ఓటర్ కార్డుతో ఆధార్ లింక్.. లేకపోతే ఓటు లేదు
posted on Jul 20, 2015 @ 5:30PM
సీఎం కేసీఆర్ బోగస్ ఓటర్ కార్డుల వ్యవహారంపై ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ నగరంలో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోందని.. నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ కార్డుకు.. ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తామని..ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోకుంటే ఓటు హక్కు ఉండదని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుకు ఈ ప్రక్రియను ముందు హైదరాబాద్ లో మొదలు పెడతామని.. తరువాత రాష్ట్రమంతటా అనుసంధానం చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన కంటే ముందే ఓటర్ల జాబితా సిద్ధం చేస్తామని చెప్పారు.