రోజులను పరిగణనలోకి తీసుకోని జైలు అధికారులు మిగిలిన కాలానికి అతడికి కూలీ కట్టిస్తున్నారు. సెమీ స్కిల్డ్ వర్కర్' కింద పరిగణించి, అతడితో పేపర్ బ్యాగులు తయారు చేయించి అతనికి కూలీ కూడా ఇచ్చారు.   అయితే సంజయ్ దత్ సంపాదించింది మొత్తం రూ..38,000 కాగా ఆయన జైల్లో ఉన్నప్పుడు తన ఖర్చులకు గాను వాడగా ఇంక మిగిలింది 450 రూపాయలు. ఇప్పుడు ఈ 450 రూపాయలనే సంజయ్ దత్ విడుదల రోజు ఆయనకు ఇస్తారంట. మరి ఇంత మొత్తంతో సంజయ్ ఏం చేస్తారో..

పోలీసుల ఎదుట లొంగిపోయిన ఉమర్ ఖలీద్, అనిర్బన్

దేశద్రోహులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఎన్ యు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల నుండి అజ్ఞాతంలో ఉన్న వీరు రెండు రోజుల క్రితమే బయటకు వచ్చారు. అనంతరం వీరు ఓ రహస్య ప్రాంతంలో పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. అయితే గతంలో వీరు తమకు భద్రత కల్పించాలని పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో పోలీసుల ఎదుట లొంగిపోయే వరకూ భద్రత కల్పించేది లేదని చెప్పడంతో వారు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసుల ముందు లొంగిపోయే ముందు ఈ విద్యార్థులిద్దరినీ ప్రైవేట్ వాహనాల్లో రహస్య ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడ పోలీసుల ఎదుట హాజరుపరిచారు. కాగా కన్హయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది. ఈనేపథ్యంలో విద్యార్ధి సంఘాలు కన్హయ్యకు బెయిల్ వస్తుందని అశిస్తున్నారు. అంతేకాదు వారితో పాటు లొంగిపోయిన ఖలీద్, అనిర్బన్లకు కూడా బెయిల్ వస్తుందనీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

థర్డ్ అంపైర్ ను బూతులు తిట్టిన కుర్ర బౌలర్

  ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎంత నోటిదురుసో క్రికెట్ ప్రపంచానికి తెలియంది కాదు. తాజాగా, దాన్ని నిరూపిస్తూ మరో సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ కు మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్ వుడ్, థర్డ్ ఎంపైర్ ను బూతులు తిట్టాడు. నాలుగో రోజు ఆటలో బౌలింగ్ కు వచ్చిన హేజిల్ వుడ్ న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కు యార్కర్ వేశాడు. నేరుగా కాలికి తగిలినట్టుగా అనిపించడంతో, ఎంపైర్ కు అప్పీల్ చేశారు. అందుకు ఎంపైర్ నాటౌట్ ప్రకటించడంతో, రివ్యూ అడిగాడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్. రివ్యూలో స్పష్టంగా బంతి బ్యాట్ ను తాకి వెళ్తోందని తేలింది. దీంతో థర్డ్ ఎంపైర్ కూడా నాటౌట్ ఇచ్చాడు. అది చూసి హాజిల్ వుడ్ ఫీల్డ్ అంపైర్ వద్దకు వచ్చి, హూ ద ... ఈజ్ థర్డ్ అంపైర్ అంటూ బూతులు తిట్టాడు.   ఇది స్టంప్ మైక్ లో రికార్డ్ అవడంతో, కామెంటేటర్లు, టీవీ చూసేవాళ్లు ఖంగు తిన్నారు. ఈ సంఘటనతో మ్యాచ్ రిఫరీ హేజిల్ వుడ్ కు, కెప్టెన్ స్మిత్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించాడు. ఎంపైర్ నిర్ణయాన్ని పదే పదే ప్రశ్నించడంతో స్మిత్ కు కూడా కోత పడింది. న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 370 చేస్తే, ఆస్ట్రేలియా 505 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 335 పరుగులకు ఆలౌట్ అయి ఆస్ట్రేలియాకు 201  పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇవ్వగలిగింది. చివరి రోజైన రేపు, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా మ్యాచ్ గెలవడం లాంఛనమే..రిటైర్ మెంట్ ప్రకటించిన మెక్ కల్లమ్ కు ఇదే చివరి మ్యాచ్ అన్న సంగతి తెలిసిందే..ఈ మ్యాచ్ గెలిస్తే, ఆస్ట్రేలియా టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది.  

