అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే జరిమానా...!!

  టెక్నాలజీ పెరిగింది. చదువుకున్నా, చదువుకోకపోయినా, అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ప్రతీదీ స్మార్ట్ ఫోన్ సాయంతో చేతిలో ఉంటుంది. కానీ ఆ ఊళ్లో మాత్రం, పెళ్లికాని అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే చాలు జరిమానా విధిస్తారు. ఆ సమాచారాన్ని అందించిన వాళ్లకు బహుమతి ఇస్తారు.   గుజరాత్ లోని సూరజ్ అనే ఊళ్లో ఈ వింత ఆచారాన్ని మొదలెట్టారు. ఎప్పటినుంచో కట్టుబాట్ల మధ్య ఉన్న ఆ ఊరు మొబైల్ ఫోన్లు వచ్చాక స్పీడ్ అయిపోయింది. ప్రేమ దోమ అంటూ కుర్రకారు మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేస్తున్నారని భావించిన ఊరిపెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పెళ్లి కాని అమ్మాయిలకు మాత్రమే ఈ కండిషన్. ఒకవేళ ఫోన్ మాట్లాడుతూ దొరికిపోతే, రెండు వేల వరకూ జరిమానా పడుతుంది.   ఇదేం వింత ఆచారంరా బాబూ అనుకుంటున్నారా..? అమాయకురాళ్లైన ఆడపిల్లల్ని, కుర్రాళ్లు ఫోన్లలో మాట్లాడే బుట్టలో వేసుకుంటున్నారు. అలా మాట్లాడే వాళ్లలో పెళ్లి చేసుకునే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటున్నారు. అందుకే ఆడపిల్లలు మోసపోకూడదనే ఇలా చేశాం అని గ్రామపెద్దలు సమాధానం చెబుతున్నారు. ఫోన్ అనేది ఉపయోగం కంటే వ్యసనంగా మారిపోయిందని, త్వరలోనే పిల్లలకు కూడా ఈ రూల్ పెట్టబోతున్నామని చెబుతున్నారు. నరేంద్రమోడీ సొంత ఊరికి, ఈ ఊరు చాలా దగ్గర్లోనే ఉండటం విశేషం.

విమానాలకు రెక్కలు : జాట్ ఎఫెక్ట్

హర్యానా జాట్ ఉద్యమం ఉత్తరభారతంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రోడ్డు, రైలు రవాణా వ్యవస్థల్ని ఆందోళనకారులు స్తంభింపచేయడంతో విమాన టిక్కెట్ ధరలకు రెక్కలొచ్చాయి. పంజాబ్, రాజస్థాన్ లకు ఛార్జీలు గతంలో ఎన్నడూ లేనంత పెరిగిపోయాయి. ఛండీగఢ్ నుంచి ఢిల్లీకి మూడు నుంచి ఆరు వేల మధ్యలో ఉండే ఛార్జీలు, ఇప్పుడు 27 వేల దాకా ఉన్నాయి. జైపూర్ ఢిల్లీ మధ్య ప్లేన్ ఛార్జీ 24 వేల వరకూ వెళ్లింది. దొరికిందే అవకాశమని, జెట్, ఎయిర్ ఇండియా లాంటి విమాన సంస్థలన్నీ కూడా ఎగస్ట్రా సర్వీసుల్ని నడుపుతున్నాయి. దాదాపు వెయ్యికి పైగా రైళ్ల రాకపోకలు ఆగిపోవడంతో, అక్కడి ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. లను స్తంభింపజేశారు.

ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ ఎవరు బద్ధలుగొడతారో తెలుసా..?

