3లక్షల ఇళ్లు.. 7లక్షల ఉద్యోగాలు.. చంద్రబాబు

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌ ఏపీ సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిని అందరూ గర్వపడేలా నిర్మిస్తామని.. 16 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీడ్‌ క్యాపిటల్‌ అభివృద్ధి చేస్తామని అన్నారు. 3లక్షల నివాస గృహాలకు అనుగుణంగా బృహత్‌ ప్రణాళిక ఉందని.. ఈ ప్రణాళికతో 7లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని వివరించారు. ఆకర్షణీయ, పర్యావరణ హిత, స్వయం సమృద్ధి నగరంగా అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా ఏపీ సీడ్ క్యాపిటల్ సంబంధించి శనివారం ఫోటోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Teluguone gnews banner