వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం
posted on Jun 11, 2015 @ 12:37PM
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రమాదం తృటిలో తప్పింది. వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆయన నిన్న రాత్రి బెంగుళూరు నుండి కావలికి బయలుదేరగా... ఇంతలో పెళ్లకూరు మండలం శిరసనంబేడు వద్దకు రాగానే కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు బీదా రమేష్ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నెల్లూరుజిల్లా అపోలో ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.