క్రికెటర్ కు నిజమైన పరీక్ష టెస్ట్ మ్యాచ్. ఓపికతో, కంటికి, చేతికి సమన్వయంతో, గంటల తరబడి అలిసిపోకుండా క్రీజు లో నుంచుని, జాగ్రత్తగా గోడ కట్టినంత అందంగా ఇన్నింగ్స్ నిర్మించడమంటే మాటలు కాదు. అందుకే బ్యాట్స్ మెన్ గొప్పోడో కాదో నన్నది, టెస్ట్ మ్యాచ్ ల బట్టి నిర్ణయిస్తారు క్రికెట్ పండితులు. కానీ ఈ సూత్రాలు కొంత మందికి వర్తించవు. వివియన్ రిచర్డ్స్, క్రిస్ గేల్, ఎబీ డివిలియర్స్, బ్రెండన్ మెక్ కల్లం, సెహ్వాగ్ లాంటి వాళ్లెవ్వరూ ఇలా గోడ కట్టినట్టు ఇన్నింగ్స్ నిర్మించరు. వీళ్లందరూ ఆత్మరక్షణ కంటే, ప్రత్యర్ధి గోడను బద్ధలుగొట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే వీళ్లకు బౌలింగ్ చేయడానికి ప్రపంచంలోని ఏ బౌలర్ అయినా భయపడేవాడు, భయపడతాడు.   లేటెస్ట్ గా తన చివరి టెస్ట్ లో మెక్ కల్లమ్ వీర బాదుడు బాది, వివియన్ రిచర్డ్స్ మీదున్న రికార్డును తను లాగేసుకున్నాడు. కేవలం 54 బంతుల్లోనే శతకబాదాడు. రికార్డ్స్ ఉన్నవి బద్ధలవడానికే. మరి నెక్స్ట్ మెక్ కల్లమ్ రికార్డ్ ను బద్ధలు గొట్టే వీరుడెవరు..? ఇదే విషయాన్ని రైనాను అడిగితే, భారతీయుడే బద్ధలు గొట్టాలని కోరుకుంటున్నానన్నాడు. మరి మన టీంలో ఆ రికార్డ్ బద్ధలు గొట్టే అవకాశం ఎవరికుందో తెలుసా..?   రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్..ప్రస్తుతం ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో ఈ ముగ్గరికే ఆ రికార్డును కొట్టే అవకాశం ఉంది. రైనా టెస్టుల్లో లేడు. ఇప్పుడు అండర్ 19 మ్యాచ్ ల్లో ఇరగదీస్తున్న కుర్రాళ్లలో భవిష్యత్ టెస్ట్ ప్లేయర్ గా మారే ఎవరికైనా కూడా ఆ ఛాన్స్ లేకపోలేదు. టి 20 క్రికెట్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో, ఆ రికార్డు ఎంతో కాలం నిలిచి ఉండదనేది మాత్రం వాస్తవం.

అల్లుడి హత్యకు ప్లాన్ చేసిన పోలీస్

  ఆయన ఒక పోలీసాఫీసర్. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక పాప కూడా పుట్టింది. మామూలుగా ఏ తండ్రైనా, జరిగిందేదో జరిగిందిలే అని కూతురిని అక్కున చేర్చుకుంటాడు. లేదా, దూరంగా ఉన్న సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ పోలీసాయనకు మాత్రం మనసు బండబారింది. ఏకంగా కూతురి భర్తను హత్య చేయించాలనుకున్నాడు. హత్య చేయమని రౌడీ షీటర్లకు సుపారీ ఇచ్చాడు. చివరికి దొరికిపోయి కటకటాలపాలయ్యాడు.   విషయంలోకి వెళ్తే సిటీ పోలీస్ కమిషనరేట్ లో ఏఎస్ఐగా చేస్తున్నాడు ఆంబోతుల రామారావు. 2014లో రామారావు కూతురు వెల్డింగ్ పనులు చేసే వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని రామారావు, అల్లుణ్ని హత్య చేసి కూతురికి మరో పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకోసం ముగ్గురు రౌడీషీటర్లను కలిసి ఒకటిన్నర లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. రౌడీషీటర్లలో ఒకరు తాగిన స్నేహితుడితో ప్లాన్ అంతా చెప్పడం వలన, ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాజాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి ఘోరాలకు ఒడిగట్టడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.

రింగింగ్ బెల్స్ కు మోగిన ఐటీ బెల్స్

  అతి తక్కువ ధర గల ఫోన్ అని చెప్పి గత కొద్దిరోజులుగా వివాదాల్లో నలుగుతున్న కంపెనీ రింగింగ్ బెల్స్. ఫ్రీడం 251 పేరుతో 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను ఇస్తున్నామని ఈ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐటీ, ఎక్సైజ్ శాఖల అధికారులు ఈ కంపెనీపై దృష్టి సారించారు. ఇంత తక్కువ ధరకు ఫోన్ ను తయారుచేయడం అసాధ్యమని, ఒకవేళ తయారుచేస్తే కంపెనీకి ఎలాంటి లాభం ఉండదంటూ బిజెపీ ఎంపీ కిరీట్ సోమయ్య కేంద్రానికి లేఖ రాశారు.   ఆయన లేఖకు స్పందనగా రింగింగ్ బెల్స్ కంపెనీ పై విచారణ చేయాలని టెలికాం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. మరో వైపు కేవలం మార్గదర్శకాలు సూచించడం కోసమే ఐటీ శాఖ వచ్చిందని కంపెనీ ప్రెసిడెంట్ అశోక్ చద్ధా చెబుతున్నారు. ఫోన్ కు బుకింగ్స్ భారీగా రావడంతో, కంపెనీ శనివారం నుంచి బుక్సింగ్ ను నిలిపేసింది. తొలి రోజున 3.7 కోట్లు, రెండో రోజు 2.47 కోట్లు రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం..

