జితేందర్ సింగ్ తోమర్ పై బహిష్కరణ వేటు
posted on Jun 12, 2015 @ 4:27PM
ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ సర్టిఫికేట్ల వివాదంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిని పార్టీ నుండి బహిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం పై పార్టీ నేతలు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ తోమర్ పార్టీకి చాలా అన్యాయం చేశాడని, నమ్మి అతనిని పార్టీలోకి తీసుకొని పదవి ఇచ్చినందుకు పార్టీకే దెబ్బతీయాలని చూశాడని అందుకే పార్టీనుండి బహిష్కరించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంలో తోమర్ పై ఉదాశీనత చూపదలుచుకోలేదని.. తోమర్ చేసిన పనికి కేజ్రీవాల్ తీవ్ర కలత చెందారని తెలిపారు. ఇదిలాఉండగా నకిలీ పట్టాలు ఆరోపణలో తోమర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.