టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్
మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్న నేపథ్యంలో పలు పార్టీలు వారికి మద్ధతుగా నిలిచాయి. దీనిలో భాగంగానే వామపక్షాలు బంద్ పిలుపునిచ్చాయి. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సెక్రటేరియట్ వద్ద దర్నకు దిగారు. మున్సిపలు కార్మికుల వేతనాలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత దానం నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇప్పటికి వారం రోజుల పైనుండి కార్మికులు సమ్మె చేస్తున్నా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. ఆయన వ్యవహారం దున్నపోతు మీద నీళ్లు పోసిన చందంగా ఉందని అన్నారు. బంగారు తెలంగాణ చేయడమేమోగాని నగరాన్ని చెత్త నగరంగా మార్చారని ఎద్దేవ చేశారు. దీనిలో భాగంగానే సెక్రటేరియట్ ను ముట్టడించడానికి ప్రయత్నించగా పోలీసుల అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వివాదం జరగింది. దాంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల, షబ్బీర్ అలీ ఇంకా పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.