మరో వివాదంలో ఆప్
posted on Jun 11, 2015 @ 4:30PM
ఆప్ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. ఆమధ్య లెప్టినెంట్ గవర్నర్ విషయంలో కొన్ని రోజుల పాటు వివాదాలు జరుగుతూ వచ్చాయి. అది ఎలాగూ ఒక కొలిక్కి వచ్చింది. మళ్లీ రెండురోజుల క్రితం నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో న్యాయశాఖమంత్రి జితేంద్రసింగ్ తోమర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తోమర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారం ఇంకా ముగియకముందే మళ్లీ మరో వివాదంలో చిక్కుకుంది ఆప్ సర్కార్. ఎమ్మెల్యే సోమ్ నాధ్ భారతతిపై కేసు నమోదయింది. సోమ్ నాధ్ భారతి భార్య గృహసింహ కేసు కింద అతనిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. నన్ను నా పిల్లలని నాభర్త టార్చర్ చేస్తున్నడని.. ఫిజికల్ గా.. మెంటల్ గా టార్చర్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది.