కేసీఆర్ అతి చేస్తున్నాడు.. జీజేపీ నేతలు

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించాలని కేసీఆర్ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈవ్యవహారంపై కేంద్ర మంత్రుల చంద్రబాబుకు పూర్తి మద్ధతు ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఏమి నీతిపరుడు కాదని.. అతను చేసిన భాగోతం తమకు తెలుసనీ బీజేపీ పార్టీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు విషయంలో కేసీఆర్ చాలా ఎక్కవ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయించిన కేసీఆర్.. తను ఎక్కడెక్కడ నిఘా పెట్టించాడో.. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేయించాడో తెలుసుకోవడం పెద్ద పనేమి కాదని కేంద్ర భావిస్తుంది. చంద్రబాబే జీజేపీకి నమ్మకమైన మిత్రపక్షమని, అందుకే చంద్రబాబుకు మద్ధతు ఇవ్వడమే సరైనదని జీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నట్టు సమాచారం. టీడీపీ, బీజేపీ కలిసుంటేనే నవ్యాంధ్రప్రదేశ్ సాధ్యమని.. అలా అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీజేపీకి తిరుగుండదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Teluguone gnews banner