టీవీ నటుడు ఆత్మహత్య.. సహనటి అరెస్ట్
ఒడిసాలో టీవీ నటుడు రంజిత్ పట్నాయక్ అలియాస్ రాజా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేగింది. అయితే ఇతని ఆత్మహత్యలో భాగంగా నటి ప్రలిప్త ప్రియదర్శిని అలియాస్ జెస్సీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇద్దరి మధ్య వచ్చిన అర్ధిక విభేధాలే కారణని చెబుతున్నారు పోలీసులు. వివరాల ప్రకారం టీవీ నటులు జెస్పీ, చందన్ ఫిబ్రవరి 6న ఏర్పాటుచేసిన ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి చందన్ రాలేదు. అదే కార్యక్రమానికి రాజా రావడంతో చంద్రన్ ప్లేస్ లో అతనిని షోలో పాల్గొనాలని కోరగా అతని ఒప్పుకున్నాడు. అయితే పార్టీ నిర్వాహకులు షో ముగిసిన తరువాత రాజాకు రూ. 2వేలు, జెస్సీకి రూ. 27,000 చెల్లించడంతో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో జేస్సీ అతనిని అవహేళనగా మాట్లాడేసరికి తీవ్ర మనస్థాపానికి గురై రాజా ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. దీంతో జెస్సీని పోలీసులు అరెస్ట్ చేశారు.