పవన్ అంకుల్ వస్తే జ్వరం తగ్గిపోతుంది

ఆ పాపకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తనకు జ్వరం అని పెద్దవాళ్లు చెప్పడంతో, పవన్ అంకుల్ ఒక్కసారి ఒక్కసారి తనను చూస్తే జ్వరం తగ్గిపోతుందని చెబుతోంది. కానీ ఆ చిట్టి తల్లికి తెలియదు తాను భయంకర మహమ్మారి క్యాన్సర్ తో బాధపడతున్నానని. భీమవరానికి చెందిన రత్నరాజు, రమాదేవిల ఆరేళ్ల పాప నూకల కనకచంద్రదీపిక. ఈ మధ్య నీరసంగా ఉంటోందని పాపను డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షల్లో, చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. ట్రీట్ మెంట్ కు 20 లక్షల వరకూ ఖర్చు అవుతుంది.   ఉన్న ఒక్క ఇంటినీ, తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇంకా డబ్బు అవసరం ఉండటంతో, దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని సిఏం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు ఎంపీ తోట సీతారామలక్ష్మి. ఈ విషయాలేవీ తెలియని ఆ చిన్నారి అమాయకంగా చెబుతున్న మాటలు, వినేవారి కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తన గది నిండా పవన్ ఫోటోలతో నింపేయడం బట్టి దీపికకు పవన్ అంటే ఇంత ఇష్టమో అర్ధమవుతోంది. మరి పవన్ ఈ పాపను చూడటానికి వస్తారా లేదా అన్నది చూడాలి..  

టీఆర్ఎస్ ఆ..టీడీపీ ఆ..? జుట్టు పీక్కుంటున్న ఎమ్మెల్యే ఎవరూ..?

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటికే పలు పార్టీలోని నేతలంతా టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక ప్రతిపక్ష పార్టీల విషయానికి వస్తే టీఆర్ఎస్ తాకిడిక తట్టుకోలేక పోతున్నాయనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న చందాన తయారైంది. కాస్తో కూస్తో పోటీ ఇచ్చే టీడీపీ పరిస్థితి కూడా ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. ఇప్పటికే టీడీపీ నుండి పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక మిగిలింది ఒకరిద్దరు నేతలు మాత్రమే. అయితే ఇప్పుడు పార్టీ మారిన వారి పరిస్థితి బానే ఉంది. పార్టీని వీడని వారి పరిస్థితి బానే ఉంది. కానీ టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పరిస్థితే అటు కక్కలేకా.. ఇటు మింగలేకా అన్న పరిస్థితి ఏర్పడింది.   టీ టీడీపీ నుండి కీలకమైన నేతలే టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇటీవలే సీనియర్ నేత అయిన ఎర్రబెల్లి.. ఆయనతో పాటు ప్రకాశ్ గౌడ్  కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఇక ఎర్రబెల్లి చేరికతో ఆయనతో పాటు ఇంకో ఎమ్మెల్యే కూడా ఆయన వెనుకే టీఆర్ఎస్ లో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం తాను టీఆర్ఎస్లోకి వచ్చేది లేదని.. టీడీపీలోనే ఉంటున్నానని.. ఆవార్తలు ఆవాస్తవం అని అన్నారు. తాను మాత్రం గాంధేయ మార్గంలోనే నడుస్తానని చెప్పారు.   అయితే చెప్పడానికైతే చెప్పారు కాని తాను మాత్రం అటు ఆపార్టీ ఉండలేక.. ఇటు టీఆర్ఎస్లోకి వెళ్లలేక జుట్టు పీక్కుంటున్నారంట. ఎందుకంటే.. అతనికి టీఆర్ఎస్ లోకి వస్తే ప్రభుత్వం నుండి అతనికి వున్న 20 కోట్ల బకాయిలు రద్దు చేస్తామని ఆఫర్ ఇచ్చారంట. దీంతో ఆ ఎమ్మెల్యే కొంచం ఇంట్రెస్ట్ చూపించినా.. ఇంతలోనే టీడీపీ నుండి షాక్ ఎదురైనట్టు తెలుస్తోంది. అతనికి తన ఊర నందిగామ దగ్గర ఉన్న 100కు పైగా ఎకరాలు ఉండగా వాటి విషయంలో ఇరుకున పడాల్సి వస్తుందని చినబాబు ద్వారా హెచ్చరికలు వచ్చాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యేకు ఏం చేయాలో తెలియక అయోమక స్థితిలో ఉన్నారంట. మరి చూద్దాం..ఆయన ఈ పరిస్థితి నుండి ఎప్పుడు బయటపడతారో..

కుక్కని కూడా రేప్ చేశాడా..!

ఇప్పటి వరకూ మహిళలు, మైనర్ బాలికలు.. ఇంకా దురదృష్టకరం ఏంటంటే చిన్న పిల్లలపై అత్యాచారలు చేయడం విన్నాం. అయితే ఇప్పుడు ఆఖరికి జంతువులపై కూడా అత్యాచారాలు చేయడం మొదలు పెట్టారు కామాంధులు. గతంలో ఇలాంటివి ఒకటి రెండు ఘటనల గురించి విన్నాం. ఇప్పుడు మరో ఘటన తాజాగా వెలుగు చూసింది. క‌ళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు కుక్క‌పై అత్యాచారం చేసిన సంఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. దీంతో ఈ వీడియో అలా అలా జంతువుల హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యుల కంటపడటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని అప్పజెపితే భారీగా న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌ని ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి మాటలను బట్టి అతను మలయాళంలో మాట్లాడుతున్నాడని సంస్థ సభ్యులు చెబుతున్నారు.

మందు కోసం ఐసియూ నుండే వచ్చేశాడు..

మందు బాబులకు రోజు మందు కొట్టనిదే నిద్రపట్టదు. గొంతులో ఓ చుక్క పడటానికి ఏం చేయడానికైనా సరే వెనుకాడరు. కానీ తాజా ఘటన చూస్తుంటే మాత్రం మందు లేకుండా వీరు అసలు ఉండలేరేమో అనే సందేహం వస్తుంది.  సైబీరియాకు చెందిన ఓ వ్యక్తికి భారీ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే అతనికి రోజూ మందు తాగే అలవాటు ఉండటంతో తన పక్కన ఉన్న నర్సును పిలిచి తనకు కనీసం ఒక్క బీరు చుక్కయినా ఇప్పించమని అడిగాడట. దానికి ఆమె నిరాకరించడంతో ఐసీయూలో ఉన్న ఆయన తనకు తగిలించిన ట్యూబులు, మాస్కులు పీకేసి..ఐసీయూ నుంచి రోడ్డు మీదకు వచ్చాడు. దీంతో అతడిని చూసిన చుట్టు ప్రక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతణ్ని హాస్పిటల్‌కు తరలించారు. అంతేకాదు ఇంత మంది సిబ్బంది ఉన్నా అతను భయటకు ఎలా వెళ్లాడబ్బా అని హాస్పిటల్ యాజమాన్యం ఆశ్చర్యపోయింది. మొత్తానికి మందు కావాలంటే మందు బాబులు ఎంతకైనా తెగిస్తారని మరోసారి రుజువైంది.

రైలుకింద పడి బావమరదళ్లు ఆత్మహత్య.. పెళ్లైన మూడురోజులకే..

వికారాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. బావమరదళ్లు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామానికి చెందిన ముక్కు లావణ్య అనే యువతి, రానివాస్‌ అనే యువకుడు ప్రేమించుకున్నారు. రానివాస్ లావణ్య అక్క మరిది. రానివాస్ వరుసకు బావ అవడంతో వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే  లావణ్యకు మాత్రం వారి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం చేశారు. కానీ ఆ విహహం లావణ్యకు నచ్చకపోవడంతో వివాహమైన మరుసటి రోజున పుట్టింటికి వచ్చి తన ప్రియుడు రానివాస్ తో కలిసి వికారాబాద్‌ చిట్టిగిడ్డ రైల్వేస్టేషన్‌ మధ్యలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భూమా చేరికపై హైడ్రామా..

కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, ఆయన తనయ భూమా అఖిలప్రియ పార్టీ మార్పుపై హైడ్రామానే నడుస్తోంది. ఒకవైపు భూమా పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తుంటే.. మరోవైపు ఆయన పార్టీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు దీనిపై భూమా స్పందించి తాను పార్టీ మారేది లేదని చెప్పినా..టీడీపీ నేతలతో చర్చలు జరుపుతూనే ఉన్నారని అంటున్నారు. అయితే ఈరోజు జరిగిన చర్చల అనంతరం.. భూమానాగిరెడ్డి,  అఖిలప్రియ పార్టీ మారే యోచన నుంచి వెనక్కి తగ్గిట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత..పార్టీ నేతలు భూమాని బుజ్జగించిన తరువాత మెత్తబడిట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మరి ఈ మాట మీద ఎన్ని రోజులు ఉంటారో చూడాలి.

మెక్ కల్లమ్ చివరి టెస్ట్ రికార్డ్.. ఫాస్టెస్ట్ సెంచరీ

టెస్టు క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మెక్‌కల్లమ్ సరికొత్త రికార్డుని నమోదు చేశాడు. అది కూడా ఇది తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. క్రైస్ట్‌చర్చ్ వేదికగా అస్ట్లేలియా, న్యూజిలాండ్ కు రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో నాలుగవ బ్యాట్స్ మన్ గా క్రీజులోకి దిగిన మెక్ కల్లమ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 54 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. దీంతో టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

భూమాపై జగన్ ఆశలు వదులుకున్నట్టేనా..?

భూమా నాగిరెడ్డి టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అతనిని బుజ్జగించడం.. కర్నూల్ జిల్లా ఎమ్మెల్యేలతో చర్చలు జరపడం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే జగన్ భూమాపై ఆశలు వదులుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయిన నేపథ్యంలో నాగిరెడ్డి భూమాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అవకాశవాదులను ఏమీ చేయలేమని.. పార్టీలో భూమా నాగిరెడ్డికి తక్కువేమీ చేయలేదని.. భూమాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని ఆయన చెప్పారు. గౌరవం ఇచ్చాం కాబట్టే పిఎసి చైర్మన్ పదవి ఇచ్చామని ఆయన చెప్పారు.

జాట్‌ల ఆందోళనలు ఉద్రిక్తం..ఎంపీ ఇంటిపై రాళ్లతో దాడి

ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ.. జాట్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హరియాణాలో జాట్ల ఆందోళనలు మరింత ఉద్రితంగా మారాయి. ఆందోళనలో భాగంగానే బీజేపీ ఎంపీ షైనీ నివాసంపై రాళ్లు రువ్వారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్  ఆయన నివాసంలో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజు హజరయ్యారు. హరియాణాలోని భద్రతా ఏర్పాట్లపై వారితో చర్చించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హరియాణాలో 10 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించాయి. మరో 23 కంపెనీల బలగాలను కూడా కేంద్రం అక్కడకు పంపిస్తోంది.

