కారు ప్రమాదం నుండి తప్పించుకొన్న మాజీమంత్రి మోపిదేవి

 

మాజీ మంత్రి మరియు వైకాపా నేత మోపిదేవి వెంకటరమణ, తన భార్య, కుమార్తెతో కలిసి తమ కారులో హైదరాబాద్ నుండి రావులపాలెం వెళుతుండగా ఈరోజు తెల్లవారు జామున కృష్ణా జిల్లా కానూరు వద్ద వారి కారును ఆర్.టి.సి.బస్సు వెనుక నుండి వచ్చి డ్డీకొంది. అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మోపిదేవి భార్యకి, కుమార్తెకి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు.

Teluguone gnews banner