ఒక్క గుద్దు గుద్దానంటేనా... ట్రంప్‌!

  కాబోయే అమెరికా అధ్యక్షునిగా అందరూ కీర్తిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌, అధ్యక్ష ఎన్నికలలో ఎంతవరకూ విజయవంతం అవుతాడో లేదో తెలియదు కానీ, ప్రపంచం అంతటా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌ తన ఎన్నికల ఉపన్యాసం ఇస్తుండగా సభలో ఓ కుర్రవాడు అలజడి సృష్టించడం మొదలుపెట్టాడు. అతణ్ని పోలీసులు బయటకి తీసుకువెళ్లిపోయారు. అయినా ట్రంప్‌గారికి ఆవేశం ఆగలేదు. ‘వాడి మొహం మీద ఒక్క గుద్దు గుద్దాలని ఉంది’ అంటూ మైకు ముందర నిల్చొని సెలవిచ్చారు కాబోయే అధ్యక్షులవారు. అంతేనా! ‘అదివరకు రోజులలో అయితేనా! ఇలాంటివాడిని చితక్కొట్టి స్ట్రెచర్ మీద బయటకి పంపేవారు’ అంటూ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇవి అదివరకు రోజులు కావు కాబట్టి, చాలామంది ట్రంప్‌ చేతిలో దెబ్బలు తినకుండా తప్పించుకుంటున్నారన్నమాట.

రాజకీయ పార్టీ కార్యలయంలో వ్యభిచారం.. ఎక్కడ..?

  సాధారణంగా పార్టీ కార్యలయాల్లో పార్టీకి సంబంధించిన విషయాల గురించి చర్చించుకుంటారు.. కానీ ఓ పార్టీ కార్యలయం మాత్రం పార్టీ కార్యకలాపాలకు బదులు వ్యభిచారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇది తమిళనాడులోని తిరుపూర్ మంగళం రోడ్డులో జరిగింది. తిరుపూర్ మంగళం రోడ్డులో ఒక రాజకీయ పార్టీ కార్యాలయం ఉంది. అయితే ఈ కార్యాలయంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ నిఘా ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ జరిగే అసలు విషయం బయటపడింది. అక్కడి కార్యాలయం లోపలి గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించి కార్యాలయంపై తనిఖీలు నిర్వహించి 14 మందిని అరెస్టు చేశారు. ఆరుగురు యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని, ఒక బాలికను బలవంతంగా ఈ రొంపిలోకి దింపారని పోలీసులు తెలిపారు.

వెంటపడవద్దంది... కాల్చి చంపేశారు!

  ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు. వాళ్ల ఆగడాలు తట్టుకోలేక ప్రింకీ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. సోమవారం రాత్రి ఎప్పటిలాగే పని ముగించుకుని వస్తున్న ప్రింకీని వారు వేధించడం మొదలుపెట్టారు. అసభ్యకరమైన వారి మాటలు విని తట్టుకోలేకపోయిన ప్రింకీ, ఇక మీదట తన జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ వారిని తీవ్రంగా మందలించింది. దాంతో వారిలోని కుల్‌దీప్‌ అనే యువకుడు, అక్కడికక్కడే ఆమెను కాల్చి చంపేశాడు. ఈ సమయంలో ప్రింకీ పక్కనే ఉన్న ఆమె అక్కయ్యకు కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి. 2012లో నిర్భయ ఉదంతం జరిగిన తరువాత ప్రభుత్వాలన్నీ, తాము ఆకతాయిల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామంటూ పేర్కొంటున్నాయి. కానీ అది అబద్ధమని తెలియచేసేలా ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.