భూమాకి బుజ్జగింపులు.. ఎవరి ఆఫర్ కి ఓకే అంటారో..?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వేడి వాతావారణం నెలకొంది. దీనంతికి కారణం భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు రావడమే. రెండు రోజుల క్రితమే వైసీపీ అధ్యక్షుడు జగన్ తమ పార్టీ నేతలు ఏ పార్టీలోకి వెళ్లరని.. ఇదంతా టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని.. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే మాతో టచ్ లో ఉన్నారని గట్టిగానే చెప్పారు. అయితే జగన్ అలా చెప్పాడో లేదో రెండు రోజులకే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు రావడంతో జగన్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీంతో ఇప్పుడు ఆయన భూమాని బుజ్జగించే పనిలో పడినట్టు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి జంప్ అవుతున్నారు అన్న వార్తలు రాగానే  విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి భూమా నాగిరెడ్డితో చర్చలు జరపగా ఆయన వారికి తమకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని వివరించారట. ఇదే విషయాన్ని వారు జగన్ కు చెప్పారంట. ఈ నేపథ్యంలోనే ఆయన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలని ఉన్నపళంగా హైదరాబాద్ కు రమ్మని.. హడావుడిగా భేటీ అయి భూమా వ్యవహారంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.   ఇదిలా ఉండగా భూమా మాత్రం తాను పార్టీలోకి చేరేది లేదు అని ఒక పక్క చెబుతూనే.. ఆయన జరపాల్సిన చర్చలు ఆయన జరుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు టీడీపీలోకి వచ్చే భూమా నాగిరెడ్డికి కాని, కూతురు అఖియ ప్రియకి కాని మంత్రి పదవి ఇస్తామని టీడీపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసిందే. అయితే నాగిరెడ్డి మాత్రం టీడీపీలోకి రానూ అంటూనే గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారంట. ఇప్పటికి అన్ని పదవులు అనుభవించాను.. మంత్రి పదవి వద్దు కానీ.. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాను టీడీపీలోకి వస్తానని ఆయనే టీడీపీకి రివర్స్ ఆఫర్ ఇచ్చారంట.   మరోవైపు భూమా నాగిరెడ్డి వ్యవహారంపై అటు వైకాపా నేతలు.. ఇటు టీడీపీ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. జగన్ ఇప్పటికే కర్నూల్ ఎమ్మెల్యేలతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు భూమా నాగిరెడ్డితో పాటు ఇతర శాసనసభ్యులు పార్టీలో వస్తున్న నేపథ్యంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడడానికి కర్నూలు జిల్లా పార్టీ నేతలతో ఈరోజు సాయంత్రం 3 గంటలకి సమావేశం కానున్నారు. మరి ఇప్పటికే టీడీపీ భూమాకి ఒక ఆఫర్ ఇచ్చింది. మరి భూమా నాగిరెడ్డి కర్నూల్ జిల్లాలో కీలకమైన నేత కాబట్టి అతని వదులుకోవడానికి జగన్ సిద్దంగా ఉండరని రాజకీయ పెద్దలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అతను పార్టీలో ఉండాలంటే వైసీపీ కూడా ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి.. మరి వైసీపీ ఏం ఆఫర్ చేస్తుందో.. భూమా కి టీడీపీ ఆఫర్ నచ్చుతుందా.. లేక వైసీపీ ఆఫర్ నచ్చుతుందో..? పార్టీ మారుతారో.. లేదో..? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

కన్హయ్య కేసులో కొత్త ట్విస్ట్.. మార్ఫింగ్ వీడియోనా..?

దేశ దోహిగా ఆరోపణలు మోస్తున్న కన్హయ్య కుమార్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయడపడుతోంది. ఇప్పటి వరకూ కన్హయ్య కుమార్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడంటూ.. అతనిని దేశ ద్రోహి అంటూ పలువురు అతనిపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆధారం ఒక వీడియో. జమ్మూ కాశ్మీర్‌కు స్వేఛ్చ కావాలంటూ పెద్దఎత్తున, ఆవేశంగా నినాదాలు చేస్తున్న కన్నయ్యకుమార్‌ విడియో కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వీడియో  మార్ఫింగ్‌ చేసిందని తేలింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. ప్రముఖ ఎబిపి, ఇండియా టుడే ఛానళ్లు విడివిడిగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలినట్టు తెలుస్తోంది. అసలు సంగతేంటంటే..  జెఎన్‌యులో ఈ నెల 9వ తేది ఒక కార్యక్రమం జరగగా అందులో కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే, ఆ కార్యక్రమంలో చొరబడిన కొందరు ఎబివిపి విద్యార్థులు కూడా దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, మరుసటి రోజు ఎబివిపి నిర్వహించిన కార్యక్రమంలో సైతం వారు ఉన్నారని ఫోటోలతో సహా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 11 వ తేది విశ్వవిద్యాలయ ఆవరణలో జరిగిన మరో కార్యక్రమంలో కన్నయ్యకుమార్‌ పాల్గొన్నాడు. ఈ రెండు కార్యక్రమాల వీడియోని తీసి దానిని మార్ఫింగ్ చేసి వీడియోని చేశారని తాజా పరిశోధనల్లో తెలిసింది. మరోవైపు పోలీసులు ఈ వీడియో ఆధారంగానే కన్హయ్యను అరెస్ట్ చేశారు. అంతేకాదు పలు పార్టీ నేతలు కూడా ఈ వీడియో ఆధారంగానే కన్హయ్యపై విమర్శలు గుప్పించారు. మరి వీడియో ఆధారంగానే కన్హయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంత కీలకమైన ఈ వీడియో మార్ఫింగ్ అంటే నమ్ముతారా.. మరి ఏం జరుగుతుందో చూడాలి..